పండుటాకులపై పగ
ఏం జరగకూడదని అందరూ ఆశించారో అదే జరిగింది! వైకాపా వికృత రాజకీయ క్రీడలో ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వంతు పాత్ర సమర్థంగా పోషించారు.
పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం
మండుటెండల్లో అభాగ్యుల ఆపసోపాలు
సర్కారు కర్కశ నిర్ణయాలు.. ఆపై విపక్షాలపై అపనిందలు
వైకాపా వికృత క్రీడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం
చేష్టలుడిగి చూస్తున్న ఎన్నికల సంఘం
ఈనాడు - అమరావతి
ఏం జరగకూడదని అందరూ ఆశించారో అదే జరిగింది! వైకాపా వికృత రాజకీయ క్రీడలో ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వంతు పాత్ర సమర్థంగా పోషించారు. వృద్ధులు మండుటెండల్లో పింఛను కోసం పడిగాపులు కాచేలా చేశారు. వారు ఇబ్బందులు పడుతుంటే.. నెపాన్ని విపక్షాలపై నెట్టేసేందుకు అధికార పార్టీ పన్నిన కుట్రను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు తోడ్పడ్డారు. ఎన్ని విమర్శలు వచ్చినా బేఖాతరు చేస్తూ ప్రజల ప్రయోజనాలకంటే అధికార పార్టీతో అంటకాగడమే ముఖ్యమని చాటిచెప్పారు. నిజంగా తలచుకుంటే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి 1, 2 రోజుల్లోనే మొత్తం పింఛన్లను పంపిణీ చేసేంత విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పటికీ అడుగు వేయలేదు. ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న అధికారులు.. వృద్ధులు, దివ్యాంగులు సహా వివిధ కేటగిరీల పింఛనుదారులను సచివాలయాల వద్దకు రప్పించారు. వారికి కష్టనష్టాలు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరించారు. ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా, ఎన్నికల సమయంలోనైనా ప్రజాప్రయోజనాలే పరమావధిగా పనిచేయాల్సిన సీఎస్ జవహర్రెడ్డి అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తే ధనుంజయరెడ్డి, మురళీధరరెడ్డి, శశిభూషణ్కుమార్ వంటి అధికారుల గురించి చెప్పాల్సిన పనేలేదు! తమ పంతం నెగ్గించుకోవడానికి బడుగు జీవులను బలిపశువులను చేశారు. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగారు. నెపం మొత్తాన్ని విపక్షాలపైకి నెట్టేసి ప్రజల దృష్టిలో వారిని దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. తెదేపాపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే.ఉన్నతాధికారులు ఒక పార్టీకి కొమ్ముకాస్తుంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తుండటమేంటి? అధికారంలో ఉన్న పార్టీ ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి విపక్షాలపై బురదజల్లుతుంటే ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా సీఎస్కు ఎందుకు ఆదేశాలివ్వడం లేదు? వైకాపాపై అభిమానాన్ని చాటుకోవడానికి ఏమాత్రం వెనకాడని అధికారులను అవే పోస్టుల్లో కొనసాగిస్తే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎలా జరుగుతాయి? అన్న ప్రశ్నలు వివిధ వర్గాలనుంచి వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేసి వారిపై విద్వేషాన్ని రేకెత్తించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర పన్నడం, దీనికి ఉన్నతాధికారులు సహకరించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని.. ఎన్నికల సంఘం తక్షణం స్పందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకపోతే రాబోయే 40 రోజుల్లో మరిన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సినిమా హాళ్లు, మద్యం దుకాణాల వద్ద డ్యూటీలు వేసినప్పుడేమైంది?
జనసేన అధినేత పవన్కల్యాణ్పై కక్షగట్టిన జగన్ ప్రభుత్వం ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమా టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించలేదు. సరికదా.. థియేటర్ల యాజమాన్యాలు ఎక్కడ ధరలు పెంచేస్తాయోనని రెవెన్యూ అధికారులతో నిఘా పెట్టించింది. వారికి థియేటర్ల వద్ద డ్యూటీలు వేసింది. దేశంలో ఎక్కడా చూడనట్టు మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వ పెద్దలు తానా అంటే తందానా అనే ఉన్నతాధికారులు.. వారికి అవసరమైనప్పుడు ఉద్యోగులను ఎలాంటి పనులకైనా వాడేస్తారు. కానీ అభాగ్యులకు పింఛన్లు ఇచ్చేందుకు మాత్రం సరిపడా ఉద్యోగులు లేరని చెబుతున్నారు. 1.27 లక్షల మంది వార్డు, గ్రామసచివాలయాల ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వేసవి, ఎన్నికల దృష్ట్యా వారిపై అంత పని ఒత్తిడేమీ లేనప్పటికీ వారితో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయించేందుకు ఉన్నతాధికారులు ముందుకు రాలేదు. సచివాలయాల్లోని వ్యవసాయ, అనుబంధ రంగాల ఉద్యోగులు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఎనర్జీ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, వార్డు కార్యదర్శులు తీరిక లేకుండా ఉన్నారని.. వారికి పింఛన్ల పంపిణీ అప్పగించలేమనే వింత వాదన తెరపైకి తెచ్చారు. సీఎస్ సహా ఉన్నతాధికారులంతా ప్రతి దశలోను పింఛనుదారులను సచివాలయాలకు రప్పించి ఎలా ఇబ్బంది పెట్టాలి? విపక్షాల్ని దోషులుగా ఎలా నిలబెట్టాలి? తద్వారా అధికార వైకాపాకు ఎలా మేలు చేయాలని ఆలోచించారే తప్ప ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచేందుకున్న అవకాశాలపై దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి.
అధికారులకు చీమకుట్టినట్టూ లేదా?
ఎన్నికల్లో లబ్ధి కోసం వైకాపా నాయకులు ఎంతకైనా దిగజారుతారని పింఛన్ల పంపిణీ వ్యవహారంతో మరోసారి రుజువైంది. మరి అధికారులకు ఏమైంది? ఓటర్లను ప్రభావితం చేస్తున్న వాలంటీర్లను నియంత్రించాల్సిన బాధ్యతను సీఎస్ సహా మిగతా అధికారులు విస్మరించడం వల్లే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. వాలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. ఎన్నికల సంఘం ఆదేశాల స్ఫూర్తిని అర్థం చేసుకుని ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించేందుకు వ్యవస్థలను కట్టుదిట్టం చేయాల్సిన అధికారులు.. రాజకీయ నాయకుల్లా వ్యవహరించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యమేనని సర్వీసులో చాలా జూనియర్లయిన జిల్లా కలెక్టర్లే చెబుతుంటే.. సీనియారిటీ కలిగి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న సీఎస్ వంటి సీనియర్ అధికారులకేమైంది? రాష్ట్రంలో 65.92 లక్షల మంది పింఛనుదారులుంటే వారిలో 34.18 లక్షల మంది వృద్ధులే! అన్ని లక్షల మంది ఎండల్లో మాడిపోయే పరిస్థితి కల్పించిన ఉన్నతాధికారులకు మనస్సాక్షి ఉందా? మానవత్వమన్న పదానికి వారికి అర్థం తెలుసా? అన్న విమర్శలు వస్తున్నాయి. బుధవారం పింఛన్ల పంపిణీ తొలి రోజు వృద్ధులు అనేక ఇబ్బందులుపడ్డా దిద్దుబాటు చర్యలు లేవు. రాష్ట్రంలో గురువారం 130 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం ఐదు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 250 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థ హెచ్చరికలనే బేఖాతరు చేస్తూ పంపిణీని కొనసాగించేందుకు అధికారులు మొండిపట్టుతోనే వ్యవహరిస్తున్నారు. అందుకే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలివ్వాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
వైకాపా వారు.. ఉదయాన్నే వృద్ధులు, నడవలేని వారి ఇళ్లకు వెళ్లి నల్ల జెండాలు చేతుల్లో పెట్టారు.. వారిని మంచాలు, వీల్ఛైర్లపై ఉంచి సచివాలయానికి వెళ్తున్నామంటూ... ఊరేగింపుగా తీసుకెళ్లారు. వీడియోలు తీశారు. ఊరూపేరూ లేని ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడానికి ప్రయత్నించారు.
వృద్ధుల్ని, అనారోగ్యంతో ఉన్నవారిని మంచాలపై ఊరేగిస్తూ...
జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకు పింఛను పంపిణీ చేయలేదు సరికదా.. బుధవారం ఉదయం నుంచి వైకాపా కార్యకర్తలు, నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త రాజకీయ నాటకానికి తెరతీసింది. మంచంపై నుంచి లేవలేని వృద్ధులు, చక్రాల కుర్చీల నుంచి కదల్లేని దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, నడవలేని వాళ్లను మంచాలపై ఉంచి వైకాపా నాయకులు, కార్యకర్తలే రోడ్లపైకి తీసుకొచ్చారు. వాళ్లను ఊరేగిస్తున్నట్లు ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని వీళ్ల కష్టాలకు ప్రతిపక్ష తెదేపానే కారణమంటూ రోజంతా దుష్ప్రచారం కొనసాగించారు. జగన్ అనుకూల మీడియాలో వాటిని పదేపదే చూపిస్తూ గోబెల్స్ ప్రచారం చేశారు. ‘సచివాలయాల వద్దకు వెళ్లి పింఛను లబ్ధిదారులు పడుతున్న కష్టాల్ని ఫొటోలు, వీడియోలు తీసి వాటిని మీ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేయండి’ అంటూ వైకాపా సోషల్ మీడియా విభాగం.. వాట్సప్ గ్రూపుల్లో తమ శ్రేణులందరికీ ఆదేశాలిచ్చి మరీ ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తెగబడింది. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానపడినవారు, వీల్ఛైర్కే పరిమితమైన వారికి ఇంటి దగ్గరే పింఛను ఇవ్వాలని నిబంధన ఉన్నా... వారందర్నీ రోడ్లపైకి తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేసిన పాపం వైకాపాదే. మరోవైపు మండుటెండుల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సచివాలయాల వద్దకు నడుచుకుంటూ వెళ్లి, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడ తగిన సదుపాయాల్లేక సొమ్మసిల్లి పడిపోయారు. కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం ఈ నేరాలకు పాల్పడ్డ వైకాపా ఆ నెపాన్ని తెదేపాపై నెట్టడాన్ని చూస్తే ఊసరవెల్లులూ సిగ్గుతో తలదించుకుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు