రోడ్లేయని జగన్.. ఓ జనహంతక చక్రవర్తి!
ఆడపడుచుల పసుపు కుంకుమలను తుడిచేసేవాడు ‘అన్న’ అవ్వడు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల గురించి పట్టించుకోకుండా ఎందరో ఆడబిడ్డల సౌభాగ్యాన్ని చెరిపేసిన జగన్ ‘అన్న’ ఎలా అవుతారు? పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆనంద్.. ఓ చిరుద్యోగి.
దారులు, రహదారులు, అడ్డదారుల గురించి వినుంటారు... యమదారులు మాత్రం చూసుండరు! గుంతలు పడి... రాళ్లు లేచి... గమ్యం చేరతామో... గగనానికి ఎగురుతామో తెలియక... భయంభయంగా... ప్రాణాలు అరచేతిలో పట్టుకొని సాగే ఆంధ్రావని రోడ్లు... జగనన్న అయిదేళ్ల పాలనకు నిలువుటద్దాలు!
ఆడపడుచుల పసుపు కుంకుమలను తుడిచేసేవాడు ‘అన్న’ అవ్వడు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల గురించి పట్టించుకోకుండా ఎందరో ఆడబిడ్డల సౌభాగ్యాన్ని చెరిపేసిన జగన్ ‘అన్న’ ఎలా అవుతారు? పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆనంద్.. ఓ చిరుద్యోగి. బండిపై వెళ్తూ రోడ్డు గుంతలో పడి చనిపోయాడు. దాంతో ఆనంద్ భార్య రామాంజమ్మ, నలుగురు పిల్లల జీవితాలు మోడువారిపోయాయి. కాకినాడ జిల్లా పెద్దిపాలెం వాసి కోన సత్తిబాబు భవన నిర్మాణ కూలి. దార్లో నోరుతెరిచిన గుంత ఒకటి సత్తిబాబును మింగేసి, అతని భార్యాపిల్లల బతుకుల్లో వెలుగును ఆర్పేసింది. చిత్తూరు జిల్లా గుంటిపల్లి చెరువు దగ్గరి రోడ్డుపై గుంత- కరుణాకర్రెడ్డి అనే ద్విచక్ర వాహనదారుణ్ని బలిగొంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గుంతల రోడ్డు 15 రోజుల్లో ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. ఇలా ఎన్నో అకాల మరణాలు.. అవన్నీ జగన్ చేసిన హత్యలే! ఎందుకంటే- సీఎంగా ఆయన కనీసం రోడ్లపై గోతులనైనా పూడ్పించి ఉంటే, ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా ఉండేవి కాబట్టి!
జగన్ నవ్వులు.. జనం ఏడుపులు!
అమెరికా సంపన్న రాజ్యం ఎలా అయ్యింది? ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీ ఒకసారి దీనికి సమాధానమిచ్చారు. ‘‘మంచి రోడ్లు వేసుకోవడం వల్లే అమెరికా ధనిక దేశం కాగలిగింది’’ అని కెన్నడీ స్పష్టంగా చెప్పారు. వృత్తి వ్యాపారాల వృద్ధికి రోడ్లు తోడ్పడతాయి. తద్వారా సంపదను సృష్టిస్తాయి. జనం బతుకులను బాగుపరుస్తాయి. అలాంటి చక్కటి రహదారులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా.. లేవు! ఒళ్లు హూనం కాకుండా, వాహనాలు పాడైపోకుండా ఏపీలో ఎటైనా వెళ్లగలమా.. లేదు! గుంతల రోడ్లలో ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇల్లు చేరితే చాలని దేవుడికి దండం పెట్టుకోని వారెవరైనా ఉన్నారా.. లేరు! జనం ఇంతగా ఆక్రోశిస్తుంటే- సీఎంగా జగన్ ఏం చేశారు? ‘మీ చావు మీరు చావండి’ అని వదిలేసి విషపు నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు.
పిట్టలదొర జగన్
మైకు ముందుకు రాగానే పిట్టలదొరగా మారిపోతారు జగన్. బడాయి కబుర్లతో జనాన్ని ఏమార్చడానికి తెగ ప్రయత్నిస్తారు. ‘‘కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులతో మా అయిదేళ్ల పాలన సాగింది’’ అన్న జగన్ ఇటీవలి మాటలన్నీ అచ్చంగా పిట్టలదొర డప్పులే! తారు లేచిపోయి రాళ్లుతేలిన రహదారులు, బురద బాటలు, గుంతల మధ్యలో రోడ్డెక్కడ ఉందో వెతుక్కుంటూ చేసే ప్రయాణాలు.. జగన్ అనగానే జనానికి గుర్తొచ్చేవి ఇవే! కాబట్టి వైకాపా అధినేత చెప్పిన విప్లవాత్మక మార్పులేవో ఆయన కలలోనే వచ్చి ఉంటాయి తప్ప రాష్ట్రంలో రాలేదు. ఏపీలో ఆర్అండ్బీ పరిధిలో 45వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లున్నాయి. వాటిలో 9వేల కి.మీ. మేర నరకలోకపు వాకిళ్లుగా మారిపోయాయి. ఇంకో ఏడున్నర వేల కి.మీ. రహదారులన్నీ గుంతలతో జల్లెడల్లా తయారయ్యాయి. మరో 8.5వేల కి.మీ రోడ్లేమో ఏదో పైపైన అలా ఉన్నాయంటే ఉన్నాయి. ‘‘రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులను వెంటనే గుర్తించి.. సత్వర మరమ్మతులు చేపట్టాలి’’ అని 2019 నవంబరులో చెప్పిన జగన్- ఆ పనులు చేయించారా? అబ్బో.. రాష్ట్రానికి అంత అదృష్టం కూడానా! ఎప్పుడైనా ఎక్కడైనా ఒకసారి రోడ్డు వేశాక అయిదేళ్లకోసారి బీటీ లేయర్తో దాన్ని పునురుద్ధరించాలి. ఆ విధంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 9వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు తప్పనిసరి. అవీ చేయించలేదు జగన్. ఆయన హయాంలో ఒకే ఒక్కసారి 7.6వేల కి.మీ. మేరకు పునరుద్ధరణ పనులు జరిగాయి. వాటికోసం రూ.2వేల కోట్ల రుణం తీసుకున్నారు. ఆ అప్పు వాయిదాల చెల్లింపుల కోసం పెట్రోల్, డీజిల్లపై లీటర్కు రూపాయి చొప్పున అదనంగా వసూలు చేశారు. అలా నెలకు రూ.50 కోట్లు జనం జేబుల్లోంచి లాక్కున్నారు. జగన్ అన్న ‘‘కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు’’ అన్నీ ఇదిగో ఇలాగే ప్రజలను పీడించడంలో తెచ్చినవే!
జగన్ పరివారానికి ప్రత్యేక రోడ్లు
హెలికాప్టర్లో తిరిగే అరాచక చక్రవర్తి జగన్కు జనం బాధలు కనపడవు. ఆయన పొరపాటున రోడ్డు ప్రయాణం చేయాల్సి వస్తే- ఆ రహదారి ఒక్కటే ఆఘమేఘాలపై బాగయ్యేది. తాను, తన కుటుంబ సభ్యులు, తన పార్టీ నేతలు మాత్రమే మనుషులు అన్నట్లుగా ప్రవర్తించడం జగన్కే సాధ్యం. ఆయన అంతటి స్వార్థపరుడు కాబట్టే సొంత జిల్లాలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ముందు మిలమిల మెరిసే రోడ్డేశారు. ఆ చుట్టుపక్కల ఊళ్లలో పాడైపోయిన రహదారులనేమో అలాగే గాలికొదిలేశారు. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రం కోసమని జనం తిరగని దారిలో రూ.30 లక్షల ఉపాధి నిధులతో ప్రత్యేకంగా తార్రోడ్డు నిర్మించారు. విశాఖపట్నంలో కూడా అలాగే జగన్ బంధుమిత్రులు, ఆయన పార్టీ నేతల ఆస్తులున్న కొన్ని ప్రాంతాల్లోనే మంచి రోడ్లు కనపడతాయి. ఇదే మరి జగన్ రాజ్యం... జనాన్ని చావగొట్టి అయినవారికి అంతా దోచిపెట్టే రాబందు రాజ్యం!
తాళిబొట్లను తెంచేసిన జగన్!
శ్రీకాకుళం-పాలకొండ ప్రధాన రహదారిలోని గుంతల కారణంగా కానిస్టేబుల్ సురేష్ ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా మనుబోలు భాజపా మండలాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కూడా రోడ్డుపై గుంతను తప్పించబోయి బండి మీద నుంచి జారిపడ్డారు. అక్కడికక్కడే మరణించారు. ఇలా ఒకరా ఇద్దరా.. అయిదేళ్ల జగన్ పాలనలో ఎందరో అభాగ్యులను గుంతల రోడ్లు బలితీసుకున్నాయి. చెత్త రహదారుల్లో ప్రయాణాల మూలంగా బండ్ల రిపేర్లూ అధికమయ్యాయి. వాహనాలపై తిరుగుతూ చిరువ్యాపారాలు చేసుకునేవారు, ఆటో కార్మికులు తదితరులకు ఖర్చులు అధికమయ్యాయి. ఈ బాధలన్నీ పడలేమని జనమంతా మొత్తుకున్నా జగన్ కొత్త రోడ్లు వేయించలేదు. పాత రోడ్లను బాగు చేయించలేదు. కనీసం రోడ్లపై గుంతలనూ పూడ్పించలేదు. వాటి కారణంగా ఎందరో చనిపోయినా జగన్ చలించలేదు. రోడ్లను నాశనం చేసి, వాటిపై నెత్తుటేళ్లు పారించిన జగన్ ఒక జనహంతకుడు.. అయిదేళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని అవసాన దశకు లాక్కుపోయిన ఉన్మత్త పాలకుడు!
నిధులు ఇవ్వలేదు.. పనులు కాలేదు!
ప్రజల కష్టనష్టాలను తీర్చని జగన్- పాత ప్రభుత్వం చేపట్టిన మంచి ప్రాజెక్టులనూ పాడుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 6,534 కి.మీ మేర కొత్త రోడ్ల నిర్మాణం, 624 కి.మీ వరకు పాత రోడ్ల బాగుసేతకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)తో తెదేపా సర్కారు అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు వ్యయం రూ.4,944 కోట్లలో 70శాతం రుణంగా ఇచ్చేందుకు ఏఐఐబీ అంగీకరించింది. మిగిలిన సొమ్మును రాష్ట్రం సమకూర్చాలి. తెదేపా హయంలో ప్రారంభమైన ఈ పనులను జగన్ ఆపేయించారు. ఆపై ఎప్పటికో మళ్లీ మొదలుపెట్టించినా- ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో దారుణ అలక్ష్యం ప్రదర్శించారు. దాంతో పనుల పురోగతి పడకేసింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు(ఎన్డీబీ) రుణసాయంతో చేపట్టిన రోడ్ల విస్తరణ ప్రాజెక్టుకూ జగన్ సర్కారు గ్రహణం పట్టించింది. 2023 మార్చికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ ముప్ఫైశాతం దగ్గరే దేకుతున్నాయంటే కారణం జగనే. రాష్ట్ర వాటా నిధులను ఆయన బిగపట్టేశారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రాజెక్టును రద్దుచేస్తామని కేంద్రం, ఎన్డీబీ వర్గాలు హెచ్చరించినా జగన్ ఖాతరు చేయలేదు. కనీసం కేంద్ర రహదారి మౌలికవసతుల నిధిని సద్వినియోగం చేసుకుని ఉన్నా- ఏపీ రోడ్లు ఎంతోకొంత బాగుపడేవి. గద్దెనెక్కాక గిట్టనివాళ్లను రాచిరంపాన పెట్టారే తప్ప రాష్ట్రానికి పనికొచ్చే పని ఏదీ జగన్ చేయలేదు.
పల్లెలకు జగనే ఒక శాపం!
పిల్లికి బిచ్చం వేయనివాడు జనంలోకి వచ్చి ‘నేను దానకర్ణుణ్ని’ అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది! జగన్ చెప్పుకొనే గొప్పలూ అలాగే రోతగా ఉంటాయి. పూర్తిగా దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మీద ఆర్టీసీ బస్సులు ఒరిగిపోతున్నాయి. పాఠశాల బస్సులు పల్టీకొడుతున్నాయి. బండ్లు అదుపు తప్పుతుండటంతో వాహనదారుల ప్రాణాలే పోతున్నాయి. పది పన్నెండు కి.మీ. ప్రయాణానికీ గంటకు పైగా పట్టేంతగా పల్లె రహదారులు గుంతలు తేలాయి. ఈ నిజాలను దాచిపెట్టి ‘‘గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులు మారాయి’’ అంటూ జనం చెవిలో పూలుపెడుతున్నారు జగన్. గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో 25వేల కి.మీ. పైగా సిమెంటు రహదారులను వేయించింది. ఉపాధి హామీ నిధులు, పంచాయతీ సొమ్ములతో పల్లె రోడ్లను అందంగా తీర్చిదిద్దింది. జగన్ సీఎం అయ్యాక ఉపాధి నిధులను గ్రామ సచివాలయాల వంటివాటి నిర్మాణానికి ఇష్టానుసారం మళ్లించారు తప్ప రోడ్లను పట్టించుకోలేదు. అటు ఆ భవనాలనూ పూర్తి చేయలేదు. పంచాయతీల ఖాతాలనూ జగన్ ఊడ్చిపారేశారు. ఫలితంగా గ్రామీణ రహదారుల నిర్వహణ పరమ అధ్వానమైంది.
యథా జగన్.. తథా ఎమ్మెల్యేలు!
బిహార్, ఉత్తర్ప్రదేశ్ వంటివి ఒకప్పుడు బీమారు రాష్ట్రాలుగా పరువు మాశాయి. రోడ్లు, మౌలిక వసతులు ఏవీ అక్కడ ఉండేవి కావు. 1990ల్లో బిహార్ సీఎంగా లాలుప్రసాద్ ఉండేవారు. ‘‘రోడ్లు చాలా ప్రమాదకరమైనవి. మీ గ్రామాలకు రహదారులొస్తే, పోలీసులు చాలా సులువుగా మీ ఇళ్ల దాకా వచ్చేస్తారు’’ అంటూ ఆయన అప్పట్లో జనాన్ని భయపెట్టారు. రోడ్లు వేయట్లేదేంటని నిలదీసిన ప్రజలకు జగన్ పార్టీ నేతలూ అడ్డదిడ్డంగా జవాబులిచ్చారు. ‘‘గ్రామాలకు రహదారులు బాగాలేకపోతే నష్టమేమీ లేదు’’ అని నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైకాపా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి తేల్చిపడేశారు. ‘‘డబ్బులన్నీ పథకాలకే ఖర్చవుతున్నాయి... రహదారులు నిర్మించలేం’’ అని నందిగామ ఎమ్మెల్యే జగన్మోహనరావు చేతులెత్తేశారు. ‘‘ఒక్క నెల పింఛన్లు ఆపేస్తే, ఆ డబ్బుతో రోడ్లన్నింటినీ అద్దాల్లా చేయవచ్చు’’ అని బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. బూతు భాషాప్రవీణ కొడాలి నానీ కూడా రోడ్లు వేయాలంటే పథకాలన్నీ ఆపాల్సి వస్తుందన్నారు. ‘‘రహదారి పనులు ఇప్పట్లో పూర్తిచేయలేం. అంతవరకు కష్టాన్ని భరించాలి’’ అని ప్రజలకు ఉచిత సలహాలిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇలాంటి పనికిరాని మాటలు, చేవచచ్చిన చేతలతోనే జగన్, ఆయన అంతేవాసులు రాష్ట్రానికి తెగులు పట్టించారు. ప్రగతి పూలవనం కావాల్సిన ఏపీని వెనకబడిన రాష్ట్రాలకంటే ఘోరంగా తయారుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి