తాగించారు.. తూగించారు
రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం అమలుచేస్తానని డప్పుకొట్టిన జగన్.. మద్యంతాగి మరణించిన వారి ఇళ్ల ముందరే ‘డప్పు’ కొట్టించారు! మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించేస్తానన్నారు.
అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరిచిన జగన్
రూ.1.54 లక్షల కోట్లు పిండేశారు
‘జే బ్రాండ్ల’తో ప్రజల ఇళ్లూ ఒళ్లూ గుల్ల
గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు
65 శాతం అదనంగా దండుకున్న వైకాపా సర్కారు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం అమలుచేస్తానని డప్పుకొట్టిన జగన్.. మద్యంతాగి మరణించిన వారి ఇళ్ల ముందరే ‘డప్పు’ కొట్టించారు! మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించేస్తానన్నారు. కానీ అందుకు విరుద్ధంగా పేద, సామాన్యుల ఇళ్లూ ఒళ్లూ గుల్ల చేసి గల్లాపెట్టె నింపుకొన్నారు. డొక్కలెండిన బక్కజీవుల జేబులకు చిల్లుపెట్టి.. వారి గొంతుల్లో ‘జె బ్రాండ్’ విషాన్ని నింపి.. బడుగుల కుటుంబాల్లో చిచ్చు రా‘జే’శారు! ఆ అభాగ్యులవి ‘మద్యం’తర బతుకులు చేసేశారు.
ఆదాయం వస్తుందని తెలిస్తే చాలు.. నిబంధనలకు రాం‘రం’ అనడం, గేట్లను ‘బార్’లా తెరవడం జగన్కు ‘జిన్ను’తో పెట్టిన విద్య. జనం సొమ్మును దోచడమే కానీ.. జనం కోసం దాచడం అస్సలే తెలియని ఆయన.. మద్యం అమ్మకాలతో ప్రజలను దోచుకున్న తీరును చూస్తే ఎంతటివారైనా విస్తుపోవాల్సిందే! కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలోకి ‘జె బ్రాండ్లు’ తీసుకొచ్చిన జగన్.. బీదాబిక్కీ జనాన్ని పీల్చిపిప్పి చేసి వారి ప్రాణాలను బలిగొనేదాకా విశ్రమించలేదు. ‘జె బ్రాండ్ల’ రూపంలో ప్రజలపై విషం ఎగజిమ్మి.. వారి కుటుంబాల్లో విషాదం నింపిన ఆ ‘విషాల’ హృదయుడు గడిచిన అయిదేళ్లలో మద్యం విక్రయాలతో పిండుకున్న మొత్తం రూ.1,54,333 కోట్లు!
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం తిరోగమిస్తుంటే మద్యం విక్రయాల్లో అప్రతిహతంగా పురోగమిస్తోంది! మందుబాబుల తాగుడు బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.కోట్లను కొల్లగొట్టారు సీఎం జగన్. మద్యనిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తానని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయడమేనని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుద్దులు చెప్పిన ఆయన అధికారం చేపట్టగానే అబద్ధాలతో అంటకాగారు. పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ తన గల్లాపెట్టెను నింపేసుకున్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాం(2014-19)తో పోల్చితే ఐదేళ్ల వైకాపా సర్కారు హయాంలో మద్యం విక్రయాల విలువ ఏకంగా 65.14 శాతం మేరకు పెరిగాయంటే జగన్ జనానికి ఎంతటి స్థాయిలో మత్తుకు బానిస చేశారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి.. మద్యం విక్రయాల్లో రాష్ట్రాన్ని జగన్ మొదటిస్థానంలో నిలిపి రికార్డు సృష్టించారు!
అన్నీ వైకాపా నేతల చేతుల్లోనే..
- ఆంధ్రప్రదేశ్లో 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 మధ్య ఐదేళ్ల వ్యవధిలో అధికారిక లెక్కల ప్రకారం రూ.1,24,333.29 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. వైకాపా నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులు తమ చేతుల్లో ఉన్న బెల్ట్షాపులు, బార్లలో అదనపు ధరలకు విక్రయించి అనధికారికంగా వసూలు చేసింది రూ.30 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
- రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లు ఉన్నాయి. వైకాపా నాయకుల యాజమాన్యం చేతుల్లో ఉన్న ఈ బార్లలో లూజ్ విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ తరహా విక్రయాల ద్వారా అదనంగా 30 నుంచి 50 శాతం మేరకు బాదేశారు. ఇలా ఏడాదికి రూ.3 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల వరకు పీల్చారు.
- రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో దాదాపు రెండు, మూడు బెల్ట్షాపులు నడుస్తున్నాయి. ఆబ్కారీ శాఖ నుంచి వీటికి ఎలాంటి అనుమతులు ఉండవు. వైకాపా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులే ఎక్కువగా వీటిని అక్రమంగా నిర్వహిస్తున్నారు. వీటిలో క్వార్టర్ మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.40 నుంచి రూ.50 వరకు వసూలు చేశారు. ఇలా ఏడాదికి కనీసం రూ.3 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల వరకు దోచేశారు.
విక్రయాల పెంపునకు కొత్తదారులు
దశల వారీగా మద్యనిషేధం అంటే రాష్ట్రంలో వీలైనంత వరకూ మద్యం అందుబాటులో లేకుండా చూడాలి. క్రమక్రమంగా మద్యం అమ్మకాలను నిలిపేయాలి. కానీ.. జగన్ తన మాట మీద తాను నిలబడే వ్యక్తి కాదు కదా..! ప్రజలతో తాగించారు.. వారిని తూగించారు.. వారి నుంచి గుంజినంత గుంజి గల్లా పెట్టె నింపుకొన్నారు. మద్యం విక్రయాలను పెంచేందుకు జగన్ అనేక కొత్తదారులు కనిపెట్టారు. మద్యనిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తానన్న ఆయన గతంలో ఉన్న బార్ల సంఖ్యను తగ్గించలేదు సరికదా.. మరింతగా పెంచారు. అంతకు ముందు వరకూ బార్లు లేని కొత్త పురపాలికలు, నగరపంచాయతీల్లో నూతనంగా బార్లు ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మద్యం వాక్-ఇన్ స్టోర్లు తెరిచారు. పర్యాటక కేంద్రాల్లో లిక్కర్ అవుట్లెట్లు, వాక్-ఇన్ షాపులు ప్రారంభించారు.
ఎన్ని తాళిబొట్లు తెంచారో..
జగన్ అధికారం చేపట్టాక తొలి ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.20,928.61 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా.. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.30,078 కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. అంటే జగన్ జమానాలో తొలి ఏడాది (2019-20)తో పోలిస్తే చివరి ఏడాది(2023-24) నాటికి మద్యం విక్రయాల విలువ ఏకంగా 43.72 శాతం పెరిగింది. అయిదేళ్లలో అదనంగా రూ.9,149.76 కోట్ల విలువైన మద్యం విక్రయాలు పెరిగాయి. ఈ లెక్కన అయిదేళ్ల వ్యవధిలో ఎన్ని లక్షల మందికి తాగించారు? ఎన్ని వేల కుటుంబాలను వీధిపాలుజేశారు? ఎంతమంది తాళిబొట్లు తెంచారు? ఎంత మందిని అనారోగ్యానికి గురిచేశారు? అని ఊహించడం కష్టమేమీ కాదు..!
గత ప్రభుత్వానికి ఈ సర్కారుకు ఇంత తేడా..
- రాష్ట్రంలో గత తెదేపా ప్రభుత్వ హయాంతో పోల్చితే వైకాపా సర్కారు హయాంలో 65.14 శాతం మేర మద్యం విక్రయాలు పెరిగాయి.
- గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మార్చి మాసాంతం వరకు రూ.75,285.97 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే వైకాపా హయాంలో అధికారిక లెక్కల ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో రూ.1,24,333.29 కోట్ల విలువైన మద్యం అమ్మారు. దీని ప్రకారం.. గత ప్రభుత్వంతో పోల్చితే వైకాపా సర్కారు పాలనాకాలంలో మొత్తం రూ.49,047.32 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా విక్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?