అనుకున్నట్లే చేసింది
ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే కొద్దిమందికి మినహా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీకి నిర్ణయించింది.
గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం
నేటి నుంచి ఆరో తేదీ వరకు అందజేత
దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం, వీల్ఛైర్పై ఉన్న వారికే ఇంటి వద్ద
మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందే
సర్కారు ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే కొద్దిమందికి మినహా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీకి నిర్ణయించింది. 86.33 శాతం పింఛనుదార్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకునేలా ఉత్తర్వులిచ్చింది. పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సరిపోరని.. వీరిలో కొందరికి వేర్వేరు విధులు ఉన్నాయని.. ఇలా పలు కారణాలు చూపించి చివరకు పింఛనర్లను గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించేలా చేస్తోంది. ఈ మేరకు బుధవారం నుంచి ఆరో తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచానికి, వీల్ఛైర్కు పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందే వృద్ధ వితంతువులకు మాత్రమే ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని ఉత్తర్వులో పేర్కొంది. పింఛన్ల పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) సీఈవో గతనెల 31న జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించి.. దాని స్థానంలో ఈ నెలతోపాటు మే, జూన్ నెలల్లోనూ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలిచ్చింది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ పేర్కొన్నారు.
వారికి మాత్రమే ఇళ్ల వద్ద పంపిణీ
గ్రామ సచివాలయాలకు దూరంగా ఉండే ఆవాసాలు (హాబిటేషన్స్), అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం వంటి జిల్లాల్లోని సచివాలయాలకు దూరంగా ఉన్న ఆవాసాల్లోని పింఛనుదార్లకు.. సమీప ప్రభుత్వ కార్యాలయాల్లో పింఛన్ల పంపిణీకి కలెక్టర్లు ఏర్పాటుచేయాలి. ఈ పింఛన్ల పంపిణీపై తగిన ప్రచారం కల్పించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.
- పింఛన్ల పంపిణీ పూర్తయ్యేవరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విధులు నిర్వహించాలి.
- సచివాలయాలకు వచ్చే పింఛనుదార్లకు నీడ కల్పించడం, కూర్చునే ఏర్పాట్లు, తాగునీరు అందుబాటులో ఉంచే బాధ్యత గ్రామపంచాయతీలదే. వీటికయ్యే ఖర్చులకు పంచాయతీ సాధారణ నిధిని వెచ్చించాలి. తదనుగుణంగా పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలనివ్వాలి.
- బ్యాంకులనుంచి పింఛను సొమ్ము డ్రా చేసి గ్రామ సచివాలయాలకు తీసుకెళ్లేందుకు వీలుగా పంచాయతీ కార్యదర్శి, సంక్షేమ, విద్యా కార్యదర్శులకు ఎంపీడీవోలు, పట్టణాల్లోని వార్డు అడ్మినిస్ట్రేటివ్, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు మున్సిపల్ కమిషనర్లు అధీకృత లేఖలు ఇవ్వాలి. బ్యాంకుల్లో డ్రా చేసిన సొమ్మును పింఛన్ల పంపిణీ విధుల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అందజేయాలి. పింఛన్ల సొమ్మును బుధవారం నుంచి బ్యాంకుల్లో డ్రా చేసేలా ఆర్థికశాఖ ఏర్పాట్లు చేసింది. వెంటనే పింఛన్ల పంపిణీని ప్రారంభించి ఆరో తేదీ నాటికి పూర్తి చేయాలి.
- కొందరు పింఛనర్లకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీచేసే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది.. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఇచ్చే అధీకృత లేఖలను వెంట తీసుకెళ్లాలి. ఈ ప్రతులను సంబంధిత ఎన్నికల అధికారులకూ పంపాలి.
- ప్రతిరోజూ పింఛన్లు పంపిణీ అయ్యాక మిగిలిన సొమ్మును వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (డబ్ల్యూఈఏ), వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి అప్పగించాలి. వీళ్లు ఈ వివరాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయాలి.
- గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ లాగిన్లు అందజేయాలి. వారు తమ మొబైళ్లలో పింఛను పంపిణీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- పింఛనుదార్ల జాబితా సిబ్బందికి అందిస్తారు. ఫింగర్ప్రింట్ స్కానర్ డివైజ్లను ఆ సిబ్బందికి డిజిటల్ అసిస్టెంట్లు అందజేస్తారు.
- పింఛన్ల పంపిణీ విధానాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు వివరించాలి.
- ఆధార్ ఆధారిత పింఛను పంపిణీ కుదరకపోతే రియల్టైమ్ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానంలో పంచాలి.
- పింఛన్లు పంపిణీ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ప్రచారం చేయకూడదు.
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగితే తీవ్రంగా పరిగణిస్తాం.. అని సర్క్యులర్లో పేర్కొన్నారు.
వాలంటీర్లులా.. సిబ్బంది లేరట!
రెండు రోజుల కిందట కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పింఛనుదార్లు అందరికీ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంచడం సాధ్యం కాదని, వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛను సొమ్ము జమ చేసేందుకు ఇబ్బందులున్నాయని సర్క్యులర్లో పేర్కొన్నారు.
వాలంటీర్లు 2.66 లక్షల మంది ఉండగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 1.27 లక్షల మందే ఉన్నారని తెలిపారు. వీరిలో వైద్య సేవలందించే ఏఎన్ఎంలు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు 12,770 మంది, వ్యవసాయ అనుబంధ సేవలందించే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య సహాయకులు 14,232 మంది, విద్యుత్ పనులు చేసే ఎనర్జీ అసిస్టెంట్లు, వార్డు ఎనర్జీ సెక్రటరీలు 6,754 మంది సేవలను పింఛన్ల పంపిణీకి వినియోగించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కొందరు బూత్ స్థాయి అధికారుల విధులు నిర్వహిస్తుండటం, మరికొందరు ఎన్నికల సంబంధిత శిక్షణకు హాజరవుతున్నందున వీరితో ఏప్రిల్, మే నెలల్లో పింఛన్ల పంపిణీ కుదరబోదని తెలిపారు.
- వీరందరినీ మినహాయిస్తే ఇంటింటికీ పింఛను పంపిణీచేసే సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, వాలంటీర్ల మాదిరి ఈ సిబ్బందికి పింఛనుదార్ల ఇళ్లు కచ్చితంగా తెలియక, పింఛను పంపిణీకి ఎక్కువ సమయం పట్టే అవకాశముందని పేర్కొన్నారు. ఇలాంటి జాప్యం ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదని వివరించారు.
- పింఛనుదార్లు అందరికీ తమ గ్రామ, వార్డు సచివాలయాలు ఎక్కడున్నాయో తెలుసని.. వారు తమ సౌలభ్యం మేరకు ఈ సచివాలయాలకు రావొచ్చని పేర్కొన్నారు.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండే ఉద్యోగుల సేవలను పింఛన్ల పంపిణీకి ఉపయోగించుకోవచ్చని, అన్ని సచివాలయాల్లో ఐటీ హార్డ్వేర్, కనెక్టివిటీ అందుబాటులో ఉందని తెలిపారు.
- పింఛన్ల పంపిణీ నేపథ్యంలో అక్కడి ఉద్యోగుల పని వేళలు పెంచొచ్చని, పింఛన్ల పంపిణీని సులభంగా పర్యవేక్షించే వీలుందని, ఏవైనా ఇబ్బందులొస్తే వెంటనే పరిష్కరించే వీలుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి మొగ్గు చూపినట్లు పేర్కొన్నారు.
డీబీటీ వల్ల అసాధ్యమే..
నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పింఛను జమ (డీబీటీ) చేసే విధానమూ సాధ్యం కాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. పింఛనుదార్లలో కొందరికి బ్యాంకు పాసుపుస్తకాలు లేకపోవడం, మరికొందరి బ్యాంకు ఖాతాలు వినియోగంలో లేకపోవడం, ఆ ఖాతాలకు ఆధార్ సీడింగ్ కాకపోవడంతోపాటు మరణించిన పింఛనుదార్లకూ పింఛను జమయ్యే అవకాశముందని తెలిపారు. మరోవైపు పింఛను పొందేవారంతా పేదవాళ్లు కావడం, వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారు పింఛను సొమ్మును బ్యాంకులో డ్రా చేయడం సాధ్యం కాదని తేల్చినట్లు ఉత్తర్వులో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల