వైకాపా శవ రాజకీయం
పండుటాకుల చావులతో లబ్ధి పొందేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది. మరికొన్నాళ్ల పాటు ప్రశాంతంగా బతకాల్సినవాళ్లను సైతం తన అధికార పీఠాన్ని కాపాడుకోవటం కోసం.. చనిపోయే దారుణ పరిస్థితులు కల్పించిన జగన్ గ్యాంగ్ ఆ నేరాన్ని ప్రతిపక్షాలకు అంటగడుతోంది.
తెదేపా వల్లే ఇంటింటికీ పింఛన్లు రాలేదని దుష్ప్రచారం
మండుటెండలో వృద్ధుల్ని మంచాలపై ఊరేగిస్తూ సచివాలయాలకు తీసుకెళ్లిన వైనం
ఎండదెబ్బకు తాళలేక చనిపోయినవారి ఇళ్లకు వెళ్లి ప్రతిపక్షాలపై నీచరాజకీయం
ఈనాడు, అమరావతి: పండుటాకుల చావులతో లబ్ధి పొందేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది. మరికొన్నాళ్ల పాటు ప్రశాంతంగా బతకాల్సినవాళ్లను సైతం తన అధికార పీఠాన్ని కాపాడుకోవటం కోసం.. చనిపోయే దారుణ పరిస్థితులు కల్పించిన జగన్ గ్యాంగ్ ఆ నేరాన్ని ప్రతిపక్షాలకు అంటగడుతోంది. గత ఎన్నికల ముందు కోడికత్తి దాడి, బాబాయ్పై గొడ్డలి వేటుతో సానుభూతి నాటకాన్ని రక్తికట్టించి అప్పుడు అధికారంలో ఉన్న తెదేపాపై బురదచల్లిన జగన్.. అయిదేళ్ల తర్వాత మళ్లీ అదే కుతంత్రాన్ని, కుటిల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఆయన రాజకీయ స్వార్థానికి ఈసారి నిరుపేదలైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు బలైపోతున్నారు. వారందరికీ ఇంటి వద్దకెళ్లి పింఛను పంపిణీ చేసేందుకు కావాల్సిన ప్రభుత్వ యంత్రాంగమున్నా.. లబ్ధిదారులంతా పింఛను కోసం గ్రామ, వార్డు సచివాలయాల వద్దకే రావాలంటూ ప్రకటనలిచ్చి మంచం దిగలేని ముసలివారు, నాలుగడుగులు వేయలేని దివ్యాంగులు, ఆదరణ లేని మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు.. ఇలా లక్షలమంది నిస్సహాయులను మండుటెండల్లో రోడ్లపైకి వచ్చేలా చేసి వారి ఉసురు తీస్తున్నారు. ఆ పాపాన్ని ప్రతిపక్షానికి అంటగట్టేందుకు వైకాపా నాయకులు విషప్రచారానికి తెరలేపారు.
అధికారం కోసం ఇంత దిగజారుడుతనమా?
వైకాపా నాయకులు బుధవారం వ్యవహరించిన తీరు చూస్తే అధికారం కోసం ఇంతలా దిగజారిపోవాలా? ఇన్ని నీచ రాజకీయాలకు పాల్పడాలా? అనిపించక మానదు. పింఛన్లను వాలంటీర్లతో పంపిణీ చేయించొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతే తప్ప ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇవ్వొద్దని చెప్పలేదు. ముఖ్యమంత్రి జగన్కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా.. 1.35 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇంకా అవసరం అనుకుంటే రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగుల్ని వినియోగించుకుని ఉంటే ఈపాటికే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛను పంపిణీ కనీసం 80 శాతం పూర్తయిపోయి ఉండేది. కానీ తొలి నుంచీ శవరాజకీయాన్నే తమ పేటెంట్ హక్కుగా మార్చుకున్న జగన్ అండ్ కో.. ఇంటి వద్దకు పింఛను పంపిణీ చేయలేదు. లబ్ధిదారులు సచివాలయాల వద్దకు రావాల్సిందేనంటూ ప్రకటించారు. ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు చేయటం వల్లే ఇంటి వద్దకు పింఛను రావట్లేదంటూ రెండు రోజులుగా అబద్ధాల ప్రచారం మొదలుపెట్టారు. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఎన్నికల సంఘానికి తెదేపా అసలు ఫిర్యాదే చేయలేదు. పైగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ జరిగేలా చూడాలని, 5వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెదేపా నాయకులు వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు కూడా ఈ మేరకు లేఖ రాశారు.
ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే!
రాజకీయ దురుద్దేశంతో.. ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయని జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల నలుగురు వృద్ధులు మృతి చెందారు. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం నెరబైలుకు చెందిన షేక్ అసంసాహెబ్ (75) పింఛను కోసం సచివాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం కావడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన కూర్చున్న చోటే సొమ్మసిల్లి కన్నుమూశారు. సూళ్లూరుపేటకు చెందిన ఈశ్వరవాక లలితమ్మ(56) వితంతు పింఛన్ కోసం వార్డు సచివాలయానికి వెళ్లగా పంపిణీ ఆలస్యమైంది. ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన నల్లవీరంరెడ్డి రాజమ్మ (84) సచివాలయానికి పింఛను కోసం వెళుతూ కళ్లుతిరిగి పడిపోయారు. స్థానికులు ఇంటికి తీసుకెళ్లేటప్పటికే ఆమె కన్నుమూశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80) కూడా పింఛను కోసం మండుటెండలో రెండుసార్లు తిరిగి, ఇంటికి వచ్చాక ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వయోవృద్ధులకు ఇళ్ల వద్దే పింఛను ఇచ్చి ఉంటే వీరు చనిపోయి ఉండేవారా? దీన్ని ప్రభుత్వం చేసిన హత్య అనకపోతే మరేమనాలి? పైగా పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్ ఆ మృతదేహం వద్ద వాలిపోయి శవరాజకీయాలు చేయాలని చూడడం దారుణం. అలాగే, రెండు రోజుల కిందట తిరుపతి జిల్లా వెంకటగిరిలో బొడిచర్ల వెంకటయ్య (80) అనే వృద్ధుడు సాధారణ మరణం చెందగా.. దానికి పింఛనుతో ముడిపెట్టి ప్రతిపక్ష తెదేపాపై బురద చల్లేందుకు వైకాపా నాయకులు కుటిలయత్నం చేశారు. తాము చెప్పినట్లు చెప్పాలంటూ మృతుడి కుటుంబీకులకు వైకాపా, నాయకులు, వాలంటీరు, సాక్షి విలేకరులు తర్ఫీదు ఇచ్చారు. ఇది శవరాజకీయం కాదా? ప్రతిపక్షంపై రాజకీయ దుష్ప్రచారం కోసం అవ్వాతాతల్ని ఇంతలా ఇబ్బంది పెట్టాలా? వారి ప్రాణాలతో చెలగాటమాడాలా? రాజకీయ స్వార్థం కోసం వృద్ధులు, దివ్యాంగులతో ఆటలాడుకోవటం మానవత్వమేనా? పైగా దాన్ని ప్రతిపక్షాలకు అంటగట్టటం ఇంకో వికృత రాజకీయ క్రీడ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే