సంక్షిప్త వార్తలు(8)
ఎండలు ముదరడంతో భాగ్యనగర ప్రజలు బయట తిరగాలంటేనే జంకుతున్నారు. వాహనాలతో కిక్కిరిసిపోయే హైదరాబాద్లో దారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
‘మండే’ ఎండలు
ఎండలు ముదరడంతో భాగ్యనగర ప్రజలు బయట తిరగాలంటేనే జంకుతున్నారు. వాహనాలతో కిక్కిరిసిపోయే హైదరాబాద్లో దారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు రోడ్లన్నీ ఇలా బోసిపోయి కనిపించాయి.
ఈనాడు, హైదరాబాద్
ఈసీ ఆదేశాలను సాకుగా చూపి పెన్షనర్ల ఉసురుపోసుకోవద్దు: బాలకోటయ్య
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల కమిషన్ ఆదేశాలను సాకుగా చూపి లక్షలాది మంది పెన్షనర్ల ఉసురుపోసుకోవద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాలంటీర్ల తొలగింపుతో పెన్షన్దారుల్లో నెలకొన్న ఆందోళనను అధికారులు తొలగించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. ‘వాలంటీర్లు లేకపోయినా సచివాలయ, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా పింఛన్లు ఇవ్వొచ్చు. రాష్ట్రంలోని సచివాలయాల్లో 1.35లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కో ఉద్యోగి 50 మందికి అందించినా రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చు. తీవ్ర ఎండల నేపథ్యంలో వృద్ధులు కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిలబడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందించాలి’ అని డిమాండు చేశారు.
పింఛన్లపై ప్రభుత్వ వైఖరి సరికాదు
సీఎస్, ఈసీలకు లేఖ రాసిన పెన్షనర్ల సంక్షేమ సంఘం
ఈనాడు డిజిటల్, అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం ఈసీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరిస్తుందని సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సోమవారం లేఖ రాశారు. ఇది ప్రతిపక్షాలపై నిందలు వేసే ప్రయత్నమేనని లేఖలో మండిపడ్డారు. సీఎస్, ఈసీలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించి ఇంటివద్దనే పింఛను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గురుకుల పరీక్ష దరఖాస్తు గడువు 5 వరకు పొడిగింపు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘ఏపీఆర్ఎస్ క్యాట్-2024, ఏపీఆర్జేసీ, డీసీ సెట్’ పరీక్షల దరఖాస్తు గడువును ఈనెల 5వరకు పొడిగించినట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరాల్లోని సీట్లతో పాటు 5,6,7,8 తరగతుల్లో మిగిలివున్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల
విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం), న్యూస్టుడే: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ పీజీసెట్-2024 నోటిఫికేషన్ను.. సెట్ ఛైర్మన్, ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సోమవారం విడుదల చేశారు. మే 4 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించి, జూన్ 10 నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
కేఏ పాల్ వ్యాజ్యంపై ముగిసిన వాదనలు
ఈనాడు, అమరావతి: ప్రజాశాంతి పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ తీర్పును రిజర్వు వేస్తున్నట్లు ప్రకటించారు. విచారణ సందర్భంగా కేఏ పాల్ నేరుగా వాదనలు వినిపించారు. తన విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోకుండా ఎన్నికల సంఘం జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 10 లోపు నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అనినాష్ దేశాయ్ కోర్టుకు నివేదించారు.
వ్యాయామానికి ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి
విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో వ్యాయామానికి ప్రత్యేక సమయం కేటాయించుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల పట్లా ఆసక్తి కలిగేలా వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విజయవాడలోని లయోలా కళాశాలలో నిర్వహించిన ‘వ్యాయామ ఉపాధ్యాయులకు మాడ్యుల్ రూపకల్పన’ వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ‘పీఎంశ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలను క్రీడా శిక్షణ కేంద్రంగా ఏర్పాటు చేస్తాం. దేశంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులను గుర్తించి.. వారిని జిల్లా క్రీడా బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రోత్సహిస్తాం’ అని తెలిపారు.
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ విశాఖ నగరంలో సోమవారం జరిగిన ఆయన సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. వధూవరులు భానుప్రకాశ్, సౌజన్యలను ఆశీర్వదించారు. న్యాయమూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.