తిరుపతిలో దొంగ ఓట్ల దందా
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల దందాకు తెరలేపిన అధికార వైకాపా... ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే తరహా వ్యవస్థీకృత నేరానికి పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జాబితా పరిశీలిస్తే బయటపడుతున్న నకిలీ, డబ్లింగ్ ఓట్లు
ఈనాడు-అమరావతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల దందాకు తెరలేపిన అధికార వైకాపా... ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే తరహా వ్యవస్థీకృత నేరానికి పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే నకిలీ, డబ్లింగ్ ఓట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒకే వ్యక్తి పేరు, తండ్రి పేరు, ఒకే ఇంటి నంబర్తో వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో రెండేసి ఓట్లున్నాయి. ఓటరు పేరు, తండ్రి పేరును ఆంగ్ల అక్షరాల్లో కొద్దిగా మార్చేసి రెండేసి చోట్ల ఓటర్లుగా చేర్పించారు. నియోజకవర్గంలో ఇలాంటి ఓట్లు 38,493 ఉన్నట్లు ప్రతిపక్షాలు గుర్తించాయి. ఈ మేరకు జనసేన, భాజపా నాయకులు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా (సీఈవో)కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో తీవ్రస్థాయి ఎన్నికల అక్రమాలకు తిరుపతిని కేంద్ర బిందువుగా మార్చారు. లోక్సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఇలా ప్రతి సందర్భంలోనూ పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ నాటికి ఈ ఓట్లు జాబితాలో లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని విపక్షాలు చెబుతున్నాయి.
ఒకే పేరు.. ఒకే ఇంటి చిరునామా.. కానీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు
- ఎస్.పవన్కుమార్ అనే పేరుతో 19వ నంబర్ పోలింగ్ కేంద్రంలో(రామచంద్ర గుంట కట్ట) సీరియల్ నంబర్ 329తో ఒక చోట, 139వ నంబర్ పోలింగ్ కేంద్రంలో(ఎయిర్ బైపాస్ రోడ్డు) సీరియల్ నంబర్ 329తో మరో చోట ఓటు ఉంది. ఈ రెండు చోట్ల తండ్రి పేరు ఎస్.జయకుమార్ అనే ఉంది. ఇంటి నంబర్ కూడా 19-42-ఎస్8-451గా ఉంది. ఒకే ఇంటి నంబర్ రెండు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండటం ఎలా సాధ్యమవుతుంది?
- ఎన్.నాగరాణి పేరుతో 177వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 741తో, 180వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 913తో ఓట్లున్నాయి. ఈ రెండు చోట్ల భర్త పేరు, ఇంటి నంబర్ ఒకటే ఉంది.
- సుబ్రహ్మణ్యం సందీప్ అనే పేరుతో 246, 247 నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓట్లున్నాయి. అయితే రెండు చోట్ల తండ్రి పేరు, ఇంటి నంబర్ ఒకటే ఉంది. సుబ్రమణ్యం రెడ్డి పేరుతో 133, 134 నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నాయి. ఈ ఓట్లకు కూడా ఇంటి నంబర్ ఒకటే ఉంది.
అక్షరాల మధ్య స్పేస్ ఇచ్చి.. బురిడీ కొట్టించి
- ఏ.బాలచంద్రన్ అనే పేరుతో 41వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 148తో, 43వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 153తో ఓట్లున్నాయి. ఈ రెండు చోట్ల తండ్రి పేరు, ఇంటి నంబర్ ఒకటే ఉంది. ఒక చోట ‘‘బాలచంద్రన్ ఏ’’ అని ఉండగా.. మరో చోట ‘‘బాల చంద్రన్ ఏ’’ అని పొందుపరిచారు. బాల, చంద్రన్ మధ్యలో కొంత స్పేస్ ఇచ్చి డబుల్ ఎంట్రీ ఓట్ల బండారం బయటపడకుండా చేశారు.
క్యాపిటల్ లెటర్స్.. స్మాల్ లెటర్స్తో మాయ చేసి
- ఆర్.మోహన్సాయి అనే పేరుతో 57వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 13తో, 55వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 994తో ఓట్లున్నాయి. ఒక చోట ఆంగ్లంలో క్యాపిటల్ లెటర్స్తో పేరు ఉండగా.. మరో చోట స్మాల్ లెటర్స్తో పేరు పెట్టారు. ఈ రెండు చోట్ల ఇంటి నంబర్ ఒకటే ఉంది. అయితే అది ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఇంటి నంబర్ చివర్లో ఆంగ్ల అక్షరం ‘‘బీ’’ని ఒక చోట క్యాపిటల్ లెటర్స్లో, మరో చోట స్మాల్ లెటర్స్లో పెట్టారు.
- జి.దేవ పేరుతో 133వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 1,502తో, 134వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 1,264తో ఓట్లున్నాయి. ఆంగ్లంలో క్యాపిటల్ లెటర్స్తో ‘‘దేవగ్’’ అని ఒక చోట... స్మాల్ లెటర్స్తో ‘‘దేవ జి’’ అని మరో చోట పేరు చేర్చారు.
ఒక చోట తండ్రిగా పేరు.. మరో చోట భర్తగా పేరు
- 124వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 272లో ఒక చోట, 122వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 710లో మరోచోట సి.అనురాధ పేరుతో రెండు వేర్వేరు ఓట్లున్నాయి. సి.చిరంజీవి అనే పేరును ఒక చోట తండ్రిగా, మరో చోట భర్తగా పేర్కొన్నారు.
- 132, 223వ నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో లలిత అగరం పేరుతో రెండు ఓట్లున్నాయి. సాయికుమార్ అగరం పేరును ఆమెకు ఒక చోట తండ్రిగా, మరో చోట భర్తగా చూపించారు.
- నీ 244, 245వ నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో సీరియల్ నంబర్ 716, 737ల్లో ఎన్.అమృత పేరుతో రెండు ఓట్లున్నాయి. ఎన్.హరిబాబును ఆమెకు ఒక చోట భర్తగా, మరొక చోట తల్లిగా చూపించారు.
అసలు కుతంత్రమిదేనా?
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో అధికార వైకాపా నాయకులు.. ఈఆర్వో లాగిన్, పాస్వర్డ్ను తీసుకుని ఆబ్సెంటీ ఓటర్లకు సంబంధించిన 32 వేలకు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటిపై ఫొటోలు మార్చేసి వేల సంఖ్యలో దొంగ ఓట్లు వేయించారు. దీనికోసం ఇతర ప్రాంతాలకు చెందిన వేల మందిని బస్సుల్లో తిరుపతికి తరలించారు. దొంగ ఓట్లేయడానికి వరుసలో నిలబడిన వారిని ప్రతిపక్ష పార్టీల నాయకులు మీ పేరేంటి? తండ్రి పేరేంటి? చిరునామా ఏంటి అని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు. గట్టిగా నిలదీసేసరికి అక్కడి నుంచి పరారయ్యారు. ఇప్పుడు కూడా అదే తరహాలో దొంగ ఓట్లు వేయించే పన్నాగంలో భాగంగానే.. భారీగా దొంగ ఓటర్లను చేర్పించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగం
మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. -
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు నమోదుకు షెడ్యూల్ ఖరారు
తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి