అసుర.. అసుర.. భూబకాసుర!
ఐదేళ్ల కిందట.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్రంటే ఔననుకున్నారు ఆంధ్రాజనం! ఐదేళ్ల తర్వాత.. అర్థమైంది నాటి జగనన్న యాత్ర కష్టాలు తెలుసుకోవటం కోసం కాదు కబ్జాలు పెట్టడానికని!
ఐదేళ్ల కిందట.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్రంటే ఔననుకున్నారు ఆంధ్రాజనం!
ఐదేళ్ల తర్వాత.. అర్థమైంది నాటి జగనన్న యాత్ర కష్టాలు తెలుసుకోవటం కోసం కాదు కబ్జాలు పెట్టడానికని!
ఖాళీ స్థలాల్లో జెండా పాతడమే ఎజెండాగా.. కంకణం కట్టుకుని... అన్న అను‘చోరులంతా’ ఏకమై... పప్పుబెల్లాల్లా నీకిది.. నాకది అంటూ పంచుకున్నారు... అధికారమే అండగా.. అప్పనంగా సర్కారు స్థలాల్ని భూంఫట్ అన్నారు... ప్రైవేటు స్థలాలనూ పంచాయతీల పేరుతో స్వాహా చేశారు!
మహాభారతంలో ఉన్నది ఒక్కడే బకాసురుడు. మాయావి జగన్ రాజ్యంలోనేమో ఊరికొక బకాసురుడు! తడవకు బండెడు అన్నం, రెండు దున్నపోతులు, ఒక మనిషిని తిని తేన్చేవాడు నాటి బకాసురుడు. జగనన్న ఆశీస్సులతో జనం భూములను లెక్కపెట్టలేనంతగా మింగేసి బ్రేవ్మంటున్నారు నేటి వైకాపాసురులు. ‘‘రాష్ట్ర ప్రజలందరికీ తోడుగా ఉంటా’’ అని నమ్మకంగా అబద్ధాలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్నారు జగన్మోహన్రెడ్డి. సీఎం కుర్చీలో కుర్చోగానే ముసుగు తీసేసిన జగన్- కబ్జాలరాయుళ్లకు కొంగు బంగారమయ్యారు.
భూమేతల్లో పెద్దతలకాయలు
రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొసలి కన్నీళ్లు కార్చారు జగన్. నిజానికి ఆయన సీఎం అయ్యాకే ల్యాండ్ మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఆ క్రమంలో విశాఖపట్నం చుట్టుపక్కల ఎన్నెన్ని భూములు వైకాపా ప్రేతగణాల పొట్టలోకి పోయాయో లెక్కేలేదు. విశాఖలో వైకాపా మూలవిరాట్టు కనుసన్నల్లో సాగిన భూబాగోతాల విలువ దాదాపు రూ.7,950 కోట్లు. ఆ అక్రమ వ్యవహారాల్లో రూ.1600 కోట్లు పెద్దతలకాయ జేబులో పడినట్లు చెబుతారు. స్థలాల స్వాహాయణంలో విశాఖ వైకాపా ప్రజాప్రతినిధి శైలే వేరు. రూ.500 కోట్ల విలువైన భూమిలో భారీ ప్రాజెక్టును చేపట్టిన ఆయన- సంబంధిత భూయజమానుల నెత్తిన చెయ్యిపెట్టారు. 15 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో రెండువేల ఫ్లాట్లు నిర్మిస్తున్న ఆ ప్రజాప్రతినిధి- భూయజమానులకు ఇస్తోంది కేవలం 14,400 చదరపు అడుగులు! యాజమాన్య హక్కుల్లోని లొసుగులను తనకు వాటంగా మార్చుకుని అతి ఖరీదైన భూములను జగన్ పార్టీ బడానేత గుటుక్కుమనిపించారు. విశాఖలోనే రుషికొండ ఒమ్మివానిపాలెంలో వందల కోట్ల రూపాయల విలువైన 18 ఎకరాలను వైకాపా నేతాసురులు ఆక్రమించారు. బంగారం లాంటి భూములను బోగస్ కాగితాలతో కబ్జా చేసే ముఠాలకూ జగన్ పార్టీ పాలుపోసింది. ఒంగోలులో అలాంటి ఓ ముఠా పాలబడినట్లు తెలిసిన స్థలాల విలువే రూ.200 కోట్ల వరకు ఉంది. భూములను మింగేసే భూతాల పాలనకు ప్రాణప్రతిష్ఠ చేసిన జగన్ కారణంగా గడచిన అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దోపిడీ పర్వాలెన్నో నిరాటంకంగా సాగిపోయాయి.
భూచోళ్లు బాబోయ్!
జగన్కు స్వతహాగా స్వార్థ ప్రయోజనాల యావే ఎక్కువ. దానికి తగినట్లే దుర్గుణాల్లో తనకు సరిజోడులైన వారికి నియోజకవర్గాలను రాసిచ్చారాయన. వాళ్లందరూ ఎక్కడికక్కడ బందిపోట్లుగా అవతరించి- ప్రజల ఆస్తులు, సహజ వనరులు, ఖాళీ జాగాలను వీలైనంతగా కొల్లగొట్టారు. పొద్దుపొద్దునే ‘గుడ్మార్నింగ్’ అంటూ రోడ్డెక్కే ఓ వైకాపా నేతాశ్రీ- అచ్చుగుద్దిన అధర్మమూర్తి. అనుభవదారులకు పదీ పరకా ఇచ్చి రూ.కోట్ల విలువైన ఎసైన్డ్ భూములను ఆయన భోంచేస్తుంటారు. ఆ రకంగా 300 ఎకరాలను సొంతం చేసుకున్నారు. సోలార్ ప్లాంటు ఏర్పాటుకు 106 ఎకరాలను సేకరించి ఒక కంపెనీకి అప్పగించింది గత ప్రభుత్వం. రాజ్యాధికారం జగన్ పార్టీ చేతికి చిక్కాక ఆ నియోజకవర్గ రారాజు దృష్టి ఆ భూములపై పడింది. కంపెనీ ప్రతినిధులను బెదిరించి మరీ రూ.100 కోట్లకు పైగా విలువైన స్థలాలను రూ.3.18 కోట్లకు కొట్టేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్ పార్టీ జాతిరత్నం ఇంకొకరు ఉన్నారు. స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమీషన్లు, విల్లాలతోపాటు పేదల భూములను గుంజుకోవడంలో ఆయన సాటిలేని మేటి తోపు! అక్రమార్కులపై అవ్యాజ ప్రేమానురాగాలను కురిపించే జగన్ పుణ్యమా అని అయిదేళ్లలో రూ.500 కోట్ల ఆస్తులను వెనకేసుకున్నారు ఆ నాయకులుంగారు. రోత బూతులకు బ్రాండ్ అంబాసిడర్ వంటి ఓ ప్రజాప్రతినిధి ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో. సొంత నియోజకవర్గంలో ఎకరాల కొద్దీ భూములను, షాపింగ్ కాంప్లెక్స్ను ఆయన ఆక్రమించుకున్నారు. పక్క నియోజకవర్గంలో కొండలను పొడికొట్టి కోట్లు వెనకేసుకున్నారు. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు భూఆక్రమణల్లో ఘనాపాఠి అని రాజంపేట మండలవాసులు ఇటీవలే కలెక్టర్కు ఫిర్యాదుచేశారు. మందపల్లె రెవెన్యూ గ్రామంలో 100 ఎకరాలను ఆయన దిగమింగేశారని, మరోచోట సర్కారీ భూమిని సొంత ఎస్టేట్గా మార్చుకున్నారని జనం గళమెత్తారు.
హిరణ్యాక్షుడి వారసులు
జగన్ మార్క్ పరిపాలన అంటే- నేలతల్లిని చెరబట్టిన హిరణ్యాక్షుడి వారసుల స్వైరవిహారమే! జగన్ విధేయుల అండదండలతో ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాల పాలయ్యాయి. అక్కడ రూ.150-170 కోట్ల విలువైన సర్కారీ జాగాలను పప్పుబెల్లాలా ఆరగించారు వైకాపా నేతలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులమంటూ కొద్దినెలల క్రితం కొందరు వచ్చి నెల్లూరులోని చైతన్య కాలనీ పార్క్ మీద పడ్డారు. రూ.12 కోట్ల విలువైన పార్క్ జాగాను దిగమింగడానికి వాళ్లు తప్పుడు పత్రాలూ తయారు చేశారు. తిరుపతి జిల్లాలో సెజ్ భూములను దర్జాగా తన పరం చేసుకున్నారొక జగన్ అంతేవాసి. శ్రీకాకుళం జిల్లా లోహరిబందలో యాభై ఎకరాల సర్కారీ స్థలాన్ని వైకాపా రాబందులు తన్నుకెళ్లిపోయాయి. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల జాగాల్లోనూ జగన్ భక్తగణం పాగావేసింది. వినుకొండ వైకాపా ఎమ్మెల్యే ఎండీగా ఉన్న ఒక సంస్థ, మరో కంపెనీ కలిసి 175 ఎకరాల ఎసైన్డ్ భూములను ఆక్రమించాయని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆక్రమించుకున్న స్థలాలను బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.50కోట్లు తీసుకున్నారని కోర్టులో విచారణ సందర్భంగా పిటీషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. స్పందించిన హైకోర్టు- వైకాపా ఎమ్మెల్యేతో సహా మరికొందరికి నిరుడు నోటీసులిచ్చింది. జగన్ పార్టీ భూదందాల ప్రేరణతోనేమో రాష్ట్రంలోని ఒక ఉన్నతాధికారి సైతం ‘భూ’చోడి అవతారమెత్తారు. విశాఖ నగర శివార్లలో సాధారణ రైతులను నయానాభయానా దారికి తెచ్చుకుని రూ.2వేల కోట్లకు పైగా విలువైన భూములను కారుచవగ్గా కొట్టేశారాయన!
దేవుడి భూములా... దోచేయ్!
దేవాలయ భూములనూ జగన్ అనుచరగణాలు భారీగా దిగమింగేశాయి. పల్నాడులో లక్ష్మీనరసింహ స్వామి ఆలయ మాన్యం భూముల్లో క్వార్జ్ ఖనిజాన్ని ఓ ఎమ్మెల్యే కొల్లగొట్టారు. దాదాపు 50వేల టన్నుల ఖనిజాన్ని తవ్వుకుని రూ.50 కోట్లకు పైగా ఆర్జించారు. గుడివాడలో రూ.20 కోట్ల విలువైన అభయాంజనేయ స్వామి దేవస్థానం భూమి కబ్జాకు వైకాపా నేతలు తెగబడ్డారు. ‘‘అన్న చెప్పారు. మేం షెడ్డు వేసుకుంటున్నాం. మీకు చేతనైంది చేసుకోండి’’ అంటూ అడ్డొచ్చిన వారిని బెదిరించారు. ప్రకాశం జిల్లా పామూరులోని మదన వేణుగోపాలస్వామి, శ్రీవల్లీ భుజంగేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన 70 ఎకరాలు పెద్దల పరమయ్యాయి. రూ.120 కోట్లకు పైగా విలువైన ఆ స్థలాలను ఆక్రమించుకుని, రిజిస్ట్రేషన్లు చేయించుకుని, ఏకంగా భవంతులే కట్టేసుకున్నారు. ‘‘గుడినీ గుడిలో లింగాన్నీ మింగేస్తున్నారు’’ అంటూ విపక్షంలో ఉన్నప్పుడు జగన్ గుండెలు బాదుకున్నారు. ఆయన మాటలను తూ.చ.తప్పకుండా పాటించి సర్వం స్వాహాచేసింది వైకాపా ప్రబుద్ధులే. తాడేపల్లిగూడెం బాల వేంకటేశ్వర స్వామి ఆలయ భూమిని కబ్జాచేసిన జగన్ పార్టీ నేత- అందులో వాణిజ్య సముదాయం నిర్మించారు. దేవాలయ స్థలంలోని ఆ అక్రమ కట్టడంలోనే జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాన్ని పెట్టారు. ఇంతకంటే మహాపాపం ఉంటుందా?
దళితుల ఆస్తులూ కబ్జా!
‘నా ఎస్సీలు...’ అంటూ దళితులపై ఎక్కడి లేని ప్రేమను ఒలకబోస్తుంటారు జగన్. ఆయన పార్టీ పెద్దమనుషులేమో ఊళ్లలో దళితుల భూములను యమదర్జాగా కాజేస్తుంటారు. అయిదేళ్లుగా ఇదే వరస! తిరుపతికి సమీపంలో పాతిక మంది దళితులకు చెందిన రూ.10 కోట్ల విలువైన భూములను జగన్ పార్టీ నేతలు గుప్పిట పట్టారు. అన్నమయ్య జిల్లా మందడంలో దళితుల అనుభవంలో ఉన్న దాదాపు వంద ఎకరాలను వైకాపా పెత్తందారులు కైవసం చేసేసుకున్నారు. తెర ముందు ఒక స్థిరాస్తి వ్యాపారి... తెర వెనక ముగ్గురు ప్రజాప్రతినిధులు... ఆ నలుగురూ కలిసి కర్నూలు శివారులోని మునగాలపాడులో రూ.200 కోట్ల విలువైన భూమికి టెండర్ పెట్టారు. జాతీయ రహదారికి దగ్గర్లోని ఆ రెండొందల ఎకరాలను వందేళ్లుగా దళితులు సాగుచేసుకుంటున్నారు. వారి నుంచి ఆ భూములను గుంజుకోవడానికి ప్రజాప్రతినిధుల సాయంతో స్థిరాస్తి వ్యాపారి పథక రచన చేశారు. గుంటూరు జిల్లా అనమర్లపూడిలో దళితులకు చెందిన రూ.15 కోట్ల విలువైన భూములను జగన్ పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు స్వాహాచేశారు. ‘జీర్ణం.. జీర్ణం.. జగనన్న దయతో సర్వం జీర్ణం’ అనుకుంటూ వైకాపా నేతలు ఊరూరా ఇలాగే పేట్రేగిపోయారు.
కొండలు, గుట్టలు, కాల్వగట్లు, జలవనరులు... దేన్నీ విడిచిపెట్టకుండా ఆక్రమణలకు పాల్పడ్డారు. చరిత్రలో ఎన్నడూ కనివినీ ఎరగని స్థాయిలో జగన్ ఏలుబడిలో భూదోపిడీ చోటుచేసుకుంది. కానీ, ఆయన ఏమో రాష్ట్రానికి తాను చేసినంత మేలు మరెవరూ చేయలేదంటూ గప్పాలు కొడుతున్నారు. కానీ, నోటికి నెత్తురు అంటించుకున్న తోడేలు వచ్చి ‘నేను శాకాహారిని’ అంటే ఎవరు నమ్ముతారు?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్