పాఠశాలలకు 24 నుంచి వేసవి సెలవులు

రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి జూన్‌ 11 వరకు పాఠశాల విద్యా శాఖ వేసవి సెలవులు ప్రకటించింది.

Published : 03 Apr 2024 04:32 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి జూన్‌ 11 వరకు పాఠశాల విద్యా శాఖ వేసవి సెలవులు ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఈ నెల 23ను చివరి పని రోజుగా పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని