చిన్న పరిశ్రమలపై.. జగన్ మోసపు దెబ్బ!
‘పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు రాకుంటే.. వారు పరిశ్రమలను ఎలా నిర్వహిస్తారు? పరిశ్రమల్ని సరిగా నడపలేకపోతే వాటిపై ఆధారపడ్డ చిన్న ఉద్యోగుల పరిస్థితేంటి? ప్రోత్సాహకాలను మేం ఏటా క్రమం తప్పకుండా చెల్లిస్తాం.’
ఎన్పీఏలుగా మారుతున్న యాజమాన్యాలు
సర్కారు రాయితీ రాదు.. వడ్డీ భారం తగ్గదు
మూడోసారీ పారిశ్రామికవేత్తలకు నిరాశే
‘పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు రాకుంటే.. వారు పరిశ్రమలను ఎలా నిర్వహిస్తారు? పరిశ్రమల్ని సరిగా నడపలేకపోతే వాటిపై ఆధారపడ్డ చిన్న ఉద్యోగుల పరిస్థితేంటి? ప్రోత్సాహకాలను మేం ఏటా క్రమం తప్పకుండా చెల్లిస్తాం.’
2022లో రాష్ట్ర పారిశ్రామిక రంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం జగన్ మాటలివి.
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో చిన్న పరిశ్రమల పరిస్థితి ‘గోరు చుట్టుపై.. రోకటి పోటు’ అన్నట్లుగా తయారైంది. ముడి సరకుల ధరలు పెరిగి, కొవిడ్తో ఆర్థికంగా నష్టాల పాలైన కర్మాగారాలను జగన్ ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది. వాటికి మూడేళ్లుగా ప్రోత్సాహక బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా ఏటా రూ.300 కోట్ల అదనపు వడ్డీ భారం పడుతోంది. పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ఉంటామని, పరిశ్రమలకు ‘హ్యాండ్ హోల్డింగ్’ అందిస్తామంటూ సీఎం తరచూ చెప్పే మాటలేవీ ఆచరణలో కనిపించడం లేదు. ఐదేళ్ల పాలనలో పరిశ్రమల కోసం జగన్ బటన్ నొక్కింది రెండే సార్లు. కొవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ అంటూ రూ.903.91 కోట్లు, 2021లో మరోసారి ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్లులకు రూ.684 కోట్ల ప్రోత్సాహకాలు మాత్రమే చెల్లించారు. చిన్న పరిశ్రమల కష్టాలపై అసెంబ్లీలో 2022లో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన జగన్.. వాటికి ఏటా ప్రోత్సాహకాలను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అందుకు రివర్స్గా, అదే ఏడాది నుంచి ప్రోత్సాహకాలు చెల్లించడం నిలిపివేశారు. రెండేళ్లలో రూ.2,500 కోట్లు బకాయి పడ్డారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించి ఉంటే.. పారిశ్రామిక రంగానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతైనా ఉపశమనం లభించేది. సాధారణంగా చిన్న ఫ్యాక్టరీల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే, నిబంధన మేరకు చెల్లించే రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం సంబంధిత పరిశ్రమ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. దీంతో ప్రతినెలా వారు బ్యాంకుకు చెల్లించే వాయిదా మొత్తంలో కొంత మేర ఉపశమనం లభించేది. ఆ మేరకు పరిశ్రమలకు ఆర్థికంగా వెసులుబాటు దొరికేది.
రాయితీలో సగం.. వడ్డీకే ఆవిరి!
ప్రభుత్వం ఏటా రాయితీ మొత్తాన్ని విడుదల చేస్తే చిన్న పారిశ్రామికవేత్తలపై వడ్డీ భారం తప్పేది. ప్రభుత్వం రాయితీలు ఇవ్వలేదని బ్యాంకులు పరిశ్రమల నిర్వాహకులపై జాలి చూపవు కదా? పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై బ్యాంకులు 10.5-15 శాతం వరకు వడ్డీ రేటును లెక్కగట్టి వసూలు చేస్తాయి. ప్రభుత్వం మూడేళ్లుగా చెల్లించని పారిశ్రామిక రాయితీలు రూ.2,500 కోట్లపైనే. ఈ మొత్తాన్ని విడుదల చేసి ఉంటే, సగటున 12 శాతం వడ్డీ రేటు చొప్పున లెక్కించినా ఏడాదికి రూ.300 కోట్ల భారం వారికి తగ్గేది. మూడేళ్లకు లెక్కిస్తే.. వడ్డీ రూపేణా రూ.900 కోట్ల భారం చిన్న పారిశ్రామికవేత్తలపై పడింది. ‘2018లో నెలకొల్పిన ఒక చిన్న కర్మాగారానికి ప్రభుత్వం ఆరేళ్లుగా విద్యుత్ ఛార్జీల రాయితీ రూ.2 లక్షలు, వడ్డీ రాయితీ సుమారు రూ.31 లక్షలు పెండింగ్లో పెట్టింది. అంటే రాయితీ మొత్తం రూ.33 లక్షలు. ఖాతాదారుల నుంచి మరో రూ.35 లక్షలు వసూలు కావాల్సి ఉంది. ఒక చిన్న ఫ్యాక్టరీకి రూ.65 లక్షల బాకీలు వసూలు కావాల్సి ఉంటే.. దానిపై బ్యాంకు వడ్డీ 12 శాతం చొప్పున లెక్కించినా నెలకు రూ.65 వేల అవుతుంది. ఏడాదికి రూ.7.80 లక్షల భారం పడుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ పరిశ్రమ బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాలు రూ.25 లక్షలు పెండింగ్లో ఉండటంతో ఎన్పీఏ జాబితాలో చేరుస్తామంటూ నోటీసులు వస్తున్నాయి’ అంటూ ఒక చిన్న పరిశ్రమ నిర్వాహకుడు వాపోయారు. రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించి ఉంటే, బ్యాంకు నోటీసులు అందుకోవాల్సిన అగత్యం వచ్చేది కాదని గుర్తుచేశారు.
మూడో‘సారీ’ మాట తప్పారు
పరిశ్రమలకు రాయితీలు 2024 ఫిబ్రవరిలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పుకొచ్చింది. రెండేళ్లుగా ఇదే మాటలు చెబుతున్నందున ఖాతాల్లో డబ్బులు పడేవరకూ నమ్మలేమని పారిశ్రామికవేత్తలు సందేహించారు. వారు అనుమానించినట్లుగానే జగన్ రాయితీలు వేయలేదు. మొదటిసారి 2022లో దసరాకు (అక్టోబరులో) విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారు. తర్వాత 2023 మార్చిలో విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు ముందు ఫిబ్రవరిలో ఇవ్వాలనుకున్నామని, అంతలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో చెల్లించలేక పోయామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అప్పట్లో చెప్పుకొచ్చారు. కోడ్ ముగిశాక ఆ విషయమే మరిచిపోయారు. ఇవే కాదు, కొవిడ్ సమయంలో పరిశ్రమలకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద ప్రకటించిన గరిష్ఠ డిమాండ్ ఛార్జీలు రూ.205 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం