అరాచకాలు.. ‘డోర్ డెలివరీ!’
రంపచోడవరం, అడ్డతీగల అనగానే.. గుర్తొచ్చేవి.. మన్యం వీరుడు అల్లూరి సాహసాలు, గిరిజనుల పోరాటాలు.. తెల్లోడిని గడగడలాడించిన ఆ ప్రాంతం.. ఇప్పుడు ఓ తెలుగు వీరప్పన్కి అడ్డాగా మారింది.
షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతర నేత దందాలు
గంజాయి, కలప అక్రమ రవాణా ఆయన కనుసన్నల్లోనే
దళిత యువకుని హత్యకేసులో ప్రధాన నిందితుడు
ఆయన లీలలు అనంతం బాబోయ్!
ఈనాడు - అమరావతి
రంపచోడవరం, అడ్డతీగల అనగానే.. గుర్తొచ్చేవి.. మన్యం వీరుడు అల్లూరి సాహసాలు, గిరిజనుల పోరాటాలు.. తెల్లోడిని గడగడలాడించిన ఆ ప్రాంతం.. ఇప్పుడు ఓ తెలుగు వీరప్పన్కి అడ్డాగా మారింది. కలప స్మగ్లింగ్, గ్రానైట్ తవ్వకాలతో సహజవనరుల్ని దోచేయడమే కాదు, రాజకీయంగానూ అమాయక గిరిజనుల్ని శాసిస్తున్నారాయన. సర్పంచుల నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ ఆయన కీలుబొమ్మలే! ఆ అనంత శక్తికి ఎదురెళ్తే ఎంతటివారైనా అంతం కావాల్సిందే.. తన కారు డ్రైవర్ డెడ్బాడీని డోర్ డెలివరీ చేసిన ఘనాపాటి! జంతవులే నయం.. అన్నంత క్రూరంగా ఉంటాయి.. ఈ మన్యం గూం‘డాన్’ ఆగడాలు!
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేలపై ఒక వ్యక్తి అరాచకశక్తిగా రాజ్యమేలుతున్నారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారు. ఆ అరాచకానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ అండదండలు అందిస్తున్నారు. అక్కడ ఏ సభ జరిగినా సీఎం ఆ వ్యక్తిని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. అంతే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. మన్యంలో ఆ గిరిజనేతర నాయకుడు అయిదేళ్లుగా తన ‘అనంత’ బాహువులతో ఆదివాసీలను నలిపేస్తున్నారు. తనను ‘మన్యం డాన్’గా పిలిపించుకుంటారు. అక్కడ వైకాపా నుంచి ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా వారిని తన చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలనైనా సరే. ఇన్ని అర్హతలున్నాక పదవి లేకపోతే ఏం బావుంటందని ఆ పార్టీ ముఖ్యనేత తలచారో ఏమో.. ఎమ్మెల్సీగా నియమించారు.
ఆదివాసీలకు రిజర్వు చేసిన ఈ ప్రాంతంలో వైకాపా నుంచి పోటీ చేయాలంటే ఆ వ్యక్తి అండదండలు కావాల్సిందే. తన మాట వినే ఏ టీచర్నో తీసుకువచ్చి.. జగన్కు చెప్పి అభ్యర్థిత్వం ఇప్పిస్తారు. గిరిజనుల మద్దతుతో గెలిచిన ఆ ‘మహిళలు’ ఇక అతని చెప్పు చేతల్లో నలిగిపోవాల్సిందే. వైకాపా ఆవిర్భవించిన తర్వాత ఈ నాయకుడి అక్రమాలు అనంతం. తన దగ్గర పని చేసే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి చరిత్ర సృష్టించారు.
ప్రజాప్రతినిధులూ కీలుబొమ్మలే..
2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళా నాయకురాలిని నామమాత్రం చేసి అధికారాన్ని చెలాయించేవారు. ఆమె ఏటీఎం కార్డును తనవద్దే పెట్టుకుని ఆమెకు చెల్లించే జీతభత్యాలను ఆయనే తీసుకొనేవారు. ఆ నేత ఆగడాలు, దౌర్జన్యాలతో మనస్తాపం చెందిన ఆమె 2017లో తెదేపాలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో మరో మహిళా టీచరును ఈ వ్యక్తి తెరపైకి తెచ్చారు. ఆమె ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక వెనక నుంచి తానే చక్రం తిప్పారు. ఆమె నిత్యం తన కనుసన్నల్లోనే ఉండాలని.. ఈ ప్రాంత ముఖ్యకేంద్రంలో కాకుండా.. తన ఇంటి ఎదుటే ఆ ప్రజాప్రతినిధి నివాసమూ ఏర్పాటు చేయించారు.
భయపెట్టి తన మాట వినేలా చేసుకుని...
ఈ అరాచక నాయకుడి తండ్రి మండల స్థాయి ప్రజాప్రతినిధిగా ఉండేవారు. ఆ తర్వాత 2002లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వ్యక్తి జడ్పీటీసీగా గెలిచారు. ఆనక ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొంది 2006లో మళ్లీ అదే మండలం నుంచి మండల పరిషత్తు అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆ ఎస్టీ ధ్రువీకరణ పత్రం చెల్లలేదు. ఆదివాసీలకు దక్కాల్సిన మండలాధ్యక్ష పదవినీ ఆయనే అనుభవించారనే ఆగ్రహం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. 2014లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తే ఆ కులధ్రువీకరణ సరైంది కాదని తేల్చి పోటీ నుంచి తప్పించారు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు సైతం ఆయనకు చెప్పిన తర్వాతే ఏ పనైనా చేసుకోవాలి లేకుంటే తన అనుచరులతో కేసులు పెట్టించి బెదిరిస్తారు. దాడులకు సైతం దిగుతారు. గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు తీసుకుంటారు.
గిరిజనుల భూములను చెరబట్టేశారు..
మొదట్లో ఈయనకు 20ఎకరాల భూమి ఉండేది. బెదిరింపులకు పాల్పడి గిరిజనుల నుంచి కారుచౌకగా వందల ఎకరాల భూములు దక్కించుకున్నారు. మరికొన్ని భూములను ఆక్రమించుకుని బినామీల పేరున పట్టాలను పొంది సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 200 ఎకరాలు ఈయన గుప్పిట్లో ఉన్నాయి. వాటిలో 150 ఎకరాలకు పైగా చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. ఆ చెరువులకు మద్దిగడ్డ జలాశయం నుంచి ఏడాది పొడవునా నీరుపారేలా కాలువలను తవ్వించారు. ఎటపాక మండలంలో భద్రాచలం రాములవారి భూముల్లో ఈయన అనుచరులు పాగా వేశారు. పోలవరం ప్రాజెక్టు భూములకు సంబంధించి బినామీలను సృష్టించి దొంగ డి-పట్టాలతో రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడిన ఘటనలో ఈయన హస్తం ఉందనే ఆరోపణలున్నాయి.
మన్యం.. వీరప్పన్!
రంపచోడవరం మన్యంలో బినామీల పేరున క్వారీలను నిర్వహిస్తూ రూ.కోట్లలో గిరిజనులకు చెందాల్సిన ఖనిజ సంపదను ఆ నేతే దోచుకుంటున్నారు. అడ్డతీగల మండలం గొంటువానిపాలెంలో రెండు మెటల్ క్వారీలు, రంపచోడవరం మండలం చుప్పరిపాలెంలో గ్రానైట్ క్వారీతో పాటు నరసాపురంలో మెటల్ క్వారీలను బినామీ(గిరిజనులు)ల పేరున అనుమతులు తీసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. క్వారీల నిర్వహణలో రెవెన్యూ, మైనింగ్ అధికారులు కొందరికి ముడుపులు ముట్టజెప్పి కొండలను పీల్చి పిప్పిచేస్తున్నారు. మన్యం నుంచి విలువైన కలపను లారీలు, ట్రాక్టర్లతో తరలిస్తూ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ఆయనే కాదు అనుచరులు ఎవరైనా టేకు, రోజ్ఉడ్ వంటి విలువైన కలపను తరలిస్తుంటే అధికారులు చూస్తూ ఉండాలే తప్ప అడ్డుకొంటే వెంటనే వారిని బదిలీ చేయిస్తారు. ఇదివరకు రోజ్వుడ్ దుంగలను కొందరు తరలిస్తుండగా భాజపా మహిళా నేత ఒకరు పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. మర్నాడే ఆ కలపను అధికారులు వదిలేశారు. ‘ఇదేంట’ని ప్రశ్నిస్తే ఆ ‘అరాచకశక్తి’ ఆదేశాలతో వదిలేసినట్లు సమర్థించుకోవడం గమనార్హం. గంజాయి అక్రమ రవాణాలో ఈయన ప్రధాన అనుచరుడు గతంలో పట్టుబడ్డాడు. తెలంగాణ మద్యాన్ని తీసుకువచ్చి దర్జాగా ఇక్కడ అమ్మకాలు సాగేలా చూస్తున్నదీ ఈయనే!
కేసులు మాఫీ చేసుకుని..
ఆయనపై అడ్డతీగల పోలీసుస్టేషన్లో రౌడీషీట్ ఉండేది. 2016లో ఎంపీగా ఉన్న కొత్తపల్లి గీత ఫొటోని అసభ్యంగా మార్చి బ్యానర్లు ఏర్పాటు చేశారు. సదరు నేతపై ఆమె ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీంతో కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. తర్వాత బెయిల్పై వచ్చారు. ఉద్యోగులపై దౌర్జన్యాలకు పాల్పడంతో అప్పట్లో 18 కేసులు ఆయనపై నమోదయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక రౌడీషీట్ను తొలగించుకున్నారు. మరికొన్ని కేసులను సైతం మాఫీ చేయించుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ హత్యకేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆయనపై ఉన్నట్లు సమాచారం. తన వాహనాలకు అడ్డంగా వచ్చారని ఆర్టీసీ డ్రైవర్లని సైతం తన అనుచరలతో కొట్టించారు.
దళితులు తరిమి కొట్టారు..
ఈ అరాచక వ్యక్తిపై జనాగ్రహమూ పెల్లుబికుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలం ధర్మవరం వచ్చారీ ప్రజాప్రతినిధి. ఆపై అంబేడ్కర్ విగ్రహానికి దండ వేశారు. ‘దళితుడిని చంపి డోర్డెలివరీ చేసిన నువ్వు అంబేడ్కర్కు దండ వేస్తావా’ అంటూ ఆ ఊరి దళితులంతా అక్కడికి వెళ్లి ఆయన్ని నిలదీశారు. వెంటనే ఊళ్లోంచి వెళ్లిపోవాలంటూ వాహనాన్ని చుట్టుముట్టడంతో అక్కడ నుంచి ఉడాయించారాయన. తాజాగా పోలవరం ముంపు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లగా.. ‘ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు గుర్తొచ్చామా’ అంటూ స్థానికులు నిరసన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?