తాగించారు.. తూగించారు
రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం అమలుచేస్తానని డప్పుకొట్టిన జగన్.. మద్యంతాగి మరణించిన వారి ఇళ్ల ముందరే ‘డప్పు’ కొట్టించారు! మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించేస్తానన్నారు.
అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరిచిన జగన్
రూ.1.54 లక్షల కోట్లు పిండేశారు
‘జే బ్రాండ్ల’తో ప్రజల ఇళ్లూ ఒళ్లూ గుల్ల
గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు
65 శాతం అదనంగా దండుకున్న వైకాపా సర్కారు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం అమలుచేస్తానని డప్పుకొట్టిన జగన్.. మద్యంతాగి మరణించిన వారి ఇళ్ల ముందరే ‘డప్పు’ కొట్టించారు! మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించేస్తానన్నారు. కానీ అందుకు విరుద్ధంగా పేద, సామాన్యుల ఇళ్లూ ఒళ్లూ గుల్ల చేసి గల్లాపెట్టె నింపుకొన్నారు. డొక్కలెండిన బక్కజీవుల జేబులకు చిల్లుపెట్టి.. వారి గొంతుల్లో ‘జె బ్రాండ్’ విషాన్ని నింపి.. బడుగుల కుటుంబాల్లో చిచ్చు రా‘జే’శారు! ఆ అభాగ్యులవి ‘మద్యం’తర బతుకులు చేసేశారు.
ఆదాయం వస్తుందని తెలిస్తే చాలు.. నిబంధనలకు రాం‘రం’ అనడం, గేట్లను ‘బార్’లా తెరవడం జగన్కు ‘జిన్ను’తో పెట్టిన విద్య. జనం సొమ్మును దోచడమే కానీ.. జనం కోసం దాచడం అస్సలే తెలియని ఆయన.. మద్యం అమ్మకాలతో ప్రజలను దోచుకున్న తీరును చూస్తే ఎంతటివారైనా విస్తుపోవాల్సిందే! కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలోకి ‘జె బ్రాండ్లు’ తీసుకొచ్చిన జగన్.. బీదాబిక్కీ జనాన్ని పీల్చిపిప్పి చేసి వారి ప్రాణాలను బలిగొనేదాకా విశ్రమించలేదు. ‘జె బ్రాండ్ల’ రూపంలో ప్రజలపై విషం ఎగజిమ్మి.. వారి కుటుంబాల్లో విషాదం నింపిన ఆ ‘విషాల’ హృదయుడు గడిచిన అయిదేళ్లలో మద్యం విక్రయాలతో పిండుకున్న మొత్తం రూ.1,54,333 కోట్లు!
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం తిరోగమిస్తుంటే మద్యం విక్రయాల్లో అప్రతిహతంగా పురోగమిస్తోంది! మందుబాబుల తాగుడు బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.కోట్లను కొల్లగొట్టారు సీఎం జగన్. మద్యనిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తానని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయడమేనని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుద్దులు చెప్పిన ఆయన అధికారం చేపట్టగానే అబద్ధాలతో అంటకాగారు. పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ తన గల్లాపెట్టెను నింపేసుకున్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాం(2014-19)తో పోల్చితే ఐదేళ్ల వైకాపా సర్కారు హయాంలో మద్యం విక్రయాల విలువ ఏకంగా 65.14 శాతం మేరకు పెరిగాయంటే జగన్ జనానికి ఎంతటి స్థాయిలో మత్తుకు బానిస చేశారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి.. మద్యం విక్రయాల్లో రాష్ట్రాన్ని జగన్ మొదటిస్థానంలో నిలిపి రికార్డు సృష్టించారు!
అన్నీ వైకాపా నేతల చేతుల్లోనే..
- ఆంధ్రప్రదేశ్లో 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 మధ్య ఐదేళ్ల వ్యవధిలో అధికారిక లెక్కల ప్రకారం రూ.1,24,333.29 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. వైకాపా నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులు తమ చేతుల్లో ఉన్న బెల్ట్షాపులు, బార్లలో అదనపు ధరలకు విక్రయించి అనధికారికంగా వసూలు చేసింది రూ.30 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
- రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లు ఉన్నాయి. వైకాపా నాయకుల యాజమాన్యం చేతుల్లో ఉన్న ఈ బార్లలో లూజ్ విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ తరహా విక్రయాల ద్వారా అదనంగా 30 నుంచి 50 శాతం మేరకు బాదేశారు. ఇలా ఏడాదికి రూ.3 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల వరకు పీల్చారు.
- రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో దాదాపు రెండు, మూడు బెల్ట్షాపులు నడుస్తున్నాయి. ఆబ్కారీ శాఖ నుంచి వీటికి ఎలాంటి అనుమతులు ఉండవు. వైకాపా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులే ఎక్కువగా వీటిని అక్రమంగా నిర్వహిస్తున్నారు. వీటిలో క్వార్టర్ మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.40 నుంచి రూ.50 వరకు వసూలు చేశారు. ఇలా ఏడాదికి కనీసం రూ.3 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల వరకు దోచేశారు.
విక్రయాల పెంపునకు కొత్తదారులు
దశల వారీగా మద్యనిషేధం అంటే రాష్ట్రంలో వీలైనంత వరకూ మద్యం అందుబాటులో లేకుండా చూడాలి. క్రమక్రమంగా మద్యం అమ్మకాలను నిలిపేయాలి. కానీ.. జగన్ తన మాట మీద తాను నిలబడే వ్యక్తి కాదు కదా..! ప్రజలతో తాగించారు.. వారిని తూగించారు.. వారి నుంచి గుంజినంత గుంజి గల్లా పెట్టె నింపుకొన్నారు. మద్యం విక్రయాలను పెంచేందుకు జగన్ అనేక కొత్తదారులు కనిపెట్టారు. మద్యనిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తానన్న ఆయన గతంలో ఉన్న బార్ల సంఖ్యను తగ్గించలేదు సరికదా.. మరింతగా పెంచారు. అంతకు ముందు వరకూ బార్లు లేని కొత్త పురపాలికలు, నగరపంచాయతీల్లో నూతనంగా బార్లు ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మద్యం వాక్-ఇన్ స్టోర్లు తెరిచారు. పర్యాటక కేంద్రాల్లో లిక్కర్ అవుట్లెట్లు, వాక్-ఇన్ షాపులు ప్రారంభించారు.
ఎన్ని తాళిబొట్లు తెంచారో..
జగన్ అధికారం చేపట్టాక తొలి ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.20,928.61 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా.. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.30,078 కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. అంటే జగన్ జమానాలో తొలి ఏడాది (2019-20)తో పోలిస్తే చివరి ఏడాది(2023-24) నాటికి మద్యం విక్రయాల విలువ ఏకంగా 43.72 శాతం పెరిగింది. అయిదేళ్లలో అదనంగా రూ.9,149.76 కోట్ల విలువైన మద్యం విక్రయాలు పెరిగాయి. ఈ లెక్కన అయిదేళ్ల వ్యవధిలో ఎన్ని లక్షల మందికి తాగించారు? ఎన్ని వేల కుటుంబాలను వీధిపాలుజేశారు? ఎంతమంది తాళిబొట్లు తెంచారు? ఎంత మందిని అనారోగ్యానికి గురిచేశారు? అని ఊహించడం కష్టమేమీ కాదు..!
గత ప్రభుత్వానికి ఈ సర్కారుకు ఇంత తేడా..
- రాష్ట్రంలో గత తెదేపా ప్రభుత్వ హయాంతో పోల్చితే వైకాపా సర్కారు హయాంలో 65.14 శాతం మేర మద్యం విక్రయాలు పెరిగాయి.
- గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మార్చి మాసాంతం వరకు రూ.75,285.97 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే వైకాపా హయాంలో అధికారిక లెక్కల ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో రూ.1,24,333.29 కోట్ల విలువైన మద్యం అమ్మారు. దీని ప్రకారం.. గత ప్రభుత్వంతో పోల్చితే వైకాపా సర్కారు పాలనాకాలంలో మొత్తం రూ.49,047.32 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా విక్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.