రూల్స్ మార్చు.. సొమ్ము పిండు!
రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కళాశాలల ప్రవేశాలు జగన్ సర్కారులో వ్యాపారంలా మారాయి. కొందరు వీటిని కాసులు కురిపించే కామధేనువుల్లా వాడుకుంటున్నారు.
వైకాపా పాలనలో వ్యాపారంగా మారిన ఉపాధ్యాయ విద్య
స్పాట్, కేటగిరి-బీ సీట్ల భర్తీకి పదేపదే నిబంధనల మార్పు
వారంలో రెండుసార్లు మార్చిన ఉన్నత విద్యామండలి
ఏటా రూ. 10 కోట్లు చేతులు మారుతున్న వైనం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కళాశాలల ప్రవేశాలు జగన్ సర్కారులో వ్యాపారంలా మారాయి. కొందరు వీటిని కాసులు కురిపించే కామధేనువుల్లా వాడుకుంటున్నారు. ప్రవేశాల సమయంలో కాసులు పిండుకునేందుకు నిబంధనలంటూ హడావుడి చేయడం, ఎంతో కొంత రాగానే వాటికి సడలింపులు ఇవ్వడం పరిపాటిగా మారింది. వైకాపా హయాంలో బీఈడీ కళాశాలల అనుమతుల నుంచి ప్రవేశాల వరకు ఫక్తు వ్యాపారంగా మారింది. జగన్ పాలనలో డీఎస్సీలు నిర్వహించకపోవడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు బీఈడీలో చేరడం లేదు. ఈ కళాశాలల యాజమాన్యాలు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని చేర్చుకుంటున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న సంబంధిత అధికారులు యాజమాన్యాలపై నిబంధనల కత్తి దూసి, నగదు పిండుకుంటున్నారు. ఏటా బీఈడీ కళాశాలల అనుమతులు, ప్రవేశాల నిర్వహణకు రూ.10 కోట్లకు పైగా మామూళ్లు చేతులు మారుతున్నాయి. నాణ్యమైన ఉపాధ్యాయ విద్య అందించాల్సిన సర్కారు అక్రమాలకు వంతపాడుతోంది. 2023-24 విద్యా సంవత్సరంలో మొదట కళాశాలల యాజమాన్యాలను తనిఖీల పేరుతో ఇబ్బందులు పెట్టి, వసూలు చేసుకోవాలని ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం తనిఖీ అధికారాలను ఉన్నత విద్యామండలికి ఇస్తూ ఉత్తర్వులు ఇప్పించారు. దీనిపై యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ జీవోను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను తనిఖీలకు రంగంలోకి దించారు. కమిటీలు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించారు. ఇలా ప్రవేశాల్లో తీవ్ర జాప్యం చేశారు. 2023 జులై 14న ఎడ్సెట్ ఫలితాలు విడుదల చేస్తే ఫిబ్రవరిలో ప్రవేశాలు చేపట్టింది. ఎన్నికలకు ముందు ఎంతో కొంత వసూలు చేసుకోవాలని కీలక యాజమాన్యాలపై అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినా మామూళ్లు దండుకునేందుకు యాజమాన్యాలపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.
తరుచూ మారిపోతున్న ఆదేశాలు..
రాష్ట్రంలో మొత్తం 411 బీఈడీ కళాశాలలు ఉండగా.. 34 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరం ముగింపునకు వచ్చినా ఇప్పటికీ బీఈడీ ప్రవేశాలు పూర్తి కాలేదు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీని ఉన్నత విద్యామండలి భర్తీ చేసింది. ఇందులో మిగిలిపోయిన సీట్లను స్పాట్ కింద, యాజమాన్య కోటా (కేటగిరి-బీ) 25% సీట్లను ఈనెల 12 లోపు పూర్తి చేయాలని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది..
- కళాశాలల్లో 50 నుంచి 150 సీట్లు వరకు ఉన్నాయి. ఇందులో గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఆంగ్ల సబ్జెక్టు మెథడాలజీలుగా వారీగా సీట్లను భర్తీ చేయాలి. ఉన్నత విద్యామండలి మొదట ఇదే విధానంలో పూర్తి చేయాలంటూ వారం క్రితం ఆదేశాలు ఇచ్చింది. ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు మాత్రమే తప్పనిసరిగా భర్తీ చేయాలని ఆదేశించింది.
- యాజమాన్యాలు ప్రసన్నం చేసుకోవడంతో వారం తిరగక్కుండానే ఉన్నత విద్యామండలికి యాజమాన్యాలపై ప్రేమ పుట్టుకొచ్చింది. పాత జీవో ఒకటి గుర్తు కొచ్చింది. వెంటనే ఆ జీవోను పేర్కొంటూ సడలింపులు ఇచ్చేసింది.
- ఫిబ్రవరి 2008లో ఇచ్చిన జీవో ఎంఎస్-31 ప్రకారమంటూ తాజాగా కొత్త ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం సీట్లలో గణితం 25%, భౌతిక, జీవశాస్త్రాలు 30%, సాంఘిక శాస్త్రం, ఆంగ్లం మెథడాలజీలు 45% చొప్పున సీట్లు భర్తీ చేసుకోవాలని సూచించింది.
- ఈ జీవో ప్రకారం సైతం కాకుండా మొత్తం సీట్లను అభ్యర్థుల లభ్యతను బట్టి ఇష్టం వచ్చిన మెథడాలజీలో చేర్చుకునేందుకు అవకాశం కల్పించాలని యాజమాన్యాలు ఉన్నత విద్యామండలిని కోరాయి. మెథడాలజీతో సంబంధం లేకుండా సీట్లను భర్తీ చేసుకునేందుకు మామూళ్లు చెల్లించాలంటూ యాజమాన్యాలు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో చాపకింద నీరులా ఈ తతాంగం నడిచిపోతుంది.
- జగన్ సర్కార్లో ఈ అయిదేళ్లలో బీఈడీ కళాశాలలో అసలు తరగతులే కొనసాగలేదు. నాగార్జున వర్సిటీ పరిధిలో ప్రాక్టికల్ పరీక్షలనే ఎత్తేశారు. 700 మార్కులకు నిర్వహించాల్సిన ఈ పరీక్షలు లేకుండా చేశారు. ప్రవేశాలను ఆలస్యంగా నిర్వహిస్తుండడంతో రెండేళ్ల బీఈడీ కోర్సును 11 నెలలకే పూర్తి చేసేస్తున్నారు. ఇలా ఈ ఉల్లంఘనలన్నింటికీ ఒక్కో ధర నిర్ణయించి వర్సిటీల నుంచి ఉన్నత విద్యాశాఖ వరకు వసూలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం