జగన్ అనుయాయులకు రూ.వేల కోట్లు
జగన్ ప్రభుత్వం రూ.వేల కోట్లను తన పెత్తందారీ అనుయాయులకు పంచేసి పేదలకు పెన్షన్ సొమ్ము లేకుండా ఖజానా ఖాళీ చేసేసింది. ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు పెన్షన్లు పంచవలసి ఉన్నా అందుకు తగ్గట్టుగా నిధులు సర్దుబాటు చేయలేదు.
ఖజానా ఖాళీ... పేదలు బలి
మార్చి 30, 31 తేదీల్లో రూ.7,200 కోట్లు పెద్దలకు
పెన్షన్లకు కావాల్సింది రూ.1,900 కోట్లే
పెద్దల కోసం పేదలకు కష్టాలు
ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వం రూ.వేల కోట్లను తన పెత్తందారీ అనుయాయులకు పంచేసి పేదలకు పెన్షన్ సొమ్ము లేకుండా ఖజానా ఖాళీ చేసేసింది. ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు పెన్షన్లు పంచవలసి ఉన్నా అందుకు తగ్గట్టుగా నిధులు సర్దుబాటు చేయలేదు. చేతిలో ఉన్న రూ.వేల కోట్లను జగన్ ప్రభుత్వానికి అనుకూలమైన బడా గుత్తేదారులకు, ఇతరులకు బిల్లుల రూపంలో పంచేశారు. ఇలా పంచే క్రమంలోనూ ఆర్థిక నిబంధనలను సైతం వైకాపా ప్రభుత్వం విస్మరించింది. ఫలితంగా ఏప్రిల్ 1, 2వ తేదీల్లో పెన్షన్లు పంచలేకపోయింది. నిధులను సర్దుబాటు చేయలేక బుధవారం (3వ తేదీన) కూడా పూర్తిస్థాయిలో పింఛన్లు పంచలేకపోయింది. ఆయా పంచాయతీలకు అవసరమైన నిధులను జగన్ ప్రభుత్వం బుధవారం కూడా ఇవ్వలేకపోయింది. దీంతో పెన్షన్ల కోసం గ్రామ సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు, దివ్యాంగులు ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.
పెద్దల కోసమే..
సాధారణంగా మాసాంతంలో (చివరి రెండు రోజుల్లో) ఆర్థికశాఖ పెన్షన్ల కోసం నిధులను సెర్ప్ అధికారులకు బదిలీ చేస్తుంది. ఆ సొమ్మును పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గ్రామాలకు బదిలీ చేస్తారు. జగన్ ప్రభుత్వం ఉన్న డబ్బును పెన్షన్లకు సర్దుబాటు చేయకుండా ఆర్థిక సంవత్సరం ముగుస్తోందన్న కారణంగా తమకు అనుకూలంగా ఉండే పెద్దగుత్తేదారులకు ఆ సొమ్మును పంచేసింది. అందుకోసమే బ్యాంకులకు సెలవులు అని ముందే చెప్పి ఏప్రిల్ 3 వరకు పెన్షన్లు అందబోవని ప్రకటించింది. 2022లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న తరుణంలో ముందే ఏర్పాట్లు చేసుకుని ఆ ఏడాది ఏప్రిల్ 1వ తేదీనే పెన్షన్లు పంచారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉన్న సొమ్మును బడాబాబులకు పంచేశారు. మార్చి 30న ప్రభుత్వం ఏకంగా రూ.6,000 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించింది. ఆ రోజు పెన్షన్ల కోసం సొమ్ము బదిలీ చేయలేదు. మార్చి 31న మరో రూ.1,200 కోట్లు కూడా పెద్దలకే చెల్లించింది. ఈ బిల్లుల చెల్లింపుల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పేదలకు మాత్రం బుధవారం సాయంత్రం వరకూ కూడా పూర్తిస్థాయిలో పెన్షన్లు అందలేదు.
పేదల కన్నా పెత్తందారులే ముఖ్యమా?
ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అని అంటుంటారు. తాను పేదల పక్షమని చెబుతుంటారు. కానీ అసలు సమయం వచ్చేసరికి తాను పెత్తందారుల పక్షమే అని తాజా ఉదంతంతో నిరూపించుకున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో తన ఇష్టమైన వారికి బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు తక్కువ. అందుకే ఉన్న నిధులన్నీ, తన అనుయాయులకు పందేరం చేసేశారు. నెలాఖరులో చివరి రెండు రోజుల్లో రూ.7,200 కోట్లు ఇలా చెల్లిస్తే.. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దాదాపు రూ.14 వేల కోట్లు ఇష్టారీతిన సీఎం జగన్ పెత్తందారులైన తన అనుచరులకు బిల్లుల రూపంలో ఇప్పించేశారు. సాధారణంగా ఏ కుటుంబమైనా అవసరాలకు తగ్గట్టుగా ఉన్న నిధులను ఎలా ఖర్చు చేయాలో ప్రణాళిక రూపొందించుకుంటుంది. ఏప్రిల్ 1న సామాజిక పెన్షన్ల కోసం సుమారు రూ.1,900 కోట్లు చెల్లించాలన్న సంగతి జగన్ ప్రభుత్వానికి తెలుసు. ఈ విషయానికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే నెలాఖరులో వచ్చిన సొమ్మును దాచి పెన్షన్ల కోసం వెచ్చించి ఉండేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్