పురందేశ్వరి ఫిర్యాదుపై తక్షణమే నివేదిక పంపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి కొల్లి రఘురామ్రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డితో పాటు, పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి రఘురామ్రెడ్డితో పాటు పలువురిపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలి ఫిర్యాదు
నిఘా విభాగాధిపతి పీఎస్సార్ ఆంజనేయులు, ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిపైనా..
వాళ్లు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ప్రస్తావన
ఎన్నికల వేళ అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలని వినతి
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి కొల్లి రఘురామ్రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డితో పాటు, పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి పురందేశ్వరి ఈ నెల 1న ఫిర్యాదు చేయగా, 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్కుమార్ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి.
పురందేశ్వరి తన లేఖలో నిఘా విభాగాధిపతి పీఎస్సార్ ఆంజనేయులు, ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. వారందరినీ అవినీతిపరులైన అధికారులుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ... ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందినవారేనని, వారి ముగ్గురిదీ ఒకే జిల్లా అని తెలిపారు. వారంతా ఎన్నికల, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ప్రక్రియల్ని అపహాస్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ‘నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడమనేది... ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల పరిరక్షణలో అత్యంత కీలకం. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకాన్ని కలిగించడం లేదు. పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగింది. పోలీసులు అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ.. ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయి.
అధికారుల తీరు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా ఉంది. ఆ సంఘటనలేవీ అనుకోకుండా జరిగినవి కాదు. ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యలే’ అని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే ఈ అధికారులందరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్, డీజీపీలను తక్షణం బదిలీ చేసి.. ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. తన ఫిర్యాదుతో పాటు, సీఎస్, డీజీపీ తదితరులపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల్నీ ఆమె జత చేశారు.
వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్న డీజీపీ
ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని వైకాపా ప్రభుత్వమే నియమించింది. ఆయన ఆ పార్టీ సానుభూతిపరుడు. అంతేకాదు ఆయనదీ ముఖ్యమంత్రి జగన్ సామాజికవర్గమే, ఇద్దరిదీ ఒకే జిల్లా. డీజీపీగా ఆయన నియామకంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. డీజీపీ పోస్టుకు అర్హులైన ఆరేడుగురు సీనియర్ అధికారుల్ని పక్కనపెట్టి సర్వీసులో వారికంటే జూనియర్ అయిన రాజేంద్రనాథరెడ్డిని డీజీపీగా నియమించారు. అందుకాయన కృతజ్ఞత తీర్చుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటీవల చిలకలూరిపేటలో ప్రధాని పాల్గొన్న బహిరంగ సభకు అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారు. మైక్ సిస్టమ్స్ దగ్గర సరైన భద్రత కల్పించలేదు. సభా ప్రాంగణంలోని స్తంభాలపైకి ఎక్కుతున్నవారిని పోలీసులు అడ్డుకోలేదు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని... వారిని స్తంభాలపై నుంచి దిగమని కోరాల్సి వచ్చింది.
- మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ అవినాష్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు డీజీపీ సహకరించలేదు. పైగా అరెస్ట్ చేయకుండా నిరోధించారు. రాష్ట్ర పోలీసులు సహకరించకపోవడంతో సీబీఐ అధికారులు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.
- విపక్ష నాయకులపై భౌతిక దాడులకు దిగిన వైకాపా నాయకులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి వేధించారు.
- డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారు. వైకాపా చేస్తున్న పలు దురాగతాలకు ఆయనే మార్గదర్శకత్వం వహిస్తున్నారు.
- రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై గానీ, దానికి కారకులైన వైకాపా నాయకులపైగానీ డీజీపీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దొంగ ఓటర్లపై పత్రికలు, టీవీ ఛానళ్లలో అనేక వార్తలొచ్చినా ఆయన స్పందించలేదు. ఆ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ఆయన మౌన ప్రేక్షకుడిలానే వ్యవహరించారు.
- ఆయనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సంపూర్ణ మద్దతుంది.
ఫోన్లు ట్యాప్ చేస్తున్న రఘురామ్రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతి కొల్లి రఘురామ్రెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు.. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. వాలంటీర్ల నుంచి డేటా, సమాచారం సేకరిస్తున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇచ్చిన సమాచారాన్ని అధికార పార్టీ నాయకులకు చేరవేస్తూ వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నారు. వాళ్లద్దిర్నీ వెంటనే ఆయా స్థానాల నుంచి బదిలీ చేయాలి.
వైకాపాకు సొమ్ములు పోగేస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి అధికార వైకాపాకు బహిరంగ మద్దతుదారు. బడా పారిశ్రామికవేత్తలు, దాతల నుంచి వైకాపాకు ఆర్థికంగా మద్దతు లభించేలా చేయటమే ప్రధాన లక్ష్యంగా ఆయన్ను ఆ స్థానంలో నియమించారు. పవిత్ర పుణ్యక్షేత్ర కార్యాలయాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. 2006లోనే ధర్మారెడ్డి లక్షకు పైగా ఆర్జిత సేవా టికెట్లు విక్రయించి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. ఆయన వేధింపులు తాళలేక సురేష్ అనే తితిదే ఉద్యోగి గతేడాది ఆగస్టులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్మారెడ్డిని వెంటనే అక్కణ్నుంచి బదిలీ చేసి, తటస్థంగా ఉండే అధికారిని నియమించాలి.
మద్యం సరఫరాలో వాసుదేవరెడ్డి పాత్ర
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వైకాపా మద్దతుదారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చీప్ లిక్కర్ క్రయవిక్రయాలకు ఆయనే ప్రధాన బాధ్యుడు. రాష్ట్రంలో నగదు రూపంలో మద్యం విక్రయాలు జరపటంలో రూ.వేల కోట్ల అవినీతి ఉంది. దానిపై సీబీఐ విచారణకు భాజపా ఇప్పటికే డిమాండు చేసింది. అధికార వైకాపా నాయకులతో ఉన్న సంబంధాల రీత్యా.. ఎన్నికల వేళ వాసుదేవరెడ్డి వారికి భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారు. ఆయన్ను వెంటనే ఆ బాధ్యతల నుంచి తప్పించి, విచారించాలి.
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్ జవహర్రెడ్డి
సమర్థులైన పలువురు సీనియర్ అధికారుల్ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్రెడ్డిని నియమించారు. అనుచిత ప్రయోజనాల కోసమే ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. తనకు కీలకమైన పోస్ట్ కట్టబెట్టినందుకు ప్రత్యుపకారంగా జవహర్రెడ్డి బహిరంగంగా వైకాపా ప్రభుత్వానికి సహాయపడుతున్నారు. మెరిట్, సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా.... ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరికి ముందుగా బిల్లులు చెల్లించేలా చూడటంలో సీఎస్ కీలక భూమిక నిర్వహించారు. సీఎఫ్ఎంఎస్ నిబంధనల్ని పక్కనబెట్టి వారికి దొడ్డిదారిన బిల్లులు చెల్లించారు.
- ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టుపెట్టి తెచ్చిన రుణాల్ని దారి మళ్లించడం సహా ప్రభుత్వం నిర్వహించిన పలు ఆర్థిక లావాదేవీల్ని కాగ్ తప్పుబట్టింది. అలా చేయడం తప్పని తెలిసీ సీఎస్ ఉద్దేశపూర్వకంగానే వాటిని ప్రోత్సహించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధుల్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముఖ్యమంత్రి ఇష్టానుసారం దారి మళ్లించేశారు.
- గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లిస్తున్నా సీఎస్ ప్రేక్షకపాత్ర వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!