ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. 55 హైస్కూలు ప్లస్లలో ‘సున్నా ఫలితాలు’..
జగన్ సర్కారు ఆడిన వింత ఆటలో పేద విద్యార్థుల జీవితాలు ఆగమై పోయాయి. ఇంటర్ ఫలితాల్లో హైస్కూల్ ప్లస్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) డొల్లతనం బయటపడింది.
ఫస్టియర్లో 27.69%, సెకండియర్లో 34.11% ఉత్తీర్ణత
16 కేజీబీవీల్లోనూ సున్నా ఫలితాలే
మండలానికో బాలికల కళాశాలంటూ ప్రచారమే తప్ప చదువు చెప్పిందే లేదు
ఈనాడు, అమరావతి: జగన్ సర్కారు ఆడిన వింత ఆటలో పేద విద్యార్థుల జీవితాలు ఆగమై పోయాయి. ఇంటర్ ఫలితాల్లో హైస్కూల్ ప్లస్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) డొల్లతనం బయటపడింది. హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థల్లో మొదటి సంవత్సరంలో 27, రెండో సంవత్సరంలో 28 చోట్ల ఒక్కరూ పాస్ కాలేదు. కేజీబీవీల్లోనూ ఫస్టియర్లో 10 చోట్ల, సెకండియర్లో ఆరు చోట్ల అందరూ ఫెయిలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగగా, ప్రభుత్వ బాలికల కళాశాలల్లో ఇంతటి ఘోర ఫలితాలు వచ్చాయి. కేజీబీవీలు, హైస్కూల్ ప్లస్లలో చదివే వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద బాలికలే. వీరికి కనీసం పాఠ్యపుస్తకాలు ఇచ్చేందుకూ జగన్కు చేతులు రాలేదు. కమీషన్లు భారీగా వచ్చే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లు, ఫర్నిచర్ వంటి ఉపకరణాల కొనుగోళ్లకే ప్రాధాన్యమిచ్చారు. వీటిపై ఎంత ఎక్కువ ఖర్చుచేస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుందన్న ఆరోపణలున్నాయి. హైస్కూల్ ప్లస్లలో సరిపడా అధ్యాపకులను నియమించకుండా, ప్రయోగశాలలు ఏర్పాటు చేయకుండా పేద పిల్లల జీవితాలను బలి చేశారు.
72% మంది బాలికలు ఫెయిల్..
హైస్కూల్ ప్లస్లలో ఇంటర్ చదువుకున్న వారిలో మొదటి ఏడాదిలో 72.31%, రెండో ఏడాదిలో 65.89% మంది ఫెయిలయ్యారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 249 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ కోర్సును ప్రారంభించారు. పాఠాలు చెప్పేవారు లేకపోవడంతో గతేడాది ఫస్టియర్లో కేవలం 12% ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా ఫలితాల మెరుగుకు చర్యలు తీసుకోలేదు. స్కూల్ అసిస్టెంట్లకే ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి, వారితోనే ఇంటర్ పాఠాలు చెప్పించారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో ఫస్టియర్లో 57.47%, సెకండియర్లో 69.89% మంది ఉత్తీర్ణులయ్యారు. మండలానికో బాలికల జూనియర్ కళాశాల ఉండాలంటూ సీఎం జగన్ ఆదేశించడం, ముందూ వెనుకా ఆలోచించకుండా అధికారులు ప్రారంభించేయడం.. పర్యవసానమే ఈ ఫలితాలు. సీఎం ఆదేశాలతో 131 కేజీబీవీల్లో ఇంటర్ కోర్సులు ప్రవేశపెట్టారు. అధ్యాపకుల సర్దుబాటు పేరుతో కొన్ని సబ్జెక్టులకు లెక్చరర్లను తొలగించారు. 9, 10 తరగతులకు బోధించే వారితోనే ఇంటర్ సబ్జెక్టులు చెప్పించారు. ఫలితంగా గతేడాది 34 కేజీబీవీల్లో సున్నా ఫలితాలు రాగా, ఈసారి 16 చోట్ల అదే ఫలితం పునరావృతమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్రప్రదేశ్లో 44 రోజులు... రూ.17 వేల కోట్ల అప్పులు
ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే విపరీతమైన అప్పులు పుట్టిస్తున్నారు. -
నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?
రాష్ట్రంలో ప్రస్తుతం బిల్లుల చెల్లింపుపై వివాదం రేగుతోంది. పోలింగ్ ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపు వైకాపా అనుయాయులు, గుత్తేదారులు ఆర్థికశాఖ నుంచి తమ బిల్లులను సాధించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ఛానల్.. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి
ఓటర్లు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్న రైలు ఆలస్యంగా నడుస్తుండటంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) స్పందించి ఆ రైలుకు గ్రీన్ఛానల్ ఏర్పాటు చేయించారు. -
ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి
మనది వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. అభివృద్ధి రేటు 7 శాతం అంటున్నాం. వృద్ధి అంత వేగంగా ఉంటే నిరుద్యోగం ఎందుకు ఉందన్నది ఓ ప్రశ్న. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. -
పథకాల నిధులు.. గుత్తేదార్లకా?
రాష్ట్రంలో పేదలకు జనవరి నెల నుంచి పెండింగ్లో ఉంచిన రూ.14,165 కోట్ల డీబీటీ నిధుల చెల్లింపులు నిలిపివేసి.. వైకాపా అనుయాయ గుత్తేదారులకు ఆ సొమ్ములు చెల్లించేసేందుకు గూడుపుఠాణి సాగుతోంది. -
అందని ద్రాక్షలా ఈపీఎఫ్ అధిక పింఛను
ఇప్పటి వరకు కేవలం రూ.2-3 వేల పింఛనుతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల్లో కొందరు అధిక పింఛను పొందేందుకు అవకాశం కలిగినా.. ఈపీఎఫ్ అధికారులు అనేక కొర్రీలువేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. -
సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు జగన్ ఎత్తుగడ
జగన్ ప్రభుత్వం చివరిలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమైందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు. -
కుక్క కాట్లు పెరుగుతున్నాయ్
రాష్ట్రంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పాదచారులు, వాహనచోదకులు ప్రాణాలు చేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తోంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత కంగారు పడుతున్నారు. -
జెన్కో థర్మల్ కేంద్రాల్లో ఒక్క రోజుకే బొగ్గు!
రాష్ట్రంలోని జెన్కో థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం రోజుకు సగటున 78,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. విద్యుదుత్పత్తి ఆధారంగా బొగ్గు వినియోగం లెక్కలు మారతాయి. -
ఏపీ ఎస్ఈఐఏ ఛైర్మన్గా బి.శ్రీధర్
రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు ప్రాధికార సంస్థ (స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ) ఛైర్మన్గా విజయవాడకు చెందిన బి.శ్రీధర్ను, సభ్యుడిగా నూజివీడు ఆర్జీయూకేటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ను నియమిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఎమ్మెల్యే దాడి హేయం: నిమ్మగడ్డ రమేశ్కుమార్
ఓటు వేసేందుకు వెళ్లిన గొట్టుముక్కల సుధాకర్పై తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడికి పాల్పడడం దుర్మార్గమని సీఎఫ్డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ అన్నారు. -
స్వయం ప్రతిపత్తి కళాశాలలపై ఉన్నత విద్యామండలి పెత్తనం
రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి కళాశాలల్లో సిలబస్, సబ్జెక్టులపై జోక్యం చేసుకుంటూ విశ్వవిద్యాలయాల ద్వారా ఉన్నత విద్యామండలి పెత్తనం చేస్తోంది. -
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
కుటుంబ సభ్యులతో కలిసి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్కు సీబీఐ ప్రధాన న్యాయస్థానం అనుమతించింది. -
ఏపీఈఏపీ సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
ఏపీఈఏపీ సెట్-2024 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. కాకినాడలో యూనివర్సిటీ అధికారులు, సెట్ కన్వీనర్ కె.వెంకటరెడ్డి, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో పరీక్ష నిర్వహణకు సంబంధించి మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. -
గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను కార్యదర్శి నరసింహారావుతో కలిసి కమిషనర్ సురేష్కుమార్ మంగళవారం విడుదల చేశారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో బీటెక్ విద్యార్థులకు ఇంటర్న్షిప్
ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ప్యానల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్ నాలుగో ఏడాది చదివే విద్యార్థులను నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. -
ఏపీ పీసెట్ దరఖాస్తు గడువు పెంపు
వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీసెట్ దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు కన్వీనర్ ఆచార్య జాన్సన్ చెప్పారు. -
సంక్షిప్త వార్తలు (5)
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ