మెట్ట రైతు చేతిలో.. మొట్టికాయలకు సిద్ధమా?
ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో, సీఎం అయ్యాక అధికారిక హోదాలో జగన్ మెట్ట ప్రాంతమైన ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి అనేక హామీలిచ్చారు.
పెళ్లిరోజు కానుక వేదాద్రికీ దిక్కు లేదు
కాంట్రాక్టు కార్మికుల బతుకులు మారలేదే!
రాష్ట్ర నడిబొడ్డు బెజవాడపై మీ ముద్రేది?
ఐదేళ్ల నాటి హామీలు గుర్తున్నాయా?
నేడు పశ్చిమ కృష్ణాలో జగన్ బస్సు యాత్ర
ఈనాడు, అమరావతి: ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో, సీఎం అయ్యాక అధికారిక హోదాలో జగన్ మెట్ట ప్రాంతమైన ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి అనేక హామీలిచ్చారు. మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని, నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు స్థిరీకరిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో శిలాఫలకాలు వేసి ఆశలు రేపారు. ఐదేళ్ల పాలన ముగుస్తున్న వేళ ఆ ఆశలు అడియాసలై అన్నదాతల్లో ఆగ్రహం ఉబికివస్తోంది. ఒక్క రైతులకే కాదు, ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ బాధితులు, వీటీపీఎస్లోని ఒప్పంద కార్మికులు, విజయవాడ నగరవాసులు, బెజవాడ దుర్గమ్మ భక్తులకు జగన్ ఇవ్వని హామీ లేదు. ఐదేళ్లలో నెరవేర్చిందీ లేదు. జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర, మామిడి పరిశోధన కేంద్రం, ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం వంటి ప్రకటనలన్నీ వాగ్దానభంగాలే. ‘మేమంతా సిద్ధం’ అంటూ శనివారం పశ్చిమ కృష్ణాకు బస్సుయాత్రగా వస్తున్న జగన్కు.. గత హామీల తాజా స్థితిని గుర్తుచేస్తూ..
క్రమబద్ధీకరణకు ఐదేళ్లూ చాలలేదా?
విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో దాదాపు 4వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరిలో కొందరు రోజువారీ వేతనజీవులు కాగా, మరికొందరు ఒప్పంద ఉద్యోగులు. 2018లో పాదయాత్రలో భాగంగా వీటీపీఎస్ ప్రాంతానికి వచ్చిన జగన్.. తాను సీఎం అయ్యాక అందరినీ క్రమబద్ధీకరిస్తానని ఒప్పంద కార్మికులకు హామీ ఇచ్చారు. నిజమేనని నమ్మిన వారు.. స్థానిక ఎమ్మెల్యేతో కలసి సీఎం జగన్ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్మెంటూ ఇవ్వలేదు. ఒక్క కార్మికుడూ పర్మినెంట్ కాలేదు. నేటికీ వీటీపీఎస్ బూడిదలో అదే తీరున మగ్గుతున్నారు. తెలంగాణ జెన్కోలోని కాంట్రాక్టు కార్మికులను అక్కడి ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తూ, వేతనాలు పెంచింది.
సాగర గోస తీర్చలే
తెలంగాణతో మాట్లాడి సాగర్ ఎడమ కాలువకు నీరు తెస్తానని 2019లో తిరువూరులో జగన్ హామీ ఇచ్చారు. ఈ కాలువ కింద 300 చెరువులను ఆధునికీకరించి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మారుస్తామన్నారు. నిజానికి సాగర్ ఆయకట్టు ఏటా ఎండిపోతోంది. ఈ ఏడాది పంట విరామం ప్రకటించారు. ఎడమ కాలువ నీరు తెలంగాణ సరిహద్దుల్లోనే ఆగిపోతోంది. 2015లో చంద్రబాబు ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టగా, జగన్ సీఎం అయ్యాక పనులు నిలిపివేయించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 210 గ్రామాలకు తాగునీరు అందించే ఈ పథకాన్ని గత ప్రభుత్వం రూ.4,900 కోట్లతో చేపట్టి, రూ.3 వేల కోట్లు వెచ్చించింది. ఆ బిల్లులూ చెల్లించలేదు. సాగు, తాగునీరు లేక తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు నియోజకవర్గాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
కిడ్నీ బాధితులపై కనికరమేది?
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. అక్కడ నాలుగేళ్లలో దాదాపు 250 మంది కిడ్నీ వ్యాధులతో చనిపోయారు. మరో ఉద్దానంగా మారింది. తిరువూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం జగన్.. ఇక్కడ శుద్ధజలం సరఫరాకు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.10 లక్షల కోట్ల అప్పులో ఒక మండలానికి రూ.50 కోట్లు అంటే పెద్ద పద్దేమీ కాదు. కానీ పేదలు, గిరిజనులు ఉండే ఆ ప్రాంతంపై జగన్కు మనసు రాలేదు. మరణమృదంగం ఆగలేదు.
అభివృద్ధి ఎవరిది? బాకా ఎవరిది?
విజయవాడలో బైపాస్ రోడ్డు, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్, కనకదుర్గ పైవంతెన తన కృషి ఫలితమేనని ఇటీవల జగన్ ప్రకటించారు. వాస్తవానికి ఇవి 2014-19 మధ్య అప్పటి ఎన్డీయే ప్రభుత్వం మంజూరు చేసి, ప్రారంభించిన ప్రాజెక్టులు. అప్పట్లో చంద్రబాబు అధికారులతో నిత్యం సమీక్షించి, పట్టాలెక్కించిన పనులను జగన్ తన ఖాతాలో వేసుకున్నారు. విజయవాడ కార్పొరేషన్ను గెలుచుకున్న సందర్భంగా వైకాపా కార్పొరేటర్లు సీఎంను కలవగా, నగర అభివృద్ధికి రూ.150 కోట్లు ప్రకటించి, నయా పైసా ఇవ్వలేదు.
అమ్మవారిపైనా చిన్నచూపే
విజయవాడ కనకదుర్గమ్మపైనా ఈ ప్రభుత్వానికి చిన్నచూపే. వెలంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ‘సీఎం నిధుల వరద పారిస్తున్నారు. దుర్గగుడి రూపురేఖలు మార్చేస్తున్నాం. రూ.70 కోట్లతో కార్యాచరణ ప్రారంభించామ’న్నారు. వాస్తవానికి ఒక్క రూపాయీ రాలేదు. తర్వాత రూ.220 కోట్లతో ప్రణాళిక సిద్ధమన్నారు. అదీ అంతే! మరో రూ.150 కోట్లతో ఆధునికీకరణ అన్నారు. ఇటీవల రూ.33 కోట్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నారు. దుర్గగుడి ఆదాయాన్ని పక్కదారి పట్టించారు.
మళ్లీమళ్లీ మీ పెళ్లి రోజులు.. మరి నీళ్లేవి?
జగ్గయ్యపేట నియోజకవర్గ రైతుల కడగండ్లు తీర్చేందుకు 2019లో నాటి సీఎం చంద్రబాబు కృష్ణా నది నీటిని తోడిపోసేలా ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. జగన్ సీఎం అయ్యాక తన పెళ్లిరోజు కానుక అంటూ 2020 ఆగస్టు 28న ఇదే పథకానికి ‘వైఎస్సార్ వేదాద్రి’గా పేరు మార్చి వేదాద్రి వద్ద వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మించి తన పెళ్లిరోజు కానుకగా 38,500 ఎకరాలను సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. రూ.312 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో కాంట్రాక్టు సంస్థ మేఘా కేవలం రూ.5 కోట్ల విలువైన పనులుచేసి, నిలిపేసింది. నాలుగేళ్లుగా అతీగతీ లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట