జగన్ అనుయాయులకు రూ.వేల కోట్లు
జగన్ ప్రభుత్వం రూ.వేల కోట్లను తన పెత్తందారీ అనుయాయులకు పంచేసి పేదలకు పెన్షన్ సొమ్ము లేకుండా ఖజానా ఖాళీ చేసేసింది. ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు పెన్షన్లు పంచవలసి ఉన్నా అందుకు తగ్గట్టుగా నిధులు సర్దుబాటు చేయలేదు.
ఖజానా ఖాళీ... పేదలు బలి
మార్చి 30, 31 తేదీల్లో రూ.7,200 కోట్లు పెద్దలకు
పెన్షన్లకు కావాల్సింది రూ.1,900 కోట్లే
పెద్దల కోసం పేదలకు కష్టాలు
ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వం రూ.వేల కోట్లను తన పెత్తందారీ అనుయాయులకు పంచేసి పేదలకు పెన్షన్ సొమ్ము లేకుండా ఖజానా ఖాళీ చేసేసింది. ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు పెన్షన్లు పంచవలసి ఉన్నా అందుకు తగ్గట్టుగా నిధులు సర్దుబాటు చేయలేదు. చేతిలో ఉన్న రూ.వేల కోట్లను జగన్ ప్రభుత్వానికి అనుకూలమైన బడా గుత్తేదారులకు, ఇతరులకు బిల్లుల రూపంలో పంచేశారు. ఇలా పంచే క్రమంలోనూ ఆర్థిక నిబంధనలను సైతం వైకాపా ప్రభుత్వం విస్మరించింది. ఫలితంగా ఏప్రిల్ 1, 2వ తేదీల్లో పెన్షన్లు పంచలేకపోయింది. నిధులను సర్దుబాటు చేయలేక బుధవారం (3వ తేదీన) కూడా పూర్తిస్థాయిలో పింఛన్లు పంచలేకపోయింది. ఆయా పంచాయతీలకు అవసరమైన నిధులను జగన్ ప్రభుత్వం బుధవారం కూడా ఇవ్వలేకపోయింది. దీంతో పెన్షన్ల కోసం గ్రామ సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు, దివ్యాంగులు ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.
పెద్దల కోసమే..
సాధారణంగా మాసాంతంలో (చివరి రెండు రోజుల్లో) ఆర్థికశాఖ పెన్షన్ల కోసం నిధులను సెర్ప్ అధికారులకు బదిలీ చేస్తుంది. ఆ సొమ్మును పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గ్రామాలకు బదిలీ చేస్తారు. జగన్ ప్రభుత్వం ఉన్న డబ్బును పెన్షన్లకు సర్దుబాటు చేయకుండా ఆర్థిక సంవత్సరం ముగుస్తోందన్న కారణంగా తమకు అనుకూలంగా ఉండే పెద్దగుత్తేదారులకు ఆ సొమ్మును పంచేసింది. అందుకోసమే బ్యాంకులకు సెలవులు అని ముందే చెప్పి ఏప్రిల్ 3 వరకు పెన్షన్లు అందబోవని ప్రకటించింది. 2022లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న తరుణంలో ముందే ఏర్పాట్లు చేసుకుని ఆ ఏడాది ఏప్రిల్ 1వ తేదీనే పెన్షన్లు పంచారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉన్న సొమ్మును బడాబాబులకు పంచేశారు. మార్చి 30న ప్రభుత్వం ఏకంగా రూ.6,000 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించింది. ఆ రోజు పెన్షన్ల కోసం సొమ్ము బదిలీ చేయలేదు. మార్చి 31న మరో రూ.1,200 కోట్లు కూడా పెద్దలకే చెల్లించింది. ఈ బిల్లుల చెల్లింపుల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పేదలకు మాత్రం బుధవారం సాయంత్రం వరకూ కూడా పూర్తిస్థాయిలో పెన్షన్లు అందలేదు.
పేదల కన్నా పెత్తందారులే ముఖ్యమా?
ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అని అంటుంటారు. తాను పేదల పక్షమని చెబుతుంటారు. కానీ అసలు సమయం వచ్చేసరికి తాను పెత్తందారుల పక్షమే అని తాజా ఉదంతంతో నిరూపించుకున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో తన ఇష్టమైన వారికి బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు తక్కువ. అందుకే ఉన్న నిధులన్నీ, తన అనుయాయులకు పందేరం చేసేశారు. నెలాఖరులో చివరి రెండు రోజుల్లో రూ.7,200 కోట్లు ఇలా చెల్లిస్తే.. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దాదాపు రూ.14 వేల కోట్లు ఇష్టారీతిన సీఎం జగన్ పెత్తందారులైన తన అనుచరులకు బిల్లుల రూపంలో ఇప్పించేశారు. సాధారణంగా ఏ కుటుంబమైనా అవసరాలకు తగ్గట్టుగా ఉన్న నిధులను ఎలా ఖర్చు చేయాలో ప్రణాళిక రూపొందించుకుంటుంది. ఏప్రిల్ 1న సామాజిక పెన్షన్ల కోసం సుమారు రూ.1,900 కోట్లు చెల్లించాలన్న సంగతి జగన్ ప్రభుత్వానికి తెలుసు. ఈ విషయానికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే నెలాఖరులో వచ్చిన సొమ్మును దాచి పెన్షన్ల కోసం వెచ్చించి ఉండేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప