వైకాపా కోడ్ నడుస్తోంది
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 24 రోజులవుతున్నా.. రాష్ట్రంలో ఇప్పటికీ వైకాపా కోడే నడుస్తోంది. దేశమంతటా అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తుంటే.. మన రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు మాత్రం ఇప్పటికీ అధికార పార్టీ సేవలోనే తరించిపోతున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 24 రోజులవుతున్నా అధికార పార్టీ సేవలోనే కొందరు పోలీసు అధికారులు
వైకాపా రౌడీమూక అరాచకాలకు వెన్నుదన్ను
అధికార పార్టీ కార్యకర్తల్లా ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు
ఎన్ని దారుణాలు చేస్తున్నా చర్యలు శూన్యం
అందుకే పేట్రేగిపోతున్న వైకాపా ఖాకీలు
రేయ్ కాల్చిపడేస్తా.. రౌడీషీట్ తెరిచి లాకప్లో వేస్తా’ అంటూ తెదేపా శ్రేణుల్ని హెచ్చరించిన కారంపూడి సీఐపై చర్యలేవి?
కర్నూలులో తెదేపా నేత శేషగిరిశెట్టిని చితకబాదిన ఇన్స్పెక్టర్ ఆదినారాయణరెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
ఈనాడు - అమరావతి
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 24 రోజులవుతున్నా.. రాష్ట్రంలో ఇప్పటికీ వైకాపా కోడే నడుస్తోంది. దేశమంతటా అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తుంటే.. మన రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు మాత్రం ఇప్పటికీ అధికార పార్టీ సేవలోనే తరించిపోతున్నారు. వైకాపా రౌడీమూకల అరాచకాలకు కొమ్ముకాస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా కార్యకర్తలను ఉక్కుపాదంతో అణచేయాల్సింది పోయి బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్నారు. కొన్నిచోట్ల పోలీసులే అధికార పార్టీ కండువాలు కప్పుకొన్న కార్యకర్తల్లా ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు. అలాంటి వారిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోకపోతుండటంతో మరింతగా పేట్రేగిపోతున్నారు. ‘రేయ్ కాల్చి పడేస్తా.. ఏమనుకుంటున్నావో.. రౌడీషీట్ తెరిచి లాకప్లో వేస్తా’ అంటూ మాచర్ల నియోజకవర్గం కారంపూడి సీఐ చిన్నమల్లయ్య తెదేపా శ్రేణులను ఇటీవల తుపాకీతో బెదిరించారు. ఆయనపై ఇప్పటికీ ఏ చర్యా లేదు. కనీసం సంజాయిషీ అడగలేదు. కర్నూలులో తెదేపా నాయకుడు శేషగిరిశెట్టిని 2రోజుల కిందట స్పెషల్ పార్టీ సీఐ ఆదినారాయణరెడ్డి, ఇద్దరు కానిస్టేబుళ్లు కౌన్సెలింగ్ అని పిలిచి చితకబాదారు. ఈ ఘటనపై తెదేపా నాయకులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. హింసను అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతుంటే ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది? ఇలాంటి అధికారులందరికీ తీవ్రమైన హెచ్చరిక పంపించేలా కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? క్షేత్రస్థాయిలో ఇలాంటి అధికారులు కొనసాగుతుంటే నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది?
బాధితులపైనే రివర్స్ కేసులు
3 రాజధానుల విధానంపై నిలదీసినందుకు.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ అరుణ్కుమార్ అనుచరులు తెదేపా కార్యకర్తలు కిషోర్, నరసింహరావులపై రాడ్లు, కుర్చీలతో దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు వైకాపా నాయకుల ఫిర్యాదు ఆధారంగా తిరిగి బాధితులపైనే రివర్స్ కేసు పెట్టారు. దాడికి పాల్పడ్డవారిపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారికి కొమ్ముకాశారు.
- పల్నాడు జిల్లా క్రోసూరులో తెదేపా కార్యాలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టేశారు. అక్కడ చంద్రబాబు ప్రజాగళం సభ జరిగిన మరుసటిరోజే ఈ దారుణం చోటుచేసుకుంది. సభ విజయవంతమవటాన్ని చూసి ఓర్వలేక వైకాపా నాయకులే ఈ దారుణానికి పాల్పడ్డారని తెదేపా ఆరోపించింది. పెదకూరపాడు వైకాపా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వ్యక్తిగత కార్యదర్శి సత్తిరాజు గంగాధర్రెడ్డి, నంబూరు కల్యాణ్ చక్రవర్తి, బొంతు రవీంద్రనాథ్ చౌదరి, వడ్డే కృష్ణారెడ్డిలే ఈ ఘటనకు కారణమంటూ ఫిర్యాదు చేసింది. ఇప్పటికీ పోలీసులు వారెవరిపైనా చర్యలు తీసుకోలేదు.
- అడ్డదారుల్లోనైనా సరే గెలిచేందుకు కర్నూలు జిల్లాలో వైకాపా నాయకులు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయా ఘటనలపై ప్రతిపక్షాల అభ్యర్థులు ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులిస్తున్నా వైకాపా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.
- కృష్ణా జిల్లా గన్నవరంలో వైకాపా నాయకుల ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన తెదేపా నాయకురాలు మాధవీరెడ్డి, ఆమె కుమార్తెపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడితే.. పోలీసులు నిందితులకే వత్తాసు పలికారు.
ఎస్పీని మారిస్తే సరిపోతుందా?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గాన్ని వైకాపా నాయకులు అరాచకానికి కేంద్రంగా మార్చేశారు. అయిదేళ్లుగా ప్రతిపక్ష నేతలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హింసకు పాల్పడుతూ నియోజకవర్గాన్ని మరో చంబల్లోయగా తయారుచేశారు. ఇక్కడ పోలీసులే వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ జిల్లా ఎస్పీని బదిలీ చేసింది.. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న సిబ్బందిపై చర్యల్లేవు.
తెదేపా శ్రేణులపై వరుస దాడులు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ హింసాత్మక ఘటనలేవీ జరగకూడదని, అలా జరిగితే ఆ జిల్లా ఎస్పీలనే బాధ్యుల్ని చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా పదే పదే చెబుతున్నా కొందరు పోలీసులు అవేవీ లెక్క చేయట్లేదు.
- మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడేనికి చెందిన తెదేపా నాయకులు తులసీనాయక్, రవినాయక్, శ్రీనునాయక్లపై వైకాపా శ్రేణులు కర్రలు, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. వెల్దుర్తి మండల వైకాపా జడ్పీటీసీ అనుచరులు తెదేపా వర్గీయుల ఇళ్లు, దుకాణాలు ధ్వంసం చేశారు.
- గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బేతాళ రవి, ఈశ్వర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
కఠిన హెచ్చరికలు పంపిస్తేనే..
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, హింసకు పాల్పడుతూ వైకాపా నాయకులు పేట్రేగిపోతున్నారు. హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాల్సిన పోలీసులు వారికి కొమ్ముకాస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులే దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటివారిని ఉపేక్షిస్తే ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ హింసాత్మక ఘటనలు మరింత పెరుగుతాయి. ఒక్క హింసాత్మక ఘటన కూడా జరగకుండా ఎన్నికల నిర్వహించాలనే ఈసీ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. అందువల్ల హింసాత్మక ఘటనలకు బాధ్యులైన ఎస్పీలపైనే కాకుండా క్షేత్రస్థాయిలో అరాచకంగా వ్యవహరిస్తున్న వారిని కూడా గుర్తించి, చర్యలు తీసుకోవాలి.
ప్రతిపక్ష పార్టీలకు జైకొట్టడమూ నేరమేనా?
అయిదేళ్లుగా విపక్ష నాయకులు అడుగు తీసి అడుగేస్తే కేసు అన్నట్లుగా వేధించిన పోలీసులు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడూ వైకాపాపై స్వామి భక్తి ప్రదర్శించడం మానలేదు. ప్రతిపక్ష పార్టీలకు జై కొట్టడం కూడా నేరమేనన్నట్లు జనాన్ని వేధిస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కింధపాలెంలో తెదేపా కార్యకర్తల ఇళ్లపై జెండాలు తొలగించిన పంచాయతీ సిబ్బంది వైకాపా నాయకుల ఇళ్లపై పార్టీ జెండాలను మాత్రం తీయలేదు. దీనిపై ప్రశ్నించిన తెదేపా నాయకులపై వైకాపా వారు దాడి చేయగా... పోలీసులు తిరిగి బాధితులపైనే కేసు పెట్టారు.
- అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో తెదేపా మద్దతుదారు దుకాణంలో పనిచేస్తున్న కూలీపై ఎస్సై నాగశివరెడ్డి దాడికి పాల్పడ్డారు. దుకాణ యజమానిని వైకాపాలో చేరేలా ఒత్తిడి చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదులున్నాయి.
- బల్లికురవ మండలంలో వైకాపాకు 3 వేలకు పైగా మెజారిటీ తెప్పిస్తానని ఓ పోలీసు అధికారి బహిరంగంగానే శపథం చేస్తున్నారు.
- ‘జై తెలుగుదేశం, జై గొట్టిపాటి’ అని నినాదాలు చేసినందుకు అద్దంకి నియోజకవర్గం వేమవరం తండావాసులపై వైకాపా నాయకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
- అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలపై కొందరు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయించారు.
అరాచకాలకు కొమ్ముకాస్తూనే ఉన్నారు..
- కాకినాడలో శివాలయంలో అర్చకులపై వైకాపా నేత, మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు దాడికి పాల్పడ్డారు. కాలితో తన్ని, చెంపపై కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. ఇంత దారుణం జరిగినా పోలీసులు ఈ కేసులో రాజీ కుదిర్చి, నీరుగార్చే ప్రయత్నం చేశారు. చివరికి మొక్కుబడి సెక్షన్తో సరిపెట్టేశారు.
- గుడివాడలో వైకాపా అండదండలతో పేట్రేగిపోతున్న గంజాయి బ్యాచ్ ఓ ఇంటర్మీడియట్ అమ్మాయిని వేధించింది. దీనిపై బాధితురాలి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకుండా నిందితులకే సహకరించారు. వేధింపులు మరింత పెరగటంతో బాధితురాలు తండ్రి దిశ యాప్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అక్రమంగా గంజాయి కేసు బనాయించేందుకు ఇన్స్పెక్టర్లు ప్రయత్నించారు.
- ఎన్నికల కోడ్ ఉన్నా.. క్షేత్రస్థాయిలో పోలీసులు వైకాపా నాయకులు ఎంతలా కొమ్ముకాస్తున్నారో చెప్పేందుకు ఈ రెండు ఘటనలు తాజా నిదర్శనాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు