గూండాల నీడలో గుడివాడ
‘గుడివాడ’ అంటే.. దేవాలయాలకు నిలయమైన ఊరు అని అర్థం. దేవాలయం ఉన్న ప్రాంతంలో ఆధ్యాత్మికతతో నిండిన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాంటి గుడివాడ.. నేడు జూదవాడగా మారింది.
క్యాసినోలు, గంజాయి, సెటిల్మెంట్లు..
అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడేనా ఇది!
కృష్ణా జిల్లాలో నేడు జగన్ బస్సుయాత్ర.. ప్రశ్నించేందుకు స్థానికులు సిద్ధం
ఈనాడు - అమరావతి
‘గుడివాడ’ అంటే.. దేవాలయాలకు నిలయమైన ఊరు అని అర్థం. దేవాలయం ఉన్న ప్రాంతంలో ఆధ్యాత్మికతతో నిండిన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాంటి గుడివాడ.. నేడు జూదవాడగా మారింది. విదేశాలకు చెందిన క్యాసినోలను గుడివాడకూ పరిచయం చేశారు. గంజాయి ముఠాకు ఆవాసంగా, జూదాలకు కేంద్రంగా మారింది. ఏడాది పొడవునా జూదాలు నిర్వహిస్తున్నారు. చేపల చెరువులే జూద కేంద్రాలయ్యాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం జగన్ ఇక్కడికి వస్తున్నారు. ఏళ్లతరబడి ఇక్కడ పేరుకుపోయిన సమస్యలపై నిలదీసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు.
గుడివాడ పట్టణానికి చారిత్రక నేపథ్యమే కాదు.. రాజకీయ చైతన్యమూ ఉంది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చదువుకున్న ప్రాంతం. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడే నడయాడారు. 1983లో తెదేపా స్థాపించిన నాటి నుంచి 11 సార్లు ఎన్నికలు జరిగితే.. ఎనిమిదిసార్లు తెదేపా విజయ కేతనం ఎగరవేసింది. ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గెలుపొందగా, తెదేపా నుంచి నాయకుడిగా ఎదిగిన కొడాలి నాని మొదట తెదేపా తరపున రెండుసార్లు, వైకాపా తరపున రెండుసార్లు గెలిచారు. ప్రస్తుతం అయిదోసారి బరిలో దిగుతున్నారు. శాంతిభద్రతల వైఫల్యంలో, క్యాసినో పరిచయంలో, జూదగృహాల నిర్వహణకు అండదండలు, భూముల కబ్జాలు, ప్రైవేటు పంచాయితీలు, సెటిల్మెంట్లు.. గంజాయి బ్యాచ్ ఆగడాలు.. ఇలా ఒకటేంటి.. చాలావాటికి గుడివాడ నెలవుగా మారింది.
రాజకీయ చైతన్యం ఏదీ..?
గుడివాడ నుంచి ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. గుడివాడలోనే చదివి తెదేపాను స్థాపించిన ఎన్టీఆర్ 1983లో, 1985లో పోటీచేసి గెలిచారు. 1985లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. రావి శోభనాద్రిచౌదరి విజయం సాధించారు. రావి హరగోపాల్ ఒకసారి గెలుపొందారు. ఆయన మరణం తర్వాత ఉప ఎన్నికలో రావి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, కటారి సత్యనారాయణరావు, కటారి ఈశ్వర్కుమార్ వంటి వారు పోటీచేసిన చరిత్ర గుడివాడది. 2004 నుంచి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో తెదేపా తరపున గెలిచిన ఆయన వైకాపా గూటికి చేరారు. నాటి నుంచి గుడివాడ అరాచక శక్తులకు నిలయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
- 2022 జనవరిలో కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్లో క్యాసినో నిర్వహించారు. సంక్రాంతి సంబరాల పేరుతో ప్రవేశ రుసుం రూ.10 వేలు పెట్టారు. 5 నిమిషాల్లో వెనక్కి వచ్చేస్తే.. రూ.5 వేలు. 10 నిమిషాలకు రూ.10 వేలు. అంతకుమించి లోపల సమయం గడిపితే.. తప్పనిసరిగా క్యాసినో ఆడాల్సిందే. ఒక కౌంటర్ పెట్టారు. అక్కడ కరెన్సీ నోట్లు తీసుకుని టోకెన్లు ఇచ్చారు. అలా మూడురోజుల్లో రూ.కోట్లలో వ్యాపారం జరిగింది. క్యాబరేలు ఏర్పాటు చేసినట్లు లోపలికి వెళ్లిన వారు చెబుతుంటారు. మందు, విందు సరేసరి. క్యాసినో ప్రముఖుడు చీకోటి ప్రవీణ్ ప్రధాన సూత్రధారి.
- గుడివాడ అంటే ఇప్పుడు జూదవాడ అన్నట్లు మారిపోయింది. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ, గుడివాడ శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కొందరు గుడిసెలు ఏర్పాటు చేసి జూద గృహాలను నడుపుతున్నారు. ఇవి 365 రోజులూ నడుస్తాయి. దీనికి ఎమ్మెల్యే అండ దండలు పుష్కలం. పైకి గుడిసెల తరహాలోనే కనిపించే ఈ గృహాల లోపల ఏసీలు, బార్లు ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచీ ఇక్కడికి వస్తుంటారు. ఓ కృష్ణుడు నడిపించే జూదగృహంపై కొత్తగా వచ్చిన పోలీసులు దాడి చేస్తే,.. రూ. 45 లక్షల నగదు దొరికినట్లు కేసులో చూపించారు. తర్వాత అంతా మమ అయింది.
- గుడివాడ పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. అమ్మాయిలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పోలీసులు సైతం గంజాయి బ్యాచ్కే కొమ్ము కాస్తున్నారు.
- గుడివాడ అంటే.. ఒకప్పుడు మర్యాదకు మారు పేరు. ఆలాంటి ‘గుడి’వాడను బూతులవాడగా మార్చారు. ప్రస్తుతం ఎవరి నోరు తెరిచినా.. బూతుతోనే ప్రసంగం ప్రారంభం అవుతుంది.
- దూషణలు సరేసరి.
- నియోజకవర్గంలో సెటిల్మెంట్లు పెరిగాయి. భూముల క్రయవిక్రయాలు జరిగితే ఓ గ్యాంగ్ మధ్యలో దూరి చౌకగా కొట్టేయడం ఆనవాయితీగా మారింది. లేదంటే వివాదాల సెటిల్మెంట్ పేరుతో భారీగా కమీషన్లు గుంజడం ‘అక్షర’ సత్యం.
- మట్టి దందా సరేసరి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఒక నేత వంద టిప్పర్లు కొనుగోలు చేశారు. అక్కడ పనులు పూర్తయ్యాక ఈ నియోజకవర్గంపై మట్టి దాడి చేశారు. ఈ వంద టిప్పర్లు ఒక్కరోజైనా ఖాళీ ఉంటే ఒట్టు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్