తెలంగాణకు 8.5.. ఏపీకి 5.5 టీఎంసీలు
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ 8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది.
కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం
నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వాదనలు
తాగునీటి పేరుతో ఏపీ సాగుకు ఉపయోగిస్తోంది: తెలంగాణ
కేటాయింపులకు మించి తెలంగాణ తీసుకుంటోంది: ఏపీ
ఈనాడు, హైదరాబాద్: తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ 8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ మేరకు కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వాస్తవంగా ఏపీ 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు కావాలని డిమాండ్ చేయగా కమిటీ తిరస్కరించింది. హైదరాబాద్లోని బోర్డు కార్యాలయంలో బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయిపురే, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్కుమార్, ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది. రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో తెలంగాణ, ఏపీ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గతేడాది అక్టోబరులో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో శ్రీశైలం, సాగర్ల నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలు కేటాయించిన నేపథ్యంలో ఈ కోటా నీటి వినియోగంపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి.
తెలంగాణ అదనంగా తీసుకుందని ఏపీ ఆరోపణ
అక్టోబరులో తెలంగాణకు కేటాయించిన కోటా కన్నా 11 టీఎంసీలు ఎక్కువగా ఆ రాష్ట్రం వినియోగించుకుందని ఏపీ ఆరోపించింది. ఇప్పుడు అదనంగా 10 టీఎంసీలు అడగడం సబబు కాదని పేర్కొంది. తాము కేటాయింపులకన్నా తక్కువే వినియోగించుకున్నామని, ఇంకా ఐదు టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని గుర్తుచేసింది. తెలంగాణ స్పందిస్తూ..‘‘రాష్ట్ర పరిధిలో కృష్ణా పరీవాహకంలో ఎక్కువ జనాభా ఉంది. హైదరాబాద్ మహానగరంతోపాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్ జిల్లాలు బేసిన్ పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో 2 కోట్ల జనాభా తాగునీటి అవసరాలు ముడిపడి ఉన్నాయి. ఏపీలో బేసిన్ పరిధిలోని 17 లక్షల జనాభాకే తాగునీరు అందాల్సి ఉందని’’ పేర్కొంది. సాగర్ జలాలను తాము తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకున్నామని తెలిపింది.
చెరువుల్లోకి ఎత్తిపోయడంపై అభ్యంతరం
ఏపీలో చెరువులన్నీ ఎండిపోయాయని, రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, ఈ కారణంగా పంటలకు విరామం ప్రకటించామని ఆ రాష్ట్రం పేర్కొంది. పులిచింతల కింద ఇబ్బందులు ఉన్నాయని, ఆ జలాశయానికి నీటిని విడుదల చేయాలని కోరింది. సాగర్ నుంచి విడుదల చేసిన నీటిని కాలువలపై మోటార్లు పెట్టి చెరువుల్లోకి ఎత్తిపోసుకుంటున్నామని, ఆ నీటినీ తాగు అవసరాలకే వినియోగించుకున్నామంది. తెలంగాణ స్పందిస్తూ.. సాగర్ నుంచి పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేసిన సందర్భంలో కాలువ పొడవునా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశామని, మోటార్లతో తోడటం..చెరువులు నింపడం వంటివి జరక్కుండా చూశామని స్పష్టంచేసింది. ఏపీ మాత్రం కాలువల్లోని నీటిని చెరువుల్లోకి ఎత్తిపోస్తోందని ఆరోపించింది. నీటి ఎద్దడి కారణంగా రాష్ట్రంలో పంటలకు విరామం ప్రకటించామని, అదే తరుణంలో తాగునీటి అవసరాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది 200 టీఎంసీలను తరలించిందని, ఆ నీటిని సాగుకు వినియోగిస్తోందని వాదించింది. పులిచింతల నుంచి ఈ ఏడాది 57 టీఎంసీల మేర ఏపీ వినియోగించిందని, మళ్లీ ఇప్పుడు నీళ్లు అడుగుతోందని ఆక్షేపించింది.
వినియోగం లెక్కలపై పట్టు..
ప్రస్తుతం ఏపీ 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు అడుగుతున్నందున శ్రీశైలం నుంచి దిగువకు నీటిని వదులుదామని బోర్డు సభ్యుడు శంఖ్వా ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తెలంగాణ తమ కోటా కన్నా ఎక్కువగానే వినియోగించుకుందని ఆయన పేర్కొనగా.. తెలంగాణ అభ్యంతరం తెలిపింది. జూన్ నుంచి రెండు రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగం లెక్కలు తీస్తే ఏ రాష్ట్రం లెక్కకు మించి వినియోగించుకుందో స్పష్టత వస్తుందని సూచించింది. బోర్డు ఆ రాష్ట్రంలో నీటి వినియోగంపై పరిశీలన చేయాలని కోరింది. తెలంగాణకు ప్రత్యేకంగా రిజర్వాయర్లు లేని కారణంగా గతేడాది క్యారీ ఓవర్ కింద ఉన్న 18.7 టీఎంసీలు ఉమ్మడి జలాశయాల్లోనే ఉండిపోయాయని, ఏపీ మాత్రం పెన్నా బేసిన్కు తరలించి నిల్వ చేసుకుందని ఆరోపించింది.
500 అడుగుల నుంచి తీసుకునేందుకు నిర్ణయం
తాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ ఇరు రాష్ట్రాలకు ఈ సందర్భంగా బోర్డు సూచించింది. సాగర్ నుంచి గరిష్ఠంగా నీటిని తోడుకునే స్థాయి (ఎండీడీఎల్) 510 అడుగులు కాగా, 500 అడుగుల స్థాయి నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించింది. ‘ప్రస్తుతం జలాశయంలో 510.53 అడుగుల వద్ద 132.86 టీఎంసీలు ఉన్నాయి. 500 అడుగులకుపైన 17.55 టీఎంసీలు అందుబాటులో ఉండనున్నాయి. మే నెల వరకు రెండు రాష్ట్రాల అవసరాలకు 14 టీఎంసీలను వినియోగించుకోవాలి. మిగులు 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించాలి’ అని నిర్దేశించింది. మొత్తంగా శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదలకూడదని త్రిసభ్య కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. మే నెలలో మరోమారు సమావేశం నిర్వహించి అప్పటి పరిస్థితులను అంచనా వేయాలని నిర్ణయించింది. నల్గొండ సీఈ అజయ్కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్కుమార్, ఈఈ విజయ్ భాస్కర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం