కుట్ర అమలుకు తహతహ
పింఛనుదారులను ఇళ్ల నుంచి సచివాలయాల వద్దకు రప్పించి అక్కడే పింఛను ఇచ్చేలా వైకాపా పన్నిన కుట్ర అమలుకు పరోక్షంగా సహకరించేలా ఆదేశాలిచ్చిన సెర్ప్ సీఈఓ మురళీధరరెడ్డి.. చివరి వరకు దాన్ని కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వడం కుదరదట!
అడ్డుకునేందుకు సెర్ప్ సీఈవో మురళీధరరెడ్డి విశ్వప్రయత్నం
మెజారిటీ కలెక్టర్లు ఆమోదం తెలిపినా మొండిపట్టు
ఈనాడు - అమరావతి
పింఛనుదారులను ఇళ్ల నుంచి సచివాలయాల వద్దకు రప్పించి అక్కడే పింఛను ఇచ్చేలా వైకాపా పన్నిన కుట్ర అమలుకు పరోక్షంగా సహకరించేలా ఆదేశాలిచ్చిన సెర్ప్ సీఈఓ మురళీధరరెడ్డి.. చివరి వరకు దాన్ని కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను పింఛనుదారుల ఇళ్ల దగ్గరకు పంపి పింఛను అందించడం కుదరని పని అని ఆయన తేల్చిచెప్పినట్టు తెలిసింది. అత్యధిక జిల్లాల కలెక్టర్లు ఇళ్ల వద్ద పంపిణీకే మొగ్గు చూపినా దాన్ని అడ్డుకునేందుకే మురళీధరరెడ్డి ప్రయత్నించారని సమాచారం. ‘వారే అడ్డుకుంటూ... నెపాన్ని తెదేపాపై వేస్తూ’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సంచలనంగా మారింది. దీనిపై సోమవారం సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఇందులో ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మెజారిటీ కలెక్టర్లు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దనే పింఛను అందించాలనే నిర్ణయానికి మొగ్గుచూపారు. కానీ మురళీధరరెడ్డి ఒక్కరే అది సాధ్యపడదని చెప్పినట్లు తెలిసింది. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతోగానీ, ఆ శాఖ నిర్ణయాలతోనూ ఆయనకు సంబంధం ఉండదు. కేవలం పింఛన్ల నిధులు సమీకరించి విడుదల చేయడం, పంపిణీ తీరును పర్యవేక్షించడమే సెర్ప్ పరిధి. కానీ దానికి భిన్నంగా మురళీధరరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ కీలక ఉన్నతాధికారి చెప్పినట్టల్లా తలాడిస్తూ.. వైకాపాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులు ఉండేది పింఛన్ల పంపిణీ కోసమే కాదు.. వారికి ఇతర పనులూ ఉంటాయి, వారు ఇంటింటికీ వెళ్లి పింఛను ఇచ్చేందుకు మ్యాపింగ్ వంటి సమస్యలు వస్తాయంటూ మురళీధరరెడ్డి వింత వాదన తెరపైకి తెచ్చారు.
ఎన్నికల సమయంలో నగదు పంపిణీ పథకాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా లేదు. ఇది తెలిసీ ఇతర పనులున్నాయనేలా బుకాయించడం మురళీధర్రెడ్డి ఉద్దేశాన్ని చాటుతోంది. ఇక వాలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ చేయడం మహా అంటే రెండు మూడు గంటల పని. మ్యాపింగ్ సమస్యలున్నా అది గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చూసుకుంటుంది. ఆ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే మురళీధరరెడ్డి ఏ స్థాయిలో వైకాపాకు వంత పాడేందుకు కంకణం కట్టుకున్నారో ఇట్టే అర్థమవుతోంది.
మొదటి నుంచి అత్యుత్సాహమే
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచే ప్రక్రియను అడ్డుకునేందుకు వైకాపా పన్నిన ముందస్తు వ్యూహాన్ని అమలు చేయడంలో మురళీధరరెడ్డి మొదటి నుంచీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. 1వ తేదీకి ముందే పింఛన్ల నగదును సమీకరించుకునేందుకు అవకాశమున్నా పట్టించుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకు సెలవుల్ని సాకుగా చూపి ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2022 ఏప్రిల్లో ఇదే తరహా పరిస్థితి ఉన్నా 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేశారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడేం వచ్చింది? ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం రూ.13 వేల కోట్ల బిల్లులు చెల్లించింది. స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లకుండానే కొంతమంది వైకాపా నేతలు, వారి అనుచర వర్గానికి బిల్లులు చెల్లించారు. వృద్ధులపై మమకారముంటే అందులో నుంచి పింఛన్లకు అవసరమయ్యే రూ.1,980 కోట్లు ఎందుకు పక్కన పెట్టలేదు? ఇదేమీ లేకుండానే మూడో తేదీ నుంచి పంపిణీ చేస్తామని ఆదేశాలిచ్చారు.
కొంతమంది వాలంటీర్లు బరితెగించి వైకాపాకు ప్రచారం చేస్తున్నారని తెలిసికూడా.. వారే ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తారని స్పష్టం చేశారంటేనే ఆయన వైకాపాతో ఎంత అంటకాగుతున్నారో తెలిసిపోతోంది. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెడితే.. దాన్ని తెదేపాకు ఆపాదించేందుకు వైకాపా పన్నిన కుతంత్రాన్ని అమలు చేసేలా పింఛనుదారులను సచివాలయాలకు రప్పించి పింఛను పంపిణీ చేసేలా మురళీధరరెడ్డి ఆదేశాలిచ్చారు. ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయంలో నంబర్ 1గా ఉన్న ఓ ఉన్నతాధికారి ఆదేశాలకు అనుగుణంగానే సాగినట్టు ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
పింఛన్ల పంపిణీ మార్గదర్శకాల్లో సవరణలు
సామాజిక పింఛనుదార్లు సచివాలయాలకే వచ్చి పింఛన్లు తీసుకోవాలన్న సెర్ప్ సీఈవో ఆదేశాలు వివాదాస్పదమవడంతో పింఛన్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను పునస్సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో అధికారులతో సమావేశమైన సీఎస్ జవహర్రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. సవరించిన మార్గదర్శకాలు సోమవారం అర్ధరాత్రికి లేదా మంగళవారం వెలువడే అవకాశాలున్నాయి. బుధవారం నుంచి పింఛన్ల పంపిణీలో సాధ్యాసాధ్యాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ‘ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ పనులను ఉదయం 10.30 గంటల్లోపే పూర్తిచేయాలి. మంచినీటి చెరువులు నింపేందుకు ఈనెల 4న ప్రకాశం బ్యారేజి నుంచి ఏలూరు, బందరు, రైవస్ కాలువలకు.. 8న నాగార్జున కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలి’ అని సీఎస్ ఆదేశించారు.
సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లడం కొత్తా!
సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లడం ఇప్పుడే కొత్త అన్నట్టు వైకాపా ప్రభుత్వం, మురళీధరరెడ్డి హంగామా చేస్తున్నారు. కులగణన పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపి ప్రతి కుటుంబం సమాచారం సేకరించిన సంగతి అప్పుడే మరిచిపోయారా? అంతపెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన గడువు వారమే కదా?అంతకంటే పింఛన్ల పంపిణీ పెద్ద పనా? బెనిఫిషియరీ అవుట్ రీచ్ యాప్ పేరుతో లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ఎన్నిసార్లు సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపలేదు? ఆ ఉద్యోగులతో జగన్ భజన చేయించేందుకు ఇంటింటికీ పంపలేదా? వీటన్నింటికీ లేని ఇబ్బంది ఏ ఆదరువూ లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను ఇవ్వడంలోనే వచ్చిందా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్