పింఛను పైసలపై ఓటు మరకలు!
చంద్రబాబు.. తన మనిషి నిమ్మగడ్డ రమేశ్ ద్వారా ఎన్నికల సంఘానికి లేఖలు రాయించి, ఒత్తిడి తెచ్చి, ఏకంగా వాలంటీరు వ్యవస్థను రద్దు చేయించారు.
ఓట్ల కోసం ఇంత దిగజారుడుతనమా!
అవ్వాతాతలపై వికృత రాజకీయమా?
దిగజారిందెవరు.. రక్తపు రంగులద్దిందెవరు?
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. పచ్చి అబద్ధాలు చెప్పాలా?
ఛార్జీల బాదుడు, పన్నుల మోతపై గొంతు పెగలదా?
పూతల పట్టు సభలో కట్టుకథలల్లిన సీఎం జగన్
అబద్ధం 1:
చంద్రబాబు.. తన మనిషి నిమ్మగడ్డ రమేశ్ ద్వారా ఎన్నికల సంఘానికి లేఖలు రాయించి, ఒత్తిడి తెచ్చి, ఏకంగా వాలంటీరు వ్యవస్థను రద్దు చేయించారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టులో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగం
- వాలంటీరు వ్యవస్థను రద్దు చేశారా.. ఎవరు? ఎప్పుడు? అలాంటి ఉత్తర్వులుంటే చూపించగలరా? ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పాలా? ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా? కట్టుకథలల్లుతూ ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పాలా? వాలంటీర్లను నగదు పంపిణీకి దూరంగా ఉంచాలని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మీరు మాత్రం దాన్ని వక్రీకరిస్తూ.. ఏకంగా వాలంటీరు వ్యవస్థనే రద్దు చేశారని రాజ్యాంగబద్ధ సంస్థపైనే నెపం వేస్తున్నారా?
- వాలంటీర్ల ద్వారా వైకాపా ప్రచారం చేయిస్తున్నారని.. వారిని విధులకు దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ రమేశ్ ఫిర్యాదు చేశారు. వాస్తవానికి. వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలేనని చెప్పింది మీరు, మీ మంత్రులే కదా? వారితో ఎన్నికల ప్రచారం చేయిస్తున్న మాట నిజం కాదా! దానిపైనే రమేశ్ ఫిర్యాదు చేశారు. అందుకే వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి రక్తపు రంగులద్ది.. ప్రతిపక్షం పైకి నెట్టేసే కుట్రకు తెరతీసిందెవరు? అవ్వాతాతలకు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తోంది మీరు కాదా? అంటే ఎన్నికల సంఘం నిర్ణయాన్నే ప్రశ్నిస్తున్నారా?
నడవలేని అవ్వాతాతలపై.. ఇంత శాడిజమా?
అబద్ధం 2:
సెలవైనా.. పండగైనా.. ప్రతి నెలా 1వ తేదీన క్రమం తప్పకుండా వాలంటీరు వచ్చి అవ్వాతాతల చేతుల్లో పింఛను పెట్టేవారు
సీఎం జగన్మోహన్రెడ్డి
- అవ్వాతాతలకు పింఛన్లు ఇచ్చేందుకు 1వ తేదీనే ఎందుకు డబ్బు తీయలేదు.. అలా ఇవ్వొద్దని ఎవరూ చెప్పలేదే! అయినా ఎందుకు ఆపేశారు? 3వ తేదీ నుంచి పింఛను ఇస్తామని ప్రకటించింది మీ ప్రభుత్వమే కదా? 2022 సంవత్సరంలో మూడు రోజుల ముందే డబ్బులు డ్రా చేసేవారు. ఆ తెలివి ఇప్పుడేమైంది? అంటే అవ్వాతాతల్ని కావాలనే ఇబ్బంది పెట్టాలనేది మీ ముందస్తు వ్యూహంలో భాగమే. నడవలేని వయసున్న వారిపై ఇంత శాడిజమా?అయినా ప్రజల్ని నమ్మించేందుకు ఎన్నికల సభల్లో అబద్ధాల ప్రచారం చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి? ఇలాంటి మోసం చేసే వ్యక్తికి, అబద్ధాలు చెప్పే వారికి ఓటు వేయడం అవసరమా?
- మీ వంటింటి గుత్తేదారు సంస్థలకు రూ. వేల కోట్ల చెల్లింపుల కోసం.. మార్చి నెలాఖరునే ఖజానా ఖాళీ చేసింది మీరు కాదా? దాన్ని కప్పిపుచ్చేందుకు.. పింఛను ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబుపై బురదజల్లేందుకు ఇంత అరాచకమా? ఆయనపై నెపం నెట్టేందుకు అవ్వాతాతలనే కనికరం కూడా లేకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరించాలా? మొన్నటికి మొన్న ఖజానాలో డబ్బు లేకుండా చేసిందీ మీరే.. ఇప్పుడు 1వ తేదీ పింఛను ఇవ్వలేదంటూ ప్రచారం చేసేదీ మీరే! ఇంత వికృత రాజకీయమా?
ఈనాడు-అమరావతి : పదే.. పదే అవే అబద్ధాలు.. అడుగడుగునా వంచన.. చేతులు తిప్పి చెప్పండంటూ వైకాపా కార్యకర్తల్ని రెచ్చగొట్టే వ్యూహమే జగన్ నైజం. చిత్తూరు జిల్లా పూతలపట్టులో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరోమారు కట్టుకథలల్లారు. వాలంటీరు వ్యవస్థను రద్దు చేశారంటూ.. ప్రతిపక్షంపై విషం చిమ్మే ప్రక్రియ ప్రారంభించారు. అవ్వా తాతలనే కనికరం కూడా లేకుండా.. వారితో ఎన్నికల రాజకీయం చేసేది తామే అనే విషయాన్ని కప్పిపెట్టేందుకు ప్రయత్నించారు. ఎన్నికల ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయని ఆయన విశ్వసనీయత అంటూ ఊసరవెల్లి కబుర్లు చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నామంటూ చెప్పిన సీఎం.. కరవుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రూ. 2.70 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేశామని చెప్పిన ఆయనకు. ‘కరెంటు బిల్లులు, బస్సు ఛార్జీలు, పెట్రోలు, డీజిల్ బాదుడెంత? పన్నులు పెంచి పిండేదెంత? నిత్యావసరాలు, వ్యవసాయ ఖర్చుల ధరలెంత పెరిగాయి?’ అనే విషయంలో నోరు మెదపలేదు.
ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి సౌమ్యుడట!
చిత్తూరు నియోజకవర్గం నుంచి శాసన సభకు పోటీ చేస్తున్న విజయానందరెడ్డి సౌమ్యుడని.. ఆయనపై మీ చల్లని దీవెనలు ఉండాలని జగన్ ఓటర్లను అభ్యర్థించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడైన ఆయనపై గతంలో పీడీ చట్టం ప్రయోగించారు. అలాంటి వ్యక్తిని సౌమ్యుడంటూ జగన్ చెప్పడంపై అక్కడున్నవారంతా విస్తుపోయారు. మీ పార్టీ వాళ్లంతా ఇలాంటి సౌమ్యులేనా? అని ఎద్దేవా చేయడం కనిపించింది. ఎమ్మెల్యే, ఒంగోలు నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడైన చంద్రగిరి అభ్యర్థి మోహిత్రెడ్డిని పరిచయం చేస్తూ.. యువకుడు, ఉత్సాహవంతుడని వర్ణించారు. తండ్రి అక్రమాలకు తనయుడూ వారసుడే అని చెప్పలేకపోయారు. ఇటీవల పెద్దఎత్తున పట్టుకున్న తాయిలాలు ఎవరివో చెప్పి ఉంటే బాగుండేది కదా! నగరి ఎమ్మెల్యే రోజమ్మకూ దీవెనలు అందించాలని కోరారు. ఒక్కో మండలాన్ని ఒక్కో తమ్ముడికి కట్టబెట్టి.. సొంత సామ్రాజ్యంలా తయారు చేసినందుకా? మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తామని తన దగ్గర నగదు తీసుకున్నారని ఆమెపై వైకాపా మహిళా నేత తిరుపతిలో విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పిన విషయం ముఖ్యమంత్రి జగన్కు తెలియదనుకోవాలా? పలమనేరు అభ్యర్థి వెంకటేగౌడను కూడా జగన్ ఓటర్లకు పరిచయం చేశారు. సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ కమిషన్లలో తలపండారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయినా వైకాపా అభ్యర్థులంతా సౌమ్యులంటూ జగన్ వారికి కితాబులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్