శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తీరుపై.. మాంసం చెత్తలో పడేసి ముస్లింల నిరసన

కరోనా సమయంలో ఓ పూట కూరకు సాయం చేశారా ఎమ్మెల్యే. అంతమాత్రానికే దానకర్ణుడిలా బిల్డపివ్వడం మొదలుపెట్టారు.

Updated : 03 Apr 2024 07:04 IST

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: కరోనా సమయంలో ఓ పూట కూరకు సాయం చేశారా ఎమ్మెల్యే. అంతమాత్రానికే దానకర్ణుడిలా బిల్డపివ్వడం మొదలుపెట్టారు. దొరికిన ప్రతి వేదికపై మైక్‌ పట్టుకొని సొంత డబ్బాను కొట్టుకోసాగారు. అది విని సాయం పొందిన వాళ్లూ విసిగిపోయారు. చివరికి ఆ గప్పాలు ఆపండి బాబాయ్‌.. అంటూ నిరసన తెలియజేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కరోనా సమయంలో ఓ రోజు ముస్లింలకు చికెన్‌, టమాటాలు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి ప్రచారానికి వాడుకుంటున్నారు. దీన్ని సాయం స్వీకరించిన ముస్లింలు అవమానకరంగా భావించి, మంగళవారం శ్రీకాళహస్తిలోని కుమారస్వామితిప్ప కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఒక్క రోజు సాయం చేసి.. రాజకీయ వేదికలపై తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా రోజూ చెప్పడం తగదన్నారు. ఐదేళ్లలో ఒక్కసారి చికెన్‌ ఇవ్వడం తప్పా.. ఎమ్మెల్యే చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. అయినా.. ఆపద వచ్చినప్పుడు సాయం చేయడం ఎమ్మెల్యే బాధ్యత  కాదా అని ప్రశ్నించారు. తమ వెంట తెచ్చుకున్న మాంసం, టమాటాను చెత్తకుప్పల్లో పడేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని