వాలంటీర్లూ... వైకాపా బాధితులే!
ఇంతకాలం ప్రజలు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే వైకాపా ప్రభుత్వ బాధితులు.. ఇప్పుడు వాలంటీర్లూ ఆ జాబితాలోకి చేరారు. అయిదేళ్లుగా వైకాపా సేవలో తరిస్తూ.. వారు చెప్పిన పనులు చేస్తూ వచ్చిన వారందరినీ.. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రచారœంలోకి దిగాలని వైకాపా ఒత్తిడి చేస్తోంది.
ఇక ప్రభుత్వంలో పనిలేదంటూ రాజీనామాలు చేయించే వ్యూహం
ఇంటింటి ప్రచారంలోకి దిగాలని ఒత్తిళ్లు.. బెదిరింపులు
బయటపడుతున్న వైకాపా అసలు రంగు
2.56లక్షల మందిలో రాజీనామా చేసింది 6వేల లోపే
ఈనాడు, అమరావతి: ఇంతకాలం ప్రజలు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే వైకాపా ప్రభుత్వ బాధితులు.. ఇప్పుడు వాలంటీర్లూ ఆ జాబితాలోకి చేరారు. అయిదేళ్లుగా వైకాపా సేవలో తరిస్తూ.. వారు చెప్పిన పనులు చేస్తూ వచ్చిన వారందరినీ.. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రచారంలోకి దిగాలని వైకాపా ఒత్తిడి చేస్తోంది. వైకాపాకు వీర విధేయులైన కొందరు వాలంటీర్లు వెంటనే రాజీనామా చేస్తున్నా.. అధికశాతం మంది తాము అందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న తాము ఎందుకు రాజీనామా చేయాలని నిలదీస్తున్నారు. దీంతో అధికారులతో చెప్పి వారిని తొలగిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల బెదిరింపులకూ దిగుతున్నారు. దీంతో ఇప్పుడు వాలంటీర్లు కూడా వైకాపా బాధితులుగా మారుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.56లక్షల మంది వాలంటీర్లు ఉండగా.. ఇప్పటి వరకు సుమారు 6వేల మంది రాజీనామాలు చేసినట్లు చెబుతున్నారు.
అంటే అధికశాతం వాలంటీర్లు రాజీనామాలకు వెనకాడుతున్నారు. వారిని కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో రాజీనామా చేయించి ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్లాలని వైకాపా నేతల వ్యూహంగా ఉంది. వాలంటీర్ల పరిధిలోకి వచ్చే 50 ఇళ్లలో వారి ద్వారానే విష ప్రచారం చేయించి ఎన్నికల్లో గెలవాలని వైకాపా యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటి వరకు వారికి వస్తున్న జీతానికి అదనంగా మరికొంత సొమ్ము చెల్లించడంతోపాటు.. అధికారంలోకి వస్తే మళ్లీ వాలంటీరు ఉద్యోగం ఇస్తామని చెప్పి వైకాపా అభ్యర్థులు ప్రలోభపెడుతున్నారు. చాలాచోట్ల వైకాపా అభ్యర్థులు బహిరంగంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నా ఎన్నికల సంఘం చోద్యం చూడ్డానికే పరిమితమవుతోంది.
ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు.. పార్టీకి సేవలు
వాలంటీర్లను సంక్షేమ పథకాల అమలు కోసం నియమించినా.. అనధికారికంగా ఇప్పటిదాకా వారితో వైకాపా ప్రచారమే చేయించారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం చెల్లిస్తూ.. పార్టీ సేవకులుగా తయారు చేసుకున్నారు. వారికి పెద్ద పనేముంటుంది? వారంలో రెండు మూడు గంటలు పనిచేస్తే సరిపోతుందని చెబుతూనే.. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ పనులకు వినియోగించుకున్నారు. ఒక దశలో మీరిచ్చే రూ.5వేల జీతానికి ఈ పనులన్నీ చేయలేమంటూ కొందరు రాజీనామాలు చేయడంతోపాటు తీవ్ర నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చిందంటే.. వారితో ఏ స్థాయిలో పని చేయించుకున్నారో అర్థమవుతోంది. ఆ తర్వాతా ఎంతమాత్రం తగ్గలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సర్వేలు చేయించారు. కులాల వారీగా ఓటర్ల వివరాలు సేకరించారు. పింఛను పంపిణీ ద్వారా.. మరింత విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయాలనే వైకాపా కుట్రకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయడంతో.. ఆ పార్టీ అసలు రంగు బయటపడింది. ఇక ప్రభుత్వంలో ఉండి చేసేదేంలేదంటూ.. వారందరితో రాజీనామాలు చేయించే వ్యూహాన్ని వైకాపా అమల్లోకి తెచ్చింది.
రాజీనామా చేయాలంటూ ఎంఎల్ఓల నుంచి ఆదేశాలు
వాలంటీర్లంతా ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు పనిచేస్తున్నారని ప్రభుత్వం ఇప్పటి వరకు సుద్దులు చెప్పింది. అయితే వారికి పనిని నిర్దేశించేదంతా ఐప్యాక్ బృందాలే. వారితో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలు ఇచ్చి.. సత్వరమే అమలయ్యేలా వైకాపా ఏర్పాటు చేసుకుంది. అంటే వీరు సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు చెప్పే పనికంటే.. ఐప్యాక్ బృందం చెప్పే పనికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అంతా తెలిసినా అధికారులూ ఇన్నాళ్లూ కిమ్మనకుండా మౌనం వహించారు. ఇప్పుడు కూడా వాలంటీర్లంతా వెంటనే రాజీనామా చేయాలంటూ.. ఐప్యాక్ బృందంలోని ఎంఎల్ఓ(మండల లెవల్ ఆఫీసర్)ల ద్వారా వాలంటీర్ల మొబైల్ ఫోన్లకు ఆడియో సందేశాలు ఇప్పిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజుల కిందట దీనికి సంబంధించిన ఆడియో ఒకటి బయటకొచ్చింది. దీనిపై ఎన్నికల అధికారులు విచారణకు ఆదేశించారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంఎల్ఓలే.. రాజీనామాలకు ఒత్తిడి తేవడంతోపాటు, ఎక్కడెక్కడ ఎంతమంది రాజీనామాలు చేస్తున్నారు? ఎవరు మొండికేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం 682 మందితో మూకుమ్మడి రాజీనామాలు ఇప్పించారు. అందరూ ఒకే ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారు. అంటే వైకాపా నిర్దేశించిన విధంగానే రాజీనామాలు చేయిస్తున్నారని స్పష్టమవుతోంది. అత్యధికంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 1,500 మంది, తాడిపత్రిలో 300మంది, ప్రొద్దుటూరులో 67, అనకాపల్లి జిల్లా పరవాడమండలంలో 23, విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో 13, కర్నూలు జిల్లాలో 97మంది వాలంటీర్లతో రాజీనామాలు చేయించారు. జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేందుకు ఎన్నికల ప్రచారంలోకి వెళుతున్నామని వారితోనే చెప్పిస్తున్నారు.
రాజీనామాలపై విచారణ చేపట్టాలి: కొల్లు
మచిలీపట్నం, న్యూస్టుడే: వాలంటీర్ల వ్యవస్థ నిజస్వరూపం వారి మూకుమ్మడి రాజీనామాల ద్వారా బహిర్గతమైందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. బలవంతపు మూకుమ్మడి రాజీనామాలపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సెల్ఫోన్ల ద్వారా సందేశాలు.. ప్రతిపక్షాలపై విషప్రచారం
వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం, జనసేన, భాజపాతోపాటు ఎన్నికల సంఘంపైనా వైకాపా ఇప్పటికే విషం చిమ్మే ప్రక్రియ ప్రారంభించింది. పలుచోట్ల పింఛనుదారుల సెల్ఫోన్లకు సందేశాలు పంపించే ప్రక్రియ మొదలు పెట్టింది. ‘ఆంటీ, అంకుల్.. నమస్కారం.. నేను మీ వాలంటీర్.. గత నాలుగేళ్లుగా ప్రతి నెలా మొదటి రోజు ఉదయం 6 గంటలకు మీ ఇంటి ఖర్చుల కోసం.. మీ పెద్ద కొడుకు.. మా జగనన్న ప్రేమతో పంపిన పింఛను డబ్బుల్ని మీకు అందించి మీ యోగక్షేమాలు చూసుకున్నాం. చంద్రబాబు, పవన్కల్యాణ్, భాజపా కుట్రలతో ఎన్నికలయ్యే వరకు మీకు సేవ చేసుకోలేకపోతున్నాం. మండుటెండల్లో మిమ్మల్ని పింఛను డబ్బు కోసం నిలబెట్టాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది. వారి కుట్రలను తిప్పికొట్టి మీరు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తారు. అప్పుడు మళ్లీ మీ సేవ చేసుకుంటాం’ అని రెండు రోజులుగా పలుచోట్ల పింఛనుదారులకు సందేశాలు పంపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?