సలహాదారులు.. జగన్మాయదారి మేతగాళ్లు!
అభివృద్ధికి నిధుల్లేవు... రహదారులకు డబ్బుల్లేవు... ప్రాజెక్టులకు పైసల్లేవు... కానీ... అప్పులు చేసి తెచ్చిన... ఆదాయంగా వచ్చిన ప్రజల సొమ్మును... కోట్లలో అప్పనంగా... అయినవారికి ‘సలహాల’ పేరుతో ఫలహారంగా పంచిన నాయకుడిని ఏమనాలి? జగజ్జంత్రీ అనాలా... కంత్రీ అనాలా?
అభివృద్ధికి నిధుల్లేవు... రహదారులకు డబ్బుల్లేవు... ప్రాజెక్టులకు పైసల్లేవు... కానీ... అప్పులు చేసి తెచ్చిన... ఆదాయంగా వచ్చిన ప్రజల సొమ్మును... కోట్లలో అప్పనంగా... అయినవారికి ‘సలహాల’ పేరుతో ఫలహారంగా పంచిన నాయకుడిని ఏమనాలి? జగజ్జంత్రీ అనాలా... కంత్రీ అనాలా?
సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, చంద్రహాసరెడ్డి, లోకేశ్వర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వీరారెడ్డి, విద్యాసాగర్రెడ్డి.. ఇలా ఇంకెందరో! అందరూ మహానుభావులే.. ‘‘సామాజిక న్యాయాన్ని చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం’’ అని మహాగర్వంగా టముకేసుకునే జగన్ ఏలుబడిలో సలహాదారులైన వారే! అన్ని అర్హతలూ ఉండీ ఉద్యోగాల్లేక చదువుకున్న యువతీ యువకులు ఒకపక్క ఏడుస్తున్నారు. వాళ్ల ఖర్మకు వాళ్లను వదిలేసిన జగన్- తన మోచేతి నీళ్లకు లొట్టలేసే ప్రబుద్ధులకు ఏరికోరి సలహాదారు పదవులిచ్చారు. ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు లోగడే స్పష్టం చేసింది. అయినా సలహాదారుల పేరిట జనం సొమ్మును జగన్ విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. ‘‘సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు’’ అని హైకోర్టు తలంటినా జగన్ వినలేదు. ప్రజలకు పనికిరాని సలహాదారుల నియామకాలను ఆపలేదు. పొట్ట పగిలేలా ప్రజాధనాన్ని మేయడం, అయిన వారిని మేపడమే పనిగా పెట్టుకున్న ప్రజాకంటక ప్రభుత్వాధినేత జగన్. సామాన్యుల సంపదను ఆబగా ఆరగించి ఆనందంగా అరాయించుకోవడంలో ఆయన ముఠాయే నంబర్ వన్!
మొండి గురువు.. బండ శిష్యుడు!
‘కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు/ మొండివాని హితుడు బండవాడు/ దుండగీడునకును కొండెడు దళవాయి..’ అనే పద్యం తెలుగువారికి బాగా తెలిసిందే. మొండోడికి బండోడే మిత్రుడు, దుష్టుడికి అబద్ధాలకోరే సహాయకుడు అన్నది దాని భావం. జగన్- సజ్జల కాంబినేషన్కు అచ్చుగుద్దినట్లు సరిపోయే పద్యమది! ప్రభుత్వ సలహాదారు పనేంటి? ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఏం చేస్తే బాగుంటుందో ప్రభుత్వానికి సూచనలూ సలహాలు ఇవ్వాలి. జగన్ చంకలో దూరి అపరిమిత అధికారాలు చలాయించిన సజ్జల చేసిందేంటి? ‘‘పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ, సీఎం ఆదేశాలను పాటిస్తుంటాం’’ అని ఆయనే ఓసారి ఉన్న నిజం కక్కేశారు. ప్రతిపక్షాలు, వైకాపాకు గిట్టనివాళ్లపై టన్నులకొద్దీ బురదజల్లే సజ్జల- జగన్నాటక సూత్రధారులకు నమ్మినబంటు. ‘‘వివేకా హత్య కేసు విషయంలో ఇకపై ఏం చేయాలనుకున్నా సజ్జలను సంప్రదించి చేయాలని భారతి నాకు చెప్పారు’’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వై.ఎస్.సునీత పేర్కొన్నారు. తండ్రి పదవినే పెట్టుబడిగా మార్చుకుని జగన్ పోగేసిన అక్రమాస్తులపై చాలా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక దాంతో సంబంధం ఉన్న ఈశ్వర్ సిమెంట్స్ సంస్థ అప్పటి డైరెక్టర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. ఇదీ జగన్కూ సజ్జలకు ఉన్న జోగీ జోగీ సంబంధం! తనకు మద్దెల కొట్టడంలో అందరి కంటే ముందుండే సజ్జలను సలహాదారు రూపంలో ‘రాజ ప్రతినిధి’గా ప్రతిష్ఠించారు జగన్. ప్రజా ప్రతినిధులకు మించిన ప్రాధాన్యాన్ని ఆయనకు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా ఖూనీ చేశారు.
నీతీరీతీ లేని జగన్ పాలన
నకిలీ బంగారానికి మెరుపులెక్కువ అన్నట్లు జగన్మోహన్రెడ్డికి మాటలెక్కువ! ‘‘రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున ఆర్థిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి’’ అని సీఎం అయిన కొత్తలో అధికారులకు పాలనాసూక్తులు బోధించారు జగన్. అలా శ్రీరంగనీతులు చెప్పిన వారం లోపే తనకు ప్రసంగాలు రాసిచ్చే జీవీడీ కృష్ణమోహన్ను రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారుగా కొలువు తీర్చారు. ఏడాది తిరిగేసరికి ఆయన జీతాన్ని రూ.2 లక్షలకు పెంచేశారు. అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికుల వంటి బడుగు వేతనజీవుల బాధలను కనీసం వినడానికి కూడా జగన్ ఇష్టపడలేదు. అలాంటాయన తన వందిమాగధులు చాలామందిని సలహాదారులు, ప్రజాసంబంధాల అధికారులను చేసిపారేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వంద నుంచి నూటపాతిక కోట్ల రూపాయల జనం సొమ్మును సలహాదారులు, వారి సిబ్బంది కోసం ధారపోశారు. అదే జగన్.. నిధులు ఇవ్వకుండా రోడ్లను గుంతలమయం చేశారు. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టారు. అభివృద్ధి పనులకు కాసులు రాల్చకుండా ప్రజలను కష్టాల కడలిలోకి నెట్టేశారు.
తోడుదొంగల రాజ్యం
ఏదో ఒక ముసుగేసుకుని ముష్కర మూకలకు సాయంచేసే ‘స్లీపర్సెల్స్’ గురించి వినేఉంటారు కదా. 2019 ఎన్నికలకు ముందు జగన్కు అలా ఊడిగం చేసినవారిలో అజేయ కల్లం ఒకరు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన ఆయన- మేధావులతో భేటీల పేరిట అప్పట్లో తెదేపా సర్కారును జనంలో పలుచన చేసేందుకు తెగ కష్టపడ్డారు. వైకాపా మ్యానిఫెస్టో తయారీలోనూ అయ్య వారు ఒక చెయ్యివేశారు. ఆ క్రమంలోనే మరికొందరితో కలిసి ఓ రోజు తెల్లవారుజామున జగన్తో సమావేశమయ్యారు అజేయ కల్లం. ఆ రోజే వివేకానందరెడ్డి హత్య జరిగింది. ‘‘సమావేశం జరుగుతుండగానే 5.30 గంటల సమయంలో అటెండర్ వచ్చి అమ్మ (భారతి) పిలుస్తున్నారని జగన్కు చెప్పారు. బయటికి వెళ్లిన జగన్ పది నిమిషాల తరవాత తిరిగి వచ్చి చిన్నాన్న ఈజ్ నో మోర్ అన్నారు’’ అంటూ అజేయ కల్లం వాంగ్మూలమిచ్చినట్లు కోర్టుకు సీబీఐ తెలియజేసింది. వివేకా మరణవార్త బయటికి రావడానికి గంట ముందే జగన్కు ఆ విషయం తెలుసునన్న కీలకాంశం దీంతో వెలుగుచూసింది. తన వాంగ్మూలాన్ని సీబీఐ మార్చేసిందంటూ అజేయ కల్లం ఆపై ఆరోపించారు. ఒత్తిడి వల్లే ఆయన అలా మాట మార్చారని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ సమాచారమిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి తనతో ఇంతటి ‘ప్రత్యేక అనుబంధం’ కలిగిన అజేయ కల్లంకు తాను సీఎం కాగానే ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు జగన్. తవ్వుకుంటూ పోతే సలహాదారుల నియామకాల వెనక ఇలాంటి చీకటి కథలెన్నో.. తోడుదొంగలై రాష్ట్ర ఖజానాకు కన్నాలేసిన వైకాపా పెద్దలు, వాళ్ల పాదసేవకుల లోగుట్లు అన్నీ ఆ పెరుమాళ్లకే ఎరుక!
వ్యవస్థకు వేరుపురుగు
రోజంతా కష్టపడితే తప్ప సామాన్యులు నాలుగు ముద్దలు తినలేరు. జగన్ అనే అవినీతి విష వృక్షం నీడలో సేదతీరిన సలహాదారులేమో జనం సొమ్మును అప్పనంగా జేబుల్లో వేసుకున్నారు. ‘ఇప్పటి వరకూ ఏ బాధ్యతలూ నిర్దేశించని సలహాదారులకు నిర్దిష్టమైన పాత్ర, బాధ్యతలను రూపొందించే పనిలో ప్రభుత్వముంది’ అని జగన్ సర్కారు 2023 మార్చిలో హైకోర్టుకు తెలియజేసింది. అంటే ఏంటి.. పనీ పాటా లేని సలహాదారులను జగన్ సర్కారు అన్నేళ్లూ అడ్డగోలుగా మేపిందనే కదా అర్థం! అదొక దరిద్రమైతే- రాష్ట్రంలో అసలు ఎంతమంది సలహాదారులు తిష్టవేశారో ప్రభుత్వానికే తెలియక పోవడం మరీ అరాచకం! సలహాదారుల వివరాలు చెప్పాలంటూ హైకోర్టు ఆదేశించిన దరిమిలా ఏ శాఖలో ఎవరున్నారో తెలుసుకోవడానికి సర్కారు ఓ సర్క్యులర్ విడుదల చేసింది. స్వీయ ప్రయోజనాలకోసం వ్యవస్థను ఇంతగా భ్రష్టుపట్టించిన సీఎం- దేశంలో జగన్ తప్ప మరొకరు లేరు.
జనం సొమ్ము.. జగన్ ముఠా పాలు!
జుల్ఫీ రవ్ద్జీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఆయన ఎవరో ఏంటో ఏపీలో నరమానవుడికి తెలియదు. అలాంటి వ్యక్తికి సలహాదారు పేరిట క్యాబినెట్ హోదా ఇచ్చారు జగన్. భూఆక్రమణల వివాదాల్లో ఉన్న తన దగ్గరి బంధువు తిరుపాల్రెడ్డిని వ్యవసాయ శాఖకు సలహాదారును చేశారు జగన్. అలాగే, ఉద్యానశాఖకు సలహాదారుగా వైఎస్ఆర్ జిల్లాకే చెందిన పుట్టా శివప్రసాద్రెడ్డిని కొలువుతీర్చారు. మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్రెడ్డికి జలవనరుల శాఖ సలహాదారు పదవిని కట్టబెట్టారు. వీళ్లెవరూ ఆయా రంగాల్లో నిపుణులు కారు. జగన్, ఆయన పార్టీతో బొడ్డుపేగు బంధం తప్ప వేరే అర్హతలేమీ లేవు. అయినప్పటికీ ఇలాంటి వాళ్లెందరో సలహాదారులై రాష్ట్రం నెత్తిన తెల్ల ఏనుగులై కూర్చున్నారు.
హైకోర్టు కన్నెర్ర చేసినా..
ప్రజాప్రయోజనాలతో నిమిత్తం లేకుండా పచ్చి రాజకీయ స్వార్థంతో ఎవరిని పడితే వారిని సలహాదారులను చేసేయడమేంటి? జగన్ జమానాలో వెర్రితలలు వేసిన ఈ పెడపోకడపై ఉన్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ‘‘మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలం కానీ, ప్రభుత్వ శాఖలకు సలహాదారులేంటి’’ అని రాష్ట్ర హైకోర్టు నిగ్గదీసింది. ఐఏఎస్ల కంటే వాళ్లు గొప్ప సలహాలిస్తారా, ఇలాగే వదిలేస్తే రేపొద్దున కలెక్టర్, పోలీస్ కమిషనర్, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు మండిపడింది. చీమూనెత్తురు ఉన్న వారు ఎవరైనా సరే, న్యాయపాలిక ఇన్ని చివాట్లు పెట్టాక కాస్తయినా సర్దుకుంటారు. సిగ్గుమాలినతనంలో సాటిలేని జగన్ మాత్రం హైకోర్టు కన్నెర్ర చేసినా సలహాదారు పదవుల పందేరాన్ని ఆపలేదు. ఆఖరికి మొన్న మార్చిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు కూడా విపత్తుల నిర్వహణశాఖకు సలహాదారుగా మేడా గురుదత్త ప్రసాద్కు పట్టంకట్టారు. జనసేనను వదిలి ఇటీవలే వైకాపా కండువా కప్పుకొన్న ప్రసాద్కు జగన్ వడ్డించిన తాయిలమిది!
అటు అక్రమాలు.. ఇటు జగన్కు చిడతలు
జగన్ పుణ్యమా అని సలహాదారులైన వారిలో కొందరు భారీగా అక్రమాలకూ తెగబడ్డారు. శ్రీశైలంలో వివిధ పనుల కోసం రూ.110 కోట్లతో టెండర్లు పిలిచారు. పెద్దసంఖ్యలో బిడ్లు కూడా దాఖలయ్యాయి. ఇంతలో సకల శాఖల సలహాదారుగా మాంఛి పేరుపొందిన పెద్దమనిషి రంగంలోకి వచ్చారు. తన మనుషులకు ఆ పనులు దక్కట్లేదన్న దుగ్ధతో టెండర్లనే రద్దు చేయించారు. రూ.750 కోట్లతో 5 లక్షల ట్యాబుల కొనుగోళ్ల టెండర్లనూ అయినవారి పరం చేసేందుకు ఆయనే చక్రం తిప్పారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్రెడ్డి ఇటీవల సచివాలయంలోనే విలేకర్ల సమావేశం పెట్టి మరీ జగన్కు చిడతలు కొట్టారు. చెత్తపన్నులు.. కరెంట్, ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో పేదల రక్తం పిండిన జగన్- ఆ డబ్బుతో తన భజనపరుల కడుపులు నింపారు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయడం నేరం. సలహాదారుల నియామకాలతో ఆ మహాపరాధానికి ఒడిగట్టిన జగన్- ప్రజాకోర్టులో కఠిన దండనకు అర్హులు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్