పిల్లల కోడిగుడ్డు లాగేసిన జగన్ మామ
జగనన్న గోరుముద్దకు ఏడాదికి రూ.1,824కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలు ఏం తింటున్నారని ఓ ముఖ్యమంత్రి ఆలోచించిన పరిస్థితి గతంలో లేదు. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న మంచి ఆలోచనతో గోరుముద్ద చేపట్టాం.
వారం రోజులుగా నిలిచిన సరఫరా
బడుల్లో ఉన్న వాటినే సర్దుబాటు చేస్తున్న ఉపాధ్యాయులు
గుడ్ల బకాయిలు రూ.163కోట్లు, చిక్కీలకు రూ.62కోట్లు పెండింగ్
గొప్పలు..
జగనన్న గోరుముద్దకు ఏడాదికి రూ.1,824కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలు ఏం తింటున్నారని ఓ ముఖ్యమంత్రి ఆలోచించిన పరిస్థితి గతంలో లేదు. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న మంచి ఆలోచనతో గోరుముద్ద చేపట్టాం.
సీఎం జగన్ తరచూ చెప్పే మాటలివి
వాస్తవం
పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం పేరును జగనన్న గోరుముద్దగా మార్చేసి.. మొదటిసారి కొత్తగా దీన్ని చేపట్టినట్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. పిల్లలు ఏం తింటున్నారో అని పదేపదే ఆలోచిస్తున్నానని చెప్పే సీఎం.. గత అక్టోబరు నుంచి కోడిగుడ్లు, చిక్కీలకు బిల్లులు నిలిపివేశారు. కానీ తన అనుచరవర్గానికి, కమీషన్లు వచ్చే బిల్లులను మాత్రం ఇటీవలే పెద్దఎత్తున చెల్లించేశారు. ఇది ఒక్కటి చాలు.. సీఎం జగన్కు మధ్యాహ్న భోజనంపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో చేప్పేందుకు. బకాయిలు పేరుకుపోవడంతో ఈ నెల ఒకటి నుంచి గుత్తేదార్లు బడులకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేశారు. మేనమామను అంటూ గొప్పలు చేప్పే జగన్ పిల్లల నోటికాడి గుడ్డును లాగేశారు.
ఈనాడు, అమరావతి: అబద్ధాన్ని ఎలాంటి జంకు లేకుండా చెప్పేయడంలో సీఎం జగన్ను మించిన వారు ఉండరేమో.! ప్రజలకు ఏమి తెలియదు.. ఏం చెప్పినా నమ్ముతారనుకుంటారో ఏమో.. అవాస్తవాలను అలవోకగా చెప్పేస్తారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. తెదేపా హయాంలోనే వారానికి ఐదు కోడిగుడ్లు ఇవ్వడం ప్రారంభించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ప్రచార యావతో పథకం పేరు జగనన్న గోరుముద్దగా మార్చి, దీన్ని ఏదో కొత్తగా చేపట్టినట్లు ప్రచారానికి తెరతీశారు. పిల్లలకు మేనమామగా ఉంటానంటూ గొప్పలు చెప్పే సీఎం జగన్ చిన్నారుల నోటికాడి కోడిగుడ్డు, చిక్కీలను లాగేశారు. చిన్నారులకు పోషకాహారం అందకుండా చేసిన ఆయనే గొప్పలు చెప్పుకోవడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,121 పాఠశాలల్లో సుమారు 34లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు, మూడు రోజులు చిక్కీలు ఇస్తున్నారు. వీటిని సరఫరా చేసే గుత్తేదార్లకు గతేడాది అక్టోబరు నుంచి బిల్లులు చెల్లించడం లేదు. ఈ బిల్లులను గ్రీన్ఛానల్లో చెల్లిస్తామని చెప్పిన జగన్ ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఆ తర్వాత తనకు కావాల్సిన గుత్తేదార్లకు ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించేసిన సీఎం జగన్.. కోడిగుడ్లు, చిక్కీలకు మాత్రం బిల్లులు విడుదల చేయలేదు. కోడిగుడ్లకు రూ.163.88కోట్లు, చిక్కీలకు రూ.62.93 కోట్ల బకాయిలున్నాయి. వీటిని చెల్లించాలని కొన్ని నెలలుగా గుత్తేదార్లు కోరుతున్నారు. బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించినా ప్రభుత్వంలో చలనం లేకుండాపోయింది.
వారం రోజులుగా సరఫరా లేదు..
కోడిగుడ్లు, చిక్కీల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గుత్తేదార్లు ఈనెల ఒకటో తేదీ నుంచి సరఫరా నిలిపివేశారు. వారానికోసారి కోడిగుడ్లను బడులకు సరఫరా చేస్తారు. ఈ వారం నిలిపివేశారు. పాఠశాలల్లో ఉన్న వాటినే ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తున్నారు. సోమవారం నాటికి దాదాపుగా అన్ని బడుల్లోనూ కోడిగుడ్ల నిల్వలు అయిపోతాయి. రాయలసీమలోని కొన్ని జిల్లాలకు అక్కడి గుత్తేదార్లు అందిస్తున్నారు. మొదట్లో ఎక్కువ ఇండెంట్ పెట్టిన బడుల్లోనే చిక్కీలు ఉన్నాయి. మిగతా వాటిల్లో రెండు, మూడు రోజుల్లో ఖాళీ కానున్నాయి.
- కొన్నిచోట్ల కోడిగుడ్లు తక్కువగా.. విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో..ఒకరికి ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని పంపిణీ నిలిపివేశారు.
- కొన్ని బడులకు రాగిపిండి సరఫరా కాలేదు. బియ్యంతోపాటు రాగిపిండి పంపించాల్సి ఉండగా రాలేదు. ఇలాంటి చోట విద్యార్థులకు రాగిజావ సరఫరా నిలిచిపోనుంది.
ప్రచారం రావడం లేదనా?
ప్రచారం కోసం మధ్యాహ్న భోజనం పథకాన్నీ జగన్ వదల లేదు. జగనన్న గోరుముద్ద పథకంగా పేరు మార్చేశారు. చిక్కీల కవర్లపై జగన్ బొమ్మలు వేసుకున్నారు. కోడిగుడ్లపైన స్టాంపింగ్ వేశారు. రాగిజావ అందించే స్టీల్ గ్లాసులపైనా పేరు రాయించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వీటన్నింటిపైనా అభ్యంతరాలు రావడంతో కోడిగుడ్లపై స్టాంపింగ్ నిలిపివేయించారు. చిక్కీల కవర్లను ముందుగానే చింపేసి విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇస్తున్నారు. ప్రచారానికి అడ్డుకట్ట పడటంతో..చివరికి పిల్లలకు వాటిని అందకుండా చేశారేమోననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం