కుమ్మరించేస్తోంది
రాష్ట్రంలో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్లో ఆరితేరిన ఒక పార్టీ.. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు రూ.వేల కోట్లు గుమ్మరిస్తోంది. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతోంది. ఎక్కడంటే అక్కడ, ఎలా కావాలంటే అలా డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తోంది.
వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ
కార్యకర్తలకు రూ.50 వేలు... నాయకులకు రూ.50 లక్షలు
ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు రూ.3,500 కోట్లు
వారు సొంతంగా పెట్టే ఖర్చుకు.. పార్టీ ఇచ్చింది అదనం
ఎక్కడికక్కడ భారీగా డబ్బు, బహుమతుల డంప్లు
మద్యం దుకాణానికి రూ.10 లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్లో ఆరితేరిన ఒక పార్టీ.. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు రూ.వేల కోట్లు గుమ్మరిస్తోంది. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతోంది. ఎక్కడంటే అక్కడ, ఎలా కావాలంటే అలా డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తోంది. సాధారణంగా రేపో, ఎల్లుండో పోలింగ్ అనగా ఓటర్లకు డబ్బులు పంచడం చూశాం. కానీ అసాధారణమైన ఆర్థిక, అంగబలాలు సమకూర్చుకున్న ఆ పార్టీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి మూడు నాలుగు నెలల ముందు నుంచే నాయకులకు, ఓటర్లకు డబ్బులు, బహుమతులూ ఎరవేస్తూ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. అభ్యర్థులను ప్రకటించడానికి ముందు నుంచే అసాధారణ రీతిలో డబ్బు వెదజల్లడం ప్రారంభించింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇప్పటికే తొలి విడతలో దాదాపు రూ.3,500 కోట్లు చేరవేసినట్లు ఆ పార్టీవర్గాల సమాచారం. ఆ పార్టీ అభ్యర్థుల్లో చాలా మంది గత అయిదేళ్లలో విపరీతంగా సంపాదించారు. ప్రకృతి వనరులను ఎడాపెడా దోచేసి, అంతులేని అవినీతికి పాల్పడి రూ.వందల కోట్లకు పడగలెత్తారు. అయినా ఆ పార్టీ అధినేత మాత్రం వారేదో అమాయకులన్నట్లు బిల్డప్లిస్తున్నారు.
‘మా అభ్యర్థులు డబ్బుల విషయంలో అంతంత మాత్రమే’ అంటూ ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా చేతులు తిప్పుతూ, ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తున్నారు. అభ్యర్థులకు రూ.కోట్లు ఖర్చు పెట్టగల ఆర్థిక పరిపుష్టి ఉన్నప్పటికీ... పార్టీ నుంచీ వారికి భారీగా నిధులు సమకూరుస్తున్నారు. ఆ పార్టీ అసాధారణమైన ఆర్థిక వనరులున్న ఏ కొద్దిమందికో తప్ప... మిగతా అభ్యర్థులందరికీ ఒక్కొక్కరికి రూ.20-25 కోట్ల చొప్పున ఇప్పటికే చేరవేసిందని సమాచారం. ఉదాహరణకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి శాసనసభకు పోటీ చేస్తున్న ప్రముఖ బిల్డర్కు, డెయిరీ వ్యాపారంలో ఉన్న మరో అభ్యర్థికీ తప్ప మిగతా వారందరికీ డబ్బులు పంపినట్టు పార్టీవర్గాల సమాచారం. ఆ పార్టీ ఎక్కడికక్కడ నగదు, బహుమతులతో భారీ డంప్లను సిద్ధంగా పెట్టింది. రూ.కోట్లు చెల్లించి నియమించుకున్న కన్సల్టెంట్ల దన్నుతో, ఎత్తులు, జిత్తులకు కొదవలేని ఆ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా డబ్బు పంచుతూ, గిఫ్టులకే రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చంతా ఒక ఎత్తు... ఈ ఎన్నికల్లో చేస్తోంది ఒక ఎత్తు అన్నట్లుగా డబ్బు వెదజల్లుతోంది.
ఇది అభ్యర్థులు సొంత వనరుల నుంచి పెట్టే ఖర్చుకు ఇది అదనం. ఇన్నాళ్లూ నగదు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమే చూశాం. ఈసారి ఆ పార్టీ కొత్త సంస్కృతికి తెరతీసింది. వివిధ వర్గాలవారికి కుక్కర్లు, ఫ్యాన్లు, కుట్టుమిషన్లు, చీరలు, నగదు, స్వీట్లు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, నరేగా సిబ్బంది, పాస్టర్లు, విలేకరులు తదితరులకు డబ్బు, బహుమతులతో ఎరవేస్తోంది. అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తోన్న వాలంటీర్లకు నెలకు రూ.10-15 వేల వరకు జీతమిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఇవి దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు కాబోతున్నాయని, ఉత్తరభారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్టే మొత్తం ఖర్చంతా కలిపినా... ఏపీలో పెడుతున్నంత ఉండదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.
రాష్ట్రమంతా పులివెందుల ఫార్ములా..!
ఆ పార్టీ డబ్బు వెదజల్లి నాయకుల్ని, కార్యకర్తల్ని కొనేసే వ్యవహారాన్ని వైయస్ఆర్ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో కొన్ని నెలల క్రితమే మొదలు పెట్టి... అదే ఫార్ములాను క్రమంగా రాష్ట్రమంతా విస్తరించింది. పులివెందుల, కమలాపురం సహా వివిధ నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేయగలరనుకున్న కీలకమైన కార్యకర్తలు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులకు ‘కార్యకర్తలకు భరోసా’ పేరుతో బహిరంగంగా డబ్బులు పంచారు. దాని కోసం ఒక ఫార్మాట్ను సిద్ధం చేశారు. సాయం కోరుతున్నట్లుగా ఆయా నాయకుల నుంచి దరఖాస్తు తీసుకుని డబ్బులిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు బహిరంగంగా చేసిన ఈ కార్యక్రమాన్ని... ఇప్పుడు తెరచాటున నిర్వహిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు తదితర మండలాల్లో పార్టీ క్షేత్రస్థాయి నాయకులెవరూ సహకరించే పరిస్థితి లేకపోవడంతో వారికి రూ.10-20 లక్షలిచ్చి బుజ్జగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కడప లోక్సభ స్థానం నుంచి ఈసారి మిగతా పార్టీలూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడంతో పోటీ తీవ్రమవడంతో...ఆ పార్టీ ఒక్కో మండలానికి ఒక ఇన్ఛార్జిని నియమించి నాయకులు, కార్యకర్తలకు డబ్బులు పంపిణీ కార్యక్రమం వారికి అప్పజెప్పింది.
ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధం
ఆ పార్టీ మొదట తమ మండల, గ్రామస్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో పాటు, తటస్థులు, కనీసం 100 మంది ఓటర్లను ప్రభావితం చేయగలరనుకున్నవారినీ, కార్యకర్తలను టార్గెట్ చేసింది. వారి స్థాయిని బట్టి డబ్బులు పంచుతోంది. కార్యకర్తలకైతే రూ.50 వేలు, నాయకులకు రూ.50 లక్షల వరకు ఇస్తోంది. చాలా చోట్ల తొలివిడత పంపిణీ కార్యక్రమం పూర్తయిందని, ఎన్నికలు సమీపించేనాటికి రెండో విడత పంపిణీ ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల నుంచి ముఖ్య నాయకులు, బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట వారిని ఓడించేందుకు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చుపెట్టేందుకు పార్టీ సిద్ధంగా ఉంది. ఆ పార్టీ వివిధ వర్గాలవారికీ, ఓటర్లకు పంచేందుకు ఎక్కడికక్కడ డంప్లు ఏర్పాటు చేసింది. వాటిలో ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడ్డవి 0.01 శాతం కూడా ఉండవని సమాచారం. ప్రాంతాల వారీగా డబ్బు పంపిణీ, సమన్వయ బాధ్యతను కొందరు ముఖ్య నేతలకు అప్పగించింది.
ఒక్కో నియోజకవర్గంలో బహుమతులకే రూ.5-6 కోట్లు
- పార్టీ అభ్యర్థుల్లో చాలా మంది చీరలు, ప్యాంట్లు, షర్ట్లు, ఇతర బహుమతులు పంచేందుకే రూ.5-6 కోట్ల చొప్పున ఖర్చు పెడుతున్నారు.
- విశాఖ జిల్లాలో ఓ అభ్యర్థి ఆటోడ్రైవర్లు, వివిధ వృత్తులకు చెందినవారితో సమావేశాలు నిర్వహించి, భోజనాలు పెట్టి రూ.1,500 చొప్పున ఇస్తున్నారు.
- రాజమహేంద్రవరంలో ఆ పార్టీ అభ్యర్థి మాజీ కార్పొరేటర్లు, పార్టీ కీలక నాయకులు, ఇన్ఛార్జులతో సమావేశాలు నిర్వహించి... వారి స్థాయినిబట్టి రూ.5 నుంచి రూ.30 లక్షల వరకు ఇస్తున్నారు. అక్కడ సామాజికవర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహించి, వారిని ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.
- కొత్తపేట నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి...గుత్తేదారులతో సమావేశాలు నిర్వహించి పెండింగ్ బకాయిలు చెల్లించే ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇసుక మొత్తం దోచేసిన ఆ నాయకుడు... గ్రామాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి మట్టి, ఇసుక ఉచితంగా సరఫరా చేస్తానని హామీలిస్తున్నారు.
- వేరే జిల్లా నుంచి వచ్చి ప్రకాశం జిల్లాలో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ నాయకుడు, దాని పరిధిలోని శాసనసభ స్థానాల అభ్యర్థులకు, ఓటర్లను ప్రభావితం చేయగలరనుకున్నవారికి డబ్బుల పంపిణీ మొదలు పెట్టారు. శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులకు పార్టీ ఇచ్చిన డబ్బు కాకుండా, ఆ లోక్సభ అభ్యర్థి ఇప్పటికే రూ.కోటి చొప్పున ఇచ్చినట్లు సమాచారం. ఉద్యోగులు, వాలంటీర్లు, గృహసారథులు, బూత్ కమిటీల వరకు ప్రభావితం చేసే కార్యక్రమం అక్కడ జోరుగా సాగుతోంది. పార్టీలోని నియోజకవర్గ, మండలస్థాయి నాయకులకు వారు ఎన్ని ఓట్లు వేయించగరన్నది చూసి డబ్బులు ఇస్తున్నారు. గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఇస్తున్నారు.
- కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ప్రచార శైలి విభిన్నంగా ఉంటుంది. ఆయన జనంలోకి వెళ్లినప్పుడు కూడా సంచిలో డబ్బులు పట్టుకుని అనుచరులు అనుసరిస్తారు. డబ్బులు ఇవ్వాలనుకున్న చోట ఆయన సైగ చేస్తే...అప్పటికప్పుడు రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు ఇస్తారు. ఓటర్లను ప్రలోభ పెట్టే ఈ కార్యక్రమానికి ఆర్థికసాయం అని పేరు పెట్టారు.
- గుడివాడ నియోజకవర్గంలో అసభ్య పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ప్రసిద్ధి చెందిన నాయకుడు... ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు హారతులిచ్చినవారికి పళ్లెంలో డబ్బులు వేస్తున్నారు. ఆయనది అదో తరహా పంపిణీ కార్యక్రమం.
మద్యం దుకాణాలతో ముందస్తు ఒప్పందం..
రాష్ట్రంలో చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు మద్యం దుకాణాలతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి రూ.లక్షల్లో చెల్లించారు. మద్యం పంపిణీ చేయాలనుకున్నవారికి అభ్యర్థులు టోకెన్లు ఇస్తున్నారు. అవి తీసుకుని వెళితే అక్కడ మద్యం సీసాలు అందజేస్తున్నారు. విశాఖలో ఆ పార్టీ అభ్యర్థి ఒకరు దీన్ని వ్యవస్థీకృతం చేసేశారు.
చీరలు, కుక్కర్లు, వాచీలు, గోడ గడియారాలు..
- విశాఖ జిల్లాలో అత్యంత ధనవంతుడైన ఒక అభ్యర్థి... ఇప్పటికే నియోజకవర్గంలో ఇంటింటికీ స్వీట్ బాక్సులు, చీరలు పంపిణీ చేశారు. మెప్మా రిసోర్స్పర్సన్ల వంటివారితో సమావేశాలు నిర్వహించి భోజనాలు పెడుతున్నారు. సమావేశానికి హాజరైనప్పుడే వారికి టోకెన్లు ఇచ్చేస్తున్నారు. సమావేశం ముగిశాక వాటిని తీసుకెళ్లినవారికి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు.
- గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి... అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా రిసోర్స్ పర్సన్లకు ఇటీవల కవర్లలో రూ.7 వేల చొప్పున పెట్టి పంపించడం సంచలనమైంది.
- తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు నుంచే అక్కడ ఓటర్లకు ఎరవేసే కార్యక్రమం మొదలైంది. ఇంటింటికీ కుక్కర్లు, రిస్ట్ వాచీలు, గోడ గడియారాల పంపిణీ మొదలు పెట్టారు. వాలంటీర్లతో పాటు వివిధ వర్గాల వారికీ బహుమతులు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్