కరెంట్లోనూ కోట్లాట
క్విడ్ప్రోకో అక్రమాలను ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ రంగానికీ వర్తింపజేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష పేరుతో వైకాపా ప్రభుత్వం హడావుడి చేసింది.
రూ.7,830 కోట్లు దోచిపెట్టేలా జగన్నాటకం
యాక్సిస్ ఎనర్జీతో పీపీఏకు అనుమతించిన ఫలితం
ఏపీఈఆర్సీ ఆమోదం కోసం 21 పీపీఏలు
గతంలోకంటే అధిక ధర చెల్లించేలా ప్రతిపాదన
మార్కెట్తో పోలిస్తే.. యూనిట్కు 73 పైసలు అదనం
బిడ్డింగ్ లేకుండా పవన విద్యుత్ తీసుకునేలా నిర్ణయం
ఈనాడు, అమరావతి: క్విడ్ప్రోకో అక్రమాలను ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ రంగానికీ వర్తింపజేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష పేరుతో వైకాపా ప్రభుత్వం హడావుడి చేసింది. విద్యుదుత్పత్తి సంస్థలను కోర్టుకు వెళ్లేలా చేసింది. అందులో కొన్ని సంస్థలతోనే ఇప్పుడు పీపీఏలు కుదుర్చుకోబోతోంది. ఇదీ జగన్నాటకంలో ఒక భాగం. ప్రకృతి వనరులను దోచుకోవడం ఎలాగో తెలిసిన జగన్.. గాలినీ తన దోపిడీ కోసం వదల్లేదు. విద్యుత్ ప్రాజెక్టుల పీపీఏలను తనకు దగ్గరి కంపెనీతో కుదుర్చుకోవడానికి జగన్ ఇదే తీరు అనుసరించారు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి విద్యుత్ తీసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకోడానికి జగన్ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పీపీఏ ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ ఆమోదానికి విద్యుత్ సంస్థలు పంపాయి. అధిక ధరకు విద్యుత్ తీసుకునేలా పీపీఏ కుదుర్చుకోవడంతోపాటు ఆ సంస్థకు పన్నుల మినహాయింపుల ద్వారా 25 ఏళ్లలో రూ.7,830 కోట్ల భారీ ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చబోతోంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ పీపీఏ ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పంపడం విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా ఈ భారం వినియోగదారులపై పడనుంది. యూనిట్ రూ.2.80 చొప్పున తీసుకోవడానికి 2019లో యాక్సిస్ సంస్థతో 21 పీపీఏలు కుదుర్చుకునేలా జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత యూనిట్ ధర ఎక్కువగా ఉందని ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. మూడేళ్ల తర్వాత అదే సంస్థతో పీపీఏ కుదుర్చుకోవడానికి ఏపీఈఆర్సీ అనుమతి కోరింది. అప్పట్లో పీపీఏ కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన ఎందుకు తిరస్కరించినట్లు? ఎన్నికలకు కొద్ది నెలల ముందు యాక్సిస్ సంస్థకు స్కీం ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ (ఎస్ఐఏ) ప్రకారం అన్ని ప్రయోజనాలు కల్పించాలంటూ ప్రభుత్వం ఎందుకు అనుమతించిందన్న ప్రశ్నలు వస్తున్నాయి. పోనీ.. గతంలో ప్రతిపాదించిన ధర కంటే తగ్గించి పీపీఏ చేసుకుంటుందా? అంటే అదీ కాదు. ఆ ధరకంటే యూనిట్కు అదనంగా 44 పైసలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రతిపాదన ప్రకారం యాక్సిస్ సంస్థకు యూనిట్కు రూ.3.24 చొప్పున పీపీఏ వ్యవధి 25 ఏళ్ల పాటు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది.
ధరలోనూ తిరకాసు
పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన బిడ్డింగ్లలో యూనిట్ ధర సగటున రూ.3.25 నుంచి రూ.3.40 మధ్య ఉంది. ఈ ధరలను దృష్టిలో ఉంచుకుని యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్ రూ.3.30కి తీసుకునేలా టారిఫ్ను నిర్దేశించాలని పీపీఏ ప్రతిపాదనల్లో ఇంధన శాఖ పేర్కొంది. 2022లో దేశంలో వివిధ బిడ్డింగ్ల్లో వేసిన ధరలను దృష్టిలో ఉంచుకుని యూనిట్కు రూ.3.24 చొప్పున తీసుకోవడానికి అనుమతించాలని కోరింది. ఆ ఏడాది పవన విద్యుత్ ప్రాజెక్టులకు నిర్వహించిన బిడ్డింగ్లో గరిష్ఠంగా యూనిట్కు రూ.2.90 చొప్పున మాత్రమే ధర ఉంది. గతంలో తిరస్కరించిన పీపీఏలను తెరపైకి తీసుకురావడమే విమర్శలకు తావిస్తే.. యూనిట్ ధరను నిర్దేశించే విషయంలోనూ యాక్సిస్ సంస్థకు అయాచిత లబ్ధి చేకూర్చేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. బ్యాటరీ స్టోరేజీ అవకాశమున్న యూనిట్లకు నిర్దేశించిన టారిఫ్ ఆధారంగా యాక్సిస్ సంస్థ నుంచి తీసుకునే విద్యుత్కు అధిక ధర చెల్లించేలా జగన్ ప్రభుత్వం తెరవెనుక వ్యూహాన్ని అమలుచేసింది.
- 2018లో కేంద్ర సంస్థ సెకి 2 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్వహించిన బిడ్డింగ్లో.. శ్రీజన్ ఎనర్జీ సిస్టమ్స్ 250 మెగావాట్లు, స్ప్రింగ్ ఎనర్జీ 300 మెగావాట్లు, బీఎల్పీ ఎనర్జీ 280 మెగావాట్లు, బేతమ్ విండ్ ఎనర్జీ 200 మెగావాట్ల ప్రాజెక్టులను దక్కించుకున్నాయి. ఆ సంస్థలతో యూనిట్ రూ.2.51 చొప్పున విద్యుత్ విక్రయ ఒప్పందాన్ని సెకి కుదుర్చుకుంది. పాత ధరతో పోలిస్తే యూనిట్కు 73 పైసల చొప్పున జగన్ ప్రభుత్వం ఎక్కువ చెల్లిస్తున్నట్లే.
- ప్రభుత్వం యూనిట్ విద్యుత్ రూ.3.24 చొప్పున తీసుకునేలా ప్రతిపాదిస్తే విద్యుత్ చట్టం సెక్షన్ 62 ప్రకారం క్యాపిటల్ కాస్ట్ను నిర్దేశించాలని యాక్సిస్.. ఏపీఈఆర్సీని కోరింది. ఈ ప్రకారం యూనిట్కు కనీసం రూ.5 చొప్పున ధర నిర్దేశించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆ మొత్తానికి అంగీకరిస్తే ప్రజలపై భారం పెరగనుంది.
యాక్సిస్కు అదనపు లబ్ధి..రూ.7,300 కోట్లు!
యాక్సిస్ నుంచి 850 మెగావాట్ల విద్యుత్ తీసుకునేలా పీపీఏ ప్రతిపాదన ప్రకారం.. ఏటా సుమారు 1,700 మిలియన్ యూనిట్ల విద్యుత్ను డిస్కంలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారం పీపీఏ వ్యవధి 25 ఏళ్లలో తీసుకోబోయే విద్యుత్ 42,500 ఎంయూలు. మార్కెట్ ధరలతో పోలిస్తే యూనిట్కు అదనంగా 73 పైసలు చెల్లించినట్లు భావిస్తే ఏటా రూ.124.10 కోట్ల వంతున 25 ఏళ్లలో పడబోయే అదనపు భారం రూ.3,102.5 కోట్లు. దశలవారీగా మిగిలిన 1,150 మెగావాట్ల ప్రాజెక్టులతో పీపీఏలు కుదుర్చుకుంటే ఏటా మరో రూ.167.90 కోట్ల చొప్పున పీపీఏ వ్యవధిలో మరో రూ.4,197.50 కోట్ల అదనపు భారం పడే అవకాశముంది.
ఒకరికి ఒకలా.. యాక్సిస్కు మరోలా నిబంధనలు?
గ్రీన్కో సంస్థ కర్నూలులో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు 2018లో అప్పటి ప్రభుత్వం అనుమతించింది. 2,750 మెగావాట్ల సౌర, పవన, పీఎస్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాన్ని అప్పట్లోనే కుదుర్చుకుంది. ఆ సంస్థ ఉత్పత్తి చేసే విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఎలాంటి పీపీఏ కుదుర్చుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వమిచ్చిన అనుమతులను కొనసాగిస్తూనే గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జీల కింద మొదటి 25ఏళ్ల పాటు మెగావాట్కు రూ.లక్ష చొప్పున, తర్వాత రూ.2 లక్షల చొప్పున చెల్లించాలని కోరింది. సంస్థ ఏర్పాటుచేసే సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు మెగావాట్కు రూ.లక్ష చొప్పున 28 ఏళ్లు చెల్లించాలని పేర్కొంది. ప్రాజెక్టు కోసం సేకరించే 4,766 ఎకరాల కోసం.. ఎకరా రూ.రెండున్నర లక్షల చొప్పున గత ప్రభుత్వం నిర్దేశించిన ధరను సవరించి ఎకరాకు రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని 2020 జూన్ 13న ఉత్తర్వులిచ్చింది.
ఇదే సమయంలో కేవలం ఎంవోయూ కుదుర్చుకున్న యాక్సిస్ ఉత్పత్తి చేసే విద్యుత్ తీసుకునేలా పీపీఏ కుదుర్చుకోవడం ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతోపాటు గ్రీన్టాక్స్ కింద మెగావాట్కు రూ.లక్ష చొప్పున, సైట్ డెవలప్మెంట్ ఛార్జీల కింద ఎకరాకు రూ.50వేల వంతున చెల్లించాల్సిన మొత్తానికి మినహాయింపు ఇచ్చింది. పీపీఏ వ్యవధి 25 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జీల కింద రూ.500 కోట్లు (2 వేల మెగావాట్ల ప్రాజెక్టులపై), సైట్ డెవలప్మెంట్ ఛార్జీలు రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.530 కోట్ల ప్రయోజనాన్ని పరోక్షంగా కల్పించింది. యాక్సిస్ సంస్థతో మూడేళ్ల కిందట వద్దనుకున్న పీపీఏలు.. జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు ముద్దుగా అనిపించాయి.
బిడ్డింగ్ ఎందుకు నిర్వహించడం లేదు?
ఆర్పీపీవో ఆబ్లిగేషన్కు మించి ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయి. ఈ ప్రకారం పాత ఒప్పందాలను రద్దు చేసి బిడ్డింగ్లో ఎంపికైన ప్రాజెక్టులనుంచే విద్యుత్ కొనాలి. దీనివల్ల సంస్థల మధ్య పోటీతో తక్కువ ధరకు విద్యుత్ వచ్చే అవకాశం ఉండేది. ఆ నిబంధనలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యాక్సిస్ సంస్థ నుంచి కొనుగోలుకు ఎలాంటి బిడ్డింగ్ లేకుండానే ప్రభుత్వం అనుమతించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!