టమాట రైతుల వ్యథ తీరలేదు.. నేతన్నల జీవితాలు బాగు పడలేదు
‘‘మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. కరవు ప్రాంతమైన మదనపల్లెకు కృష్ణా జలాలు తీసుకొచ్చి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేస్తాం. వేసవి జలాశయాలు పూర్తిచేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం.’’
అన్నమయ్య జిల్లాలో జగన్ హామీలన్నీ నీటిమూటలే
మరోసారి మోసగించేందుకు నేడు మదనపల్లెకు రాక
ఈనాడు-కడప, న్యూస్టుడే- మదనపల్లె పట్టణం, రాజంపేట గ్రామీణ
‘‘మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. కరవు ప్రాంతమైన మదనపల్లెకు కృష్ణా జలాలు తీసుకొచ్చి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేస్తాం. వేసవి జలాశయాలు పూర్తిచేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం.’’
...2018లో మదనపల్లె పట్టణంలో పర్యటిస్తూ జగన్ ఇచ్చిన హామీలివి.
ప్రస్తుత పరిస్థితి చూస్తే గత అయిదేళ్లలో ఏవీ పూర్తి కాలేదు. ప్రతిపక్ష నేతగా అనేక హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటి మాటే మర్చిపోయారు. తెదేపా హయాంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి కాల్వ పనులు 85% పూర్తి చేసినా.. మిగిలిన కొద్దిపాటి పనులనూ జగన్ పూర్తి చేయలేకపోయారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అనుసంధానంలో భాగంగా పుంగనూరు బ్రాంచ్ కాల్వకు సమాంతరంగా మరొకటి తవ్వించి.. వైయస్ఆర్ జిల్లాలోని గండికోట జలాశయం నుంచి నీటిని తీసుకొస్తానని నమ్మించి, నట్టేటా ముంచేశారు. రూ.4,373 కోట్లతో టెండర్లు పిలిచి పనుల్ని తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీకి కట్టబెట్టారు.
వైయస్ఆర్ జిల్లాలో కాలేటివాగు, అన్నమయ్యలో ముదివేడు, చిత్తూరులో ఆవులపల్లి, నేతిగుట్లపల్లెలో జలాశయాల నిర్మాణం చేపట్టి, అనుమతి లేని కారణంగా ఎన్జీటీ అభ్యంతరం తెలపడంతో పనులు నిలిపివేశారు. ఎన్జీటీ భారీ జరిమానా విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. కాలేటివాడు రిజర్వాయర్ పైపులైను టన్నెల్ తవ్వకం 5 కి.మీ మేర చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటికీ కేవలం కిలోమీటరు వరకు పూర్తి చేశారు. అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనులు ఆగిపోయాయి. అటు టన్నెల్.. ఇటు మూడు రిజర్వాయర్ల పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు పడకేసింది. తాజాగా మళ్లీ ఎన్నికలు రావడంతో మరోసారి ప్రజల్ని మోసగించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
నేతన్నల జీవితాలను చిదిమేసిన జగన్
గత ఎన్నికల ముందు మదనపల్లెకు వచ్చిన జగన్.. చేనేత రంగం అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. నీరుగట్టువారిపల్లెలో మెగా క్లస్టర్ ఏర్పాటుతో పాటు ఇక్కడ తయారు చేసిన పట్టు చీరలకు బ్రాండ్ ఏర్పరిచే బాధ్యత తీసుకుంటామన్నారు. వర్క్షెడ్ల మంజూరు, చేనేత భవన్ నిర్మాణం, బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాల అందజేత వంటి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. వైకాపా అధికారంలోకి రాకముందు నీరుగట్టువారిపల్లెలో 15 వేలకు పైగా ఉన్న చేనేత మగ్గాలు నేడు 5 వేలకు తగ్గిపోయాయి. ఉపాధి లేక కొందరు నేతన్నలు దినసరి కూలీలుగా మారిపోయారు. కుటుంబ పోషణ భారమై మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద ఇస్తున్న రూ.24 వేలు ఎటూ సరిపోవడం లేదు.
మదనపల్లె.. తాగునీటికి తల్లడిల్లె
మదనపల్లె పట్టణంలోని 1.80 లక్షల మంది జనాభాకు రోజుకు 15 ఎంఎల్డీ నీరు అవసరం కాగా మూడోవంతు కూడా సరఫరా చేయడం లేదు. పట్టణంలోని 260 బోరుబావుల్లో సగానికి పైగా వాటిల్లో నీరు రావడం లేదు. తెదేపా పాలనలో అమృత్ పథకం కింద తాగునీటి సరఫరా కోసం రూ.49 కోట్లు వెచ్చించి ఈఎల్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించి, భూగర్భంలో పైపులైన్లు ఏర్పాటు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పనులన్నీ ఆపేసి.. ఈ పథకాన్ని నీరుగార్చేసింది.
టమాట గుజ్జు పరిశ్రమలేవి?
‘టమాట రైతులను ఆదుకోవడానికి రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వమే దిగుబడులు కొనుగోలు చేస్తుంది. టమాట గుజ్జు పరిశ్రమలతో పాటు విత్తన పరిశోధన కేంద్రం నెలకొల్పుతాం’ అని ఎన్నికల ప్రచారంలో జగన్ గొప్పలు చెప్పారు. గత అయిదేళ్లలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఇక్కడి రైతులు టమాట పంట సాగు చేస్తున్నారు. వైకాపా హయాంలో గిట్టుబాటు ధర లేక నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
వరద బాధితుల గోడు పట్టని జగన్
‘గూడు కోల్పోయిన బాధితులకు మూడు నెలల్లో ఇళ్లు కట్టి తాళాలిస్తాం. పంట పొలాలు ముంపునకు గురికాకుండా రక్షణ గోడ నిర్మిస్తాం. పొలాల్లో ఇసుక మేటలు తొలగిస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతాం’ అని 2021 డిసెంబరు 3న అన్నమయ్య జలాశయం కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో వీధిన పడిన బాధితులను పరామర్శిస్తూ సీఎం జగన్ ఇచ్చిన హామీలీవి. ఆ తరువాత వారి గోడు అరణ్యరోదనగానే మిగిలిపోయింది. బాధితుల కోసం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, రామచంద్రాపురం గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో అత్యధికం పునాదుల దశలోనే ఉన్నాయి. 488 ఇళ్ల నిర్మాణం తలపెట్టగా కేవలం 28 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు.
రెండున్నరేళ్లుగా బాధితులు గుడారాల్లో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. పొలాల రక్షణకు చేపట్టిన గోడ నిర్మాణంలో ఆదిలోనే నాణ్యత లోపాలు బయటపడ్డాయి. పొలాల్లో ఇసుక మేటలు చాలా వరకు రైతులే తొలగించుకున్నారు. ఏడాదిలోపే ప్రాజెక్టు కట్టితీరుతామని ప్రగల్భాలు పలికిన జగన్కు ఆ గోడే పట్టకుండా పోయింది. ప్రజల్ని నమ్మించేందుకు రూ.787.19 కోట్ల అంచనాతో టెండరు పిలిచి.. హడావుడి చేసి వదిలేశారు. చిల్లర వేస్తున్నట్లుగా కేవలం రూ.22.19 లక్షల కేటాయింపులతో సరిపెట్టారు. ఈ మొత్తం అంచనాల తయారీకే సరిపోదని అధికారులు వాపోతున్నారు. సీఎం నిర్లక్ష్య వైఖరితో ఇప్పుడు సాగునీరు అందక పంట పొలాలన్నీ బీళ్లుగా మారుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక