పింఛను పంపిణీలో అడుగడుగునా వైఫల్యం
పింఛనుదారులకు సకాలంలో పెన్షన్లు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. వృద్ధులను, వితంతువులను, ఒంటరి మహిళలను సచివాలయాలకు రప్పించి మండుటెండల్లో గంటల తరబడి వేచి ఉండేలా చేసి వికృత ఆనందాన్ని పొందింది.
వైకాపా కుట్రకు అనుగుణంగా వ్యవహారం
డబ్బు సకాలంలో జమ చేయని వైనం
గంటల తరబడి పింఛనుదారుల పడిగాపులు
మంచినీళ్లు, టెంట్లు కూడా ఏర్పాటుచేయని దుర్మార్గం
ఎవరైనా చనిపోతే చాలు.. శవరాజకీయానికి సిద్ధం!
ఈనాడు, అమరావతి: పింఛనుదారులకు సకాలంలో పెన్షన్లు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. వృద్ధులను, వితంతువులను, ఒంటరి మహిళలను సచివాలయాలకు రప్పించి మండుటెండల్లో గంటల తరబడి వేచి ఉండేలా చేసి వికృత ఆనందాన్ని పొందింది. ఎండలు ఠారెత్తిస్తున్నా చాలాచోట్ల తాగునీరు, టెంటు వంటి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్ల పింఛనుదారుల్ని కిలోమీటర్ల మేర నడిపించారు. గిరిజనుల్ని ఇబ్బందులపాలు చేశారు. లబ్ధిదారులు సొమ్మసిల్లే పరిస్థితులు తలెత్తేలా చేసి.. ఆ తర్వాత తీరిగ్గా నగదు బ్యాంకుల్లో జమ చేశారు. కొన్నిచోట్ల అరకొరగానే అందింది. కొన్నిచోట్ల రాత్రి 7 గంటల వరకు కూడా నగదు జమ కాలేదు. రోజంతా వేచి చూసిన కొంతమందికి నగదు లేదని చెప్పి చాలాచోట్ల వెనక్కి పంపారు. ఇదంతా వైకాపా కుట్రకు అనుగుణంగానే సాగింది. లబ్ధిదారుల్లో ఆందోళన రెకెత్తించేలా చేసి అక్కడ గొడవలు, తోపులాటలు జరిగేలా చేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8 గంటల వరకు 40 శాతమే పింఛన్ల పంపిణీ జరిగింది.
నగదు సకాలంలో ఎందుకు జమ చేయలేదు?
2022 ఏడాదిలో ఏప్రిల్ 1వ తేదీనే పింఛను పంపిణీ చేశారు. ఇప్పుడు జాప్యం చేయడం ఉద్దేశపూర్వకం కాదా? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా రూ. 13 వేల కోట్ల బిల్లుల్ని చెల్లించారే.. అప్పుడైనా అవ్వాతాతలు గుర్తుకురాలేదా? పోనీ 3వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని నాలుగు రోజుల ముందే ప్రకటించారు కదా? 2వ తేదీ నాటికైనా నగదును సమీకరించాలి కదా? ఆ పని కూడా ఎందుకు చేయలేదు? తీరా మధ్యాహ్నం తర్వాత నగదు జమ అయ్యేలా చేశారంటే ఇది కుట్ర కాక మరేంటి? బాపట్ల జిల్లాలోని ఒక సచివాలయంలో పింఛను పంపిణీకిగాను రూ. 14.50 లక్షలు నగదు అవసరమైతే.. మధ్యాహ్నం తర్వాత రూ. 20 వేలు మాత్రమే బ్యాంకులో జమ అయింది. సచివాలయం వద్ద చూస్తే భారీ సంఖ్యలో లబ్ధిదారులు వేచి ఉన్నారు. ఆ సొమ్మును పంచాలి? ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురుకావా? నగదు తక్కువ అందిందని లబ్ధిదారులకు తెలిసి ఎవరికివారు కంగారుపడితే తోపులాటలు జరగవా? ఇది జవహర్రెడ్డి, ధనుంజయరెడ్డి, మురళీధర్రెడ్డికి తెలియదా? అయినా ఇలా చేయడమంటే కుట్రపూరిత ఆలోచన కాదా? కొన్ని వందల సచివాలయాల్లో ఉదయం నుంచి పడిగాపులు కాచిన పింఛనుదారుల్ని సిబ్బంది డబ్బుల్లేవంటూ సాయంత్రం ఇళ్లకు పంపించేశారు. ఎండలో చాలాచోట్ల లబ్ధిదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వైకాపా తీరు ఎలా ఉందంటే, ఎవరైనా చనిపోతే చాలు వారి మృతదేహాలను అడ్డం పెట్టుకుని శవరాజకీయాలకు పాల్పడదామని చూస్తున్నట్లు ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. ఇదే అదనుగా వైకాపా అభ్యర్థి జోగి రమేష్ శవ రాజకీయం మొదలుపెట్టారు. ఆమె బంధువులు, స్థానికులు ఎదురుతిరగడంతో ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది.
- బాపట్ల జిల్లా జిల్లాలో 477 సచివాలయాల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు నగదు అందలేదు. బాపట్లలో 20 సచివాలయాలకు సాయంత్రానికి 50 శాతమే అందింది.
- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాటిపర్తి సచివాలయానికి రూ.16 లక్షలకు గాను రూ.6 లక్షలు జమైంది. కడియంలో రూ. 3.62 కోట్లకుగాను మధ్యాహ్నానికి 30 శాతమే జమైంది. పెద్దాపురం మండలంలోనూ ఇదే పరిస్థితి.
- ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరులో నగదు రాలేదని చెప్పి పింఛనుదారుల్ని వెనక్కి పంపించారు.
- తిరుపతి జిల్లాలోనూ కొన్నిచోట్ల ఇదే పరిస్థితి కనిపించింది.
- అనేక జిల్లాల్లో చాలాచోట్ల డబ్బు జమ కాలేదని లబ్ధిదారులను వెనక్కి పంపారు.
- శ్రీకాకుళం జిల్లాలో చాలా మండలాల్లో నామమాత్రంగా అందించారు.
- ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలాచోట్ల పింఛన్లు తీసుకోవడానికి తెల్లవారుజాము నుంచే సచివాలయాల వద్ద బారులు తీరారు. రాత్రి 7 గంటల వరకు నగదు జమ కాలేదు.
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో సాయంత్రానికి రూ. 50 లక్షలు నిధులే వచ్చాయి.
సచివాలయాలకు తాళాలే తెరవలేదు....
ప్రభుత్వం పింఛను పంపిణీపై పెట్టిన శ్రద్ధ ఎలా ఉందో పల్నాడు జిల్లా వినుకొండలోని నరగాయపాలెం సచివాలయాన్ని చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ 12 గంటలకు కూడా సచివాలయం మూత వేసి ఉంది. పింఛను కోసం ఉదయాన్నే వచ్చిన వారు చూసి చూసి ఇక వెనుదిగిరిపోయారు. ఇక్కడ ఒక్కటే కాదు....పల్నాడు జిల్లాలో చాలా సచివాలయాల్లో బుధవారం ఇదే పరిస్థితి కనిపించింది. ఇది కూడా వ్యూహాత్మకంగానే జరిగింది.
వీడియోల చిత్రీకరణ...
నరసరావుపేట పరిసర ప్రాంతాల్లోని సచివాలయాల వద్ద వేచిచూస్తున్న వృద్ధులతో వైకాపా నాయకులు కొన్ని వీడియోలు చిత్రీకరించారు. వారితో వైకాపాకు అనుకూలమైన ప్రచారాన్ని చేయించారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని తెలిసినా.. అక్కడున్న ఏ అధికారిగానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పామర్రు మండలంలోని కొన్ని సచివాలయాల పరిధిలో ఉద్యోగులు ఎన్నికల శిక్షణ నిమిత్తం వెళ్లారని బుధవారం పింఛను పంపిణీ చేయలేదు.
- కర్నూలు జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఫొటోలు, వీడియోలు తీయకూడదని పలుచోట్ల ఆంక్షలు విధించారు.
- నంద్యాల 26వ వార్డులో కౌన్సిలర్ చంద్ర పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాగునీరు కూడా ఏర్పాటు ఇవ్వలేరా?
పింఛను పంపిణీ సవరణ మార్గదర్శకాలను వైకాపాకు అనుకూలంగా మార్చేందుకు 24 గంటలు కసరత్తు చేసిన అధికారులు.. సచివాలయాల వద్ద కనీస వసతులు కల్పించాలనే దానిపై మాత్రం దృష్టిపెట్టలేదు. జగన్ భజన కార్యక్రమాలకైతే పకడ్బందీగా ముందుగానే ఏర్పాట్లు చేస్తారు.. మరి అవ్వాతాతలంటే ఎందుకు అంత చులకన భావన! వసతుల కల్పనపై మూడో రోజుల ముందే సచివాలయాలకు ఆదేశాలిచ్చారు కదా? అక్కడ ఏ రకంగా అవి ఉన్నాయో పరిశీలించాల్సిన బాధ్యత లేదా? చాలాచోట్ల పింఛనుదారులు నిలువ నీడ లేక ఎండలో తీవ్ర ఇబ్బందిపడ్డారు.
- ప్రకాశం జిల్లా మార్కాపురం, త్రిపురాంతకంలో సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోనూ చాలాచోట్ల ఇదే పరిస్థితి.
- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట సచివాలయంలో పింఛనుదారులు ఎండలో మెట్ల మీదనే వేచి ఉన్నారు. బుట్టాయగూడెం మండలంలో సాయంత్రం 5 వరకు పంపిణీ ప్రారంభించలేదు.
- కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వృద్ధులకు తాగేందుకు మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ పలుచోట్ల ఇదే పరిస్థితి
- గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని మహానాడు ప్రాంతంలో వార్డు సచివాలయం వద్ద వృద్ధులకు టెంటు ఏర్పాటు చేస్తుండగా కర్ర జారిపోయి అక్కడే ఉన్న రమా అనే వృద్ధురాలి తలపై పడింది. తల మీద గాయం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండల కేంద్రం సచివాలయం-3 పరిధిలో పింఛనుకు వెళుతూ.. పొన్నా సుబ్బారావు (70) అనే వృద్ధుడు ఎండకు స్పృహతప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు.
తెదేపానే అడ్డుకుందని దుష్ప్రచారం..
- ఇళ్ల వద్ద పింఛను అందివ్వకుండా తెదేపానే అడ్డుకుందని ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలోని 5వ సచివాలయం వద్ద కొందరు వైకాపా నాయకులు దుష్ప్రచారం చేశారు. పింఛన్లు తీసుకోవడానికి వచ్చిన వృద్ధులకు నీరు అందించే వచ్చి వైకాపాకు అనుకూల ప్రచారం చేశారు. ఎన్నికల నియమావళి అమలు అధికారి అమృతరాజు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆయనతో వాగ్వాదానికి దిగారు.
- తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే అంబేడ్కర్నగర్లోని సచివాలయానికి వెళ్లి జగన్ వస్తేనే పింఛన్లు ఇంటివద్దకు వస్తాయంటూ ప్రచారం చేశారు.
- విశాఖ జిల్లా వడ్లపూడి పరిధిలోని గణేష్నగర్ సచివాలయం వద్దకు వాలంటీర్ రూసీమేరి వచ్చి అక్కడున్న లబ్ధిదారులతో మాట్లాడడం వివాదాస్పదమైంది. వైకాపాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల