డేగ కళ్లు ఏమయ్యాయి?
సీఎం జగన్పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడికి ముందు, ఆ తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత లోపభూయిష్ఠంగా ఉంది. వివేకానంద స్కూల్ వైపు నుంచే రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం
దాడి ముందూ తర్వాతా భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్ఠం
విద్యుత్తు సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవటం ఏంటి?
రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు?
ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా పురోగతి ఏదీ?
ఈనాడు - అమరావతి
సీఎం జగన్పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడికి ముందు, ఆ తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత లోపభూయిష్ఠంగా ఉంది. వివేకానంద స్కూల్ వైపు నుంచే రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీడియోల్లోనూ అలానే కనిపిస్తోంది. సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తయిన భవనాలను ముందే గుర్తించి, అక్కడ పోలీసులను మోహరిస్తారు. వీఐపీ వచ్చే ముందుగా ఆ మార్గంలో ఒకటికి రెండు సార్లు భద్రతా తనిఖీలు చేస్తారు. రెండంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్ గదుల తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ భవనమంతా ఖాళీగానే ఉంది. అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు? భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు? జగన్ పర్యటిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్ ఎగరవేసి.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించి, భద్రతాపరంగా ఎక్కడైనా సమస్యలున్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు. మరి అలాంటిది వివేకానంద స్కూల్ భవనం లోపల నుంచి గానీ, భవనం పైనుంచి గానీ ఎవరైనా, ఏదైనా విసిరితే ముప్పు ఉండే అవకాశముందని ముందే ఎందుకు గుర్తించలేదు? వీఐపీ భద్రత పట్ల ఇది నిర్లక్ష్యం కాదా?
గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిపేశారే..
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కోసం శనివారం చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై గుంటూరు-విజయవాడ మధ్య, ఇటు విజయవాడ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపేసి ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపించారు. జగన్ సర్వీసురోడ్డులో మధ్యాహ్న భోజనం కోసం ఆగితే... జాతీయ రహదారి మీద కూడా వాహనాల్ని నిలిపేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు.. భద్రతాపరంగా మాత్రం ఎందుకు అప్రమత్తంగా లేరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పర్యటనకు రెండు రోజుల ముందే అక్కడ పర్యటించిన పోలీసులు.. శనివారం దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. మరి అప్పుడే భద్రతాపరంగా ఎక్కడెక్కడ సమస్యలున్నాయో ఎందుకు గుర్తించలేదు? జగన్పై రాయి విసిరినప్పుడు విద్యుత్తు సరఫరా లేదు. అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఫోకస్ లైట్లు వేసి వారికి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపించేలా చూసుకోవాలి. కానీ అదీ చేయలేదు. ముఖ్యమంత్రి బస్సుపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది డేగకళ్లతో అన్ని వైపులా గమనిస్తుండాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే రక్షణ వలయంగా ఏర్పడి కాపాడాలి.
పురోగతి ఉందా? లేదా?
ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినా.. ఆదివారం రాత్రి వరకూ పోలీసులు ఏమీ ప్రకటించలేదు. డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా ముగ్గురూ వైకాపాకు వీరవిధేయులే. భద్రతా వైఫల్యానికి ప్రధాన బాధ్యత వీళ్లదే. సీపీ కాంతి రాణా అయితే.... చిన్న చిన్న విషయాలకూ ప్రెస్మీట్లు పెట్టి వివరాలు చెబుతుంటారు. అలాంటిది ఇంత పెద్ద ఘటన జరిగితే ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా లేదు. వైకాపా నాయకులు ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులే రాయి విసిరారని అనుకుంటే, ఈ పాటికే నిందితుడెవరో తేల్చేయాలి కదా! ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఇంత పెద్ద ఘటన జరిగితే... డీజీపీ, నిఘావిభాగం అధిపతి, విజయవాడ సీపీ ఎవరూ దానిపై నోరు విప్పట్లేదు. ఈ ఘటనపై అధికార, విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వాస్తవమేంటో ఆధారాలతో తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కదా! వాళ్లు దర్యాప్తులో ఎందుకింత జాప్యం చేస్తున్నారు? అత్యంత క్లిష్టమైన కేసుల్ని సైతం సాంకేతికతను ఉపయోగించేసి ఛేదిస్తున్నామని చెప్పుకొనే ఏపీ పోలీసులు.. ఈ దాడి ఘటనలో ఇప్పటివరకూ ఏం నిగ్గుతేల్చారో ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు?
అసలు తగిలింది రాయేనా? లేదా మరేదైనానా?
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్కు పదునైన రాయి తగలి రక్తగాయమైందని, అదే రాయి పక్కనే ఉన్న తన ఎడమ కంటికి తగిలి తనకూ రక్తగాయమైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపా నాయకులు మాత్రం ఎయిర్బుల్లెట్, పెల్లెట్, క్యాట్బాల్ వంటి వాటితో కొట్టారని ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవమేంటి? ముఖ్యమంత్రి నుదుటిపై తగిలింది ఏంటో ఇప్పటివరకూ పోలీసులు తేల్చలేదు. అసలు తగిలిన వస్తువును స్వాధీనం చేసుకున్నారో, లేదో కూడా స్పష్టత లేదు. దర్యాప్తు రీత్యా ఇది చాలా అవసరం. నిజంగా వైకాపా నాయకులు ఆరోపిస్తున్నట్లు పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ అయితే ఈ పాటికే వాటిని చూపించాలి కదా! కానీ అవెక్కడా చూపించట్లేదు. అయితే ముఖ్యమంత్రి నుదుటిపై తగిలిన గాయం చూస్తే అది తగిలిన గాయంలా కనిపించట్లేదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. రాయి వల్ల గాయమైతే.. అది దాని పరిమాణాన్ని బట్టి 25పైసల నాణెం పరిమాణం నుంచి ఎంతైనా వృత్తాకారంలో ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
రాయి తగిలాకా నిర్లక్ష్యమే
రాష్ట్రంలో అత్యున్నత స్థాయి భద్రత ఉండేది ముఖ్యమంత్రికే. అలాంటి వీఐపీకి రాయి తగిలితే భద్రతా సిబ్బంది, పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ముందు వీఐపీ చుట్టూ వలయంగా ఏర్పడి స్టోన్గార్డులు, బుల్లెట్ప్రూఫ్ షీట్లు తెరవాలి. వీఐపీని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి. రాయి తగిలినా సీఎం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడలేదు. రాయి వచ్చిన వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముడితే రాయి విసిరినవారిని పట్టుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అక్కడ ఉండే వందల మంది సిబ్బంది ఎవరూ ఈ దాడిని గుర్తించలేదు, తక్షణం స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట