మద్యానికి కాపలా ఉంచి.. మరుగుదొడ్లు కడిగించి
గురువును ప్రత్యక్ష దైవంగా కొలిచే సమాజం మనది. బోధనా వృత్తి గౌరవప్రదమైనదే కాదు.. పవిత్రమైనది కూడా. అందుకే అటువైపు వెళ్లేవారెందరో! కానీ జగన్ పాలనలో వారి పరిస్థితి ‘రాజపూజ్యం 0, అవమానం 6’గా మారింది.
రాత్రిపూట తనిఖీల పేరుతో టీచర్ల పరువు తీసిన వైనం
కోడిగుడ్ల సరఫరా లేకపోయినా.. నోటీసులు
సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసి..
రాజకీయ బదిలీలంటూ రూ.50 కోట్లు గుంజుకుని..
జగన్ సర్కారులో బడిపంతులు బతుకు నరకం
ఈనాడు - అమరావతి
గురువును ప్రత్యక్ష దైవంగా కొలిచే సమాజం మనది. బోధనా వృత్తి గౌరవప్రదమైనదే కాదు.. పవిత్రమైనది కూడా. అందుకే అటువైపు వెళ్లేవారెందరో! కానీ జగన్ పాలనలో వారి పరిస్థితి ‘రాజపూజ్యం 0, అవమానం 6’గా మారింది. గుడి లాంటి బడిలో భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే గురువులను.. మద్యం దుకాణాల ముందు కాపలాదారులుగా నిలిపింది.. వారిచేత మరుగుదొడ్లు శుభ్రం చేయించింది.. నాడు- నేడు పనులంటూ నానా వేధింపులకు గురిచేసింది! అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం.. గురువులని పురుగులకంటే హీనంగా చూసి అవమానించింది!
కల్లబొల్లి మాటలు..
ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రావాల్సినవన్నీ సరిగ్గా సమయానికి వచ్చేట్టుగా చేస్తానని హామీ ఇస్తున్నా.
ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన మాటలివి
అన్నీ అవమానాలే..
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆనందం ఆవిరైపోయింది. సంఘాల నాయకులు కనీసం ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను విన్నవించుకునేందుకే సమయం ఇవ్వలేదు. 11వ పీఆర్సీ సాధనకు ఉద్యోగులు నిర్వహించిన ‘చలో విజయవాడ’లో ఉపాధ్యాయులు ఎక్కువగా పాల్గొన్నారనే కక్షతో చివరికి వారికి జీతాలు సకాలంలో ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది.
అయిదేళ్ల పాలనలో ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్లు వ్యవహరించింది జగన్ సర్కారు. పీఆర్సీ సాధన కోసం ఉద్యోగులు నిర్వహించిన విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ముట్టడికి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. అది మొదలు వారిపై ఉక్కుపాదం మోపింది. ప్రతి అంశంలోనూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న గురువులను జగన్ ప్రభుత్వం కరోనా సమయంలో ఏకంగా మద్యం దుకాణాల ముందు కాపలాగా పెట్టింది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులతో బడుల్లో మరుగుదొడ్లను కడిగించింది. విద్యార్థుల నోటు పుస్తకాలు దిద్దలేదని అవమానించింది. జీతాలు ఇవ్వడంలోనూ జాప్యం చేసి, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టింది. పోలింగ్ విధులకు టీచర్లను దూరం చేయాలనే ఉద్దేశంతో ఏకంగా విద్యా హక్కు చట్టాన్నే సవరించింది. ‘నాడు-నేడు’ పనుల్లో పేలవమైన పనితీరు కనబరిచారంటూ నోటీసులు ఇచ్చింది. సిఫార్సు బదిలీల పేరుతో రూ.50కోట్లు అక్రమంగా లాగేసింది. ఇవీ.. జగన్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,69,642 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై చూపిన కక్షసాధింపు చర్యలు.
పోలింగ్ విధులు తప్పించే ఎత్తుగడ వేసి..
పీఆర్సీ, ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందించకపోవడం సహా అనేక అంశాల్లో జగన్ సర్కారుపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పోలింగ్ విధులు అప్పగిస్తే ఇబ్బందవుతుందనే అపోహతో జగన్ సర్కారు వారిని ఎన్నికల విధులకు దూరం చేసేందుకూ ప్రయత్నాలు చేసింది. బోధనేతర పనుల్లో ఉపాధ్యాయులు పాల్గొనరాదంటూ విద్యా హక్కు చట్టం నిబంధనలకు కీలక సవరణలు చేసింది. అనివార్య పరిస్థితుల్లో విద్యేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను వినియోగించాల్సి వస్తే మొదట ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది అందర్నీ వినియోగించిన తర్వాతే తప్పదనుకుంటేనే వారిని తీసుకోవాలని సవరణ చేసి.. ఎన్నికలకు టీచర్ల సేవలు అవసరం లేదని పరోక్షంగా సూత్రీకరించింది. సాధ్యమైనంత మేర ఉపాధ్యాయులు పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాల్లోనే పాల్గొనాలని సవరణలో పేర్కొంది. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల విధులను బోధనేతర పనులుగా పేర్కొన్న ప్రభుత్వం.. మరోపక్క వారితో నిత్యం బోధనేతర పనులు చేయిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో చివరికి ఉపాధ్యాయులకు పోలింగ్ విధుల్లో భాగస్వామ్యం లభించింది. జగన్ సర్కార్ ఉపాధ్యాయులపై ఎలాంటి వివక్ష చూపిందో దీన్ని బట్టే తెలుస్తుంది.
అందరి ముందు అవమానించారు..
పాఠశాలల తనిఖీలతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం వ్యవహరించింది. పనివేళల్లో కాకుండా రాత్రి సమయంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నోటుపుస్తకాలు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు ఆయన వెంట వెళ్లాల్సి వచ్చేది. విద్యార్థులు నోటు పుస్తకాలు సరిగా రాయకపోయినా.. వాటిని దిద్దకపోయినా గ్రామంలో అందరి ముందు ఉపాధ్యాయులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి అవమానించారు. దీనిపై ఏకంగా రాష్ట్ర సచివాలయానికి వచ్చి వివరణ ఇవాలంటూ ఆదేశాలు ఇచ్చారు ప్రవీణ్ ప్రకాష్. ఆన్లైన్లోనూ నోటు పుస్తకాలు తనిఖీ చేసి టీచర్లపై ఒత్తిడి చేశారు. టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి.
ఆర్జేడీలు, డీఈవోలు, డిప్యూటీడీఈవోలు, ఎంఈవోలు తనిఖీలు చేయాలంటూ ఆదేశాలిచ్చి, వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. పాఠశాలల్లో 27అంశాలు పరిశీలించాలంటూ వారిని ఆదేశించారు. ప్రభుత్వం ఒత్తిడితో వీరు బడులు తనిఖీలు చేస్తూ ఏ చిన్న తప్పు దొర్లినా నోటీసులు ఇస్తూ టీచర్లను వేధింపులకు గురి చేస్తూ వచ్చారు.
మరుగుదొడ్ల బాధ్యత వారిదే..
పోలింగ్ విధులను బోధనేతర పనులుగా పేర్కొన్న ప్రభుత్వమే ఉపాధ్యాయులతో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తోంది. రోజూ ఉదయం ఓ ఉపాధ్యాయుడు మరుగుదొడ్ల ఫొటోలు తీసి, యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఒకవేళ మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా.. ఫొటోలు సకాలంలో పంపించకపోయినా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కొన్నిచోట్ల ఆయాలు లేకపోవడం, ఉన్నా వారు విధులకు రాని సమయంలో ఉపాధ్యాయులే మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు.
- మధ్యాహ్న భోజన పథకం, ‘నాడు-నేడు’ పనుల బాధ్యతలను అప్పగించింది. ప్రతి రోజూ భోజనంలో పెట్టే పదార్థాల ఫొటోలు తీసి, యాప్లో అప్లోడ్ చేయాలనే నిబంధన పెట్టింది. ఫొటోలు అప్లోడ్ కాకపోతే షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘నాడు-నేడు’ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి పెట్టింది.
- కోడిగుడ్లను గుత్తేదారు సకాలంలో బడికి సరఫరా చేయనిచోట విద్యార్థులకు గుడ్డుపెట్టలేదని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కోడిగుడ్లు సరఫరా చేయని గుత్తేదారుపై చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయులను బాధ్యులుగా తేల్చింది. ఇది వేధింపులకు పరాకాష్ఠ.
జీతాలకూ ఇబ్బంది పెట్టారు..
ఉపాధ్యాయులను జగన్ సర్కారు జీతాలకూ ఇబ్బందులు పెట్టింది. వీరందరికీ చాలా నెలలపాటు ఆలస్యంగా వేసింది. దీనిపై గతంలో విజయనగరం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు నిరసనలు తెలిపితే వెంటనే ఆర్జేడీ, డీఈవో, డిప్యూటీడీఈవోలు వేధింపులకు దిగారు. జీతాల కోసం ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. కలెక్టరేట్ల ముట్టడి చేశాయి. వీటికి అనుమతులు ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేసి, వారిని ఇబ్బందులకు గురి చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది వాయిదాల చెల్లింపులకు వెసులుబాటు ఇవ్వాలంటూ బ్యాంకు మేనేజర్లకు వినతులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి కల్పించింది.
సుద్ద ముక్కకూ దిక్కు లేదు..
పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులనూ ప్రభుత్వం పూర్తిగా ఇవ్వడం మానేసి.. సుద్దముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లులాంటి వాటిని ఉపాధ్యాయులు సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించింది. పాఠశాలల నిర్వహణకు ఏటా రూ.122.04కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. అందులో 40శాతం కూడా ఇవ్వడం లేదు.
- పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిధులు కేటాయిస్తారు. 30 మంది, అంతకంటే తక్కువ విద్యార్థులు ఉంటే పాఠశాలలకు రూ.10వేల చొప్పున ఇవ్వాలి. 30 నుంచి 100మంది వరకు ఉంటే అన్ని పాఠశాలలకు రూ.25వేల చొప్పున మంజూరు చేయాలి. 100 నుంచి 250 మంది ఉంటే రూ.50వేలు, 250 నుంచి వెయ్యి మంది వరకు రూ.75వేలు, వెయ్యికిపైన ఉంటే రూ.లక్ష చొప్పున ఇవ్వాలి.
- వాస్తవంగా ఈ నిధుల్లో 60శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. వీటిని ఇతర అవసరాలకు వాడేసుకున్న ప్రభుత్వం రోజువారీ నిర్వహణ బరువును ఉపాధ్యాయులపై వేసింది. 2021-22లో చాలామంది ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంతో ఆ భారం టీచర్లపైనే పడింది. పురపాలక పాఠశాలలకు అయితే ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆ బడుల్లో ఉపాధ్యాయులే తలో కొంత వేసుకొని వాటిని కొనాల్సి వచ్చింది.
అక్రమ బదిలీలతో కాసుల వేట..
ఉపాధ్యాయుల అవసరాలతోనూ జగన్ ప్రభుత్వం కాసుల వ్యాపారం చేసింది. ప్రభుత్వ సిఫార్సు బదిలీల పేరుతో ఉపాధ్యాయుల నుంచి రూ.50కోట్లు పిండేసింది. ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, ఆయన పేషీలోని పీఏ, పాఠశాల విద్యాశాఖ అధికారులు కలిసి కొంత మంది ఉపాధ్యాయులను దోచుకున్నారు. రాజకీయ పైరవీల పేరుతో 2600మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గురువులను గౌరవించడం, అవినీతి లేకుండా చూడాల్సిన ప్రభుత్వమే వారి ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బ కొట్టడం, తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడం సహా చివరికి బదిలీలతో వారి నుంచి డబ్బులు లాగేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్