ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మునే కాజేశారు

‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని కేసుల్లో ఇరికించి, జైళ్లకు పంపారు. సమస్యలపై పోరాడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 15 Apr 2024 05:29 IST

పోరాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు
ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

విజయనగరం (ఉడాకాలనీ), న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని కేసుల్లో ఇరికించి, జైళ్లకు పంపారు. సమస్యలపై పోరాడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ తీసుకురావాలని ఆందోళనలు చేసినా, ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా జీపీఎఫ్‌ చట్టం తీసుకొచ్చారని, రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని, జీపీఎఫ్‌ సొమ్మును అక్రమంగా కాజేసిందని ఆరోపించారు. రూ.483 కోట్ల నిధులు సంబంధిత ఖాతా నుంచి పక్కదారి పట్టినట్లు కేంద్రమే ప్రకటించిందని గుర్తుచేశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు సిబ్బందో, ప్రభుత్వ ఉద్యోగులో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం విషయంలో మోసం చేశారని ఆరోపించారు. ఈ అంశాలపై ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో 30 సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి 12 ప్రాధాన్య అంశాలను లేవనెత్తనున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని