15 వరకు కవితకు సీబీఐ కస్టడీ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు.
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముందుగానే చెల్లించి తర్వాత ఆ డబ్బు కోసం అరబిందో గ్రూప్నకు చెందిన శరత్చంద్రారెడ్డిపై ఒత్తిడి చేసినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దిల్లీ మద్యం కేసులో గురువారం తిహాడ్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు శుక్రవారం ఉదయం ఆమెను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి 5 రోజుల కస్టడీ కోరారు. ‘‘కవితను 2022 డిసెంబరు 11న హైదరాబాద్లో విచారించాం. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాల ఆధారంగా ఆమెను మరింత సమగ్రంగా విచారించాల్సి ఉంది. పలువురి వాంగ్మూలాల ప్రకారం ఈకేసులో ప్రధాన కుట్రదారుల్లో ఆమె కూడా ఒకరని తేలింది. న్యాయస్థానం ఇచ్చిన అనుమతి మేరకు 6వ తేదీన తిహాడ్ జైల్లో విచారించాం. ఆమె సమాధానాలు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలకు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలి’’ అని సీబీఐ అధికారులు న్యాయమూర్తిని కోరారు.
అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం: కవిత న్యాయవాది విక్రమ్చౌధరి
కవిత అరెస్ట్ అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది విక్రమ్చౌధరి వాదనలు వివరించారు. ‘‘కవితకు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నసాక్ష్యాధారాలు ఏడాది కాలానికి ముందువి. ఆ అంశాలపై ఇప్పుడు అరెస్ట్ చేసి ప్రశ్నించాలని చెప్పడంలో అర్థం లేదు. ఆ సాక్ష్యాలకు, ప్రస్తుత అరెస్ట్కు ఎలాంటి సంబంధంలేదు. గతంలో అరెస్ట్ చేయడానికి సుముఖత చూపని సీబీఐ ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కారణం లోక్సభ ఎన్నికలే. ప్రజాభిమానం ఉన్న నాయకురాలి కస్టడీని పొడిగించడం కోసం ఇప్పుడు అరెస్ట్ చేశారు. పార్టీలో కీలకంగా ఉన్న ఆమెను జైల్లోనే ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల సమయం ఆమెకు చాలా కీలకం. అరెస్ట్ విషయంలో సీబీఐ నిబంధనలు పాటించలేదు. ఇలా చేయడం అధికార దుర్వినియోగం కిందికి వస్తుంది’’ అని న్యాయమూర్తికి వివరించారు.
సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది: న్యాయమూర్తి
‘‘ఇప్పటివరకు దర్యాప్తు సంస్థ సేకరించిన మెటీరియల్, దర్యాప్తు అధికారి సమర్పించిన కేస్ డైరీ, ఆరోపిత కుట్రలో పలువురు నిందితుల పాత్ర, నేరం చేసిన విధానం, దాని తీరును చూసిన తర్వాత నిందితురాలిని సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో కుట్రను పూర్తిగా వెలికితీయడానికి ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను, సాక్షులను నిందితురాలి ముందుంచి విచారించాల్సిన అవసరం గురించి దర్యాప్తు సంస్థ చెప్పింది. అందువల్ల ఆమెను ఈనెల 15వరకు సీబీఐ కస్టడీకిస్తున్నాం. సీబీఐ విజ్ఞప్తిని తోసిపుచ్చాలని కోరుతూ నిందితురాలు దాఖలుచేసిన దరఖాస్తును డిస్మిస్ చేస్తున్నా’’ అని న్యాయమూర్తి కావేరి బవేజా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘కస్టడీలో ఉన్న కవితను ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అడ్వొకేట్ మోహిత్రావుతో అరగంట పాటు మాట్లాడటానికి అనుమతివ్వాలి. వారి మాటలను సీబీఐ అధికారులు వినకూడదు. అదే సమయంలో సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, పీఏ శరత్తో 15 నిమిషాల పాటు మాట్లాడటానికి వీలు కల్పించాలి. నిందితురాలిని ప్రశ్నించే సమయంలో ఏదో ఒకచోట సీసీటీవీ ఏర్పాటుచేసి, దాని ఫుటేజీని భద్రతపరచాలి’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!