కల్పతరువును కాలదన్నారు..!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జగన్ ఐటీ నూతన విధానాన్ని గొప్పగా ఆవిష్కరించారు. దాన్ని చూసిన యువకులు, వారి తల్లిదండ్రులు.. ఐటీ రంగంలో తక్కువ సమయంలోనే ఇతర రాష్ట్రాలకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతామని సంబరపడిపోయారు.
జగన్ ఐటీ పాలసీ తుస్
నైరాశ్యంలో ఆంధ్రా యువత
కాన్సెప్ట్ సిటీలు, రీసెర్చ్ వర్సిటీ, ఇంక్యుబేషన్ సెంటర్ల ఊసే లేదు
దేశ ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.2 శాతమే
అదే సమయంలో తెలంగాణ నుంచి రూ.2 లక్షల కోట్ల ఎగుమతులు
తెలంగాణలో..
ఐటీ కంపెనీలకు హైదరాబాద్లో ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. నిపుణుల లభ్యత, మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ అధికం. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో మా గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్(జీడీసీ) ఏర్పాటు చేస్తున్నాం.’’
హైదరాబాద్లో ఇలాంటి ప్రకటనలు చేసే కంపెనీలు కనీసం నెలకు రెండు, మూడు అయినా ఉంటాయి. ఆయా కంపెనీలు తమ జీడీసీలను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పెద్దఎత్తున విస్తరిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో..
ఇలా కేంద్రాలను స్థాపించే ఐటీ సంస్థలు మచ్చుకైనా కనిపించటం లేదు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై నగరాలు దేశంలోని టాప్-5 ఐటీ నగరాలుగా వెలుగొందుతున్నాయి. ఆకర్షణీయ ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించి ఈ మూడు నగరాల్లోని ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించొచ్చు. ప్రభుత్వం చొరవ చూపి వాటిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. తన ఐదేళ్ల పాలనలో జగన్ ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాలే లేవు. ఇక ఐటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్కు ఎలా వస్తాయి? నిరుద్యోగులకు ఉపాధి ఎలా లభిస్తుంది? రాష్ట్రం ప్రగతిపథంలో ఎలా పరుగులు తీస్తుంది?
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జగన్ ఐటీ నూతన విధానాన్ని గొప్పగా ఆవిష్కరించారు. దాన్ని చూసిన యువకులు, వారి తల్లిదండ్రులు.. ఐటీ రంగంలో తక్కువ సమయంలోనే ఇతర రాష్ట్రాలకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతామని సంబరపడిపోయారు. కానీ వాస్తవంగా జరిగింది మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. సీఎం జగన్ ప్రభుత్వం 2021 జూన్లో ఆవిష్కరించిన ‘ఏపీ ఐటీ పాలసీ 2021-24’ యువతలో భారీ ఆశలు కల్పించింది. ఈ పాలసీ గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిపోయింది. దాన్ని ఆవిష్కరించిన సమయంలో చెప్పిన వాటిలో ఒక్క అంశాన్ని కూడా ఆచరణలో చూపలేకపోయింది వైకాపా సర్కారు. ఈ పాలసీని పూర్తిగా విస్మరించి నిరుద్యోగ యువతను నయవంచనకు గురిచేసింది.
మూతబడే దాకా శాంతించలేదు..
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐటీ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కు సముచిత స్థానం కల్పించాలనే తపనతో అప్పట్లో ఎంతో మంది ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కొన్ని ఐటీ కేంద్రాలు, బ్యాక్ ఆఫీస్లు నెలకొల్పారు. కేవలం విజయవాడ పరిసరాల్లోనే ఇలాంటివి 100కు పైగా కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వివిధ భిన్న వ్యాపార రంగాలకు సంబంధించి డేటాను ప్రాసెస్ చేసే ‘బ్యాక్ ఆఫీస్’లను కూడా ఎక్కువ సంఖ్యలోనే ప్రారంభించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే జీతభత్యాలు తక్కువే అయినా.. ఖర్చులు తక్కువగా ఉండటం, సొంత ఊరికి దగ్గరగా ఉంటూ పని చేసుకోవచ్చనే భావనతో యువత ఈ కేంద్రాల్లో ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపారు. క్రమేణా రాష్ట్రంలో ఐటీ రంగం వేగం పుంజుకుంటుందని యువకులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు సంబరపడుతున్న తరుణంలోనే 2019 ఎన్నికలు వచ్చాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు.. కొత్త ఐటీ సంస్థల ఏర్పాటు, అప్పటికే కొనసాగుతున్న ఐటీ కంపెనీల గురించి పట్టించుకోకపోవడంతో వారి ఆశలపై నీళ్లు కుమ్మరించినట్లయింది. యువతకు మెరుగైన ఉద్యోగాలు కల్పిస్తామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్.. కొత్త కంపెనీలను ఆకర్షించి ఐటీ రంగం విస్తరణకు దోహదపడకపోగా అప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సంస్థలు మూతబడే దాకా శాంతించలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటయ్యాయన్న ఒకేఒక్క కారణంతో.. జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఐటీ రంగం కుదేలై ఉనికి కోల్పోయే ప్రమాదమేర్పడింది.
ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.2 శాతమే..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గతేడాది ఏప్రిల్లో రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.926 కోట్లు అని, మనదేశం నమోదు చేస్తున్న ఐటీ ఎగుమతుల్లో ఇది 0.14 శాతం మాత్రమేనని వెల్లడించారు. అంతేగాకుండా అయిదేళ్లలో మనదేశం నమోదు చేస్తున్న ఐటీ ఎగుమతుల్లో ఏపీ ఎగుమతులు 0.2 శాతం కంటే తక్కువేనని స్పష్టం చేశారు. కర్ణాటక నుంచి రూ.3 లక్షల కోట్లకు పైగా, తెలంగాణ నుంచి సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు నమోదవడం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఐటీ రంగం లేనట్లేననే భావన కలగకమానదు.
ఐటీతో ఏపీకి ఎంతో మేలు..
గత రెండున్నర దశాబ్దాల కాలంలో మనదేశంలో ఐటీ రంగం బహుముఖంగా విస్తరించింది. ఈ రంగం దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 50 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుండగా.. పరోక్షంగా దీనికి నాలుగు రెట్లు అధికంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఒక కుటుంబంలో ఒకరికి ఐటీ ఉద్యోగం వస్తే.. ఆ కుటుంబం మొత్తం ఆర్థిక స్థిరత్వం సాధించే వీలుకలుగుతుంది. ఐటీ రంగాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి ఏపీ రాష్ట్రానికి ఎంతో అవకాశముంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి కూడా ఈ రంగం కల్పతరువు లాంటిది. పైగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా అధిక ఆదాయం వస్తుంది.
‘కాన్సెప్ట్ సిటీ’లు కానరావేమీ..?
‘ఏపీ ఐటీ పాలసీ 2021-24’ హామీల్లో.. ‘కాన్సెప్ట్ సిటీ అభివృద్ధి’ ఒకటి. అన్ని రకాలైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీలు నెలకొల్పి వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మానవ వనరుల లభ్యతకు, నివాస ప్రాంతాల ప్రగతికి చర్యలు తీసుకుంటామని అందులో వివరించారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. మూడు ప్రాంతాల్లో కాదు కదా.. కనీసం ఒక్క చోట అయినా ఐటీ కాన్సెప్ట్ సిటీని ప్రారంభించలేకపోయింది జగన్ ప్రభుత్వం.
విశ్వవిద్యాలయం రాలేదు
‘ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ’ ఏర్పాటు కూడా ఈ విధానంలో పేర్కొన్న మరో ముఖ్యాంశం. విశాఖపట్నంలో ఈ వర్సిటీని ఆవిష్కరిస్తామని గొప్పగా చెప్పుకొంది. అత్యాధునిక ఐటీ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేసేందుకు అవసరమైన మానవ వనరులను ఈ యూనివర్సిటీ అందిస్తుందని, యువతను ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించటం దీని లక్ష్యమని వివరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీని విషయాన్నే మరిచిపోయింది.
టెక్నాలజీ పార్కు..?
ఇంక్యుబేషన్ కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ల్యాబ్స్, కో-వర్కింగ్ స్పేసెస్, డిజిటల్ లైబ్రెరీ తదితర ఐటీ సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కును సైతం ఆవిష్కరిస్తామని ఐటీ పాలసీలో పేర్కొన్నారు. అతీగతీ లేని ఐటీ హామీల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోయింది.
ఫండ్ ఆఫ్ ఫండ్స్..?
అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి యాక్సెలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ఏఎస్ఏపీ) పథకానికి రూపకల్పన, రూ.100 కోట్లతో ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ ఏర్పాటు, వర్సిటీలు, కాలేజీల భాగస్వామ్యంతో ‘హ్యాకథాన్స్’ నిర్వహణ, ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలు... తదితర అంశాలను ఐటీ పాలసీలో పొందుపరిచారు. ఇందులో ఒక్క అంశాన్ని కూడా అమలుచేయలేక ఘోరంగా చతికిలబడ్డారు జగన్.- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్