గూండాల నీడలో గుడివాడ
‘గుడివాడ’ అంటే.. దేవాలయాలకు నిలయమైన ఊరు అని అర్థం. దేవాలయం ఉన్న ప్రాంతంలో ఆధ్యాత్మికతతో నిండిన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాంటి గుడివాడ.. నేడు జూదవాడగా మారింది.
క్యాసినోలు, గంజాయి, సెటిల్మెంట్లు..
అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడేనా ఇది!
కృష్ణా జిల్లాలో నేడు జగన్ బస్సుయాత్ర.. ప్రశ్నించేందుకు స్థానికులు సిద్ధం
ఈనాడు - అమరావతి
‘గుడివాడ’ అంటే.. దేవాలయాలకు నిలయమైన ఊరు అని అర్థం. దేవాలయం ఉన్న ప్రాంతంలో ఆధ్యాత్మికతతో నిండిన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాంటి గుడివాడ.. నేడు జూదవాడగా మారింది. విదేశాలకు చెందిన క్యాసినోలను గుడివాడకూ పరిచయం చేశారు. గంజాయి ముఠాకు ఆవాసంగా, జూదాలకు కేంద్రంగా మారింది. ఏడాది పొడవునా జూదాలు నిర్వహిస్తున్నారు. చేపల చెరువులే జూద కేంద్రాలయ్యాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం జగన్ ఇక్కడికి వస్తున్నారు. ఏళ్లతరబడి ఇక్కడ పేరుకుపోయిన సమస్యలపై నిలదీసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు.
గుడివాడ పట్టణానికి చారిత్రక నేపథ్యమే కాదు.. రాజకీయ చైతన్యమూ ఉంది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చదువుకున్న ప్రాంతం. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడే నడయాడారు. 1983లో తెదేపా స్థాపించిన నాటి నుంచి 11 సార్లు ఎన్నికలు జరిగితే.. ఎనిమిదిసార్లు తెదేపా విజయ కేతనం ఎగరవేసింది. ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గెలుపొందగా, తెదేపా నుంచి నాయకుడిగా ఎదిగిన కొడాలి నాని మొదట తెదేపా తరపున రెండుసార్లు, వైకాపా తరపున రెండుసార్లు గెలిచారు. ప్రస్తుతం అయిదోసారి బరిలో దిగుతున్నారు. శాంతిభద్రతల వైఫల్యంలో, క్యాసినో పరిచయంలో, జూదగృహాల నిర్వహణకు అండదండలు, భూముల కబ్జాలు, ప్రైవేటు పంచాయితీలు, సెటిల్మెంట్లు.. గంజాయి బ్యాచ్ ఆగడాలు.. ఇలా ఒకటేంటి.. చాలావాటికి గుడివాడ నెలవుగా మారింది.
రాజకీయ చైతన్యం ఏదీ..?
గుడివాడ నుంచి ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. గుడివాడలోనే చదివి తెదేపాను స్థాపించిన ఎన్టీఆర్ 1983లో, 1985లో పోటీచేసి గెలిచారు. 1985లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. రావి శోభనాద్రిచౌదరి విజయం సాధించారు. రావి హరగోపాల్ ఒకసారి గెలుపొందారు. ఆయన మరణం తర్వాత ఉప ఎన్నికలో రావి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, కటారి సత్యనారాయణరావు, కటారి ఈశ్వర్కుమార్ వంటి వారు పోటీచేసిన చరిత్ర గుడివాడది. 2004 నుంచి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో తెదేపా తరపున గెలిచిన ఆయన వైకాపా గూటికి చేరారు. నాటి నుంచి గుడివాడ అరాచక శక్తులకు నిలయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
- 2022 జనవరిలో కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్లో క్యాసినో నిర్వహించారు. సంక్రాంతి సంబరాల పేరుతో ప్రవేశ రుసుం రూ.10 వేలు పెట్టారు. 5 నిమిషాల్లో వెనక్కి వచ్చేస్తే.. రూ.5 వేలు. 10 నిమిషాలకు రూ.10 వేలు. అంతకుమించి లోపల సమయం గడిపితే.. తప్పనిసరిగా క్యాసినో ఆడాల్సిందే. ఒక కౌంటర్ పెట్టారు. అక్కడ కరెన్సీ నోట్లు తీసుకుని టోకెన్లు ఇచ్చారు. అలా మూడురోజుల్లో రూ.కోట్లలో వ్యాపారం జరిగింది. క్యాబరేలు ఏర్పాటు చేసినట్లు లోపలికి వెళ్లిన వారు చెబుతుంటారు. మందు, విందు సరేసరి. క్యాసినో ప్రముఖుడు చీకోటి ప్రవీణ్ ప్రధాన సూత్రధారి.
- గుడివాడ అంటే ఇప్పుడు జూదవాడ అన్నట్లు మారిపోయింది. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ, గుడివాడ శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కొందరు గుడిసెలు ఏర్పాటు చేసి జూద గృహాలను నడుపుతున్నారు. ఇవి 365 రోజులూ నడుస్తాయి. దీనికి ఎమ్మెల్యే అండ దండలు పుష్కలం. పైకి గుడిసెల తరహాలోనే కనిపించే ఈ గృహాల లోపల ఏసీలు, బార్లు ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచీ ఇక్కడికి వస్తుంటారు. ఓ కృష్ణుడు నడిపించే జూదగృహంపై కొత్తగా వచ్చిన పోలీసులు దాడి చేస్తే,.. రూ. 45 లక్షల నగదు దొరికినట్లు కేసులో చూపించారు. తర్వాత అంతా మమ అయింది.
- గుడివాడ పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. అమ్మాయిలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పోలీసులు సైతం గంజాయి బ్యాచ్కే కొమ్ము కాస్తున్నారు.
- గుడివాడ అంటే.. ఒకప్పుడు మర్యాదకు మారు పేరు. ఆలాంటి ‘గుడి’వాడను బూతులవాడగా మార్చారు. ప్రస్తుతం ఎవరి నోరు తెరిచినా.. బూతుతోనే ప్రసంగం ప్రారంభం అవుతుంది.
- దూషణలు సరేసరి.
- నియోజకవర్గంలో సెటిల్మెంట్లు పెరిగాయి. భూముల క్రయవిక్రయాలు జరిగితే ఓ గ్యాంగ్ మధ్యలో దూరి చౌకగా కొట్టేయడం ఆనవాయితీగా మారింది. లేదంటే వివాదాల సెటిల్మెంట్ పేరుతో భారీగా కమీషన్లు గుంజడం ‘అక్షర’ సత్యం.
- మట్టి దందా సరేసరి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఒక నేత వంద టిప్పర్లు కొనుగోలు చేశారు. అక్కడ పనులు పూర్తయ్యాక ఈ నియోజకవర్గంపై మట్టి దాడి చేశారు. ఈ వంద టిప్పర్లు ఒక్కరోజైనా ఖాళీ ఉంటే ఒట్టు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద