సంక్షిప్త వార్తలు (8)
పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించడంపై పిల్
నేడు విచారించనున్న హైకోర్టు
ఈనాడు, అమరావతి: పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. బుధవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్రావుతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన వి.వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛన్దారులు ఈ పిల్ దాఖలు చేశారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ అందించేవారని.. తాజా ఉత్తర్వుల వల్ల వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవడం కష్టంగా మారిందని వారు పిటిషన్లో పేర్కొన్నారు.
67 మంది వాలంటీర్ల సెల్ఫోన్లు పోయాయట..!
కొమ్మాది, న్యూస్టుడే: ఎన్నికల వేళ కొంతమంది వాలంటీర్లు నిబంధనలను అతిక్రమించి వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో పింఛన్ల పంపిణీ కోసం వారికి ప్రభుత్వం అందించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ మేరకు విశాఖ నగరంలోని జోన్-2 పరిధిలోని 1547 మంది వాలంటీర్ల నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియను మంగళవారం చేపట్టారు. అయితే వీరిలో 1480 మంది తమకు ఇచ్చిన సెల్ఫోన్లను తిరిగి ఇవ్వగా, 67 మంది తమ ఫోన్లు పోయాయని అధికారులకు చెప్పారు. ఆ మేరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి సంబంధిత పత్రం సమర్పించాలని జోనల్ కమిషనర్ సూచించడంతో సంబంధిత సచివాలయాల అడ్మిన్లు ఫిర్యాదు చేశారు. ఇంతకాలం సెల్ఫోన్లు పోయిన విషయం బయటపెట్టకుండా...ఇప్పుడు వెల్లడించడం చర్చనీయాంశమైంది.
వివాదాస్పదంగా డీటీల పదోన్నతుల ప్రక్రియ
ఈనాడు, అమరావతి: రెవెన్యూ శాఖలో ఉప తహసీల్దార్(డీటీ)ల పదోన్నతుల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. ఆ శాఖలో డైరెక్ట్ డీటీలకు అన్యాయం జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. హైకోర్టు ఆదేశాలను వక్రీకరించి, పదోన్నతులు కల్పించేందుకు సీసీఎల్ఏ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అడ్హాక్ పదోన్నతులపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశిస్తే ఎలాంటి షరతులు లేకుండా వాటిని ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని సీసీఎల్ఏ కోరుతోందన్నారు. దాంతో డైరెక్ట్ డీటీలకు అన్యాయం చేయాలని చూస్తోందని, జాయింట్ కలెక్టర్లు కావాల్సిన వారు తహసీల్దార్లుగానే పదవీవిరమణ అయ్యేలా చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో నేరుగా పదోన్నతులు ఇవ్వడానికి అవకాశం లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీకి కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తూ సీసీఎల్ఏ లేఖ రాసిందని పేర్కొన్నారు.
వివేకం సినిమాపై వివరాలు సమర్పించండి
ఈసీ, సీబీఎఫ్సీకి హైకోర్టు ఆదేశం
ఈనాడు, అమరావతి: యూట్యూబ్, ఓటీటీలలో వివేకం సినిమా ప్రదర్శనను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం, ఫిల్మ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డు(సీబీఎఫ్సీ)లను ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
ఇంటర్ ప్రవేశాల ప్రచారం నిలిపివేత
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రచారం నిర్వహించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఇంటర్ బోర్డు కమిషనర్ సౌరబ్గౌర్ మెమో జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఎన్నికల విధుల నుంచి దేవాదాయశాఖ అధికారులను మినహాయించాలి
ఈనాడు-అమరావతి: ఎన్నికల విధుల నుంచి దేవాదాయశాఖ అధికారులు, ఉద్యోగులను మినహాయించాలని కోరుతూ ఆ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఉత్తరాయణ పుణ్యకాలం కావడం, వరుసగా ఉగాది, శ్రీరామనవమి, సింహాద్రి అప్పన్న చందనోత్సవం, నృసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు ఉండటంతో.. అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిస్తే కష్టమవుతుందని తెలిపారు.
ఈ సమయంలో రికార్డు తనిఖీలా?
ఓవైపు జాతరలు, ఉత్సవాలు, పండుగలు ఉన్నాయని చెబుతున్న దేవాదాయశాఖ ఉన్నతాధికారులు.. ఇదే సమయంలో రికార్డుల తనిఖీ, ప్రాంతీయ స్థాయిలో సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 8న కొత్త అమావాస్య, 9న ఉగాది పండుగ ఉండగా.. 6వ తేదీన ద్వారకా తిరుమలలో ఏడు జిల్లాల అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడ ఏ, బీ, సీ, డీ గ్రేడ్ ఆలయాలు, మఠాలు, ట్రస్టులకు చెందిన వివిధ రికార్డులు పరిశీలిస్తామని, వివరాలతో రావాలంటూ సమాచారం పంపారు.
ఏపీఎస్ఎస్డీసీకి ఐఎస్ఓ గుర్తింపు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)కు క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగంలో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్ఓ) గుర్తింపు లభించిందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ తెలిపారు. గుర్తింపునకు సంబంధించిన 9001:2015 ధ్రువీకరణ పత్రాన్ని హైదరాబాద్కు చెందిన గ్లోబల్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు మంగళవారం తమకు అందజేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
‘మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు చెల్లించేలా ఆదేశాలివ్వండి’
ఈనాడు డిజిటల్, అమరావతి: మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, బాజీ పఠాన్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ అనుమతులు పొందినప్పటికీ ఆర్థికశాఖ కొర్రీలతో దాదాపు 1,200 మందికి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని మంగళవారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ‘పాఠశాల విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నా.. చిన్న కారణాలతో బిల్లులు ఆమోదించట్లేదు. గత సంవత్సరం పదో తరగతి పరీక్షల విధుల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు నేటికీ బకాయిలు చెల్లించలేదు’ అని కమిషనర్కు విన్నవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం