స్వేచ్ఛ కోసం ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం
‘బ్రిటిష్ పాలనలో ఇలాంటి అవమానాలు, హింస ఉండేవి. మళ్లీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో చూస్తున్నాం. మన రాష్ట్రానికి మళ్లీ స్వాతంత్య్రం రావాలి. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి.
బ్రిటిష్ పాలన తరహా వైకాపాను ఓడిద్దాం
అప్పటివరకు ప్రజల్లోనే ఉంటా..
చంద్రబాబు అరెస్టు సమయంలో రాజకీయాలు అవసరమా అనిపించింది
స్వాతంత్య్రం కోసం నాడు ఉద్యమించినట్లే నేడు చంద్రబాబు పోరాటం
మీడియా ప్రతినిధులతో నారా భువనేశ్వరి
ఈనాడు, అమరావతి: ‘బ్రిటిష్ పాలనలో ఇలాంటి అవమానాలు, హింస ఉండేవి. మళ్లీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో చూస్తున్నాం. మన రాష్ట్రానికి మళ్లీ స్వాతంత్య్రం రావాలి. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి. ఈ లక్ష్యంతోనే మే 10 వరకు ప్రజల్లోనే ఉంటా..’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు. కూటమి మద్దతుతో ప్రజా ప్రభుత్వాన్ని చంద్రబాబు ఏర్పాటుచేయగలరని ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 90 శాసనసభ నియోజకవర్గాల్లో తొమ్మిది వేల కి.మీ.కుపైగా ప్రయాణించి కార్యకర్తల కుటుంబాలకు ఆమె భరోసానిచ్చారు. యాత్ర ముగిసిన సందర్భంగా ఆదివారం కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘కేసులు, అరెస్టులతో ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడిని ఇబ్బంది పెడుతుంటే.. ఈ రాజకీయాలు అవసరమా? అని బాధ కలిగింది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్ర పరిస్థితులు చూశాక చంద్రబాబు పోరాటం తప్పనిసరని అనిపించింది. ఆయన జీవితం రాష్ట్రానికి, ప్రజలకు అంకితం’ అని భువనేశ్వరి తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
మరో స్వాతంత్య్ర పోరాటమని స్థిమితపడ్డా
చంద్రబాబును జైలులో తొలిసారి చూసిన సంఘటన జీవితంలో మరిచిపోలేను. ప్రపంచంలోనే విశిష్ట గుర్తింపు పొందిన నాయకుడిని ఖైదీలా చూసి తట్టుకోలేకపోయా. చుట్టూ ఆరేడుగురు పోలీసులున్నారు. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరని ఆయన ఈ బాధ తాత్కాలికమేనని ఓదార్చారు. ఆ తర్వాత మనసు సర్దుబాటు చేసుకున్నా. స్వాతంత్య్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకుని అలాంటిదే ఇదొకటని స్థిమితపడ్డా. స్వాతంత్య్రం కోసం ఏ తప్పూ చేయనివారూ జైలుకు వెళ్లారు. రాష్ట్రం కోసం చంద్రబాబు వెళ్లాల్సి వచ్చిందని మనసుకు నచ్చజెప్పుకొన్నా. రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నారని అనుకున్నా. చంద్రబాబును 53 రోజులు నిర్బంధించారు. ఆయనపై నమ్మకంతో ప్రజలే ప్రభుత్వంపై తిరగబడ్డారు. విడుదల కోసం పోరాడారు. లోకేశ్ యువగళం స్పందన, చంద్రబాబుకు ప్రజాదరణను గమనించి ప్రభుత్వం కేసుల కుట్ర పన్నింది. తొలుత రూ.3 వేల కోట్ల అవినీతి అన్నారు. చివరకు రూ.27 కోట్లు అన్నారు. వేటికీ ఆధారాల్లేవు. ఆయన ఏ తప్పూ చేయరు.
బ్రాహ్మణి కోడలు కాదు కుమార్తె
చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు బ్రాహ్మణి కోడలికంటే కుమార్తెలా మా వెంట నిలిచింది. భోజనం సహా అన్ని అవసరాలు చూసుకుంది. ‘నిజం గెలవాలి’ యాత్రకూ భరోసానిచ్చింది. జైలులో ఉన్నప్పుడు ప్రజలందరూ మాకు అండగా నిలిచారు. ఉండేందుకు ఒక దాత రాజమహేంద్రవరంలో ఇల్లు ఇచ్చారు. ఆయన విడుదల రోజును అందరూ పండగలా చేసుకున్నారు. కుటుంబం కోసం సమయమివ్వాలని చంద్రబాబుతో తరచూ గొడవపడిన నేను.. ఆయన్ను ప్రజలు ఎలా గుండెల్లో పెట్టుకున్నారో ప్రత్యక్షంగా చూశాక ఆలోచన మార్చుకున్నా.
రాజధాని వస్తుందంటే నాలుగెకరాలే కొంటారా?
అమరావతిలో రాజధాని వస్తుందని ముందే తెలిసి హెరిటేజ్ సంస్థ నాలుగెకరాలు కొన్నట్టు ఇన్నర్ రింగురోడ్డుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. ఏ తప్పూ చేయలేదని హెరిటేజ్ ఎండీగా నాకు తెలుసు. అందుకే ధైర్యంగా ఉన్నా. రాజధాని వస్తుందని కొనాలనుకుంటే ఎవరైనా నాలుగెకరాలే కొని ఊరుకుంటారా? నాలుగెకరాల గురించి మాపై కేసు పెడితే అధికారం అండతో వేల ఎకరాలు కొట్టేసిన వైకాపా నేతలను ఏమనాలి?
పవిత్ర సభలో మహిళపై దుర్భాషలా?
పవిత్ర సభలో మహిళలను అవమానపరిచారంటేనే వారి నైతికత స్పష్టమవుతుంది. నాన్న ఎన్టీఆర్ నుంచి ధైర్యం, మా అమ్మ నుంచి క్రమశిక్షణ అలవడ్డాయి. గడ్డు పరిస్థితులను ఈ ఆత్మవిశ్వాసంతోనే ఎదుర్కొన్నా. నాపై నమ్మకంతో చంద్రబాబు అప్పగించిన ‘నిజం గెలవాలి’ యాత్రను మనస్ఫూర్తిగా నిర్వహించా. ఆయన్ను అరెస్టు చేసిన బాధతో చనిపోయిన 203 మంది కార్యకర్తల కుటుంబాలను కలిశా. నాయకుడి కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలు కొందరు, ప్రభుత్వ అరాచకాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు మరికొందరు ఉన్నారు. దాడులనూ కార్యకర్తలు భరించారు. ప్రజలు, పార్టీ కోసమే యాత్ర చేశా. చంద్రబాబు భార్యగా కాకుండా సాధారణ మహిళగానే ఇంటింటికీ వెళ్లి పలకరించి ధైర్యం చెప్పా. పార్టీ కార్యకర్తలు, అభిమానులు వెంట నడిచారు. మే పదో తేదీ తర్వాత నా హెరిటేజ్, సేవా కార్యక్రమాలు, ఎన్టీఆర్ ట్రస్టు చాలు. రాజకీయాల జోలికి రాను.
రోడ్ల దుస్థితిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు
రాష్ట్రంలో లోకేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు 23 వేల కి.మీ. సిమెంటు రోడ్లు వేశారు. వైకాపావారు అధికారంలోకి వచ్చాక కోపంతో కొన్ని తవ్వేశారు. ఇప్పుడు రోడ్లు అధ్వానమయ్యాయి. ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. చంద్రబాబు ప్రభుత్వం రాగానే తొలుత రోడ్లు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు గతంలోనే పేదల కోసం ఎన్నో మంచి పథకాలు తెచ్చారు. అప్పట్లో అవి అంతగా తెలియవు. ప్రజలే స్వయంగా చెప్పారు. అన్న క్యాంటీన్లు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. చనిపోయిన పార్టీ కార్యకర్తల పిల్లలకు ఎన్టీఆర్ సేవా ట్రస్టు ద్వారా చదువులు చెప్పిస్తున్నాం. ఉద్యోగాలు వచ్చేవరకు అండగా నిలుస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే