సీఎం బలప్రదర్శన కోసం వేల మందికి ప్రత్యక్ష నరకం
‘మీరేం ముఖ్యమంత్రి! బలప్రదర్శన కోసం వేల మంది ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తారా? మీ బస్సు యాత్రకు జనాలు విరగబడిపోతున్నట్లు చూపించేందుకు.. డ్రోన్ షాట్లు, ఫొటో, వీడియోషూట్ల చిత్రీకరణ కోసం గంటల తరబడి జాతీయ రహదారిని స్తంభింపజేస్తారా?
హైవేపై గుంటూరు-విజయవాడ మధ్య 4 గంటలు ట్రాఫిక్ నిలిపేసిన పోలీసులు
పెద్ద సంఖ్యలో జనాలను చూపించాలన్న తాపత్రయంలో గంటల తరబడి జాతీయ రహదారిని స్తంభింపజేస్తారా?
ఈనాడు-అమరావతి: ‘మీరేం ముఖ్యమంత్రి! బలప్రదర్శన కోసం వేల మంది ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తారా? మీ బస్సు యాత్రకు జనాలు విరగబడిపోతున్నట్లు చూపించేందుకు.. డ్రోన్ షాట్లు, ఫొటో, వీడియోషూట్ల చిత్రీకరణ కోసం గంటల తరబడి జాతీయ రహదారిని స్తంభింపజేస్తారా? మీ ‘ఎలక్షన్ షో’ కోసం ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ నిలిపేసి.. వాటిని ఒక్కసారిగా వదిలి వాహనదారుల్ని, సామాన్య ప్రయాణికుల్ని హింసిస్తారా? అసలు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత మీకుందా? మీ ప్రచారం కోసం ఇంత పైశాచికత్వమా?’
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి తాను ప్రయాణించే మార్గాల్లోని జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులను ఎక్కడికక్కడ స్తంభింపజేసి ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్న జగన్ శనివారం దాన్ని పరాకాష్ఠకు చేర్చారు. 14వ రోజు యాత్రను శనివారం గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ వద్ద నుంచి ఆయన మొదలుపెట్టారు. కాజా, మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి చేరుకుని భోజన విరామం కోసం ఆగారు. కనకదుర్గ వారధి మీదుగా సాయంత్రానికి విజయవాడలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో వారధిపైన డ్రోన్ షాట్లతో ఫొటో, వీడియో షూట్ పెట్టుకున్నారు. వారధి మొత్తం జనసందోహంతో నిండిపోయినట్లు డ్రోన్ వీడియో, ఫొటో షూట్లలో కనిపించేలా చేసేందుకు అంతకు ముందు గుంటూరు- విజయవాడ మధ్య జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ నిలిపేశారు. దీంతో ఎండలో ప్రయాణికులకు, వాహనదారులకు నరకమేంటో అనుభవంలోకి వచ్చింది. ఈ ప్రభావంతో మొత్తంగా నాలుగు గంటలపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.
జాతీయ రహదారులపై జగన్ యాత్రలకు అనుమతులు రద్దు చేయాల్సిందే
చెన్నై- కోల్కతా జాతీయ రహదారి అత్యంత ప్రధానమైనది. అందులో గుంటూరు-విజయవాడ మధ్య ఒక్క గంటలోనే వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సాయంత్రం వేళ ఈ రద్దీ మరింత తీవ్రంగా ఉంటుంది. గుంటూరు నుంచి విజయవాడకు చేరుకోవటానికి బైపాస్ కూడా లేదు. వారధి మీదుగా ప్రయాణించాల్సిందే. ఏ మాత్రం ఇంగితం ఉన్నవారైనా అలాంటి మార్గంలో వీలైనంత వరకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించకూడదనే ప్రయత్నిస్తారు. జాతీయ రహదారి మొత్తం ఆరు వరుసలుగా ఉంది. తప్పనిసరైతే ఒకటి, రెండు వరుసల్లో యాత్రకు అనుమతించి మిగతా వరుసల్లో సాధారణ ప్రయాణికుల రాకపోకలు కొనసాగేలా చూడొచ్చు. కానీ జగన్ కోసం ఏకంగా మొత్తం రహదారినే స్తంభింపజేసేశారు. దీంతో వేల మంది వాహనదారులు మండుటెండలో అల్లాడిపోయారు. అసలు ఇంతటి కీలకమైiన జాతీయ రహదారిపై యాత్రకు ఎన్నికల సంఘం ఎలా అనుమతిచ్చింది? ఇప్పటికైనా జాతీయ రహదారులపై జగన్ యాత్రకు అనుమతులు రద్దు చేయకపోతే ప్రజలకు మున్ముందు మరింత నరకం చూపించటం తథ్యం.
పోలీసులకైనా ఇంగితం ఉండొద్దా!
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులవుతున్నా పోలీసులు ఇంకా వైకాపా సేవలో తరించటమేంటి? ముఖ్యమంత్రి అయితే ఆయనకేమైనా ప్రత్యేక హక్కులుంటాయా? జగన్ తన పార్టీ తరఫున రాజకీయ ప్రచారం కోసం తిరుగుతుంటే దాని కోసం జాతీయ రహదారిపై రాకపోకల్ని స్తంభింపజేయటమేంటి? వేలమందికి ఇబ్బందులు సృష్టించిన జగన్, పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. తాడేపల్లి వద్ద సర్వీసు రోడ్డులో మార్నింగ్స్టార్ ట్రావెల్స్ వద్ద మధ్యాహ్న భోజన విరామం కోసం 2 గంటల సమయంలో జగన్ ఆగారు. దాదాపు 4.30 వరకూ అక్కడే ఉన్నారు. అప్పుడు కూడా పోలీసులు అత్యుత్సాహం చూపించి జాతీయ రహదారిపై, సర్వీసు రోడ్డులోకి వచ్చే మార్గంలోనూ ట్రాఫిక్ ఆపేశారు.
మండుటెండలో మాడిపోయిన ప్రయాణికులు
గుంటూరు-విజయవాడ మధ్య ప్రయాణ సమయం గరిష్ఠంగా 45 నిమిషాలు. కానీ జగన్ ప్రచార పిచ్చి వల్ల ట్రాఫిక్ను నిలిపేయటంతో శనివారం 4 గంటల సమయం పట్టింది. చెన్నై- కోల్కతా లాంటి అత్యంత రద్దీ జాతీయ రహదారిని గుంటూరు-విజయవాడ మధ్య కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడ్డేశ్వరం బైపాస్ రోడ్డులో ఎయిమ్స్కు వెళ్లే కూడలి వద్ద మూడున్నర గంటల పాటు పోలీసులు వాహనాలను నిలిపివేయించారు. దీంతో పసిపిల్లలతో ప్రయాణిస్తున్న తల్లులు నరకం అనుభవించారు. బస్సుల్లో గాలి ఆడక చిన్నారులు ఏడుస్తుంటే సముదాయించలేక ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండలో ద్విచక్రవాహనదారులు అల్లాడిపోయారు. కొందరైతే వడదెబ్బకు గురయ్యారు.
చీకటి జీవో తెచ్చారు కదా!
‘రహదారులపై సభలు, సమావేశాలు నిర్వహించటం వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడినవారు సకాలంలో వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై సభల నిర్వహణ వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగి లాజిస్టిక్స్ సరఫరాపై ప్రభావం పడుతోంది’ అంటూ జగన్ గతేడాది జనవరిలో జీవో 1 తెచ్చారు. ప్రతిపక్షాలను అణచివేయడానికి తెచ్చిన ఈ జీవోను న్యాయస్థానాలు కొట్టేశాయి. ప్రతిపక్షాలను వేధించేందుకు అప్పట్లో ఇలాంటి జీవో తెచ్చిన జగన్కు ఇప్పుడు ఆ నిబంధనలు ఎందుకు పాటించరు?
అతలాకుతలమైన విజయవాడ
విజయవాడలో జగన్ యాత్ర సందర్భంగా బస్సుల్ని దారి మళ్లించారు. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ను నిలిపేశారు. అంతర్గత రోడ్లనూ బారికేడ్లతో మూసేశారు. దీంతో విజయవాడ అతలాకుతలమైంది. జగన్ విజయవాడలోకి ప్రవేశించే ముందే చెన్నై-కోల్కతా జాతీయ రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిపేశారు. ఏలూరు వైపు నగరంలోకి వచ్చే వాటిని బయటే నిలిపేశారు. గుంటూరు వైపు నుంచి వచ్చేవాటిని తాడేపల్లి వద్ద ఆపేశారు. సీఎం జగన్ బందరు రోడ్డులోకి ప్రవేశించిన తర్వాత ఒకేసారి వాహనాలు వదలడంతో వారధి నుంచి ఎనికేపాడు వరకు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ ప్రభావం విజయవాడ నగరంతోపాటు పరిసర ప్రాంతాల వరకు వ్యాపించి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో పైవంతెనపై సీఎం వెళ్లిన తర్వాత కూడా ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ను విమానాశ్రయం నుంచి తీసుకొచ్చేందుకు వెళ్తున్న కాన్వాయ్ కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత