పోలీసు యాప్లకు రాం రాం!
‘దిశ యాప్ ఉంటే అన్న మీ వెంట ఉన్నట్లే..’ అని ముఖ్యమంత్రి జగన్ తరచూ ప్రచారం చేసుకుంటారు. ఆపదలో ఉన్న మహిళలు, యువతులను ఆదుకునేందుకే దిశ యాప్ను తీసుకొచ్చినట్లు తెగ చెబుతుంటారు.
నిలిచిన పోలీసు సేవాయాప్
ప్లే స్టోర్ నుంచీ తొలగింపు
దిశ యాప్నకూ ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం
ఏజెన్సీలకు నిర్వహణ వ్యయం చెల్లించని ఫలితం
ఈనాడు, అమరావతి: ‘దిశ యాప్ ఉంటే అన్న మీ వెంట ఉన్నట్లే..’ అని ముఖ్యమంత్రి జగన్ తరచూ ప్రచారం చేసుకుంటారు. ఆపదలో ఉన్న మహిళలు, యువతులను ఆదుకునేందుకే దిశ యాప్ను తీసుకొచ్చినట్లు తెగ చెబుతుంటారు. ఈ యాప్నకు నాలుగు అవార్డులు వచ్చాయని కూడా చెప్పుకొంటారు. ఇవన్నీ కేవలం ప్రచారం కోసమే అన్నట్లుంది ముఖ్యమంత్రి వైఖరి. ఇంత గొప్పగా చెబుతున్న ఈ యాప్ త్వరలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఏడాది దాటినా దీని వార్షిక నిర్వహణ వ్యయాన్ని విడుదల చేయకపోవడమే కారణం. ఇప్పటికే పోలీసు సేవా యాప్ నిలిచిపోయింది. పోలీసు డేటా సెంటర్లో సర్వర్ల నిర్వహణ, తదితర అంశాల బిల్లులనూ వైకాపా ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. తమ పార్టీకి నిధులు ఇచ్చిన కంపెనీలకు బిల్లులు మంజూరు చేయడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజోపయోగ అవసరాలకు సంబంధించిన బిల్లులకు నిధులు మంజూరు చేయడంలో కనిపించడం లేదు.
ప్లేస్టోర్ నుంచి పోలీసు సేవా యాప్ తొలగింపు
ముఖ్యమంత్రి జగన్ పోలీసు సేవా యాప్ను సెప్టెంబరు, 2020లో ప్రారంభించారు. పోలీసులు, ప్రజలకూ మధ్య అనుసంధానంగా ఇది ఉపయోగపడుతుందని తెచ్చారు. ఇందులోకి సామాన్యులు కూడా లాగిన్ అయి.. ఫిర్యాదును నమోదు చేయడంతో పాటు, ఎఫ్ఐఆర్ సమాచారం, పోలీసు సేవలు, ఈ-చలాన్లు, తప్పిపోయిన వారి వివరాల కోసం ఉపయోగించుకునే వీలుంది. ఎంతో ఉపయోగకరమైన ఈ-యాప్ను రూపొందించిన ఏజెన్సీకి నిర్వహణ వ్యయం ఆరు నెలల నుంచి విడుదల చేయలేదు. ఇటీవల ప్లేస్టోర్ నుంచి యాప్ను తొలగించారు. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వారి ఫోన్లలో యాప్ పనిచేయడం లేదు.
తర్వాత వంతు.. ‘దిశ’ యాప్దేనా?
ఆపద సమయాల్లో మహిళల భద్రత కోసం ‘దిశ’ యాప్ను 2020, ఫిబ్రవరిలో రాజమహేంద్రవరంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున పోలీసులకు లక్ష్యాన్ని పెట్టి మరీ మహిళలతో ఫోన్లలో యాప్ను డౌన్లోడ్లు చేయించారు. ఇప్పటి వరకు దాదాపు కోటిన్నర డౌన్లోడ్లు అయ్యాయి. దీనికి కూడా జగన్ ప్రభుత్వం అరకొరగా నిధులను విడుదల చేస్తోంది. వార్షిక నిర్వహణ వ్యయం చెల్లించాల్సిన గడువు దాటి ± 16 నెలలు అయింది. దీంతో త్వరలో దిశ యాప్ కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏడాదికి రూ.6 లక్షలు కూడా చెల్లించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందా అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ యాప్ ఆగిపోతే మహిళలకు జగన్ ఏం సమాధానం చెబుతారు?
రెండేళ్లైనా ‘దిశ’ వాహనాలకు డబ్బులివ్వలేదు
ఆపద సమయంలో మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన దిశ పెట్రోలింగ్ వాహనాలను 2022 మార్చిలో సీఎం ప్రారంభించారు. రూ. 14 కోట్లు వెచ్చించి 163 వాహనాలను కొనుగోలు చేశారు. వీటిని కొని రెండేళ్లు దాటినా ఇంత వరకు ఆ కంపెనీకి డబ్బులు చెల్లించలేదు.
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా లెక్కలేదు
అన్ని పోలీసుస్టేషన్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. స్టేషన్లలో పారదర్శకత కోసం వీటిని పెట్టాలని ఆదేశించింది. తీర్పు అమలులో భాగంగా ఒక్కో స్టేషన్లో 8 నుంచి 12 కెమెరాలు చొప్పున బిగించారు. రెండో విడతలో భాగంగా గత ఏడాది రాష్ట్రంలో 372 పోలీసుస్టేషన్లలో బిగించిన సీసీ కెమెరాలకు కూడా డబ్బులు చెల్లించలేదు. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా.. గుత్తేదారు పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా 169 స్టేషన్లలో సీసీ కెమెరాలు మొరాయించాయి.
పోలీసు డేటా సర్వర్లదీ ఇదే దారి?
మంగళగిరిలో ఉన్న పోలీసుడేటా సెంటర్ చాలా కీలకమైంది. ఇందులో రాష్ట్రంలోని అన్ని స్టేషన్లలో నమోదు చేసే కేసులు, నేరస్థుల వివరాలు డేటా సెంటర్లోని సర్వర్లలో నమోదు అవుతుంది. అయితే ఇక్కడ సర్వర్ల నిర్వహణకు డబ్బు చెల్లించేందుకు గడువు దాటి ఎనిమిది నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ ఈ డబ్బు కూడా చెల్లించలేదు. ఈ సర్వర్లు ఆగిపోతే.. ఆన్లైన్ సేవలన్నీ స్తంభించే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్