నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రకటించింది.

Updated : 12 Apr 2024 06:59 IST

ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల
పరీక్షలు రాసిన 9.99లక్షల మంది విద్యార్థులు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రకటించింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ విద్యా కార్యాలయంలో ఉదయం 11గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా.. ఈనెల 4నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 5,17,617, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు.ఫలితాలను www.eenadu.netwww.eenadupratibha.net, https://resultsbie.ap.gov.in లోనూ పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని