మిస్టర్ 5%
రాష్ట్ర క్యాబినెట్లో ఓ కీలక మంత్రి... వ్యవహారం సత్తెకాలం సత్తెయ్యలా ఉంటుంది... చేతల్లో మాత్రం కలికాలం మహిమ కనిపిస్తుంది... అధికారులు ఆయనకు పెట్టుకున్న పేరు మిస్టర్ 5% ఎందుకంటే... ఎన్నికల ఫలితాలపై భయంతో అందినకాడికి దండుకోవాలని స్కెచ్ వేశారు.
ఎన్నికలు వస్తున్నాయని ఎడాపెడా దోపిడీ
ఉపాధ్యాయుల అక్రమ బదిలీల్లో రూ.50 కోట్ల దందా
పాత గుత్తేదారులకే విద్యా ‘కానుక’
టెండర్లు లేకుండానే చిక్కీల బాధ్యత అప్పగింత
పాఠ్యపుస్తకాల ముద్రణనూ వదలని కీలక మంత్రి
ఈనాడు, అమరావతి
రాష్ట్ర క్యాబినెట్లో ఓ కీలక మంత్రి...
వ్యవహారం సత్తెకాలం సత్తెయ్యలా ఉంటుంది...
చేతల్లో మాత్రం కలికాలం మహిమ కనిపిస్తుంది...
అధికారులు ఆయనకు పెట్టుకున్న పేరు మిస్టర్ 5%
ఎందుకంటే... ఎన్నికల ఫలితాలపై భయంతో అందినకాడికి దండుకోవాలని స్కెచ్ వేశారు...
పనులన్నీ టెండర్లు లేకుండానే అప్పగించేశారు...
దీనికాయన తీసుకున్న కమీషన్ 5%...
ఈ దందాలో రూ.కోట్లను పోగేశారు!
అన్నీ తెలిసిన సీఎం... తనలాంటి మనిషే కదా అనుకుని మిన్నకున్నట్లున్నారు!
జగనన్న మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి... దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత పదవిలో ఉంటామో.. ఊడతామోననే భయంతో రూ.కోట్ల విలువైన పనులను అక్రమార్జనకు ఊతంగా చేసుకున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పిల్లలకిచ్చే చిక్కీలు, విద్యాకానుక, పుస్తకాల ముద్రణ, ట్యాబ్ల సరఫరా ఇలా అన్నింట్లోనూ సొమ్ములు లాగేశారు. మంత్రి చెబితే చాలు... ముందూ వెనకా ఆలోచించకుండా ఉత్తర్వులు ఇవ్వడంలో ఓ ముఖ్య అధికారి ముందుంటారు. మంత్రికి ఈయన ‘ఏటీఎం’ లాంటివారని పిలుస్తారు.
ఏకంగా 2,600 పైరవీ బదిలీలు
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఉపాధ్యాయులకు ‘పైరవీ బదిలీలు’ నిర్వహించారు. కౌన్సెలింగ్ బదిలీలు ముగిశాక డిప్యుటేషన్లు, బదిలీలు చేయాలంటే గతంలో ఆయా దస్త్రాలను సీఎం కార్యాలయానికి పంపించేవారు. మంత్రి, ముఖ్య అధికారి ఈ నిబంధనకు చరమగీతం పాడారు. ముఖ్య అధికారి, మంత్రి పేషీలోని ఓ పీఏ... కలిసి 2,600 మంది ఉపాధ్యాయుల సిఫార్సు బదిలీలను ప్రతిపాదించారు. ఒక్కో బదిలీకి రూ.3-4 లక్షలు తీసుకుని... ఒక పద్ధతి ప్రకారం రూ.50 కోట్లకుపైగా దోచేశారనే ఆరోపణలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో సర్దుబాటు కాకపోవడంతో కొందరికి పోస్టింగులు లభించలేదు. ఈ బదిలీల్లో కోరుకున్న ప్రాంతాలు, హెచ్ఆర్ఏ ఆధారంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందు ఇంటర్ బోర్డులో 190 మందికి పదోన్నతులు కల్పించారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేశారని, ఈ తతంగమంతా మంత్రి ఇంటి కేంద్రంగా జరిగినట్లు ఆరోపణలున్నాయి.
బ్యాగుల్లో నాణ్యత లేకపోయినా ‘సర్దేశారు’
‘విద్యాకానుక’తోనే మంత్రి 5శాతం కమీషన్ విధానానికి తెర తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యాకానుక-3లో నాణ్యతలేని బ్యాగులు సరఫరా చేశారు. అయ్యగారికి అందాల్సినవి అందడంతో గుత్తేదార్లు, అధికారులపై చర్యల్లేకుండా అన్నీ సర్దుబాటు చేసేశారు. దాదాపు సంచులన్నీ రెండు నెలల్లోపే చినిగిపోయాయి. కానీ, ఆరు లక్షలే కొత్తవిచ్చి, మిగతా వాటిని గాలికి వదిలేశారు. విజిలెన్స్ తనిఖీల్లోనూ ఇది బయటపడినా, కీలక మంత్రి కావడంతో సీఎంఓ సైతం మౌనం వహించింది.
వీసీల నియామకాల రూటే వేరు
వర్సిటీలకు వీసీల నియామకాల్లోనూ ఈ మంత్రి చక్రం తిప్పారు. ఆయన సతీమణి పీహెచ్డీకి గైడ్లుగా వ్యవహరించిన ఇద్దరికి వీసీలుగా పోస్టింగ్ ఇప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాల్లో కీలక వ్యక్తి కావడంతో సీఎంవో సైతం ఆయన పైరవీలకు సరేనంది. దాంతో మరో ఇద్దరికి తన కోటాలోనే పోస్టులను ఇప్పించారు.
ప్రైవేటు వర్సిటీలకు అనుమతుల్లోనూ...
ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడంలోనూ ఈ మంత్రి భారీగానే పిండుకున్నారు. ఇటీవల మూడు ఇంజినీరింగ్ కళాశాలలకు వర్సిటీలుగా అనుమతిచ్చారు. ఇందులో ఓ కళాశాల యజమాని వర్సిటీ కోసం మంత్రికి భారీగా సమర్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పాఠ్య పుస్తకాల్లో ‘అవినీతి’ పుటలు
పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలతోపాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం మార్కెట్లో విక్రయించే వాటినీ వదల్లేదు. సీఎంఓలోని ఓ సలహాదారుతో కలిసి ముద్రణ సంస్థల నుంచి భారీగా పిండుకున్నారు. ప్రైవేటు బడుల కోసం మార్కెట్లో విక్రయించే పాఠ్యపుస్తకాల ముద్రణకు గతేడాది ప్రభుత్వం ఒక పేజీకి 44 పైసలుగా నిర్ణయించి, 16 సంస్థలకు ఈ పనులను టెండర్లు లేకుండానే ఇచ్చేసింది. అయితే, మూడు సంస్థలే బినామీ పేర్లతో ముద్రణ బాధ్యతలను రెండేళ్ల కాలానికి దక్కించుకున్నాయి. ఈ ప్రక్రియలో మంత్రి, సలహాదారు భారీగా లబ్ధి పొందారు. ఈ ఏడాది ఉచితంగా ఇచ్చే రూ.245 కోట్ల విలువైన పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్ టెండర్లలో మార్పు చేశారు. పేపర్తో సహా పుస్తకాలు ముద్రించేలా టెండరు పిలిచారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ సంస్థ ఎల్1గా నిలవగా... దీనికి 33% పని అప్పగించారు. మరో సంస్థకు ఆరో తరగతి పుస్తకాల ముద్రణ ఇచ్చారు. 1-7 తరగతుల ఉచిత పుస్తకాల ముద్రణను బయట మార్కెట్లో అమ్మే పుస్తకాలను ముద్రిస్తున్న సంస్థలకే అప్పగించేశారు. ఇలా ఉచిత, మార్కెట్లో అమ్మే పుస్తకాలను కొన్ని సంస్థలకే కట్టబెట్టారు. ఇందులో భారీగా డబ్బులు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
‘చిక్కీ’ల పేరిట మేత
మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు వారానికి 3రోజులు ఇచ్చే చిక్కీల సరఫరాలోనూ కావాల్సినంత మేశారు. 2022 డిసెంబరుతో గడువు ముగుస్తున్నా... టెండర్లు పిలవలేదు. రూ.156 కోట్ల విలువైన కొత్త టెండర్లు పిలవడానికి సమయం చాలదంటూ మొదట 2023 ఫిబ్రవరి వరకు, తర్వాత 2024 జనవరి వరకు గడువు పొడిగించారు. ఇప్పుడూ పాతవారికే మరోసారి పొడిగించేశారు. ఇతర పథకాలకు చిక్కీ కిలో రూ.135కే ఇస్తుండగా.. పాఠశాలలకు కిలో రూ.149కి ఇస్తుండటం గమనార్హం.
బిల్లులు చెల్లించి.. కావాల్సినంత వాటా
గతేడాది ఇచ్చిన విద్యా కానుక-4లోనూ 5% కమిషన్ విధానాన్ని కొనసాగించినట్లు విమర్శలున్నాయి. కమీషన్లు ఇవ్వాలంటే కనీసం సగానికిపైగా బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు కండిషన్ పెట్టినట్లు తెలిసింది. దీంతో ఇటీవల సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నుంచి రూ.500 కోట్లను విడుదల చేయించి... గుత్తేదార్లకు 50 శాతానికి పైగా బిల్లులు చెల్లించి, తన వాటాను సర్దుబాటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మంత్రికి సహకరించినందుకు ఎస్ఎస్ఏలోని ఇద్దరు కీలక అధికారులు భారీగా లబ్ధి పొందినట్లు ప్రచారం సాగుతోంది.
వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాకానుక-5 అందించేందుకు టెండర్లు పిలవాల్సి ఉండగా... దస్త్రాన్ని నాలుగు నెలలపాటు తొక్కిపెట్టారు. ఎన్నికల ముందు ఎలాంటి టెండర్లు లేకుండా పాత గుత్తేదారులకే రూ.772 కోట్ల పని కట్టబెట్టారు. పాత ధరలకే బ్యాగులు, బూట్లు, యూనిఫాంలు, రెండు జతల సాక్సులు, బెల్టుల సరఫరా బాధ్యతను అప్పగించేశారు. నిబంధనల ప్రకారం న్యాయసమీక్షకు పంపాల్సిన వీటిని జోన్ల వారీగా విభజించి, టెండరు విలువ తగ్గిపోయేలా చేశారు.
కోడిగుడ్ల రవాణాలో గుటకాయ స్వాహా
మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్ల కాంట్రాక్టు గడువు 2023 ఆగస్టుతో ముగియగా 2024 జులై వరకు పొడిగించేశారు. నెక్ ధరతోపాటు రవాణా ఛార్జీలు కలిపి చెల్లించేలా జిల్లాల వారీగా నిరుడు టెండర్లు నిర్వహించారు. సరాసరిన కిలోమీటరుకు 40-50 పైసల వరకు ఇస్తున్నారు. అదే పాత ధరతో మరో ఏడాది ఇచ్చారు. ఈ తతంగంలోనూ మంత్రివర్యులు లబ్ధి పొందారు.
రూ.750 కోట్ల ట్యాబ్ల టెండరులోనూ ‘పాత వాసన’
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ట్యాబ్ల టెండర్లను పాత గుత్తేదారుకు కట్టబెట్టేందుకు మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు. గతేడాది డిసెంబరులో ఇచ్చిన ట్యాబ్లకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు దస్త్రాన్ని పంపిస్తే రెండు నెలలు తొక్కిపెట్టారు. పాత గుత్తేదారుకే అప్పగించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల ముందు రూ.750 కోట్ల టెండర్ను పాతవారికి ఇవ్వకూడదని సీఎంఓలోని ఉన్నతాధికారి ఒకరు అభ్యంతరం తెలపగా కొత్తగా టెండర్లు పిలిచారు. అయినా... పాత గుత్తేదారుకే దాదాపు 3.50 లక్షల ట్యాబ్ల సరఫరా టెండర్ దక్కింది. సరఫరా చేసిన నెల రోజుల్లోనే బిల్లు ఇవ్వకపోతే బ్యాంకు నుంచి తీసుకునేలా గ్యారంటీ కూడా ఇప్పించారు.
పేషీ నిర్వహణ పేరిటా
మంత్రి పేషీ నిర్వహణ పేరిట సమగ్ర శిక్షా అభియాన్, ఉన్నత విద్యా మండలి, ఇంటర్ బోర్డుల నుంచి నిధులు లాగేస్తున్నారు. పేషీలో పనిచేసే ఓఎస్డీ ఒకరు మంత్రికి సమీప బంధువు. ఆయన పదవీ విరమణ చేశాక తన కార్యాలయంలో ఓఎస్డీగా నియమించుకున్నారు. ఈయన ఖర్చులకు ఉన్నత విద్యా మండలి నుంచే ప్రతి నెల రూ.మూడు లక్షలకుపైగా తీసుకుంటుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల