మంగళగిరి ఐటీపై జగన్ వేటు
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామం. హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతం సింగపూర్ను తలపించేలా తయారైంది.
వైకాపా ప్రభుత్వ నిర్ణయాలతో తరలిపోయిన కంపెనీలు
ఉద్యోగాలు కోల్పోయిన యువత
ఉపాధి కోసం వేల మంది వలస
నిరుపయోగంగా బహుళ అంతస్తుల భవనాలు
ఈనాడు, అమరావతి: హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామం. హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతం సింగపూర్ను తలపించేలా తయారైంది. ఐటీ కంపెనీల ఏర్పాటుతోనే ఇదంతా సాధ్యమైంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరిలోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు తెదేపా ప్రభుత్వం కృషి చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మంగళగిరి కూడా మరో మాదాపూర్లా మారేది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ అవకాశాన్ని కాలదన్నారు. అయిదేళ్లలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న వాటినీ వెళ్లగొట్టారు. వేల మంది ఉద్యోగులను వలస వెళ్లేలా చేశారు.
జగన్ ప్రభుత్వ నిర్ణయాలు ఐటీ కంపెనీలకు శాపంగా మారాయి. రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిపేసి, ప్రతికూల నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీలు వెళ్లిపోయాయి. దీంతో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ప్రాంతంపై కక్ష గట్టి విధ్వంసం చేసిన జగన్ ఏముఖం పెట్టుకుని ఓటు వేయాలని అడగడానికి వస్తున్నారని గుంటూరు జిల్లా వాసులు నిలదీస్తున్నారు.
గత ప్రభుత్వ ప్రోత్సాహంతో..
రాష్ట్ర విభజన తర్వాత ఐటీ రంగం అభివృద్ధిని సవాల్గా తీసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు రాజధాని అమరావతితో పాటు పరిసర ప్రాంతాలైన మంగళగిరి, తాడేపల్లిలో ఐటీకి పునాదులు వేశారు. ఏపీఎన్ఆర్టీ వంటి సంస్థల సహకారంతో కంపెనీల ఏర్పాటుకు కృషి చేశారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించారు. పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలతో పదేపదే సంప్రదింపులు జరిపారు. రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడంతోపాటు డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ, గ్లోబల్ ఇన్హౌస్ సెంటర్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్ పాలసీ అమలు చేశారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి ఐటీ పరిశ్రమలకు బాటలు వేశారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక వీటన్నింటికీ మంగళం పాడడంతో ఐటీ రంగం కుదేలైంది.
అనుకూల వాతావరణంతోనే..
కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఐటీ రంగానికి అనువైన పరిస్థితులు ఉండడంతో పెద్దఎత్తున బహుళ అంతస్తుల భవనాలు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతి ఏర్పాటుతో మంగళగిరి పరిసరాల్లో ఐటీ పరిశ్రమకు ఊతం ఏర్పడింది. గన్నవరం విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి పరిసరాలకు తక్కువ సమయంలో చేరుకునే అవకాశం, రాజధాని ప్రాంతానికి సమీపంలోనే ఉండడం, ఇటు విజయవాడ, అటు గుంటూరు నగరాల మధ్య ఉండడంతో పలు కంపెనీలు ఇక్కడ శాఖల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని ఆటోనగర్లో ఐటీ టెక్ పార్కు భవనం అందుబాటులోకి రావడంతో అక్కడ 8 కంపెనీలు కొలువుదీరి వందల మందికి ఉద్యోగాలు కల్పించాయి. పరిసరాల్లో మరో 26 కంపెనీలు రావడంతో ఈ ప్రాంతం ఐటీ జోన్గా అభివృద్ధికి అడుగులు పడ్డాయి. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక ఐటీ రంగాన్ని ప్రోత్సహించకపోవడం, వేధింపుల వల్ల కొత్త కంపెనీలు రాకపోగా ఉన్నవి ఒక్కొక్కటిగా తరలిపోయాయి. ప్రస్తుతం వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కంపెనీలు వెళ్లిపోవడం వల్ల వేల మంది యువత ఉపాధి కోల్పోయి వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
నిరర్థకంగా బహుళ అంతస్తుల భవనాలు
ఐటీ కంపెనీలు పెద్దఎత్తున మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటవుతాయని అంచనా వేసిన స్థిరాస్తి వ్యాపారులు జాతీయ రహదారికి రెండు వైపులా ఐటీ కార్యాలయాలతో పాటు ఉద్యోగుల నివాస అవసరాలను దృష్టిలో ఉంచుకుని బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. స్థిరాస్తి వ్యాపారంలో పేరుపొందిన పలు సంస్థలు ఇక్కడ భూములు కొనుగోలు చేసి టౌన్షిప్ల నిర్మాణాన్ని చేపట్టాయి. ఈ ప్రాంతం హైదరాబాద్లోని మాదాపూర్లా అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు.అయితే వైకాపా వచ్చిన తర్వాత ఐటీతో పాటు ఇతర రంగాలు కుదేలు కావడంతో భవన నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. అప్పటికే నిర్మాణాలు పూర్తయి ప్రారంభించిన భవనాల్లో కార్యాలయాల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. నివాసాల కోసం నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలకు డిమాండ్ లేక నిరుపయోగంగా ఉన్నాయి. అన్ని వసతులతో నిర్మాణాలు పూర్తయిన భారీ భవంతుల్లోకి సైతం ఎవరూ రాకపోవడంతో అవన్నీ నిరర్థకంగా మారాయి. స్థిరాస్తి వ్యాపారం ఒక్కసారిగా పతనం కావడంతో పెట్టుబడులు పెట్టినవారు తీవ్రంగా నష్టపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?