పండుటాకులపై పగ
ఏం జరగకూడదని అందరూ ఆశించారో అదే జరిగింది! వైకాపా వికృత రాజకీయ క్రీడలో ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వంతు పాత్ర సమర్థంగా పోషించారు.
పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం
మండుటెండల్లో అభాగ్యుల ఆపసోపాలు
సర్కారు కర్కశ నిర్ణయాలు.. ఆపై విపక్షాలపై అపనిందలు
వైకాపా వికృత క్రీడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం
చేష్టలుడిగి చూస్తున్న ఎన్నికల సంఘం
ఈనాడు - అమరావతి
ఏం జరగకూడదని అందరూ ఆశించారో అదే జరిగింది! వైకాపా వికృత రాజకీయ క్రీడలో ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వంతు పాత్ర సమర్థంగా పోషించారు. వృద్ధులు మండుటెండల్లో పింఛను కోసం పడిగాపులు కాచేలా చేశారు. వారు ఇబ్బందులు పడుతుంటే.. నెపాన్ని విపక్షాలపై నెట్టేసేందుకు అధికార పార్టీ పన్నిన కుట్రను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు తోడ్పడ్డారు. ఎన్ని విమర్శలు వచ్చినా బేఖాతరు చేస్తూ ప్రజల ప్రయోజనాలకంటే అధికార పార్టీతో అంటకాగడమే ముఖ్యమని చాటిచెప్పారు. నిజంగా తలచుకుంటే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి 1, 2 రోజుల్లోనే మొత్తం పింఛన్లను పంపిణీ చేసేంత విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పటికీ అడుగు వేయలేదు. ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న అధికారులు.. వృద్ధులు, దివ్యాంగులు సహా వివిధ కేటగిరీల పింఛనుదారులను సచివాలయాల వద్దకు రప్పించారు. వారికి కష్టనష్టాలు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరించారు. ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా, ఎన్నికల సమయంలోనైనా ప్రజాప్రయోజనాలే పరమావధిగా పనిచేయాల్సిన సీఎస్ జవహర్రెడ్డి అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తే ధనుంజయరెడ్డి, మురళీధరరెడ్డి, శశిభూషణ్కుమార్ వంటి అధికారుల గురించి చెప్పాల్సిన పనేలేదు! తమ పంతం నెగ్గించుకోవడానికి బడుగు జీవులను బలిపశువులను చేశారు. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగారు. నెపం మొత్తాన్ని విపక్షాలపైకి నెట్టేసి ప్రజల దృష్టిలో వారిని దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. తెదేపాపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే.ఉన్నతాధికారులు ఒక పార్టీకి కొమ్ముకాస్తుంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తుండటమేంటి? అధికారంలో ఉన్న పార్టీ ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి విపక్షాలపై బురదజల్లుతుంటే ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా సీఎస్కు ఎందుకు ఆదేశాలివ్వడం లేదు? వైకాపాపై అభిమానాన్ని చాటుకోవడానికి ఏమాత్రం వెనకాడని అధికారులను అవే పోస్టుల్లో కొనసాగిస్తే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎలా జరుగుతాయి? అన్న ప్రశ్నలు వివిధ వర్గాలనుంచి వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేసి వారిపై విద్వేషాన్ని రేకెత్తించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర పన్నడం, దీనికి ఉన్నతాధికారులు సహకరించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని.. ఎన్నికల సంఘం తక్షణం స్పందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకపోతే రాబోయే 40 రోజుల్లో మరిన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సినిమా హాళ్లు, మద్యం దుకాణాల వద్ద డ్యూటీలు వేసినప్పుడేమైంది?
జనసేన అధినేత పవన్కల్యాణ్పై కక్షగట్టిన జగన్ ప్రభుత్వం ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమా టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించలేదు. సరికదా.. థియేటర్ల యాజమాన్యాలు ఎక్కడ ధరలు పెంచేస్తాయోనని రెవెన్యూ అధికారులతో నిఘా పెట్టించింది. వారికి థియేటర్ల వద్ద డ్యూటీలు వేసింది. దేశంలో ఎక్కడా చూడనట్టు మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వ పెద్దలు తానా అంటే తందానా అనే ఉన్నతాధికారులు.. వారికి అవసరమైనప్పుడు ఉద్యోగులను ఎలాంటి పనులకైనా వాడేస్తారు. కానీ అభాగ్యులకు పింఛన్లు ఇచ్చేందుకు మాత్రం సరిపడా ఉద్యోగులు లేరని చెబుతున్నారు. 1.27 లక్షల మంది వార్డు, గ్రామసచివాలయాల ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వేసవి, ఎన్నికల దృష్ట్యా వారిపై అంత పని ఒత్తిడేమీ లేనప్పటికీ వారితో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయించేందుకు ఉన్నతాధికారులు ముందుకు రాలేదు. సచివాలయాల్లోని వ్యవసాయ, అనుబంధ రంగాల ఉద్యోగులు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఎనర్జీ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, వార్డు కార్యదర్శులు తీరిక లేకుండా ఉన్నారని.. వారికి పింఛన్ల పంపిణీ అప్పగించలేమనే వింత వాదన తెరపైకి తెచ్చారు. సీఎస్ సహా ఉన్నతాధికారులంతా ప్రతి దశలోను పింఛనుదారులను సచివాలయాలకు రప్పించి ఎలా ఇబ్బంది పెట్టాలి? విపక్షాల్ని దోషులుగా ఎలా నిలబెట్టాలి? తద్వారా అధికార వైకాపాకు ఎలా మేలు చేయాలని ఆలోచించారే తప్ప ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచేందుకున్న అవకాశాలపై దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి.
అధికారులకు చీమకుట్టినట్టూ లేదా?
ఎన్నికల్లో లబ్ధి కోసం వైకాపా నాయకులు ఎంతకైనా దిగజారుతారని పింఛన్ల పంపిణీ వ్యవహారంతో మరోసారి రుజువైంది. మరి అధికారులకు ఏమైంది? ఓటర్లను ప్రభావితం చేస్తున్న వాలంటీర్లను నియంత్రించాల్సిన బాధ్యతను సీఎస్ సహా మిగతా అధికారులు విస్మరించడం వల్లే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. వాలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. ఎన్నికల సంఘం ఆదేశాల స్ఫూర్తిని అర్థం చేసుకుని ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించేందుకు వ్యవస్థలను కట్టుదిట్టం చేయాల్సిన అధికారులు.. రాజకీయ నాయకుల్లా వ్యవహరించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యమేనని సర్వీసులో చాలా జూనియర్లయిన జిల్లా కలెక్టర్లే చెబుతుంటే.. సీనియారిటీ కలిగి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న సీఎస్ వంటి సీనియర్ అధికారులకేమైంది? రాష్ట్రంలో 65.92 లక్షల మంది పింఛనుదారులుంటే వారిలో 34.18 లక్షల మంది వృద్ధులే! అన్ని లక్షల మంది ఎండల్లో మాడిపోయే పరిస్థితి కల్పించిన ఉన్నతాధికారులకు మనస్సాక్షి ఉందా? మానవత్వమన్న పదానికి వారికి అర్థం తెలుసా? అన్న విమర్శలు వస్తున్నాయి. బుధవారం పింఛన్ల పంపిణీ తొలి రోజు వృద్ధులు అనేక ఇబ్బందులుపడ్డా దిద్దుబాటు చర్యలు లేవు. రాష్ట్రంలో గురువారం 130 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం ఐదు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 250 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థ హెచ్చరికలనే బేఖాతరు చేస్తూ పంపిణీని కొనసాగించేందుకు అధికారులు మొండిపట్టుతోనే వ్యవహరిస్తున్నారు. అందుకే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలివ్వాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
వైకాపా వారు.. ఉదయాన్నే వృద్ధులు, నడవలేని వారి ఇళ్లకు వెళ్లి నల్ల జెండాలు చేతుల్లో పెట్టారు.. వారిని మంచాలు, వీల్ఛైర్లపై ఉంచి సచివాలయానికి వెళ్తున్నామంటూ... ఊరేగింపుగా తీసుకెళ్లారు. వీడియోలు తీశారు. ఊరూపేరూ లేని ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడానికి ప్రయత్నించారు.
వృద్ధుల్ని, అనారోగ్యంతో ఉన్నవారిని మంచాలపై ఊరేగిస్తూ...
జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకు పింఛను పంపిణీ చేయలేదు సరికదా.. బుధవారం ఉదయం నుంచి వైకాపా కార్యకర్తలు, నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త రాజకీయ నాటకానికి తెరతీసింది. మంచంపై నుంచి లేవలేని వృద్ధులు, చక్రాల కుర్చీల నుంచి కదల్లేని దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, నడవలేని వాళ్లను మంచాలపై ఉంచి వైకాపా నాయకులు, కార్యకర్తలే రోడ్లపైకి తీసుకొచ్చారు. వాళ్లను ఊరేగిస్తున్నట్లు ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని వీళ్ల కష్టాలకు ప్రతిపక్ష తెదేపానే కారణమంటూ రోజంతా దుష్ప్రచారం కొనసాగించారు. జగన్ అనుకూల మీడియాలో వాటిని పదేపదే చూపిస్తూ గోబెల్స్ ప్రచారం చేశారు. ‘సచివాలయాల వద్దకు వెళ్లి పింఛను లబ్ధిదారులు పడుతున్న కష్టాల్ని ఫొటోలు, వీడియోలు తీసి వాటిని మీ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేయండి’ అంటూ వైకాపా సోషల్ మీడియా విభాగం.. వాట్సప్ గ్రూపుల్లో తమ శ్రేణులందరికీ ఆదేశాలిచ్చి మరీ ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తెగబడింది. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానపడినవారు, వీల్ఛైర్కే పరిమితమైన వారికి ఇంటి దగ్గరే పింఛను ఇవ్వాలని నిబంధన ఉన్నా... వారందర్నీ రోడ్లపైకి తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేసిన పాపం వైకాపాదే. మరోవైపు మండుటెండుల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సచివాలయాల వద్దకు నడుచుకుంటూ వెళ్లి, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడ తగిన సదుపాయాల్లేక సొమ్మసిల్లి పడిపోయారు. కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం ఈ నేరాలకు పాల్పడ్డ వైకాపా ఆ నెపాన్ని తెదేపాపై నెట్టడాన్ని చూస్తే ఊసరవెల్లులూ సిగ్గుతో తలదించుకుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
ఎస్టీగా నా హక్కులు హరించారు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
-
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్