ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మునే కాజేశారు
‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని కేసుల్లో ఇరికించి, జైళ్లకు పంపారు. సమస్యలపై పోరాడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు
ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ
విజయనగరం (ఉడాకాలనీ), న్యూస్టుడే: ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని కేసుల్లో ఇరికించి, జైళ్లకు పంపారు. సమస్యలపై పోరాడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ తీసుకురావాలని ఆందోళనలు చేసినా, ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా జీపీఎఫ్ చట్టం తీసుకొచ్చారని, రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని, జీపీఎఫ్ సొమ్మును అక్రమంగా కాజేసిందని ఆరోపించారు. రూ.483 కోట్ల నిధులు సంబంధిత ఖాతా నుంచి పక్కదారి పట్టినట్లు కేంద్రమే ప్రకటించిందని గుర్తుచేశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు సిబ్బందో, ప్రభుత్వ ఉద్యోగులో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం విషయంలో మోసం చేశారని ఆరోపించారు. ఈ అంశాలపై ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో 30 సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి 12 ప్రాధాన్య అంశాలను లేవనెత్తనున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
జీతాలు ఎప్పుడు పడతాయో తెలియట్లేదని చెప్పినందుకు నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణను సస్పెండ్ చేయడం సరికాదని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకాల కొండయ్య మండిపడ్డారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!