ఎన్ని మొట్టికాయలు వేయాలి జగన్?
రాయలసీమ రైతులకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. దీని ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని 6.38 లక్షల ఎకరాలకు నీరు అందించాలనేది లక్ష్యం.
వైకాపా పాలనలో పడకేసిన హంద్రీనీవా పనులు
చాలినన్ని నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి
ఉరవకొండలో ఇచ్చిన హామీలు హుష్కాకి
డిస్ట్రిబ్యూటరీల పనులకూ దిక్కులేదు
జగన్ జమానాలో రాయలసీమ విఫలగాథ!
ఈనాడు, అమరావతి
నాడు ప్రతిపక్ష నేత హోదాలో...
పాదయాత్రలో మాయమాటలు చెప్పారు...
రాయలసీమ రైతులకు ఆశలు కల్పించారు...
లోగిళ్లలోకి కృష్ణా జలాలు తీసుకొస్తామన్నారు...
పిల్ల కాలువలను పూర్తి చేస్తామన్నారు...
ఎంతగానో నమ్మి అధికారం అప్పగిస్తే...
వారికి జగన్ నమ్మకద్రోహం చేశారు....
కీలక ప్రాజెక్టునూ ఓ విఫలగాథగా మిగిల్చారు!
హంద్రీనీవాను పూర్తి చేయకుంటే రైతులు, దేవుడు మొట్టికాయలు వేస్తారు.
ఈ ప్రభుత్వం పూర్తి చేయకపోతే మా పోరాటం ఆపేది లేదు. మన ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల సమయం ఇవ్వండి. హంద్రీనీవాను నిర్మించి ఆయకట్టుకు నీరిస్తాం. ప్రాజెక్టు తొలిదశలో మిగిలి పోయిన డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేసి, ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందిస్తాం.
అనంతపురం జిల్లా ఉరవకొండలో 2017 ఫిబ్రవరి 6న నిర్వహించిన మహాధర్నాలో జగన్ హామీ
రాయలసీమ రైతులకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. దీని ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని 6.38 లక్షల ఎకరాలకు నీరు అందించాలనేది లక్ష్యం. శ్రీశైలం జలాశయంలోని నీటిని వివిధ దశల్లో ఎత్తిపోసి మొత్తం 40 టీఎంసీలను వినియోగించాలనేది ప్రణాళిక. తొలిదశలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలకు, రెండో దశలో ఉమ్మడి అనంతపురంలో 2,27,000 ఎకరాలకు, కడపలో 37,500 ఎకరాలకు, చిత్తూరులో 1,40,000 ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలి. ఈ పథకానికి ఎన్టీఆర్ హయాంలో రూపకల్పన చేయగా రాష్ట్ర విభజన తర్వాత... చంద్రబాబు హయాంలో 2019 నాటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ తన అయిదేళ్ల పరిపాలనా కాలంలో మిగిలిన కొద్దిపాటి పనులను చేయలేక చేతులెత్తేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై పదేపదే మాట్లాడిన వ్యక్తే... అధికారంలోకి వచ్చాక వదిలేశారు. పైగా కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను ఇచ్చినట్లుగా సినిమా సెట్టింగు వేసి హడావుడి చేశారు. అక్కడికి నీళ్లు తరలించేందుకు అనంతపురం జిల్లాకు సాగునీటిని అందించకుండా పంటలను ఎండబెట్టారు. హంద్రీనీవాను నిర్మించకుంటే రైతులు మొట్టికాయలు వేస్తారని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ స్వయంగా హెచ్చరించారు. అందుకే ఈ ఎన్నికల్లో అదే సమాధానం చెప్పేందుకు సీమ ప్రజలు సిద్ధమవుతున్నారు.
కేవలం లక్ష ఎకరాలకు తగ్గ పనులే!
క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే.... చంద్రబాబు హయాంలో తొలిదశలో ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారో ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల ముందు ఉరవకొండలో ధర్నా చేస్తూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డిస్ట్రిబ్యూటరీలను నిర్మించేసి, ఆయకట్టుకు నీళ్లు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే, అధికారిక లెక్కల ప్రకారం చూసినా... నాలుగు జిల్లాల్లో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా మాత్రమే పనులయ్యాయి. పైగా వాటిలో సింహభాగం 2019 నాటికే పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాలో 42,982 ఎకరాలు, అనంతపురంలో 20,000 ఎకరాలు, చిత్తూరులో 16,952 ఎకరాలు, కడప జిల్లాలో 25,649 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా వ్యవస్థ సిద్ధమైందని పేర్కొంటున్నారు. ఈ ఆయకట్టుకూ పూర్తిస్థాయిలో నీరందించే పరిస్థితులు లేవు. జగన్ అధికారంలోకి వచ్చాక 2020 జులైలో కొన్ని పనుల ప్యాకేజీలను రద్దు చేశారు. వాటికి మళ్లీ అంచనాలు పెంచి తన వాళ్లకు పనులు అప్పగించే ప్రయత్నాలు సాగించారు.
తొలిదశ డిస్ట్రిబ్యూటరీలకే దిక్కు లేదు
తొలిదశలో కృష్ణగిరి జలాశయంలో 0.161 టీఎంసీలు, పత్తికొండ జలాశయంలో 1.216 టీఎంసీలు, జీడిపల్లి జలాశయంలో 1.686 టీఎంసీలు నిల్వ చేసి కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి. ఈ ఆయకట్టు కోసం 14 టీఎంసీల వరకు నీటిని వినియోగించాలి. జగన్ వచ్చాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. శ్రీశైలం జలాశయంలో నిండుగా నీళ్లున్నా ఆయకట్టుకు అందించలేని విఫల సర్కారుగా మిగిలిపోయింది. ఉప, పిల్ల కాలువల్లో కంప చెట్లు పెరిగిపోయాయి. మట్టి పూడుకుపోయింది. తట్టెడు మట్టి ఎత్తిపోసింది లేదు. దాంతో రైతులు... తమ సొంత ఖర్చులతో ప్రధాన కాలువల వద్ద మోటార్లు పెట్టుకుని, వాటి నుంచి పైపులు వేసుకుని, దూరంగా ఉన్న తమ పొలాలకు నీటిని పంపింగ్ చేసుకుంటున్నారు.
ఇచ్చిన నిధులూ ఖర్చు చేయలేదు..
జగన్ వచ్చాక... ప్రతి ఏటా బడ్జెట్లో కావాల్సినన్ని నిధులు కేటాయించలేదు. ఇచ్చిన వాటినీ పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. 2019-20లో రూ.232.66 కోట్లు, 2020-21లో రూ.240.50 కోట్లు, 2021-22లో రూ.31.31 కోట్లు, 2022-23లో రూ.542.87 కోట్లు, 2023-24 డిసెంబరు వరకు రూ.172 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో జీతాలు, నిర్వహణ ఖర్చులు, పాత బిల్లుల చెల్లింపులూ కలిసి ఉన్నాయి.
రూ.75 కోట్లనూ ఇవ్వలేని దుస్థితి
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు ప్రధాన కాలువను 553 కిలోమీటర్ల పొడవున తవ్వారు. ఈ కాలువ మీద ఉన్న శ్రీనివాసపురం, అడివిపల్లి జలాశయాల ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు చేరాలి. మేజర్ పనులు ఎప్పుడో పూర్తయినా జగన్ హయాంలో చిన్నచిన్న పనులనూ చేయకపోవడంతో చిత్తూరు జిల్లాలోని చివరి జలాశయానికి నీళ్లు చేరడం లేదు. ఈ జిల్లాలో పెండింగు పనుల పూర్తికి రూ.75 కోట్లు విడుదల చేయాలని అధికారులు కోరినా ప్రభుత్వం ఇవ్వని కారణంగానే ఈ దుస్థితి నెలకొంది.
కుప్పానికి నీళ్లు ఇవ్వడంలో నాటకీయత
పుంగనూరు బ్రాంచి కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు హయాంలో 2019 నాటికే ఈ పనుల్లో సింహభాగం కొలిక్కి వచ్చాయి. మిగిలినవి పూర్తి చేసి నీళ్లు అందించడం సులభమే. మధ్యలో ఉన్న కొన్ని పనులు సరిగా చేయలేదు. శ్రీశైలంలో నీళ్లున్న రోజుల్లోనూ వాటిని ఆయకట్టుకు అందించలేకపోయారు. కుప్పం కాలువకు నీళ్లు ఇస్తున్నట్లు... ముఖ్యమంత్రి జగన్ వచ్చి సినిమా సెట్టింగులా ఏర్పాటు చేసి నీళ్లు వదిలి వెళ్లారు. ఆ తర్వాత నుంచి కాలువలో నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు. మదనపల్లె వద్ద కాలువల్లో లీకేజీలు అరికట్టాల్సి ఉంది. పుంగనూరు, కుప్పం బ్రాంచి కాలువలకు ఎక్కువ నీటిని వదిలితే గండ్లు పడతాయేమోనన్న ఆందోళనలు వ్యక్తమవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు