సలహాదారులు.. జగన్మాయదారి మేతగాళ్లు!
అభివృద్ధికి నిధుల్లేవు... రహదారులకు డబ్బుల్లేవు... ప్రాజెక్టులకు పైసల్లేవు... కానీ... అప్పులు చేసి తెచ్చిన... ఆదాయంగా వచ్చిన ప్రజల సొమ్మును... కోట్లలో అప్పనంగా... అయినవారికి ‘సలహాల’ పేరుతో ఫలహారంగా పంచిన నాయకుడిని ఏమనాలి? జగజ్జంత్రీ అనాలా... కంత్రీ అనాలా?
అభివృద్ధికి నిధుల్లేవు... రహదారులకు డబ్బుల్లేవు... ప్రాజెక్టులకు పైసల్లేవు... కానీ... అప్పులు చేసి తెచ్చిన... ఆదాయంగా వచ్చిన ప్రజల సొమ్మును... కోట్లలో అప్పనంగా... అయినవారికి ‘సలహాల’ పేరుతో ఫలహారంగా పంచిన నాయకుడిని ఏమనాలి? జగజ్జంత్రీ అనాలా... కంత్రీ అనాలా?
సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, చంద్రహాసరెడ్డి, లోకేశ్వర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వీరారెడ్డి, విద్యాసాగర్రెడ్డి.. ఇలా ఇంకెందరో! అందరూ మహానుభావులే.. ‘‘సామాజిక న్యాయాన్ని చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం’’ అని మహాగర్వంగా టముకేసుకునే జగన్ ఏలుబడిలో సలహాదారులైన వారే! అన్ని అర్హతలూ ఉండీ ఉద్యోగాల్లేక చదువుకున్న యువతీ యువకులు ఒకపక్క ఏడుస్తున్నారు. వాళ్ల ఖర్మకు వాళ్లను వదిలేసిన జగన్- తన మోచేతి నీళ్లకు లొట్టలేసే ప్రబుద్ధులకు ఏరికోరి సలహాదారు పదవులిచ్చారు. ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు లోగడే స్పష్టం చేసింది. అయినా సలహాదారుల పేరిట జనం సొమ్మును జగన్ విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. ‘‘సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు’’ అని హైకోర్టు తలంటినా జగన్ వినలేదు. ప్రజలకు పనికిరాని సలహాదారుల నియామకాలను ఆపలేదు. పొట్ట పగిలేలా ప్రజాధనాన్ని మేయడం, అయిన వారిని మేపడమే పనిగా పెట్టుకున్న ప్రజాకంటక ప్రభుత్వాధినేత జగన్. సామాన్యుల సంపదను ఆబగా ఆరగించి ఆనందంగా అరాయించుకోవడంలో ఆయన ముఠాయే నంబర్ వన్!
మొండి గురువు.. బండ శిష్యుడు!
‘కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు/ మొండివాని హితుడు బండవాడు/ దుండగీడునకును కొండెడు దళవాయి..’ అనే పద్యం తెలుగువారికి బాగా తెలిసిందే. మొండోడికి బండోడే మిత్రుడు, దుష్టుడికి అబద్ధాలకోరే సహాయకుడు అన్నది దాని భావం. జగన్- సజ్జల కాంబినేషన్కు అచ్చుగుద్దినట్లు సరిపోయే పద్యమది! ప్రభుత్వ సలహాదారు పనేంటి? ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఏం చేస్తే బాగుంటుందో ప్రభుత్వానికి సూచనలూ సలహాలు ఇవ్వాలి. జగన్ చంకలో దూరి అపరిమిత అధికారాలు చలాయించిన సజ్జల చేసిందేంటి? ‘‘పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ, సీఎం ఆదేశాలను పాటిస్తుంటాం’’ అని ఆయనే ఓసారి ఉన్న నిజం కక్కేశారు. ప్రతిపక్షాలు, వైకాపాకు గిట్టనివాళ్లపై టన్నులకొద్దీ బురదజల్లే సజ్జల- జగన్నాటక సూత్రధారులకు నమ్మినబంటు. ‘‘వివేకా హత్య కేసు విషయంలో ఇకపై ఏం చేయాలనుకున్నా సజ్జలను సంప్రదించి చేయాలని భారతి నాకు చెప్పారు’’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వై.ఎస్.సునీత పేర్కొన్నారు. తండ్రి పదవినే పెట్టుబడిగా మార్చుకుని జగన్ పోగేసిన అక్రమాస్తులపై చాలా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక దాంతో సంబంధం ఉన్న ఈశ్వర్ సిమెంట్స్ సంస్థ అప్పటి డైరెక్టర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. ఇదీ జగన్కూ సజ్జలకు ఉన్న జోగీ జోగీ సంబంధం! తనకు మద్దెల కొట్టడంలో అందరి కంటే ముందుండే సజ్జలను సలహాదారు రూపంలో ‘రాజ ప్రతినిధి’గా ప్రతిష్ఠించారు జగన్. ప్రజా ప్రతినిధులకు మించిన ప్రాధాన్యాన్ని ఆయనకు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా ఖూనీ చేశారు.
నీతీరీతీ లేని జగన్ పాలన
నకిలీ బంగారానికి మెరుపులెక్కువ అన్నట్లు జగన్మోహన్రెడ్డికి మాటలెక్కువ! ‘‘రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున ఆర్థిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి’’ అని సీఎం అయిన కొత్తలో అధికారులకు పాలనాసూక్తులు బోధించారు జగన్. అలా శ్రీరంగనీతులు చెప్పిన వారం లోపే తనకు ప్రసంగాలు రాసిచ్చే జీవీడీ కృష్ణమోహన్ను రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారుగా కొలువు తీర్చారు. ఏడాది తిరిగేసరికి ఆయన జీతాన్ని రూ.2 లక్షలకు పెంచేశారు. అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికుల వంటి బడుగు వేతనజీవుల బాధలను కనీసం వినడానికి కూడా జగన్ ఇష్టపడలేదు. అలాంటాయన తన వందిమాగధులు చాలామందిని సలహాదారులు, ప్రజాసంబంధాల అధికారులను చేసిపారేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వంద నుంచి నూటపాతిక కోట్ల రూపాయల జనం సొమ్మును సలహాదారులు, వారి సిబ్బంది కోసం ధారపోశారు. అదే జగన్.. నిధులు ఇవ్వకుండా రోడ్లను గుంతలమయం చేశారు. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టారు. అభివృద్ధి పనులకు కాసులు రాల్చకుండా ప్రజలను కష్టాల కడలిలోకి నెట్టేశారు.
తోడుదొంగల రాజ్యం
ఏదో ఒక ముసుగేసుకుని ముష్కర మూకలకు సాయంచేసే ‘స్లీపర్సెల్స్’ గురించి వినేఉంటారు కదా. 2019 ఎన్నికలకు ముందు జగన్కు అలా ఊడిగం చేసినవారిలో అజేయ కల్లం ఒకరు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన ఆయన- మేధావులతో భేటీల పేరిట అప్పట్లో తెదేపా సర్కారును జనంలో పలుచన చేసేందుకు తెగ కష్టపడ్డారు. వైకాపా మ్యానిఫెస్టో తయారీలోనూ అయ్య వారు ఒక చెయ్యివేశారు. ఆ క్రమంలోనే మరికొందరితో కలిసి ఓ రోజు తెల్లవారుజామున జగన్తో సమావేశమయ్యారు అజేయ కల్లం. ఆ రోజే వివేకానందరెడ్డి హత్య జరిగింది. ‘‘సమావేశం జరుగుతుండగానే 5.30 గంటల సమయంలో అటెండర్ వచ్చి అమ్మ (భారతి) పిలుస్తున్నారని జగన్కు చెప్పారు. బయటికి వెళ్లిన జగన్ పది నిమిషాల తరవాత తిరిగి వచ్చి చిన్నాన్న ఈజ్ నో మోర్ అన్నారు’’ అంటూ అజేయ కల్లం వాంగ్మూలమిచ్చినట్లు కోర్టుకు సీబీఐ తెలియజేసింది. వివేకా మరణవార్త బయటికి రావడానికి గంట ముందే జగన్కు ఆ విషయం తెలుసునన్న కీలకాంశం దీంతో వెలుగుచూసింది. తన వాంగ్మూలాన్ని సీబీఐ మార్చేసిందంటూ అజేయ కల్లం ఆపై ఆరోపించారు. ఒత్తిడి వల్లే ఆయన అలా మాట మార్చారని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ సమాచారమిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి తనతో ఇంతటి ‘ప్రత్యేక అనుబంధం’ కలిగిన అజేయ కల్లంకు తాను సీఎం కాగానే ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు జగన్. తవ్వుకుంటూ పోతే సలహాదారుల నియామకాల వెనక ఇలాంటి చీకటి కథలెన్నో.. తోడుదొంగలై రాష్ట్ర ఖజానాకు కన్నాలేసిన వైకాపా పెద్దలు, వాళ్ల పాదసేవకుల లోగుట్లు అన్నీ ఆ పెరుమాళ్లకే ఎరుక!
వ్యవస్థకు వేరుపురుగు
రోజంతా కష్టపడితే తప్ప సామాన్యులు నాలుగు ముద్దలు తినలేరు. జగన్ అనే అవినీతి విష వృక్షం నీడలో సేదతీరిన సలహాదారులేమో జనం సొమ్మును అప్పనంగా జేబుల్లో వేసుకున్నారు. ‘ఇప్పటి వరకూ ఏ బాధ్యతలూ నిర్దేశించని సలహాదారులకు నిర్దిష్టమైన పాత్ర, బాధ్యతలను రూపొందించే పనిలో ప్రభుత్వముంది’ అని జగన్ సర్కారు 2023 మార్చిలో హైకోర్టుకు తెలియజేసింది. అంటే ఏంటి.. పనీ పాటా లేని సలహాదారులను జగన్ సర్కారు అన్నేళ్లూ అడ్డగోలుగా మేపిందనే కదా అర్థం! అదొక దరిద్రమైతే- రాష్ట్రంలో అసలు ఎంతమంది సలహాదారులు తిష్టవేశారో ప్రభుత్వానికే తెలియక పోవడం మరీ అరాచకం! సలహాదారుల వివరాలు చెప్పాలంటూ హైకోర్టు ఆదేశించిన దరిమిలా ఏ శాఖలో ఎవరున్నారో తెలుసుకోవడానికి సర్కారు ఓ సర్క్యులర్ విడుదల చేసింది. స్వీయ ప్రయోజనాలకోసం వ్యవస్థను ఇంతగా భ్రష్టుపట్టించిన సీఎం- దేశంలో జగన్ తప్ప మరొకరు లేరు.
జనం సొమ్ము.. జగన్ ముఠా పాలు!
జుల్ఫీ రవ్ద్జీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఆయన ఎవరో ఏంటో ఏపీలో నరమానవుడికి తెలియదు. అలాంటి వ్యక్తికి సలహాదారు పేరిట క్యాబినెట్ హోదా ఇచ్చారు జగన్. భూఆక్రమణల వివాదాల్లో ఉన్న తన దగ్గరి బంధువు తిరుపాల్రెడ్డిని వ్యవసాయ శాఖకు సలహాదారును చేశారు జగన్. అలాగే, ఉద్యానశాఖకు సలహాదారుగా వైఎస్ఆర్ జిల్లాకే చెందిన పుట్టా శివప్రసాద్రెడ్డిని కొలువుతీర్చారు. మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్రెడ్డికి జలవనరుల శాఖ సలహాదారు పదవిని కట్టబెట్టారు. వీళ్లెవరూ ఆయా రంగాల్లో నిపుణులు కారు. జగన్, ఆయన పార్టీతో బొడ్డుపేగు బంధం తప్ప వేరే అర్హతలేమీ లేవు. అయినప్పటికీ ఇలాంటి వాళ్లెందరో సలహాదారులై రాష్ట్రం నెత్తిన తెల్ల ఏనుగులై కూర్చున్నారు.
హైకోర్టు కన్నెర్ర చేసినా..
ప్రజాప్రయోజనాలతో నిమిత్తం లేకుండా పచ్చి రాజకీయ స్వార్థంతో ఎవరిని పడితే వారిని సలహాదారులను చేసేయడమేంటి? జగన్ జమానాలో వెర్రితలలు వేసిన ఈ పెడపోకడపై ఉన్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ‘‘మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలం కానీ, ప్రభుత్వ శాఖలకు సలహాదారులేంటి’’ అని రాష్ట్ర హైకోర్టు నిగ్గదీసింది. ఐఏఎస్ల కంటే వాళ్లు గొప్ప సలహాలిస్తారా, ఇలాగే వదిలేస్తే రేపొద్దున కలెక్టర్, పోలీస్ కమిషనర్, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు మండిపడింది. చీమూనెత్తురు ఉన్న వారు ఎవరైనా సరే, న్యాయపాలిక ఇన్ని చివాట్లు పెట్టాక కాస్తయినా సర్దుకుంటారు. సిగ్గుమాలినతనంలో సాటిలేని జగన్ మాత్రం హైకోర్టు కన్నెర్ర చేసినా సలహాదారు పదవుల పందేరాన్ని ఆపలేదు. ఆఖరికి మొన్న మార్చిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు కూడా విపత్తుల నిర్వహణశాఖకు సలహాదారుగా మేడా గురుదత్త ప్రసాద్కు పట్టంకట్టారు. జనసేనను వదిలి ఇటీవలే వైకాపా కండువా కప్పుకొన్న ప్రసాద్కు జగన్ వడ్డించిన తాయిలమిది!
అటు అక్రమాలు.. ఇటు జగన్కు చిడతలు
జగన్ పుణ్యమా అని సలహాదారులైన వారిలో కొందరు భారీగా అక్రమాలకూ తెగబడ్డారు. శ్రీశైలంలో వివిధ పనుల కోసం రూ.110 కోట్లతో టెండర్లు పిలిచారు. పెద్దసంఖ్యలో బిడ్లు కూడా దాఖలయ్యాయి. ఇంతలో సకల శాఖల సలహాదారుగా మాంఛి పేరుపొందిన పెద్దమనిషి రంగంలోకి వచ్చారు. తన మనుషులకు ఆ పనులు దక్కట్లేదన్న దుగ్ధతో టెండర్లనే రద్దు చేయించారు. రూ.750 కోట్లతో 5 లక్షల ట్యాబుల కొనుగోళ్ల టెండర్లనూ అయినవారి పరం చేసేందుకు ఆయనే చక్రం తిప్పారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్రెడ్డి ఇటీవల సచివాలయంలోనే విలేకర్ల సమావేశం పెట్టి మరీ జగన్కు చిడతలు కొట్టారు. చెత్తపన్నులు.. కరెంట్, ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో పేదల రక్తం పిండిన జగన్- ఆ డబ్బుతో తన భజనపరుల కడుపులు నింపారు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయడం నేరం. సలహాదారుల నియామకాలతో ఆ మహాపరాధానికి ఒడిగట్టిన జగన్- ప్రజాకోర్టులో కఠిన దండనకు అర్హులు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు