ఐదేళ్లుగా గుర్రుపెట్టి.. గురుకులాలను వెనక్కి నెట్టి..
జగన్ ఐదేళ్ల కాలక్షేపం.. బీసీ పిల్లలకు పెనుశాపమైంది! ‘నా బీసీలు’ అంటూ పదేపదే వల్లెవేసే జగన్.. వారి పిల్లలకు గురుకులాల ఏర్పాటులో నయవంచనే చేశారు. తెలంగాణ మూడొందలకు పైగా బీసీ గురుకులాలతో బిరబిరా పరుగులు తీస్తోంది.
ఐదేళ్లలో నెలకొల్పింది రెండు విద్యాలయాలే..
బీసీ విద్యార్థులపై ఇదీ జగన్ ప్రేమ
తెలంగాణలో పదేళ్లలో నూతనంగా 308 ఏర్పాటు
అక్కడి గురుకులాల్లో 1.87 లక్షల మంది బీసీ విద్యార్థులు
ఏపీలో చదువుతోంది 38,500 మంది మాత్రమే..
నిధులు, భవనాలు ఇవ్వడానికీ వైకాపా సర్కారు విముఖత
జగన్ ఐదేళ్ల కాలక్షేపం.. బీసీ పిల్లలకు పెనుశాపమైంది!
‘నా బీసీలు’ అంటూ పదేపదే వల్లెవేసే జగన్.. వారి పిల్లలకు గురుకులాల ఏర్పాటులో నయవంచనే చేశారు.
తెలంగాణ మూడొందలకు పైగా బీసీ గురుకులాలతో బిరబిరా పరుగులు తీస్తోంది.
ఏపీలో మాత్రం జగన్ రెండంటే రెండే కొత్తగా ఏర్పాటుచేసి
ఆ వర్గం విద్యార్థుల విద్యపై విషం చిమ్మారు!
గురుకులాలు.. నాణ్యమైన విద్యను అందిస్తూ నైపుణ్యమున్న ఉపాధ్యాయులతో పిల్లల విద్యాభివృద్ధికి బాటలువేసే కేంద్రాలు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో వీటి పాత్ర అపారం. పేద, వెనకబడిన విద్యార్థులకు ఇవి వరం లాంటివి. వీటిలో సీటు దక్కితే విద్యార్థుల దశ తిరిగినట్లే అని అందరూ భావిస్తారు. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన గత తెదేపా ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు పెద్దపీట వేసింది. రాష్ట్ర విభజన నాటికి(2014) ఆంధ్రప్రదేశ్ పరిధిలో 35 బీసీ గురుకులాలు ఉండగా.. 2019 నాటికి 106కు పెంచింది. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో.. అంటే 71 గురుకులాలను కొత్తగా మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో పదేళ్లలో నూతనంగా 308 గురుకుల విద్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చి బీసీ విద్యార్థులకు అగ్రతాంబూలం ఇచ్చింది. ఇది కదా.. ప్రభుత్వాలు బీసీ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలవడం అంటే..
తెలంగాణ బీసీ గురుకులాలు నం.1
- తెలంగాణలో అత్యధిక విద్యాలయాలతో బీసీ గురుకుల సొసైటీ నం.1 స్థాయిలో ఉంది. సంఖ్యలోనే కాదు.. ఫలితాల్లోనూ నం.1గా కొనసాగుతోంది.
- తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆ ప్రాంతంలో 19 బీసీ పాఠశాలలు/జూనియర్ కళాశాలలు ఉండగా.. ఒక్క బీసీ డిగ్రీ కళాశాల కూడా లేదు. రాష్ట్ర విభజన అనంతరం అక్కడి ప్రభుత్వం కొత్తగా 275 పాఠశాలలు/జూనియర్ కళాశాలలు, 33 డిగ్రీ కళాశాలలను నెలకొల్పింది. అంటే పదేళ్లలో 308 గురుకులాలను ప్రారంభించింది.
- తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. కేవలం రెండేళ్లలోనే 238 బీసీ గురుకులాలను నెలకొల్పిందంటే బీసీ విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. వీటి ఏర్పాటులో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది కూడా.
- మొదట 5, 6, 7, 8 తరగతులతో ప్రారంభమైన ఈ పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాలలుగా అప్గ్రేడ్ అయ్యాయి.
- బీసీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 33 బీసీ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. వాటిలో పురుషుల కళాశాలలు 16, మహిళల కళాశాలలు 17.
- డిగ్రీ కళాశాలల్లో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టి బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. కృత్రిమమేధ, ఎం.ఎల్., ఎనలిటిక్స్ తదితర ప్రధాన కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- బీసీ మహిళల కోసం ప్రత్యేకంగా రెండు వ్యవసాయ విద్య కళాశాలలు కొనసాగుతున్నాయి. వీటి ఏర్పాటుకు అవసరమైన వ్యవసాయ భూములను ప్రభుత్వం సొసైటీ పేరిట మార్చింది.
- విభజన నాటికి తెలంగాణలోని బీసీ గురుకులాల్లో 10,640 మంది విద్యార్థులు చదువుతుంటే... ఇప్పుడు ఆ సంఖ్య 1,87,320కి చేరింది.
వైకాపా పాలనలో అధమస్థానం
- ఏపీలో వైకాపా పాలనలో బీసీ గురుకులాలు అధమస్థానంలో నిలిచాయి. నాణ్యమైన విద్య అందించడంలో జగన్ సర్కారు విఫలమైంది.
- రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 35 బీసీ గురుకులాలు ఉండేవి. తర్వాత అప్పటి తెదేపా ప్రభుత్వం అదనంగా 71 కొత్త గురుకులాలను మంజూరు చేసింది. వీటితో రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్య 106కు చేరింది.
- వైకాపా సర్కారు 2 గురుకులాలను మాత్రమే మంజూరు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నియోజకవర్గమైన డోన్లో ఒకటి, దాని సమీప ప్రాంతమైన బేతంచెర్లలో మరొకటి ఏర్పాటుచేసి చేతులుదులుపుకొంది.
- వైకాపా సర్కారు కొత్త గురుకులాలను మంజూరు చేయడం దేవుడెరుగు. అప్పటి తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన వాటిలో ఫిరంగిపురం, పిఠాపురం, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని బీసీ గురుకులాలను ఇప్పటికీ ప్రారంభించలేదు ఘనత వహించిన జగన్ సర్కారు. కారణం అడిగితే వాటి ఏర్పాటుకు భవనాలు దొరకడం లేదంటోంది!
- గత తెదేపా ప్రభుత్వం 14 బీసీ గురుకుల పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేసింది. జగన్ సర్కారు కేవలం ఐదింటిని మాత్రమే ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నతీకరించింది. ఇంటర్మీడియట్ స్థాయి కళాశాలలను డిగ్రీకి అప్గ్రేడ్ చేసే అవకాశమున్నా పట్టించుకోవడంలేదు.
- బీసీ గురుకులాల్లో కృత్రిమమేధ, ఎం.ఎల్., ఎనలిటిక్స్ తరహా ప్రత్యేక కోర్సుల ఊసే లేదు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే జగన్.. బీసీ పిల్లలకు వ్యవసాయ విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న కనీస స్పృహను కోల్పోయారు.
- విభజన నాటికి ఏపీలోని బీసీ గురుకులాల్లో 18 వేల మంది విద్యార్థులు చదువుతుండేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 105 గురుకులాల్లో 38,500 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. తెలంగాణలోని బీసీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 1.87 లక్షల విద్యార్థులతో పోల్చితే ఏపీలో చదువుతున్న బీసీ విద్యార్థుల సంఖ్య ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
వెన్నువిరిచారు..
‘నా బీసీలు’ అంటూ తరచూ బీసీ జపం చేసే ముఖ్యమంత్రి జగన్.. ఆ వర్గ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఏం చేశారో తెలుసా? తన ఐదేళ్ల పాలనలో కొత్తగా మంజూరు చేసింది రెండు గురుకులాలు మాత్రమే. బీసీలంటే ‘బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు... బ్యాక్బోన్ క్లాసెస్’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల వెన్నువిరిచారు. గత తెదేపా ప్రభుత్వం ఆ వర్గం విద్యార్థులకు బాసటగా నిలిస్తే.. జగన్ ప్రభుత్వం మాత్రం వారికి గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకురాకుండా పచ్చిమోసం చేసింది.
‘అద్దె’సరు భవనాలు
బీసీ విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందడం నచ్చనట్లుంది. అందుకే నిధుల కేటాయింపునకు జగన్కు చేతులురాలేదు. రాష్ట్రంలోని 65కి పైగా గురుకులాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి సొంత భవనాలు సమకూర్చేందుకు రూ.2 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించారు. జగన్ వాటిని అటకెక్కించారేగానీ నిధులను విదల్చలేదు.
వినతులు బుట్టదాఖలు
బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రంలోని వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి భారీగా వినతులు వస్తున్నాయి. కానీ వాటి మంజూరుకు జగన్కు మనసు రాలేదు. ప్రధానంగా జగన్ ప్రాతినిధ్యం వహించే రాయలసీమ ప్రాంతానికి చెందిన వెనకబడిన జిల్లాలైన అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే గడిచిన ఐదేళ్లలో అధికసంఖ్యలో వినతులు వచ్చాయి. ఆ దరఖాస్తులన్నీ బుట్టదాఖలాలయ్యాయి.
బిల్లులు చెల్లించకుండా..
గత తెదేపా ప్రభుత్వం గుండుమల, గుడిబండ, గోనెబావి, నసన్నకోట, అంపోలులో కొత్త గురుకుల భవనాల నిర్మాణాలు చేపట్టింది. ఒక్కో భవనానికి రూ.25 కోట్ల చొప్పున కేటాయించింది. వాటిలో నసన్నకోట, అంపోలులో మాత్రమే భవనాలు పూర్తయ్యాయి. మిగిలిన మూడు చోట్ల అసంపూర్తిగా మారాయి. కేవలం తెదేపా ప్రభుత్వం చేపట్టిందనే అక్కసుతోనే వైకాపా సర్కారు.. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా పనులను అడ్డుకుంటోంది. ప్రస్తుతం అంచనా వ్యయం పెరిగిన దృష్ట్యా ఒక్కో భవనం పూర్తికి రూ.5-6 కోట్ల వరకు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇవే కాకుండా వైకాపా బేతంచెర్ల, డోన్, తొండూరు, కమలాపురం, చోడవరం ప్రాంతాల్లో గురుకుల భవనాల నిర్మాణాలను చేపట్టింది. వీటికైనా నిధులు కేటాయించి పూర్తి చేసిందా..? అంటే అదీ లేదు. సీఎం జగన్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నియోజకవర్గమైన డోన్లోని భవనాలకు మాత్రమే నిధులు కేటాయించారు. మిగిలిన వాటికి మొండిచేయి చూపారు. ఇది చాలు.. బీసీ విద్యార్థులపై జగన్ ఎంత విషం కక్కుతున్నారో చెప్పడానికి..!
ఈనాడు, అమరావతి, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట