రోడ్లేయని జగన్.. ఓ జనహంతక చక్రవర్తి!
ఆడపడుచుల పసుపు కుంకుమలను తుడిచేసేవాడు ‘అన్న’ అవ్వడు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల గురించి పట్టించుకోకుండా ఎందరో ఆడబిడ్డల సౌభాగ్యాన్ని చెరిపేసిన జగన్ ‘అన్న’ ఎలా అవుతారు? పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆనంద్.. ఓ చిరుద్యోగి.
దారులు, రహదారులు, అడ్డదారుల గురించి వినుంటారు... యమదారులు మాత్రం చూసుండరు! గుంతలు పడి... రాళ్లు లేచి... గమ్యం చేరతామో... గగనానికి ఎగురుతామో తెలియక... భయంభయంగా... ప్రాణాలు అరచేతిలో పట్టుకొని సాగే ఆంధ్రావని రోడ్లు... జగనన్న అయిదేళ్ల పాలనకు నిలువుటద్దాలు!
ఆడపడుచుల పసుపు కుంకుమలను తుడిచేసేవాడు ‘అన్న’ అవ్వడు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల గురించి పట్టించుకోకుండా ఎందరో ఆడబిడ్డల సౌభాగ్యాన్ని చెరిపేసిన జగన్ ‘అన్న’ ఎలా అవుతారు? పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆనంద్.. ఓ చిరుద్యోగి. బండిపై వెళ్తూ రోడ్డు గుంతలో పడి చనిపోయాడు. దాంతో ఆనంద్ భార్య రామాంజమ్మ, నలుగురు పిల్లల జీవితాలు మోడువారిపోయాయి. కాకినాడ జిల్లా పెద్దిపాలెం వాసి కోన సత్తిబాబు భవన నిర్మాణ కూలి. దార్లో నోరుతెరిచిన గుంత ఒకటి సత్తిబాబును మింగేసి, అతని భార్యాపిల్లల బతుకుల్లో వెలుగును ఆర్పేసింది. చిత్తూరు జిల్లా గుంటిపల్లి చెరువు దగ్గరి రోడ్డుపై గుంత- కరుణాకర్రెడ్డి అనే ద్విచక్ర వాహనదారుణ్ని బలిగొంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గుంతల రోడ్డు 15 రోజుల్లో ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. ఇలా ఎన్నో అకాల మరణాలు.. అవన్నీ జగన్ చేసిన హత్యలే! ఎందుకంటే- సీఎంగా ఆయన కనీసం రోడ్లపై గోతులనైనా పూడ్పించి ఉంటే, ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా ఉండేవి కాబట్టి!
జగన్ నవ్వులు.. జనం ఏడుపులు!
అమెరికా సంపన్న రాజ్యం ఎలా అయ్యింది? ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీ ఒకసారి దీనికి సమాధానమిచ్చారు. ‘‘మంచి రోడ్లు వేసుకోవడం వల్లే అమెరికా ధనిక దేశం కాగలిగింది’’ అని కెన్నడీ స్పష్టంగా చెప్పారు. వృత్తి వ్యాపారాల వృద్ధికి రోడ్లు తోడ్పడతాయి. తద్వారా సంపదను సృష్టిస్తాయి. జనం బతుకులను బాగుపరుస్తాయి. అలాంటి చక్కటి రహదారులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా.. లేవు! ఒళ్లు హూనం కాకుండా, వాహనాలు పాడైపోకుండా ఏపీలో ఎటైనా వెళ్లగలమా.. లేదు! గుంతల రోడ్లలో ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇల్లు చేరితే చాలని దేవుడికి దండం పెట్టుకోని వారెవరైనా ఉన్నారా.. లేరు! జనం ఇంతగా ఆక్రోశిస్తుంటే- సీఎంగా జగన్ ఏం చేశారు? ‘మీ చావు మీరు చావండి’ అని వదిలేసి విషపు నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు.
పిట్టలదొర జగన్
మైకు ముందుకు రాగానే పిట్టలదొరగా మారిపోతారు జగన్. బడాయి కబుర్లతో జనాన్ని ఏమార్చడానికి తెగ ప్రయత్నిస్తారు. ‘‘కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులతో మా అయిదేళ్ల పాలన సాగింది’’ అన్న జగన్ ఇటీవలి మాటలన్నీ అచ్చంగా పిట్టలదొర డప్పులే! తారు లేచిపోయి రాళ్లుతేలిన రహదారులు, బురద బాటలు, గుంతల మధ్యలో రోడ్డెక్కడ ఉందో వెతుక్కుంటూ చేసే ప్రయాణాలు.. జగన్ అనగానే జనానికి గుర్తొచ్చేవి ఇవే! కాబట్టి వైకాపా అధినేత చెప్పిన విప్లవాత్మక మార్పులేవో ఆయన కలలోనే వచ్చి ఉంటాయి తప్ప రాష్ట్రంలో రాలేదు. ఏపీలో ఆర్అండ్బీ పరిధిలో 45వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లున్నాయి. వాటిలో 9వేల కి.మీ. మేర నరకలోకపు వాకిళ్లుగా మారిపోయాయి. ఇంకో ఏడున్నర వేల కి.మీ. రహదారులన్నీ గుంతలతో జల్లెడల్లా తయారయ్యాయి. మరో 8.5వేల కి.మీ రోడ్లేమో ఏదో పైపైన అలా ఉన్నాయంటే ఉన్నాయి. ‘‘రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులను వెంటనే గుర్తించి.. సత్వర మరమ్మతులు చేపట్టాలి’’ అని 2019 నవంబరులో చెప్పిన జగన్- ఆ పనులు చేయించారా? అబ్బో.. రాష్ట్రానికి అంత అదృష్టం కూడానా! ఎప్పుడైనా ఎక్కడైనా ఒకసారి రోడ్డు వేశాక అయిదేళ్లకోసారి బీటీ లేయర్తో దాన్ని పునురుద్ధరించాలి. ఆ విధంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 9వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు తప్పనిసరి. అవీ చేయించలేదు జగన్. ఆయన హయాంలో ఒకే ఒక్కసారి 7.6వేల కి.మీ. మేరకు పునరుద్ధరణ పనులు జరిగాయి. వాటికోసం రూ.2వేల కోట్ల రుణం తీసుకున్నారు. ఆ అప్పు వాయిదాల చెల్లింపుల కోసం పెట్రోల్, డీజిల్లపై లీటర్కు రూపాయి చొప్పున అదనంగా వసూలు చేశారు. అలా నెలకు రూ.50 కోట్లు జనం జేబుల్లోంచి లాక్కున్నారు. జగన్ అన్న ‘‘కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు’’ అన్నీ ఇదిగో ఇలాగే ప్రజలను పీడించడంలో తెచ్చినవే!
జగన్ పరివారానికి ప్రత్యేక రోడ్లు
హెలికాప్టర్లో తిరిగే అరాచక చక్రవర్తి జగన్కు జనం బాధలు కనపడవు. ఆయన పొరపాటున రోడ్డు ప్రయాణం చేయాల్సి వస్తే- ఆ రహదారి ఒక్కటే ఆఘమేఘాలపై బాగయ్యేది. తాను, తన కుటుంబ సభ్యులు, తన పార్టీ నేతలు మాత్రమే మనుషులు అన్నట్లుగా ప్రవర్తించడం జగన్కే సాధ్యం. ఆయన అంతటి స్వార్థపరుడు కాబట్టే సొంత జిల్లాలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ముందు మిలమిల మెరిసే రోడ్డేశారు. ఆ చుట్టుపక్కల ఊళ్లలో పాడైపోయిన రహదారులనేమో అలాగే గాలికొదిలేశారు. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రం కోసమని జనం తిరగని దారిలో రూ.30 లక్షల ఉపాధి నిధులతో ప్రత్యేకంగా తార్రోడ్డు నిర్మించారు. విశాఖపట్నంలో కూడా అలాగే జగన్ బంధుమిత్రులు, ఆయన పార్టీ నేతల ఆస్తులున్న కొన్ని ప్రాంతాల్లోనే మంచి రోడ్లు కనపడతాయి. ఇదే మరి జగన్ రాజ్యం... జనాన్ని చావగొట్టి అయినవారికి అంతా దోచిపెట్టే రాబందు రాజ్యం!
తాళిబొట్లను తెంచేసిన జగన్!
శ్రీకాకుళం-పాలకొండ ప్రధాన రహదారిలోని గుంతల కారణంగా కానిస్టేబుల్ సురేష్ ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా మనుబోలు భాజపా మండలాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కూడా రోడ్డుపై గుంతను తప్పించబోయి బండి మీద నుంచి జారిపడ్డారు. అక్కడికక్కడే మరణించారు. ఇలా ఒకరా ఇద్దరా.. అయిదేళ్ల జగన్ పాలనలో ఎందరో అభాగ్యులను గుంతల రోడ్లు బలితీసుకున్నాయి. చెత్త రహదారుల్లో ప్రయాణాల మూలంగా బండ్ల రిపేర్లూ అధికమయ్యాయి. వాహనాలపై తిరుగుతూ చిరువ్యాపారాలు చేసుకునేవారు, ఆటో కార్మికులు తదితరులకు ఖర్చులు అధికమయ్యాయి. ఈ బాధలన్నీ పడలేమని జనమంతా మొత్తుకున్నా జగన్ కొత్త రోడ్లు వేయించలేదు. పాత రోడ్లను బాగు చేయించలేదు. కనీసం రోడ్లపై గుంతలనూ పూడ్పించలేదు. వాటి కారణంగా ఎందరో చనిపోయినా జగన్ చలించలేదు. రోడ్లను నాశనం చేసి, వాటిపై నెత్తుటేళ్లు పారించిన జగన్ ఒక జనహంతకుడు.. అయిదేళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని అవసాన దశకు లాక్కుపోయిన ఉన్మత్త పాలకుడు!
నిధులు ఇవ్వలేదు.. పనులు కాలేదు!
ప్రజల కష్టనష్టాలను తీర్చని జగన్- పాత ప్రభుత్వం చేపట్టిన మంచి ప్రాజెక్టులనూ పాడుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 6,534 కి.మీ మేర కొత్త రోడ్ల నిర్మాణం, 624 కి.మీ వరకు పాత రోడ్ల బాగుసేతకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)తో తెదేపా సర్కారు అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు వ్యయం రూ.4,944 కోట్లలో 70శాతం రుణంగా ఇచ్చేందుకు ఏఐఐబీ అంగీకరించింది. మిగిలిన సొమ్మును రాష్ట్రం సమకూర్చాలి. తెదేపా హయంలో ప్రారంభమైన ఈ పనులను జగన్ ఆపేయించారు. ఆపై ఎప్పటికో మళ్లీ మొదలుపెట్టించినా- ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో దారుణ అలక్ష్యం ప్రదర్శించారు. దాంతో పనుల పురోగతి పడకేసింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు(ఎన్డీబీ) రుణసాయంతో చేపట్టిన రోడ్ల విస్తరణ ప్రాజెక్టుకూ జగన్ సర్కారు గ్రహణం పట్టించింది. 2023 మార్చికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ ముప్ఫైశాతం దగ్గరే దేకుతున్నాయంటే కారణం జగనే. రాష్ట్ర వాటా నిధులను ఆయన బిగపట్టేశారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రాజెక్టును రద్దుచేస్తామని కేంద్రం, ఎన్డీబీ వర్గాలు హెచ్చరించినా జగన్ ఖాతరు చేయలేదు. కనీసం కేంద్ర రహదారి మౌలికవసతుల నిధిని సద్వినియోగం చేసుకుని ఉన్నా- ఏపీ రోడ్లు ఎంతోకొంత బాగుపడేవి. గద్దెనెక్కాక గిట్టనివాళ్లను రాచిరంపాన పెట్టారే తప్ప రాష్ట్రానికి పనికొచ్చే పని ఏదీ జగన్ చేయలేదు.
పల్లెలకు జగనే ఒక శాపం!
పిల్లికి బిచ్చం వేయనివాడు జనంలోకి వచ్చి ‘నేను దానకర్ణుణ్ని’ అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది! జగన్ చెప్పుకొనే గొప్పలూ అలాగే రోతగా ఉంటాయి. పూర్తిగా దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మీద ఆర్టీసీ బస్సులు ఒరిగిపోతున్నాయి. పాఠశాల బస్సులు పల్టీకొడుతున్నాయి. బండ్లు అదుపు తప్పుతుండటంతో వాహనదారుల ప్రాణాలే పోతున్నాయి. పది పన్నెండు కి.మీ. ప్రయాణానికీ గంటకు పైగా పట్టేంతగా పల్లె రహదారులు గుంతలు తేలాయి. ఈ నిజాలను దాచిపెట్టి ‘‘గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులు మారాయి’’ అంటూ జనం చెవిలో పూలుపెడుతున్నారు జగన్. గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో 25వేల కి.మీ. పైగా సిమెంటు రహదారులను వేయించింది. ఉపాధి హామీ నిధులు, పంచాయతీ సొమ్ములతో పల్లె రోడ్లను అందంగా తీర్చిదిద్దింది. జగన్ సీఎం అయ్యాక ఉపాధి నిధులను గ్రామ సచివాలయాల వంటివాటి నిర్మాణానికి ఇష్టానుసారం మళ్లించారు తప్ప రోడ్లను పట్టించుకోలేదు. అటు ఆ భవనాలనూ పూర్తి చేయలేదు. పంచాయతీల ఖాతాలనూ జగన్ ఊడ్చిపారేశారు. ఫలితంగా గ్రామీణ రహదారుల నిర్వహణ పరమ అధ్వానమైంది.
యథా జగన్.. తథా ఎమ్మెల్యేలు!
బిహార్, ఉత్తర్ప్రదేశ్ వంటివి ఒకప్పుడు బీమారు రాష్ట్రాలుగా పరువు మాశాయి. రోడ్లు, మౌలిక వసతులు ఏవీ అక్కడ ఉండేవి కావు. 1990ల్లో బిహార్ సీఎంగా లాలుప్రసాద్ ఉండేవారు. ‘‘రోడ్లు చాలా ప్రమాదకరమైనవి. మీ గ్రామాలకు రహదారులొస్తే, పోలీసులు చాలా సులువుగా మీ ఇళ్ల దాకా వచ్చేస్తారు’’ అంటూ ఆయన అప్పట్లో జనాన్ని భయపెట్టారు. రోడ్లు వేయట్లేదేంటని నిలదీసిన ప్రజలకు జగన్ పార్టీ నేతలూ అడ్డదిడ్డంగా జవాబులిచ్చారు. ‘‘గ్రామాలకు రహదారులు బాగాలేకపోతే నష్టమేమీ లేదు’’ అని నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైకాపా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి తేల్చిపడేశారు. ‘‘డబ్బులన్నీ పథకాలకే ఖర్చవుతున్నాయి... రహదారులు నిర్మించలేం’’ అని నందిగామ ఎమ్మెల్యే జగన్మోహనరావు చేతులెత్తేశారు. ‘‘ఒక్క నెల పింఛన్లు ఆపేస్తే, ఆ డబ్బుతో రోడ్లన్నింటినీ అద్దాల్లా చేయవచ్చు’’ అని బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. బూతు భాషాప్రవీణ కొడాలి నానీ కూడా రోడ్లు వేయాలంటే పథకాలన్నీ ఆపాల్సి వస్తుందన్నారు. ‘‘రహదారి పనులు ఇప్పట్లో పూర్తిచేయలేం. అంతవరకు కష్టాన్ని భరించాలి’’ అని ప్రజలకు ఉచిత సలహాలిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇలాంటి పనికిరాని మాటలు, చేవచచ్చిన చేతలతోనే జగన్, ఆయన అంతేవాసులు రాష్ట్రానికి తెగులు పట్టించారు. ప్రగతి పూలవనం కావాల్సిన ఏపీని వెనకబడిన రాష్ట్రాలకంటే ఘోరంగా తయారుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఇదీ స్ట్రాంగ్రూమే!
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..