సొంతిల్లు.. గుండె గుబిల్లు
ఎవరికైనా సొంతిల్లు ఒక కల... నెరవేర్చుకునేందుకు అహరహం శ్రమిస్తారు... నిర్మాణం చేపట్టి పూర్తి చేసే వరకు... పదుగురికి ఉపాధి చూపుతారు...ఇలాంటి వారికి ప్రభుత్వాలేవైనా చేదోడుగా నిలుస్తాయి... జగన్ది రివర్స్ పాలన కదా... చేయూత ఇవ్వడం అటుంచి... ఖజానా నింపుకొనేందుకు భారీగా పిండుకున్నారు!!
ఐదేళ్లలో పన్నులు, సుంకాలను పెంచేసి బాదుడే బాదుడు
ఉచిత ఇసుకను తీసేసి అడ్డగోలుగా ధర పెంపు
కంకర, గ్రావెల్, గ్రానైట్ కొనుగోళ్లూ భారమే
ఒక ఇంటి నిర్మాణంపై అయిదేళ్లతో పోలిస్తే 4 లక్షల ఖర్చు అదనం
ఎవరికైనా సొంతిల్లు ఒక కల... నెరవేర్చుకునేందుకు అహరహం శ్రమిస్తారు...
నిర్మాణం చేపట్టి పూర్తి చేసే వరకు... పదుగురికి ఉపాధి చూపుతారు...
ఇలాంటి వారికి ప్రభుత్వాలేవైనా చేదోడుగా నిలుస్తాయి...
జగన్ది రివర్స్ పాలన కదా...
చేయూత ఇవ్వడం అటుంచి... ఖజానా నింపుకొనేందుకు భారీగా పిండుకున్నారు!!
ఇప్పుడవన్నీ మరిచి మళ్లీ ఓటేయండంటూ... ఊరూరా తిరుగుతున్నారు!!
సాధారణ, మధ్య తరగతి కుటుంబాల వారికి సొంతింటి నిర్మాణమనేది జీవితకాల లక్ష్యం. కష్టపడి సంపాదించిన సొమ్ముతోపాటు అప్పోసప్పో చేసి చిన్న స్థలం కొనుక్కుని, అందులో ఇల్లు
నిర్మించుకుంటారు. ఇలాంటి సామాన్యులను తమ కలను నెరవేర్చుకోకుండా జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా మైనింగ్ ఫీజులన్నీ చరిత్రలో ఎన్నడూ లేనంతలా పెంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా కొత్త ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో లీజుదారులను అన్నివిధాలా పిండేస్తోంది. ఈ ప్రభావం ఇంటి నిర్మాణంలో వినియోగించే కంకర, గ్రావెల్, గ్రానైట్ తదితరాలపై పడి, వాటి ధరలన్నీ అమాంతం పెరిగిపోయాయి. దీనికితోడు సామాన్యులెవరూ ఇసుక కొనలేని విధంగా చేసిన ఘనత జగన్కే దక్కుతుంది. గత ప్రభుత్వంలో ఉచితంగా లభించిన ఇసుకను వైకాపా అధికారంలోకి వచ్చాక... టన్నుకు రూ.475 చొప్పున విక్రయిస్తోంది. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇదే ఇసుకను ఆధారంగా చేసుకుని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. సామాన్యులకేమో దీని ధరను చూసి గుండె గుభేలుమంటోంది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం సిమెంట్ ధరలను నియంత్రించడం లేదు. ఐరన్ ధర సైతం పెరుగుతూనే ఉంది. ఇలా అన్నివిధాలా పెరిగిపోయిన ధరలతో ఇల్లు నిర్మించుకోవాలనే వారు వెనకడుగు వేయాల్సిన పరిస్థితిని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది.
పీసీబీ ఫీజులు పెంచేసి...
కంకర క్వారీలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్వో) అనుమతులు తీసుకోవాలి. వీటి ఫీజులు గతంలో టర్నోవర్పై నామమాత్రంగా ఉండేవి. జగన్ ప్రభుత్వం వీటిని భారీగా పెంచేసింది. లీజు విస్తీర్ణం, ఉత్పత్తి, ప్రతి టన్నుకు చొప్పున ఫీజులను వసూలు చేసే విధానాన్ని తెచ్చారు. ఇవన్నీ అంతిమంగా సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే వారిపై ప్రభావం చూపిస్తున్నాయి.
లీజుదారులపై ఎడాపెడా వాతలు
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనింగ్ లీజులపై పన్నులను ఎడాపెడా పెంచింది. పొరుగున్న ఉన్న రాష్ట్రాలు లీజుదారులను ప్రోత్సహించి, మైనింగ్ రంగం వృద్ధి చెందేలా చేస్తే... వైకాపా ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా లీజుదారులను పూర్తిగా పిండేయడమే లక్ష్యంగా చేసుకుంది. లీజుదారులు తమపై పడిన భారాన్ని నిర్మాణదారులపై వేస్తున్నారు.
గత ప్రభుత్వంలో కంకరకు సీనరేజ్ ఫీజు టన్నుకు రూ.50 ఉండేది. దీనికి జిల్లా ఖనిజ నిధి(డీఎంఎఫ్) సుంకం 30%, ఖనిజాన్వేషణ ట్రస్టు నిధి (మెరిట్) సుంకం 2% కలిపి... లీజుదారుడు టన్నుకు రూ.66 చొప్పున గనుల శాఖకు చెల్లించేవారు. జగన్ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల తర్వాత కంకరకు సీనరేజ్ ఫీజు టన్నుకు రూ.60 చేశారు. దీనికి అనుగుణంగానే డీఎంఎఫ్, మెరిట్ కూడా పెరగడంతో టన్ను ధర రూ.79.20కి చేరింది.
గ్రావెల్కు టన్ను సీనరేజ్ ఫీజు రూ.20, ఉండగా దానికి డీఎంఎఫ్, మెరిట్ కలిపి రూ.27 ఉండేది. దీని సీనరేజ్ రూ.30 చేయడంతో అంతిమంగా రూ.40 చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.
కొవిడ్ తగ్గినా ఆగని వసూళ్లు
కొవిడ్ మొదటి, రెండు దశల ప్రభావం కారణంగా... ప్రభుత్వ ఖర్చుల కోసం కొత్తగా కన్సిడరేషన్ అమౌంట్ అనే సుంకాన్ని 2021 జూన్లో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం గ్రానైట్ మినహా, ఇతర ఖనిజాలకు సీనరేజ్ ఫీజు విలువకు అదనంగా ప్రీమియం అమౌంట్గా వసూలు చేయడం ఆరంభించారు. టన్ను కంకరకు రూ.60 సీనరేజ్ ఫీజు ఉంటే, దానికి ప్రీమియం అమౌంట్గా మరో రూ.60 చెల్లించాలనే నిబంధన తెచ్చారు. దీంతో డీఎంఎఫ్, మెరిట్తో కలిపి టన్నుకు రూ.133.20 చొప్పున గనుల శాఖకు చెల్లించాల్సి వస్తోంది. గ్రావెల్, గ్రానైట్తోపాటు అన్నింటా ఇలాగే కన్సిడరేషన్ అమౌంట్ పేరిట చేస్తున్న వసూళ్లను ఇప్పటికీ ఆపలేదు. కొవిడ్ పరిస్థితులు పూర్తిగా తొలగిపోయాయని, ఈ భారం తగ్గించాలని లీజుదారులు ఎంతగా విన్నవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
బాదుడే బాదుడు...
- గత ప్రభుత్వంలో కంకర క్వారీలకు ఏడాదికి డెడ్రెంట్ హెక్టారుకు రూ.50 వేలు ఉండేది జగన్ వచ్చాక దాన్ని రూ.65 వేలు చేశారు.
- కొత్తగా సెక్యూరిటీ డిపాజిట్ కింద మూడురెట్ల వార్షిక డెడ్రెంట్ చెల్లించాలనే నిబంధన తెచ్చారు. ఫలితంగా లీజుదారుడు ప్రతి హెక్టారుకు రూ.1.95 లక్షలను చెల్లించాల్సి వస్తోంది.
- కొత్త లీజుదారులు, పాత లీజును రెన్యువల్ చేసుకోవాలనుకునే వారూ... పది రెట్ల వార్షిక డెడ్రెంట్ను చెల్లించాలనే మరో నిబంధనను తీసుకొచ్చారు. అంటే ఒక హెక్టారులో కొత్త కంకర లీజు పొందాలన్నా, పాత లీజు రెన్యువల్ చేసుకోవాలన్నా తప్పనిసరిగా రూ.6.50 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఈ సొమ్మును వెనక్కి ఇవ్వరు.
అటు బాదుడు.. ఇటు పెరుగుడు
చిన్న ఇల్లు నిర్మించుకోవడానికి అయ్యే ఖర్చు ఐదేళ్లతో పోలిస్తే రూ.4-5 లక్షలు పెరగడం గమనార్హం. వెయ్యి చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణానికి అప్పుడు రూ.13-15 లక్షలు అయ్యేది. ఇప్పుడది రూ.18-20 లక్షలకు చేరింది. నిర్మాణంలో వినియోగించే ఇసుక, కంకర, గ్రావెల్, ఇటుక, సిమెంట్, ఐరన్, టైల్స్... తదితరాల కోసం చేసే ఖర్చు అదనంగా రూ.4 లక్షలపైనే పెరిగిపోయింది. ఇందుకు జగన్ ప్రభుత్వం మైనింగ్ రంగంపై వేసిన అదనపు భారాలే ప్రధాన కారణం.
- వెయ్యి చదరపు అడుగుల్లో నిర్మించే ఇంటికి పిల్లర్లు, స్లాబ్ కోసం సగటున 70 టన్నుల వరకు కంకర అవసరమవుతుంది. అయిదేళ్ల కిందట టన్నుకు రూ.300 వెచ్చిస్తే కంకర ఇంటి వద్దకు చేరేది. ఇప్పుడు టన్నుకు రూ.500 ఖర్చు చేయాల్సి వస్తోంది.
- గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమలులో ఉండేది. కేవలం రీచ్లో లోడింగ్కు అయ్యే ఖర్చుతోపాటు రవాణా ఛార్జీలు కలిపితే టన్నుకి రూ.300 వెచ్చిస్తే ఇంటికి ఇసుక వచ్చేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం ప్రతి టన్నుకు రీచ్లోనే రూ.475 తీసుకుంటున్నారు. దీనికి రవాణా ఛార్జీలు కలిపి మొత్తంగా రూ.వెయ్యి భరించాల్సి వస్తోంది.
- పునాది నిర్మించాక, అందులో నింపేందుకు ఉపయోగించే గ్రావెల్ గతంలో టన్నుకు రూ.100 ఖర్చయ్యేది. ఇప్పుడు టన్నుకు రూ.400 ఇవ్వాల్సి వస్తోంది.
- ఇంటి నిర్మాణానికి 20 వేల ఇటుకల వరకు అవసరం అవుతాయి. అయిదేళ్ల కిందట ఒక ఇటుక ధర సగటున రూ.5 ఉండగా, ఇప్పుడది రూ.10కి పెరిగింది.
- గతంలో 50 కిలోల బస్తా సిమెంట్ ధర రూ.200-220 ఉండేది. ఇప్పుడది ఏకంగా రూ.350కి చేరింది.
- ఐరన్ కూడా టన్ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు ఎగబాకింది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.