శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated : 12 Apr 2024 06:42 IST

తిరుమల, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితోపాటు జిల్లా ప్రొటోకాల్‌ న్యాయమూర్తి ఎం.గురునాథ్‌, ప్రొటోకాల్‌ మున్సిఫ్‌ న్యాయమూర్తి పి.కోటేశ్వరరావు, పీఆర్వో ధనంజయ నాయుడు ఉన్నారు.


కాలినడకన తిరుమలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ గురువారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మార్గంలో తిరుమలకు చేరుకున్న న్యాయమూర్తికి స్థానిక న్యాయమూర్తి కోటేశ్వరరావు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అనంతరం న్యాయమూర్తి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకోనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని