ఐదేళ్లుగా గుర్రుపెట్టి.. గురుకులాలను వెనక్కి నెట్టి..
జగన్ ఐదేళ్ల కాలక్షేపం.. బీసీ పిల్లలకు పెనుశాపమైంది! ‘నా బీసీలు’ అంటూ పదేపదే వల్లెవేసే జగన్.. వారి పిల్లలకు గురుకులాల ఏర్పాటులో నయవంచనే చేశారు. తెలంగాణ మూడొందలకు పైగా బీసీ గురుకులాలతో బిరబిరా పరుగులు తీస్తోంది.
ఐదేళ్లలో నెలకొల్పింది రెండు విద్యాలయాలే..
బీసీ విద్యార్థులపై ఇదీ జగన్ ప్రేమ
తెలంగాణలో పదేళ్లలో నూతనంగా 308 ఏర్పాటు
అక్కడి గురుకులాల్లో 1.87 లక్షల మంది బీసీ విద్యార్థులు
ఏపీలో చదువుతోంది 38,500 మంది మాత్రమే..
నిధులు, భవనాలు ఇవ్వడానికీ వైకాపా సర్కారు విముఖత
జగన్ ఐదేళ్ల కాలక్షేపం.. బీసీ పిల్లలకు పెనుశాపమైంది!
‘నా బీసీలు’ అంటూ పదేపదే వల్లెవేసే జగన్.. వారి పిల్లలకు గురుకులాల ఏర్పాటులో నయవంచనే చేశారు.
తెలంగాణ మూడొందలకు పైగా బీసీ గురుకులాలతో బిరబిరా పరుగులు తీస్తోంది.
ఏపీలో మాత్రం జగన్ రెండంటే రెండే కొత్తగా ఏర్పాటుచేసి
ఆ వర్గం విద్యార్థుల విద్యపై విషం చిమ్మారు!
గురుకులాలు.. నాణ్యమైన విద్యను అందిస్తూ నైపుణ్యమున్న ఉపాధ్యాయులతో పిల్లల విద్యాభివృద్ధికి బాటలువేసే కేంద్రాలు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో వీటి పాత్ర అపారం. పేద, వెనకబడిన విద్యార్థులకు ఇవి వరం లాంటివి. వీటిలో సీటు దక్కితే విద్యార్థుల దశ తిరిగినట్లే అని అందరూ భావిస్తారు. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన గత తెదేపా ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు పెద్దపీట వేసింది. రాష్ట్ర విభజన నాటికి(2014) ఆంధ్రప్రదేశ్ పరిధిలో 35 బీసీ గురుకులాలు ఉండగా.. 2019 నాటికి 106కు పెంచింది. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో.. అంటే 71 గురుకులాలను కొత్తగా మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో పదేళ్లలో నూతనంగా 308 గురుకుల విద్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చి బీసీ విద్యార్థులకు అగ్రతాంబూలం ఇచ్చింది. ఇది కదా.. ప్రభుత్వాలు బీసీ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలవడం అంటే..
తెలంగాణ బీసీ గురుకులాలు నం.1
- తెలంగాణలో అత్యధిక విద్యాలయాలతో బీసీ గురుకుల సొసైటీ నం.1 స్థాయిలో ఉంది. సంఖ్యలోనే కాదు.. ఫలితాల్లోనూ నం.1గా కొనసాగుతోంది.
- తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆ ప్రాంతంలో 19 బీసీ పాఠశాలలు/జూనియర్ కళాశాలలు ఉండగా.. ఒక్క బీసీ డిగ్రీ కళాశాల కూడా లేదు. రాష్ట్ర విభజన అనంతరం అక్కడి ప్రభుత్వం కొత్తగా 275 పాఠశాలలు/జూనియర్ కళాశాలలు, 33 డిగ్రీ కళాశాలలను నెలకొల్పింది. అంటే పదేళ్లలో 308 గురుకులాలను ప్రారంభించింది.
- తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. కేవలం రెండేళ్లలోనే 238 బీసీ గురుకులాలను నెలకొల్పిందంటే బీసీ విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. వీటి ఏర్పాటులో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది కూడా.
- మొదట 5, 6, 7, 8 తరగతులతో ప్రారంభమైన ఈ పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాలలుగా అప్గ్రేడ్ అయ్యాయి.
- బీసీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 33 బీసీ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. వాటిలో పురుషుల కళాశాలలు 16, మహిళల కళాశాలలు 17.
- డిగ్రీ కళాశాలల్లో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టి బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. కృత్రిమమేధ, ఎం.ఎల్., ఎనలిటిక్స్ తదితర ప్రధాన కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- బీసీ మహిళల కోసం ప్రత్యేకంగా రెండు వ్యవసాయ విద్య కళాశాలలు కొనసాగుతున్నాయి. వీటి ఏర్పాటుకు అవసరమైన వ్యవసాయ భూములను ప్రభుత్వం సొసైటీ పేరిట మార్చింది.
- విభజన నాటికి తెలంగాణలోని బీసీ గురుకులాల్లో 10,640 మంది విద్యార్థులు చదువుతుంటే... ఇప్పుడు ఆ సంఖ్య 1,87,320కి చేరింది.
వైకాపా పాలనలో అధమస్థానం
- ఏపీలో వైకాపా పాలనలో బీసీ గురుకులాలు అధమస్థానంలో నిలిచాయి. నాణ్యమైన విద్య అందించడంలో జగన్ సర్కారు విఫలమైంది.
- రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 35 బీసీ గురుకులాలు ఉండేవి. తర్వాత అప్పటి తెదేపా ప్రభుత్వం అదనంగా 71 కొత్త గురుకులాలను మంజూరు చేసింది. వీటితో రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్య 106కు చేరింది.
- వైకాపా సర్కారు 2 గురుకులాలను మాత్రమే మంజూరు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నియోజకవర్గమైన డోన్లో ఒకటి, దాని సమీప ప్రాంతమైన బేతంచెర్లలో మరొకటి ఏర్పాటుచేసి చేతులుదులుపుకొంది.
- వైకాపా సర్కారు కొత్త గురుకులాలను మంజూరు చేయడం దేవుడెరుగు. అప్పటి తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన వాటిలో ఫిరంగిపురం, పిఠాపురం, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని బీసీ గురుకులాలను ఇప్పటికీ ప్రారంభించలేదు ఘనత వహించిన జగన్ సర్కారు. కారణం అడిగితే వాటి ఏర్పాటుకు భవనాలు దొరకడం లేదంటోంది!
- గత తెదేపా ప్రభుత్వం 14 బీసీ గురుకుల పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేసింది. జగన్ సర్కారు కేవలం ఐదింటిని మాత్రమే ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నతీకరించింది. ఇంటర్మీడియట్ స్థాయి కళాశాలలను డిగ్రీకి అప్గ్రేడ్ చేసే అవకాశమున్నా పట్టించుకోవడంలేదు.
- బీసీ గురుకులాల్లో కృత్రిమమేధ, ఎం.ఎల్., ఎనలిటిక్స్ తరహా ప్రత్యేక కోర్సుల ఊసే లేదు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే జగన్.. బీసీ పిల్లలకు వ్యవసాయ విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న కనీస స్పృహను కోల్పోయారు.
- విభజన నాటికి ఏపీలోని బీసీ గురుకులాల్లో 18 వేల మంది విద్యార్థులు చదువుతుండేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 105 గురుకులాల్లో 38,500 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. తెలంగాణలోని బీసీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 1.87 లక్షల విద్యార్థులతో పోల్చితే ఏపీలో చదువుతున్న బీసీ విద్యార్థుల సంఖ్య ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
వెన్నువిరిచారు..
‘నా బీసీలు’ అంటూ తరచూ బీసీ జపం చేసే ముఖ్యమంత్రి జగన్.. ఆ వర్గ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఏం చేశారో తెలుసా? తన ఐదేళ్ల పాలనలో కొత్తగా మంజూరు చేసింది రెండు గురుకులాలు మాత్రమే. బీసీలంటే ‘బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు... బ్యాక్బోన్ క్లాసెస్’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల వెన్నువిరిచారు. గత తెదేపా ప్రభుత్వం ఆ వర్గం విద్యార్థులకు బాసటగా నిలిస్తే.. జగన్ ప్రభుత్వం మాత్రం వారికి గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకురాకుండా పచ్చిమోసం చేసింది.
‘అద్దె’సరు భవనాలు
బీసీ విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందడం నచ్చనట్లుంది. అందుకే నిధుల కేటాయింపునకు జగన్కు చేతులురాలేదు. రాష్ట్రంలోని 65కి పైగా గురుకులాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి సొంత భవనాలు సమకూర్చేందుకు రూ.2 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించారు. జగన్ వాటిని అటకెక్కించారేగానీ నిధులను విదల్చలేదు.
వినతులు బుట్టదాఖలు
బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రంలోని వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి భారీగా వినతులు వస్తున్నాయి. కానీ వాటి మంజూరుకు జగన్కు మనసు రాలేదు. ప్రధానంగా జగన్ ప్రాతినిధ్యం వహించే రాయలసీమ ప్రాంతానికి చెందిన వెనకబడిన జిల్లాలైన అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే గడిచిన ఐదేళ్లలో అధికసంఖ్యలో వినతులు వచ్చాయి. ఆ దరఖాస్తులన్నీ బుట్టదాఖలాలయ్యాయి.
బిల్లులు చెల్లించకుండా..
గత తెదేపా ప్రభుత్వం గుండుమల, గుడిబండ, గోనెబావి, నసన్నకోట, అంపోలులో కొత్త గురుకుల భవనాల నిర్మాణాలు చేపట్టింది. ఒక్కో భవనానికి రూ.25 కోట్ల చొప్పున కేటాయించింది. వాటిలో నసన్నకోట, అంపోలులో మాత్రమే భవనాలు పూర్తయ్యాయి. మిగిలిన మూడు చోట్ల అసంపూర్తిగా మారాయి. కేవలం తెదేపా ప్రభుత్వం చేపట్టిందనే అక్కసుతోనే వైకాపా సర్కారు.. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా పనులను అడ్డుకుంటోంది. ప్రస్తుతం అంచనా వ్యయం పెరిగిన దృష్ట్యా ఒక్కో భవనం పూర్తికి రూ.5-6 కోట్ల వరకు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇవే కాకుండా వైకాపా బేతంచెర్ల, డోన్, తొండూరు, కమలాపురం, చోడవరం ప్రాంతాల్లో గురుకుల భవనాల నిర్మాణాలను చేపట్టింది. వీటికైనా నిధులు కేటాయించి పూర్తి చేసిందా..? అంటే అదీ లేదు. సీఎం జగన్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నియోజకవర్గమైన డోన్లోని భవనాలకు మాత్రమే నిధులు కేటాయించారు. మిగిలిన వాటికి మొండిచేయి చూపారు. ఇది చాలు.. బీసీ విద్యార్థులపై జగన్ ఎంత విషం కక్కుతున్నారో చెప్పడానికి..!
ఈనాడు, అమరావతి, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్