ఓటుతోనే తలరాతలు మారతాయి
‘మనం వేసే ఓటుతో తలరాతలు మారతాయని జ్ఞాపకం ఉంచుకోండి. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలివి. మీ బిడ్డది పేదల పక్షం.
పిడుగురాళ్ల ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్
జాబు రావాలంటే జగన్ కావాలంటూ జనంతో చెప్పించి ఆనందం
చంద్రబాబు హయాంలో ఉద్యోగాలివ్వలేదని ఆరోపణ
ఈనాడు అమరావతి, న్యూస్టుడే-పిడుగురాళ్ల: ‘మనం వేసే ఓటుతో తలరాతలు మారతాయని జ్ఞాపకం ఉంచుకోండి. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలివి. మీ బిడ్డది పేదల పక్షం. జగన్కు ఓటేస్తే ఇప్పుడు జరిగే ప్రతి మంచీ కొనసాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. పేదలంతా మోసపోతారు’ అని సీఎం జగన్ ప్రజలను హెచ్చరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రముఖిగా మారతారని ఆరోపించారు. బాబుది బోగస్ రిపోర్టు అని, తమది ప్రోగ్రెస్ రిపోర్టు అంటూ వైకాపా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ఏకరువు పెట్టారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ‘జాబు కావాలంటే బాబు రావాలని భ్రమ కల్పిస్తారు. 2014లోనూ ఇలాగే చెప్పారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. నేను సీఎం అయ్యాక సచివాలయాలు తీసుకొచ్చి, 1.35 లక్షల ఉద్యోగాలిచ్చాను. మరి జాబ్ రావాలంటే ఎవరు కావాలి? ఫ్యాన్ కావాలా? తుప్పుపట్టిన సైకిల్ కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. తెదేపా నినాదమైన జాబు కావాలంటే బాబు రావాలనే నినాదాన్ని అనుకరిస్తూ ‘జాబు కావాలంటే.. జగన్ రావాలి’ అని వారిచేత చెప్పించి ఆనందించారు.
వాలంటీర్లపై మోసపూరిత మాటలు
వాలంటీర్లకు తాను ఏం చేస్తారో మాటమాత్రంగానైనా ప్రస్తావించని జగన్.. అదే వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తానన్న చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘వాలంటీర్లపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రూ.10 వేలు ఇస్తానంటున్నారు. అంటే నా పాలనను పరోక్షంగా మెచ్చుకున్నట్లే. ఎన్డీయే కూటమి నేతలు వాలంటీర్ వ్యవస్థపై భయంకరమైన ద్వేషం వెళ్లగక్కారు. ఇప్పుడు మోసపూరిత మాటలు చెబుతున్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తారు. వారినే వాలంటీర్లను చేసి, దోచుకొమ్మని చెబుతారు. అదనంగా వారికే రూ.పది వేలు ఇస్తార’ని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలనతో తన పాలనను పోల్చుతూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, ఆయన మనుషులు 30 ఏళ్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వివిధ వర్గాలకు తాను అమలుచేసిన సంక్షేమ పథకాలను వల్లె వేస్తూ, చంద్రబాబు ఏమి చేయలేదని వివరిస్తూ ప్రజలు ఆమోదం తెలపాలని కోరారు. సభలో ముందున్న వారినుంచి మాత్రమే స్పందన రాగా, పలుమార్లు ‘ఇలా ఇలా..’ అని చేయి చూపిస్తూ చేతులు ఊపాలని కోరారు.
ప్రసంగంలో పల్నాడు ప్రస్తావనేది?
ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లాకు వచ్చిన సీఎం జగన్.. ఈ ప్రాంతానికి ఏం చేస్తారో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు. జిల్లాకు ఏమైనా హామీలు ఇస్తారేమోనని ఆశించి వచ్చిన ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి ప్రసంగించిన 3 నిమిషాల సమయంలోనే ఆపాలంటూ ఓసారి అనిల్కుమార్యాదవ్, మరోసారి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పంపించారు. ‘ఇక ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు’ అని మహేశ్రెడ్డి చెబుతుండగానే అతని నుంచి మైక్ లాక్కొన్నారు. ఉదయం శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి మొదలైన బస్సుయాత్ర సంతమాగులూరు అడ్డరోడ్డు, రొంపిచర్ల, నకరికల్లు మీదుగా దేవరంపాడు చేరుకుని మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్నారు. దారిలో పెద్దగా జనం లేకపోయినా యాత్ర నెమ్మదిగా సాగింది. మధ్యాహ్నం బస స్థలి నుంచి కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభ ముగిశాక కొండమోడు, అనుపాలెం, రాజుపాలెం మీదుగా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు.
డబ్బులిచ్చినా, మద్యం పంచినా.. ఖాళీగా బస్సులు
పిడుగురాళ్ల ‘మేమంతా సిద్ధం’ సభకు పల్నాడు జిల్లావ్యాప్తంగా జనాన్ని తరలించేందుకు 1,100 బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ.. చాలా గ్రామాల నుంచి ఖాళీగా వచ్చాయి. నాయకులకు జన సమీకరణపై లక్ష్యం నిర్దేశించగా, వారు మద్యం, నగదు పంచినప్పటికీ ప్రజలను కదిలించలేకపోయారు. కొన్ని పల్లెల్లో కూలీ సొమ్ము ఇస్తామని చెప్పడంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా బస్సులెక్కించారు. ఒక్కో బస్సుకు నియోజకవర్గ స్థాయి నేతలు మద్యం క్వార్టర్లు ఉన్న బాక్సు ఒకటి, భోజనానికి రూ.5 వేల నగదు సమకూర్చారు. మండల, గ్రామస్థాయి నేతలు వీటికి అదనంగా ఖర్చు పెట్టుకున్నారు. బస్సుల్లో, సభా ప్రాంగణంలో కార్యకర్తలు మద్యం తాగుతూ కన్పించారు. సభికులతో పలుమార్లు జెండాలు ఊపిస్తూ సభలో ఖాళీ కన్పించకుండా జాగ్రత్తపడ్డారు. సభా ప్రాంగణంలో ఉచితంగా టాటూలు వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి