ఉన్నత ‘వ్యయ’ మండలి
ఉన్నత విద్యామండలి ఉన్నత వ్యయమండలిగా మారింది. ఎన్నికలకు ముందు ఉన్నతవిద్యలో సంస్కరణల పేరుతో నచ్చినవారికి నచ్చినట్లు ప్రాజెక్టులు కట్టబెట్టేస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి చెప్పారని విద్యార్థుల శిక్షణ పేరుతో ఓ సంస్థకు రూ.50 లక్షలు ధారపోసింది.
సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటన కోసం రూ.50 లక్షల చెల్లింపు
ఉత్తరాంధ్ర మంత్రి సిఫార్సుతో ఓ సంస్థకు రూ.50 లక్షలు
లింక్డ్ఇన్ కోర్సుల పేరుతో రూ.7 కోట్లకు కౌన్సిల్ ఆమోదం
వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఛైర్మన్గా ఉన్న సంస్థకు రూ.15 లక్షలు
ఉన్నత విద్యామండలిలో ఇష్టారాజ్యంగా వ్యయాలు
ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి ఉన్నత వ్యయమండలిగా మారింది. ఎన్నికలకు ముందు ఉన్నతవిద్యలో సంస్కరణల పేరుతో నచ్చినవారికి నచ్చినట్లు ప్రాజెక్టులు కట్టబెట్టేస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి చెప్పారని విద్యార్థుల శిక్షణ పేరుతో ఓ సంస్థకు రూ.50 లక్షలు ధారపోసింది. విచిత్రమేమిటంటే హైదరాబాద్లో ఉండే ఈ సంస్థ ఉన్నత విద్యామండలికి సమీపంలోని మిడ్వ్యాలీలో ఉంటున్నట్లు బిల్లు సమర్పించింది. విద్యార్థుల శిక్షణకు సైతం ఉన్నత విద్యామండలికి అనుకూలంగా ఉండే కళాశాలలనే ఎంపికచేశారు. దీంతో శిక్షణ జరిగిందా? లేదా అనేదానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, వర్సిటీల సమాచారం కోసమని యాప్ రూపకల్పన, నిర్వహణకు రూ.99 లక్షలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంత చెల్లించేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ సంస్థకు ఈ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఉన్నత విద్యామండలిలో కీలకంగా ఉండేవారు నామినేటెడ్ వ్యక్తులే కావడంతో వైకాపా విషయంలో స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన కోసం రూ.50లక్షలు ఉన్నత విద్యామండలి చెల్లించింది. ఆ జిల్లా కలెక్టర్ పేరుతో దీన్ని బదిలీ చేసింది. గతంలో దిల్లీలోని ఏపీభవన్లో ఉగాది ఉత్సవాలకు రూ.5 లక్షలు చెల్లించింది. ఉన్నత విద్యామండలి నిధుల వ్యయంపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై స్వామిభక్తి ప్రదర్శించేందుకు రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో రూ.40.31 కోట్లు డిపాజిట్ చేసింది.
ఈ కార్యక్రమాల పరిస్థితి ఏంటి?
విద్యార్థులకు సమాచారం ఇచ్చేందుకు చాట్బోట్ సర్వీసుకు రూ.45 లక్షలు, లక్ష లింక్డ్ఇన్ కోర్సుల లైసెన్సుల కోసం రూ.2.5 కోట్ల ప్రాజెక్టుకు గతేడాది నవంబరులో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఆమోదం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలు అమలు కావడం లేదు. నిధుల వ్యయం కోసం కౌన్సిల్లో అనుమతులు తీసుకొని, కార్యక్రమాలు అమలు చేయకుండా ఏం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశానికి ముందు జరిగిన సమావేశంలోనూ రెండు లక్షల లింక్డ్ఇన్ కోర్సుల లైసెన్సుల కోసం రూ.4.8 కోట్లు అవసరమవుతుందని ప్రతిపాదించారు. ఉన్నతవిద్యలో డిజిటల్ ప్రమోషన్ కోసమంటూ రూ.22 లక్షలు ఖర్చుపెట్టారు. ఇది ఏం చేశారో ఎవరికీ తెలియదు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాలైనా.. కౌన్సిల్ సమావేశ ఎజెండా, మినిట్స్ను రహస్యంగా ఉంచడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదో విచిత్రం..
రాష్ట్ర పరిశోధన బోర్డును ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. దీంట్లో ఎలాంటి కార్యక్రమాలూ లేవు. కానీ, ఇక్కడ మూర్తి అనే వ్యక్తి కన్సల్టెంట్ పని చేస్తున్నట్లు చూపి రూ.50వేల జీతం చెల్లిస్తున్నారు. ఈయన ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరికీ తెలియదు. గత ఎన్నికల్లో వైకాపా మద్దతుగా ప్రచారం చేసిన దినేష్కు ఉద్యోగం ఇచ్చిన ఉన్నత విద్యామండలి ఒక్క ఏడాదిలోనే రెండుసార్లు జీతం పెంచింది. గతేడాది జనవరి వరకు బిజినెస్ ఎనలిస్ట్గా దినేష్కు రూ.75వేల జీతం ఉండగా ఆయన హోదాను మార్చి, రూ.లక్షకు పెంచారు. తర్వాత రూ.1.25 లక్షలు చేశారు. మరోశాఖలో ఇంతకంటే ఎక్కువ జీతం ఇవ్వడంతో ఆయన డిసెంబరులో వెళ్లిపోయారు. ఉన్నత విద్యామండలి ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్న సుధీర్రెడ్డికి ఒక్కసారి జీతాన్ని రూ.25వేలు పెంచారు. ఈయనకు నెలకు రూ.1.50 లక్షల జీతం ఇస్తున్నారు. ఈయన గతంలో ఒక నెల సెలవుపై విదేశాలకు వెళ్లినా పూర్తి జీతం చెల్లించడంపై అనేక ఆరోపణలు వచ్చాయి.
- వెంకటగిరి వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఛైర్మన్గా కొనసాగుతున్న కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డుకు ఉన్నత విద్యామండలి రూ.15 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆయనకు ఏదో ఒక పదవి ఇచ్చేందుకే దీన్ని ఏర్పాటుచేసినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి. వాస్తవంగా ప్రభుత్వమే నిధులు ఇవ్వాల్సి ఉండగా ఉన్నత విద్యామండలి నుంచి తీసుకున్నారు.
- కర్నూలులోని ఉర్దూ వర్సిటీకి రూ.50 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఎక్కడైనా వర్సిటీలకు నిధులు అప్పుగా ఇవ్వడం ఉంటుందా? జగన్ ప్రభుత్వంలో ఇలాంటివి కోకొల్లలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్