‘పూట గడవడమే కష్టంగా ఉంది.. జీతాలు ఎప్పుడొస్తాయమ్మా?’
‘ఏమమ్మా.. మనకు జీతాలు ఎప్పుడొస్తాయి? పూట గడవడమే కష్టంగా ఉంది. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేవు. సమ్మె కాలానికి జీతమే ఇవ్వలేదు.
సంఘ నాయకురాలితో అంగన్వాడీ కార్యకర్త ఆవేదన
వైరల్ అయిన ఆడియో కాల్
అనంతపురం (శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: ‘ఏమమ్మా.. మనకు జీతాలు ఎప్పుడొస్తాయి? పూట గడవడమే కష్టంగా ఉంది. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేవు. సమ్మె కాలానికి జీతమే ఇవ్వలేదు. మార్చి నెలదీ రాలేదు. నా జీతమే మా కుటుంబానికి ఆధారం. చాలా కష్టాలు పడుతున్నాం’. ఇదీ ఓ అంగన్వాడీ కార్యకర్త ఫోన్ కాల్లో విలపించిన తీరు. అనంతపురం జిల్లా శింగనమల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి బుక్కరాయసముద్రానికి చెందిన కార్యకర్త.. అంగన్వాడీల సంఘం నాయకురాలితో ఫోన్లో మాట్లాడిన సంభాషణ అంగన్వాడీల వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. ఆ ఫోన్కాల్లో ఆమె తన బాధను చెప్పుకొన్న తీరు వినేవారికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. వైకాపా ప్రభుత్వ నిరంకుశ చర్యలకు అద్దం పడుతోంది. అంగన్వాడీ సిబ్బంది ఇటీవల 42 రోజుల పాటు సమ్మె చేసినా కనికరించని ప్రభుత్వం.. ఉద్యమాన్ని నీరుగార్చడానికి అనేక హామీలిచ్చి, చివరకు మాటతప్పింది. నెలవారీ వేతనమూ ఇవ్వకుండా సతాయిస్తోంది.
ఈ ఫోన్ కాల్లో ఆ కార్యకర్త అవే విషయాలు చెబుతూ ‘జీతాలు ఎప్పుడొస్తాయో పైవారిని అడిగి కనుక్కోండమ్మా. ఇంటి బాడుగ, కరెంటు బిల్లు కట్టలేదు. సమ్మె జీతాలు ఇస్తున్నట్లు మార్చి 12న జీవో వచ్చింది. ఇదిగో అదిగో అంటూ నాన్చుతున్నారు. ఇప్పటికే నెల దాటింది. జీతమే కాదమ్మా, టీఏ, డీఏలు, ఈవెంట్లు, కూరగాయల డబ్బులు, గ్యాస్ బిల్లు.. ఏదీ పడలేదు. అన్నీ మా చేతి నుంచే పెట్టుకున్నాం. ఇంట్లోనే మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది. ఇక కేంద్రానికి ఖర్చు పెట్టాలంటే ఎట్లాగమ్మా? మీకు మొక్కుతానమ్మా. మన బాధను పైకి చెప్పండమ్మా’ అంటూ గద్గదస్వరంతో వాపోయారు. ఈ ఆవేదన ఆమె ఒక్కరిదే కాదని, రాష్ట్రంలోని వేల మందిదీ అదే పరిస్థితని అంగన్వాడీ సిబ్బంది చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో భారీ వర్షంతో పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు