చర్చకు వస్తా.. నువ్వు సిద్ధమా?
‘వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్ పాత్ర గురించి మరింత సమాచారం బయటకొస్తే కీలకమైన ఇతర వివరాలేవైనా వెలుగు చూస్తాయని జగన్ భయపడుతున్నారా?’ అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు.
అవినాష్ను ఎందుకు కాపాడుతున్నారు జగన్?
కీలక వివరాలు వెలుగు చూస్తాయని భయపడుతున్నారా?
అవినాష్, జగన్లను ఓడించాలి
వైఎస్ వివేకా కుమార్తె సునీత
ఈనాడు, అమరావతి: ‘వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్ పాత్ర గురించి మరింత సమాచారం బయటకొస్తే కీలకమైన ఇతర వివరాలేవైనా వెలుగు చూస్తాయని జగన్ భయపడుతున్నారా?’ అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. ఆయన ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. వివేకాను చంపిన వారెవరో దేవుడికి, కడప ప్రజలకు తెలుసంటూ ఇటీవల వ్యాఖ్యానించిన జగన్కు కూడా ఎవరు చంపించారో తెలిసే ఉంటుంది కదా! ఆ విషయం ఆయన ఎందుకు బయటపెట్టట్లేదని నిలదీశారు. షర్మిలను కడప లోక్సభ అభ్యర్థిగా నిలబెట్టాలని వివేకా భావించటం వల్లే ఆయన్ను లేకుండా చేశారా? తదితర విషయాలన్నీ బయటకు రావాలని డిమాండు చేశారు. అవినాష్ను వెనకేసుకొస్తూ అసెంబ్లీలో మాట్లాడటం మినహా అయిదేళ్లలో ఒక్కసారి కూడా వివేకా హత్య గురించి మాట్లాడని జగన్.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు దాన్ని ప్రస్తావించటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వివేకాను చంపేశాక గత ఎన్నికల్లో దాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారని, మళ్లీ ఎన్నికలు వచ్చినందున అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు చోటు ఉండకూడదని అన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్ద మంగళవారం సునీత విలేకరులతో మాట్లాడారు.
వైకాపా మళ్లీ అధికారంలోకి రాకూడదు
‘రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగి ఉంది. దాన్నుంచి బయటకు వస్తే తప్ప మనకు పురోగతి లేదు. నేను రాజకీయ నాయకురాలిని కాదు. తప్పు జరిగింది కాబట్టే ఇప్పుడు బయటకొచ్చి వాటి గురించి మాట్లాడుతున్నా. మళ్లీ వైకాపా ప్రభుత్వమే అధికారంలోకి వస్తే వ్యక్తిగతంగా నాకే కాదు.. మన రాష్ట్రానికీ ఏ మాత్రం మంచిది కాదు. ఈ ప్రభుత్వం రాకుండా చేయటమే నా లక్ష్యం. మన రాష్ట్రం బాగుపడాలి. పారిశ్రామికాభివృద్ధి జరగాలి. షర్మిల నా చెల్లెలు. ఈ ప్రభుత్వం గద్దె దిగాలనేదే మా ఇద్దరి లక్ష్యం. దాన్ని సాధించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం. కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిలను అభినందిస్తున్నా. గత ఎన్నికల్లో ఆమెను అక్కడినుంచి ఎంపీగా పోటీ చేయించటానికి మా నాన్న శాయశక్తులా ప్రయత్నించారు. ఆ క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఆమె ముందుకొచ్చి పోటీ చేస్తుండటం భావోద్వేగపరంగా నాకు చాలా ముఖ్యమైనది. సంఘీభావం చెప్పేందుకు ఇడుపులపాయకు వెళ్దామనుకున్నప్పటికీ కోర్టులో కేసు ఉండటం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.
నేరగాళ్లు చట్టసభల్లో ఉండకూడదు...
అవినాష్, జగన్ను ఓడించాలి. వైకాపా మళ్లీ అధికారంలోకి రాకూడదు. వివేకా హత్య కేసులో శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులవుతారు. అసలు కేసే విచారణకు రానీయకుండా జాప్యం చేస్తుంటే దోషులకు శిక్ష ఎప్పుడు పడుతుంది? ఇది వ్యవస్థలతో ఆడుకోవటం కాదా? నేరగాళ్లు మళ్లీ మళ్లీ పోటీ చేస్తూ ఎన్నికల్లో గెలుస్తుంటే వారు స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకుంటారు. అందుకే నేరగాళ్లు చట్టసభల్లో ఉండకూడదు.
అందుకే అంత కిరాతకంగా హతమార్చారా?
జగన్ జైల్లో ఉన్నప్పుడు 2012లో జరిగిన ఉపఎన్నికల్లో 18 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి వైకాపా పోటీ చేస్తే.. షర్మిలే కష్టపడి ప్రచారం చేసి 15 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గెలిపించుకున్నారు. ప్రజాప్రస్థానం పేరుతో ఎండనక, వాననక నెలల తరబడి ఇంట్లో పిల్లలను వదిలేసి పర్యటిస్తూ వైకాపాను నిలబెట్టారు. ఇది జగన్ ఎలా మరిచిపోయారు? అంత కష్టపడి పార్టీని కాపాడితే ఆమె ఇంకా శక్తిమంతురాలు అవుతారేమోనని భయపడి పక్కన పెట్టేశారు. అయినా ఆమె మౌనంగా ఉంటూ 2014, 2019 ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేశారు. ఇవన్నీ గ్రహించే మా నాన్న ఆమెను కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయించాలని భావించారు. అందుకే నాన్నను లేకుండా చేశారా? ఇవన్నీ బయటకు రావాలి?
గత ఎన్నికలప్పుడు నన్ను తోలుబొమ్మలా జగన్ ఆడించారు..
మా నాన్నను హతమార్చాక గత ఎన్నికల సమయంలో నన్ను తోలుబొమ్మలా ఆడించారు. ఎన్నికల సంఘం వద్దకు వెళ్లినప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేయటం, హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టించి అవినాష్ గురించి మంచిగా చెప్పించడం వంటివి నాతో చేయించారు. అంతా జగన్ చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన్ను అంత గుడ్డిగా నమ్మా. వాస్తవాలు గ్రహించి నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటున్నా. అలాంటిది నేను, షర్మిల ఎవరి ట్రాప్లోనో పడ్డామంటూ మాట్లాడటం హాస్యాస్పదం. నేనే కాదు.. గత ఎన్నికలప్పుడు ప్రజలు కూడా జగన్, వైకాపా ట్రాప్లో పడ్డారు. ఎవరినైనా ఒకసారి మోసం చేయగలరేమో కానీ పదేపదే చేయలేరు. ప్రజలు తెలివైనవారు కాబట్టి వారి పిల్లల క్షేమం, భవిష్యత్తు కోసం వాస్తవాలు చూస్తారనే నమ్మకముంది. భావోద్వేగాలతో జగన్ మాట్లాడినంత మాత్రాన ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు.
సాక్షి ఛానెల్కే వస్తా... జగన్ నాతో చర్చకు సిద్ధమా?
నేను లేవనెత్తిన అంశాలపై జగన్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. జగన్.. మీరు నాతో నేరుగా మాట్లాడతానంటే మీ సాక్షి ఛానెల్కే వచ్చి నీతో చర్చిస్తా. నిజానిజాలు అప్పుడు బయటకొస్తాయి. వాటి ఆధారంగా ప్రజలూ అర్థం చేసుకుంటారు. కడప, హైదరాబాద్ల్లో ప్రెస్మీట్లు పెట్టి నేను లేవనెత్తిన అంశాలకు ఒక అన్నగా సమాధానం చెప్పకపోయినా ఫరవాలేదు.. ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.
‘వివేకం’ సినిమాలో కంటే క్రూరంగా నాన్నను చంపారు
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేయటానికి ప్రయత్నిస్తే నన్ను నిలువరించేందుకు చాలా ప్రయత్నించారు. జగన్తో మాట్లాడతానంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా నాన్న తొలి వర్థంతి కోసం ఆహ్వానించేందుకు వచ్చి కలుస్తానంటే అవసరం లేదని అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయన్ను కలిసే సందర్భం రాలేదు. తర్వాత మాట్లాడలేదు. ఆ అవసరమూ నాకు రాలేదు. నా ఉద్యమం నాదైపోయింది. ‘వివేకం’ సినిమాను ఎవరో కానీ చాలా ధైర్యంగా తీశారు. ఆ సినిమా చివరి అరగంట చూస్తే చాలా భయం వేసింది. ఆ సన్నివేశాలు చూడలేక కళ్లు మూసుకున్నా. అందులో చూపించిన దానికంటే వాస్తవంగా ఇంకా క్రూరంగా చంపారు.
వివేకా కుమార్తె సునీత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు