వలస పక్షులు తగ్గి.. వైకాపా భక్షకులు పెరిగి..!
సుప్రీంకోర్టు చెప్పినా ఖాతరు చేయలేదు.. అంతర్జాతీయ ప్రాముఖ్యమన్నా పట్టింపులేదు.. అటవీశాఖ అధికారులున్నా అసలు భయమన్నదే లేదు..ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరులో.. వేల ఎకరాలను దర్జాగా కబ్జా చేశారు.
ఐదేళ్లలో కొల్లేరు కొంప ముంచారు
ముగ్గురు అధికారపార్టీ ఎమ్మెల్యేల కబ్జాకాండ
జగన్ వచ్చాక సరస్సులో వేల ఎకరాల ఆక్రమణ
చేష్టలుడిగిన అటవీ, వన్యప్రాణి విభాగాలు
ఎన్నికల వేళ మరింత జోరుగా తవ్వకాలు
ఈనాడు, అమరావతి
సుప్రీంకోర్టు చెప్పినా ఖాతరు చేయలేదు..
అంతర్జాతీయ ప్రాముఖ్యమన్నా పట్టింపులేదు..
అటవీశాఖ అధికారులున్నా అసలు భయమన్నదే లేదు..
ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరులో.. వేల ఎకరాలను దర్జాగా కబ్జా చేశారు..
రొయ్యల చెరువులతో కాలుష్య కాసారంగా మార్చేశారు..
ఆ కబ్జాకోరులూ, అక్రమార్కులూ మరెవరో కాదు..
అధికార పార్టీకి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులు..
ఎన్నికల వేళ ఆక్రమణల్ని మరింత పెంచారు.
ఇంత జరుగుతున్నా.. ఏమీ ఎరగనట్టే మిన్నకుంది జగన్ ప్రభుత్వం!
రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొల్లేరు సరస్సును తమ సొంత సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. సొంత పట్టా భూముల్లో చెరువులు తవ్వుకున్నట్లు ఈ అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఉన్న సరస్సులోను యధేచ్ఛగా వందల ఎకరాల్లో చెరువులు తవ్వేశారు. ‘ఆలసించిన ఆశాభంగం’ అన్నట్లు, ఎన్నికల కోడ్ రాకముందే ప్రత్యేక ప్రణాళికతో పెద్ద ఎత్తున తవ్వకాలు సాగించారు. జగన్ ప్రభుత్వంలో ఇన్నాళ్ల ఆక్రమణలు ఒక ఎత్తు, ఎన్నికల ముందు సాగించిన అరాచకాలు, ఆక్రమణలు మరో ఎత్తు. వైకాపా పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. చెరువులను ఆక్రమించేశారు. వాగులూ, వంకల్ని తమ ఆస్తుల్లో కలిపేసుకున్నారు. నదీ తీరాల్ని నంజుకు తినేశారు. వారి కబ్జాల పర్వంలో కొల్లేరు సరస్సునీ చేర్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే కొల్లేరులో వేల ఎకరాలకు పైగా చెరువులు తవ్వేసి ప్రజాప్రతినిధులు పంచేసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, వారి అనుచరులది ఈ కబ్జాకాండలో క్రియాశీల పాత్ర. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికీ ఇందులో ప్రమేయం ఉంది. అక్కణ్నుంచే మౌఖికంగా అధికారులతో మాట్లాడించుకుని వారిని క్రియాశూన్యంగా మలిచేసి.. కొల్లేరులో వీరు ఆడింది ఆట- పాడింది పాటగా మార్చేశారు.
అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్నా...
కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 76,243 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1975లోనే ‘ప్లస్ 5’ కాంటూరు పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. 1995లోనే కొల్లేరు అభయారణ్యంపై నోటిఫికేషన్ వెలువడింది. 2005-2006 మధ్య చేపట్టిన ‘కొల్లేరు ఆపరేషన్’ తర్వాత సర్వే చేస్తే ప్లస్ 5 కాంటూరు పరిధిలో 83,982 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు తేల్చారు. అదంతా కొల్లేరు అభయారణ్యమే. ఆ తర్వాత కాలక్రమేణా కొల్లేరులో ఆక్వాకల్చర్ విస్తరించడం, పెద్ద ఎత్తున కబ్జాలు చోటు చేసుకోవడంతో పర్యావరణవేత్తలు పోరాటం సాగించారు. ఆక్రమణల అంశం సుప్రీంకోర్టుకు చేరగా.. 2006 మార్చి నెలలో సాధికార కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో కొల్లేరు కబ్జాలు తొలగించాలని ఆదేశించింది. 2006 జూన్ నాటికి కొల్లేరులో వేల ఎకరాల్లో ఉన్న చేపల చెరువులను, ఆక్రమణలను తొలగించి సరస్సును పునరుద్ధరించి దీని రక్షణ బాధ్యతలు అటవీశాఖకు అప్పగించింది రెవెన్యూశాఖ.
కొల్లేరు సాదాసీదా జలవనరు కాదు. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న చిత్తడి నేలల సరస్సు. 1975లో ఇరాన్లోని ‘రామ్సార్’ వేదికగా నిర్వహించిన చిత్తడి నేలల సంరక్షణ ఒప్పందంలో కొల్లేరునూ చేర్చారు. సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక దృష్టి సారించి కొల్లేరు ఆపరేషన్కు 2005లో ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రాంతంలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు, డి.ఫాం. భూముల్లోను చేపల చెరువులు తవ్వకూడదు. కొల్లేరు సరస్సును పునరుద్ధరించి 2006 నాటికి కేవలం 3.03 ఎకరాల్లోనే చెరువుల ఆక్రమణలు ఉన్నాయని ప్రభుత్వం తేల్చింది. ఆ భూమిని అటవీ సంరక్షణశాఖకు రెవెన్యూ అధికారులు అప్పగించేశారు. అక్కడ ఎలాంటి అక్రమ చెరువుల తవ్వకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారికి అప్పగించారు. అలాంటిది ప్రస్తుతం జగన్ సర్కారు పదవీకాలం పూర్తయ్యేసరికి కొల్లేరు ఏకంగా 20 వేల ఎకరాల మేర కబ్జా కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వ భూమిలోనే దాదాపు 16 వేల ఎకరాల్లో సరస్సును ఆక్రమించేసి చెరువులతో యథేచ్ఛగా చేపల సాగుచేస్తూ ఏటా రూ.వేల కోట్లు సంపాదించుకుంటున్నారు.
ఏమిటీ ఎమ్మెల్యేల పాత్ర?
కొల్లేరు సరస్సును ఆనుకుని చుట్టుపక్కల అయిదు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు కొల్లేరుపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలోను, ఒక ఎమ్మెల్యే పాక్షికంగా ఈ సరస్సు ఆక్రమణల్లో పాత్ర పోషిస్తున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్యే అనుచరులు కొల్లేరు ఆక్రమణల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైకాపా హయాంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు సొంతంగా చెరువులు తవ్వుకున్నారు. కొల్లేరులో కొత్త రహదారులు నిర్మించకూడదు, ఉన్న రహదారులు విస్తరించకూడదు, పొక్లయిన్లు తిప్పకూడదు, ఆక్వా సాగు చేయకూడదు.. ఈ నియమాలన్నింటినీ యథేచ్ఛగా ఉల్లంఘించారీ ఘనులు. కొల్లేరు సహజ ప్రవాహాలకు పెద్ద ఎత్తున ఇవి ఆటంకం కలిగిస్తున్నాయి. వర్షాల సమయంలో కొల్లేరును ముంపులో ముంచెత్తుతున్నాయి.
కొత్తగా చెరువులు తవ్వుకుని స్వయంగా ఆక్రమించుకోవడం ఒక ఎత్తయితే... ప్రైవేటు వ్యక్తులు తవ్వుకునేందుకు వీలు కల్పిస్తూ పెద్ద మొత్తంలో వసూలుచేసుకోవడం మరో ఎత్తు. ఎన్నికల ప్రచార ఖర్చులు ఆయా గ్రామాల్లో చెరువులు లీజుకు తీసుకున్న వారి నెత్తినే వేసి ఆ విధంగాను ఎమ్మెల్యేలు లబ్ధిపొందుతున్నారు. ఇక్కడ అటవీ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు నామమాత్రమయ్యారు. అంతే కాదు- స్థానికంగా ఎప్పట్నుంచో ఇక్కడే పని చేస్తున్న అటవీ అధికారులు ఈ ఆక్రమణల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారే స్వయంగా చెరువులు తవ్వుకునే వారిని ఎమ్మెల్యేల వద్దకు పంపుతున్నారు. వారి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత తవ్వకాలను చూడకుండా వదిలేస్తున్నారు. ఆనక విషయం బయటపడితే వచ్చే టాస్క్ఫోర్సు అధికారుల దాడులూ ఉత్తుత్తిగానే సాగుతున్నాయి. తమ మాట వినడం లేదని ఒక డీఎఫ్ఓను ఇక్కడి ప్రజాప్రతినిధులు బదిలీ చేయించారు.
అన్నీ అక్రమాలే!
నిజానికి ఆక్రమణదారుల చేతులు కట్టేసే అవకాశం జగన్ సర్కారుకు ఉంది. కొల్లేరు చుట్టూ ఉన్న చెక్పోస్టులను యంత్రాంగం సరిగా నిర్వహించి ఉంటే కొల్లేరు ఆక్రమణల చెరువుల్లో చేపల సాగు వీలయ్యేది కాదు. ఆ చెరువులను ధ్వంసం చేసే అవకాశమూ ఉండేది. అవేవీ చేయకపోవడంతో.. ఎలాంటి శషబిషలు లేకుండా సీడ్ రవాణా చేస్తున్నారు. రోజూ వేల టన్నుల ఫీడ్ కొల్లేరులోకి సరఫరా అవుతోంది. ఈ సరస్సును కాలుష్యంతో నింపేస్తున్నారు. ఏటా ఆ ఆక్రమిత చెరువులను పొక్లయిన్లతో బాగు చేసుకుంటున్నా అడిగేవారే లేరు. ప్లస్ 5 కాంటూరులోపు ఉన్న ప్రాంతాన్ని మట్టితో రెండేళ్లుగా ఎత్తు చేస్తూ అది అభయారణ్యం కాదంటూ చెప్పేందుకూ అధికారులు సాహసిస్తున్నారు. కొల్లేరులో డ్రెయిన్లను ఆక్రమిస్తున్నారు. జగన్ సర్కారు చేజేతులా ఆక్రమణలకు ఊతమిచ్చింది. కొత్త తవ్వకాలకు అనధికారికంగా అనుమతులూ ఇచ్చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి